Katasani RamBhupal Reddy
-
వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నింది: కాటసాని
-
మాట చెప్పడం.. మాట తప్పడం.. చంద్రబాబు నైజం
-
చంద్రబాబుకి కాటసాని సవాల్
-
టీడీపీ నేతలకు కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరిక
-
ఓటమిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
-
‘నాకు రూ.వెయ్యికోట్ల ఆస్తి ఉన్నట్లు నిరూపిస్తే రామోజీకే రాసేస్తా..’
సాక్షి, తాడేపల్లి: తన కుటుంబ సభ్యులపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామోజీ భార్య, కోడలపై కూడా ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే ఊరుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. ‘‘మా కుటుంబ సభ్యులు ఏనాడూ రాజకీయాల్లో పాల్గొనరు. నాకు పది శాతం వాటాలు ఎవరు ఇచ్చారో ఈనాడు రామోజీ నిరూపించాలి. పత్రికా స్వేచ్చ అంటే ఇష్టం వచ్చినట్లు రాయటం కాదు. రాసిన తప్పుడు వార్తలపై వివరణ అడగటానికి వెళ్తే ఆఫీసుకు తాళం వేసుకుని పారిపోయారు. మీరు రాసినది నిజమే అయితే పారిపోవాల్సిన అవసరం ఏంటి?. దమ్ముంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. అంతేగానీ అనవసరంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయొద్దు’’ అని కాటసాని పేర్కొన్నారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే మేము నిరసన కూడా తెలపకూడదా?. మేము తప్పులు చేస్తే ఎత్తిచూపండి. కానీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే అది కరెక్టు కాదు. 1991లో నాకు తప్పులేని విషయంలో నేను బలిపశువుని అయ్యాను. రైతులకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. నేను తప్పులు చేశానని నిరూపిస్తే నా అస్తులన్నీ రాసిస్తా. రామోజీ తప్పుడు పనులు చేసినందునే సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తప్పుడు పనులు రామోజీ చేస్తూ మాపై ఆరోపణలు చేయటం ఏంటి?. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాపై తప్పుడు వార్తలు రాయటం పత్రికా స్వేచ్ఛ కాదు’’ అంటూ కాటసాని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబుకు ఈనాడు కరపత్రం. నాకు వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నట్టు రామోజీ రాశాడు. ఆ పేపర్లు చూపిస్తే ఆ ఆస్తులన్నీ రామోజీకే రాసిస్తా. ఈనాడులో ఇష్టం వచ్చినట్లు రాసినందునే మా వాళ్లు వెళ్లారు. దాడి చేయాలని మావాళ్లు వెళ్లలేదు. కేవలం నిరసన తెలపటానికే వెళ్లారు. కనీసం ఆఫీసులోకి కూడా మా వాళ్లు వెళ్ల లేదు’’ అని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
బాబుపై కాటసాని కామెంట్స్
-
చంద్రబాబుకు మరో భారీ షాక్..!
-
రాంభూపాల్రెడ్డిపై ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు జారీచేసిన నోటీసులను పాలక మండలి సభ్యుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అందుకోకపోవడంతో అతనికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు అందజేయాలంటూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం వెనక్కి తీసుకుంది. నోటీసులు అందుకోనందుకు రాంభూపాల్రెడ్డి క్షమాపణ కోరడంతో ధర్మాసనం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. నోటీసులు అందుకోని పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లీశ్వరి, ఏఎన్ శశిధర్లకు పత్రికా ప్రకటనల ద్వారా నోటీసులు జారీచేయాలని పిటిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీ పాలకమండలి సభ్యు ల్లో పలువురికి నేరచరిత్ర ఉందంటూ వారి నియామ కాన్ని సవాలుచేస్తూ బీజేపీ నేత జి. భానుప్రకాశ్రెడ్డి గత ఏడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం పాలక మండలి సభ్యులందరికీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, నోటీసులు అందుకోని వారికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు అందజేయాలంటూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాంభూపాల్రెడ్డి.. తన కుటుంబంలో వివాహ కార్యక్రమంవల్ల నోటీసు అందుకోలేకపోయానని, అందుకు క్షమించాలని, పత్రి కా ప్రకటన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువా రం విచారించిన సీజే ధర్మాసనం.. రాంభూపాల్రెడ్డి విషయంలో తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. -
పేదల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం
-
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
-
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం జగన్
-
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
01:20PM కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 10:00AM సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు రానున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి వివాహానికి హాజరుకానున్నారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో వివాహ వేడుక ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీఎం హాజరవుతుండటంతో ప్రొటోకాల్ ప్రకారం పోలీసులు, అధికారులు భద్రత, ఇతర ఏర్పాట్లను చేపట్టారు. బుధవారం ఉదయం 10.20 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అక్కడ 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొని 12.15 గంటలకు తిరిగి బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కోటేశ్వరరావు, కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి, జేసీలు డాక్టర్ మనజీర్ జిలానీ, ఎస్.రామసుందర్రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, నారపురెడ్డి మౌర్య, మునిసిపల్ కమిషనర్ డీకే బాలాజీ, డీఆర్వో బి.పుల్లయ్యలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం ఓర్వకల్లు చేరుకున్నప్పటి నుంచి వివాహంలో పాల్గొని తిరిగి వెళ్లే వరకు పటిష్ట బందోబస్తుతోపాటు ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. ఆయా అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. 09:50AM సీఎం పర్యటనకు పటిష్ట భద్రత కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి తగిన సూచనలు (బ్రీఫింగ్) ఇచ్చారు. ఓర్వకల్లు విమానాశ్రయం, కర్నూలు మండలం పంచలింగాల గ్రామ శివారులోని మాంటిస్సోరి స్కూల్ సమీపంలోని హెలిప్యాడ్ నుంచి వివాహ వేడుక వరకు గల రూట్ అండ్ రూఫ్ టాప్ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించే పోలీసులు, స్పెషల్పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బందోబస్తుకు పోలీసు నిఘా విభాగాలు ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), మఫ్టీ బృందాలతో పాటు 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, 88 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 241 మంది కానిస్టేబుళ్లు, 29 మంది మహిళా పోలీసులు, 163 మంది హోంగార్డులు, 4 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, 15 స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బందిని కేటాయించారు. -
సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడతారు. ఆ తర్వాత పంచలింగాలలో పాణ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కుమారుడు శివ నరసింహారెడ్డి పెళ్లికి హాజరవుతారు. అనంతరం తిరిగి బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు. -
న్యాయ రాజధానితోనే అభివృద్ధి
