జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు | Katasani RamBhupal Reddy support YS Jagan 'Samaikya deeksha' | Sakshi
Sakshi News home page

జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు

Published Sun, Oct 6 2013 5:30 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు - Sakshi

జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు

సమైక్యాంద్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు పలికారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయానికి ఎదురుగా జగన్ సమైక్య దీక్ష చేస్తున్న వేదిక వద్దకు ఆదివారం రాంభూపాల్ రెడ్డి వచ్చి సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ శనివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్కు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement