
16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర
రాజమహేంద్రవరం : కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర చేపడుతున్నట్లు కాపు జేఏసీ నేతలు ఏసుదాసు, రామకృష్ణ ప్రకటించారు. సోమవారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు జరిగే ఈ యాత్రలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొంటారని చెప్పారు.
కాపు రిజర్వేషన్లపై అవగాహన కోసమే సత్యాగ్రహ యాత్ర చేపట్టమన్నారు. ఈ యాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని...ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతనని జేఏసీ నేతలు తెలిపారు.