కర్నూలు (అర్బన్): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం చూపిస్తాం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్ ఎస్టేట్వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐ.విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, జాతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, కో–కన్వీనర్ ఆర్.చంద్రప్ప, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్ రోషన్ ఆలీ తదితరులు మాట్లాడారు. -
చంద్రబాబు ఒకవర్గం కోసం పనిచేస్తున్నారు: ఎమ్మెల్యే కాటసాని
-
ఉల్లి విక్రయాలకు తొలగిన అడ్డంకి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాల్లో గత నెల 17 నుంచి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. యార్డులో నెలకొన్న సమస్యలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. మార్కెట్కు ఉల్లిగడ్డలు తెప్పించేందుకు, ఈ–నామ్ అమలుకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అంగీకరించారు. దీంతో ఈ నెల 11 నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి సహా అన్ని రకాల పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా మినుములు, కొర్రలను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని మార్కెట్ కమిటీ కల్పించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు. ఉల్లి క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, వ్యాపారుల మధ్య పోటీ ఉండటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉల్లికి కూడా ఈ–నామ్ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు విధిగా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సహకరించకపోతే కొత్త కమీషన్ ఏజెంట్లు, కొత్త వ్యాపారులను రంగంలోకి దింపి ఉల్లి సహా అన్ని పంటలను ఈ–నామ్లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో దిగివచ్చిన కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఈ నెల 11 నుంచి తాము కూడా ఈ–నామ్లో కొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీధర్రెడ్డి, కమీషన్ ఏజెంట్ల సంఘం నేతలు కట్టా శేఖర్, శ్రీనివాసరెడ్డి, జూటూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్లపై టిడిపి అనవసర రాద్ధాంతం చేస్తుందన్న ఎమ్మెల్యే
-
సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఆరోపించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 45వేల కోట్ల రూపాయలను బీసీలకు కేటాయించి బీసీ కార్పోరేషన్, చైర్మన్లను ఏర్పాటు చేశారన్నారు. ఇది తెలిసి టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్పై 23 ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణలపై చట్టపరమైన విచారణ కొనసాగుతోందని చెప్పారు. బీసీలతో ఓటు వేయించుకోని వారిని మోసం చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముసుగులో జిల్లాలో కొందరు నేతలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. బీసీ అభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయలను సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది మానుకోవాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపణలపై విచారణలో నిజాలు తెలియాల్సి ఉందని, ఈ వ్యవహారంలో టీడీపీ అనుబంధం.. బీసీ సంఘాల తీరును ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులపై సైతం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతి పరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. -
దంపతుల ప్రాణాలు కాపాడిన కాటసాని
కర్నూలు (న్యూటౌన్)/ఓర్వకల్లు: కర్నూలు నగర శివారులోని రింగ్రోడ్డు వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో నన్నూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రామచంద్రయ్య (50), జానకమ్మ (45) స్పృహ కోల్పోయారు. భార్యభర్తలు వ్యక్తిగత పనినిమిత్తం ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయలుదేరారు. టోల్గేట్ సమీపంలోని సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద కర్నూలు వైపునకు మలుపు తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొంది. అదే రహదారిలో పాణ్యం వెళ్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆగి అంబులెన్స్లో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్కు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఓర్వకల్లు వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ను దాటుకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ వినోద్ కామెడ్ కాలు కేబిన్లో ఇరుక్కపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో జేసీబీ ద్వారా బయటకు తీశారు. హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కర్ణాటక నుంచి కర్నూలుకు చేరుకున్న విద్యార్థులు
సాక్షి, కర్నూలు: కరోనా కారణంగా అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఆగి పోయారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక ఇంటికి చేరలేక లాక్డౌన్కి ముందు ఎక్కడ ఉన్నారో అక్కడే చిక్కకుపోయి నానా కష్టాలు పడుతున్నారు. మార్చి నెలలో మొదలయిన లాక్డౌన్ ఇప్పటికి మూడు సార్లు పొడిగించి మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీంతో నానాటికి వలస కార్మికులు, వేరే ప్రాంతాల్లో ట్రైనింగ్ కోసం వెళ్లిన విద్యార్ధులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. (వారి వివరాలు తెలుసుకోవడానికి వెళితే దాడి చేశారు!) అయితే మే 1 నుంచి వలస కార్మికులను, వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారిని తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే శ్రామిక్ రైలు ద్వారా నిన్న కొంత మంది మత్యకారులు, వలస కూలీలు చెన్నై నుంచి శ్రీకాకుళం చేరుకున్నారు. ఇక బుధవారం నాడు కూడా సోలాపూర్ అగ్రికల్చర్ కాలేజీకి ట్రైనింగ్ కోసం వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకు పోయిన 31 మంది విద్యార్థిని విద్యార్థులు కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారిని జిల్లాలోకి తీసుకువచ్చారు. జిల్లాకు వచ్చిన విద్యార్థిని విద్యార్ధులను మొదట క్వారంటైన్లో ఉంచి అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు కోవిడ్-19 ఫలితాలు నెగిటివ్ అని తెలితే వారిని అక్కడి నుంచి వారి సొంత ఊర్లకు పంపించనున్నారు. (మాజీ మంత్రి ఇంట్లో విషాదం) -
ప్రజల ఆరోగ్యమే సీఎం జగన్కు ముఖ్యం
-
‘చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు అర్థరహితమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని మరిచిన చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బి.వై.రామయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగనన్న మాట ఇస్తే తప్పే ప్రస్తే లేదని కొనియాడారు. అమరావతిలో జరుగుతున్నది రైతు ఉద్యమం కాదని, చంద్రబాబు బినామీల ఆందోళన మాత్రమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సమర్థించే టీడీపీ నేతలు కర్నూల్లో హైకోర్టు వద్దని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబు మాయలో ఉన్నారన్నారు. ఇకనైనా ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీ నేతలు ఆలోచించాలని కోరారు. -
రెండో రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కాటసాని పాదయాత్ర
-
సాగునీరు అందించేందుకు కృషి
సాక్షి, పాణ్యం: మండలంలోని తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. తమ్మరాజుపల్లెలో ఏటి పాయ చెక్డ్యామ్ను నిర్మిస్తామన్నారు. ఆయన మంగళవారం గోరుకల్లు గ్రామంలో మొహర్రం సందర్భంగా పెద్ద సరిగెత్తును పురస్కరించుకుని పెద్ద స్వామికి ప్రత్యేక ఫాతెహాలు చదివించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు ప్రతి ఏటా నీటిసమస్య ఎదురవుతోందన్నారు. ఈ మూడు గ్రామాలు వర్షాధారంపైనే పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోందన్నారు. కళ్ల ముందే నీరు వెళ్తున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. కావున ఈ మూడు గ్రామాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తమ్మరాజుపల్లెకు ఏళ్ల నాటి కలగా మిగిలిన ఏటిపాయ నిర్మాణం జరిపి పొలాలకు సాగునీరు, గ్రామానికి తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. గోరుకల్లు బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల స్కీమ్ తెచ్చి పిన్నాపురం, తమ్మరాజుపల్లెకు పుష్కలంగా నీరు ఉండేలా కొచ్చేరును నింపుతామన్నారు. కందికాయపల్లె గ్రామానికి కూడా ఈ జలాలు ఉపయోగించుకునేలా రామతీర్థం వద్ద గానీ, మరో చోట గానీ మోటార్ల సహాయంతో నీటిని పంపింగ్ చేయించి.. పైన ఉన్న చెరువును నింపుతామన్నారు. ఓర్వకల్లు కూడా నీటిని సరఫరా చేయించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అలాగే రోడ్ల విస్తీరణలో నష్టపోయిన ప్రతి బాధితుడిని ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాయకులు కొట్టాల అమర్నాథ్రెడ్డి, లక్ష్మీమద్దయ్య, ఇమాం, భాస్కర్రెడ్డి , నాగిరెడ్డి, గగ్గటూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
సాక్షి, కర్నూలు: రూరల్ మెడికల్ ప్రాక్టీషినర్లు(ఆర్ఎంపీ)ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చెప్పారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవ సమావేశం ఆదివారం స్థానిక బి.క్యాంపులోని ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే టి. ఆర్థర్ హాజరై ప్రసంగించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ వైద్యుల సేవలు గుర్తించి జీవో నెం.429 ద్వారా సామాజిక ఆరోగ్య కార్యకర్తగా గుర్తించి ప్రభుత్వ శిక్షణ ఇచ్చారన్నారు. అయితే అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని తెలిపారు. వీరికి తిరిగి శిక్షణ ఇస్తే గ్రామీణ ప్రాంతంలో ప్రథమ చికిత్స అందించే వీలుంటుందని తెలిపారు. దీనికి ఎమ్మెల్యేలు స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లో ప్రజలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్. ఉస్మాన్, డి. దస్తగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. ప్రభాకర్రెడ్డి, కోశాధికారి జె. రఘునాథ్రెడ్డి, గౌస్, నాగరాజు, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లా నుంచి తొలిసారి... అధ్యక్షా
సాక్షి, కర్నూలు: ఇటీవలి ఎన్నికల్లో జిల్లాలో విజయకేతనం ఎగురవేసిన 14 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెడుతుండడం గమనార్హం. ఇక కాటసాని రాంభూపాల్రెడ్డి ఏకంగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి సభకు వెళుతున్నారు. మంత్రులుగా నియమితులైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం ఇద్దరూ రెండోసారి సభలో అడుగుపెడుతుండటం గమనార్హం. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో గళం వినిపించనున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లనూ గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. అసెంబ్లీలో నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం చరిత్రలోనే ప్రథమం. నూతన ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కోసం గళం వినిపించాలని ప్రజలు కోరుతున్నారు. మొదటిసారి వీరే... జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొత్తగా ఎమ్మెల్యేగా (గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డిని కలుపుకుని) ఏకంగా ఏడుగురు ఎన్నికయ్యారు. అంటే సగం మంది మొదటిసారిగా శాసనసభలో తమ గళాన్ని వినిపించనున్నారన్నమాట. శ్రీశైలం నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ గతంలో ఈయన రెండు దఫాలు ఎమ్మెల్సీగా చేశారు. ఎమ్మెల్సీ కావడంతో కేవలం శాసనమండలికే పరిమితమయ్యారు. శాసనసభలో మాత్రం మొదటిసారి అడుగుపెడుతున్నట్టే. ఇక కర్నూలు నుంచి హఫీజ్ఖాన్, కోడుమూరు నుంచి సుధాకర్, పత్తికొండ నుంచి శ్రీదేవి, నంద్యాల నుంచి శిల్పా రవి, ఆళ్లగడ్డ నుంచి గంగుల నాని, నందికొట్కూరు నుంచి ఆర్థర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గళమెత్తండి.. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. కర్నూలుకు రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, రక్షణగోడ నిర్మాణం, జిల్లా ఆసుపత్రి స్థాయి పెంపు, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టుల నిర్మాణం, కేసీ కెనాల్ కింద ఆయకట్టు మొత్తానికి నీరు అందించడం, ముచ్చుమర్రి పూర్తి వంటివి ప్రధానమైనవి. ఎల్ఎల్సీ కింద కూడా చివరి ఆయకట్టు వరకూ నీరందించాల్సిన అవసరం ఉంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాగునీటి సమస్య కూడా అధికం. ఈ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు గళమెత్తాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలందరికీ ఆల్ ద బెస్ట్! -
ఎన్నికల చిత్రాలు..
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఒకపక్క కరి పండుగ.. మరో పక్క ఆదివారం.. అయినా పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు నిద్రలేచింది మొదలు.. పొద్దుపోయే వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు. వీలైనంత మందిని కలిసి తమకే ఓటు వేయాలని కోరారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అభ్యర్థుల వెంట అనుచర, బంధు గణం రావడంతో ఆయా గ్రామాల వీధులు కిటకిటలాడాయి. -
కర్నూల్ జిల్లాలో సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాణ్యం నియోజకవర్గం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ గత ఎన్నికల ముందు జిల్లాకు, పాణ్యం నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. పారిశ్రామిక హబ్గా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామని, డీఆర్డీవో, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏర్పాటు వంటి హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. ఇక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ అనుమతులు లేక సగం సగం పనులు చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాను..అందులోనూ పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కాటసాని తెలిపారు. ఈ అవినీతి, అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజాతీర్పుకు సూచికగా ఓర్వకల్లు సభ నిలవనుందని అభిప్రాయపడ్డారు. పాదయాత్ర తర్వాత... వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయన 2017 నవంబరు 14 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు మొత్తం 18 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. 14 నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నడక సాగించారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల శంఖారావం సభల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి ఎన్నికల శంఖారావాన్ని పాణ్యం నియోజకవర్గంలో పూరించనున్నారని పేర్కొన్నారు. భారీగా కదలిరండి– కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓర్వకల్లులో జరిగే బహిరంగ సభలో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఈ సభకు భారీగా తరలివచ్చి అధికార తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజలు చాటాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తరలిరావాలి. -
పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్ ఫ్రంట్
-
పాణ్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
క్వారీ బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, రాష్ట్ర కార్యదర్శులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌర వెంకట్ రెడ్డిలు బాధితులను కలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలూరు నియోజకవర్గంలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వారీ నిర్వాహకుడు టీడీపీ సానుభూతిపరుడు కావడం వల్లే అధికారులు అనుమతులిచ్చారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. మరణించిన వారికి ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. -
స్లాగ్ లారీలను కట్టడి చేయండి
నంద్యాల (కర్నూలు): పాణ్యం రైల్వే స్టేషన్ నుంచి లారీల్లో స్లాగ్ను లోడ్కు మించి జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్తున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని శోభా ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీల్లో ఎక్కువ స్లాగ్ను తీసుకొని వెళ్లడంతో అది రోడ్డుమీద పడుతోందన్నారు. స్లాగ్ ఒక్కసారి కంట్లో పడితే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. అధిక లోడుతో వెళితే సీజ్ చేయాలన్నారు. నంద్యాల సిటీకేబుల్(డిజిటల్ టీవీ కమ్యూనికేషన్) యాజమాన్యం కేబుల్ వ్యవస్థ అంతా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తోందన్నారు. దీని కోసం ఆపరేటర్లను భయపెట్టడం, వారు తగ్గకపోతే కనెక్షన్ తక్కువ ధరకే ఇచ్చి వారిని దెబ్బతీయడం చేస్తోందన్నారు. గడివేముల మండలంలో కొందరు ఆపరేటర్లు సిటీకేబుల్ నుంచి పక్కకు వచ్చి సొంతంగా కేబుల్ ఏర్పాటు చేసుకుంటే వారిని దెబ్బతీయడానికి నెలకు రూ.130 ఉన్న కనెక్షన్ను ఒక్క గడివేముల మండలంలో మాత్రం రూ.50కే ఇస్తున్నారన్నారు. గడివేముల మండలం నుంచి ఇన్ని సంవత్సరాలు కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకున్నారని, ఆ ఆదాయంతో రూ.50కి కనెక్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అయితే నంద్యాల పట్టణంలో కూడా రూ.50కే కనెక్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సిటీకేబుల్ యజామాన్యం ప్రజలను, ఆపరేటర్లను ఇబ్బందులు పెడితే త్వరలోనే తాను నంద్యాలలో కేబుల్టీవీ ఏర్పాటు చేస్తానన్నారు. తాను ఎన్నడు వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎవరి వ్యాపారం వారు చేసుకుంటారని, అయితే స్వచ్ఛం దంగా పని చేసుకుంటున్న గడివేముల ఆపరేటర్లను భయపెట్టడం తగదన్నారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్ ఆర్బీ చంద్రశేఖర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలహుసేని, బిలకలగూడూరు చంద్రశేఖర్రెడ్డి, ఆపరేటర్లు పాల్గొన్నారు. -
‘దుర్గారావుది మరణం కాదు.. హత్య’
సాక్షి, కర్నూలు : చంద్రబాబు మోసానికి, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తొత్తులుగా మారిన పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని హోదా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజల సంకల్పం ముందు బాబు కుట్రలు, ఖాకీల కర్కశత్వం తుడిచిపెట్టుకు పోయాయని విమర్శించారు. బంద్లో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు కుంటుంబానికి సానుభూతిని తెలిపారు. హోదా పోరులో వైఎస్సార్సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని పేర్కొన్నారు. దుర్గారావుది మరణం కాదని చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఒక్క రోజు బంద్కు పిలుపు నిస్తే అదేదో నేరం అన్నట్లు, ప్రజలు దేశ ద్రోహులు అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ చేట్టిన బంద్ను ప్రభుత్వం విఫలం చేయలేదని ప్రజలే భగ్నం చేశారని డిప్యూటి సీఎం కేఈ క్రిష్ణమూర్తి అనడం సిగ్గుచేటన్నారు. ఒక్కరోజు బంద్తో హోదా వస్తుందా అన్న కేఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు. హోదా పోరాటంలో యూటర్న్ తీసుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసి ఫిరాయించిన మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఫిరాయింపుతో వచ్చిన మంత్రి పదవి శాశ్వతం కాదని అఖిలప్రియ తెలుసుకోవాన్నారు. ప్రత్యేక హోదా బంద్తో ఎవరు ఎటువైపో తేలిపోయిందన్నారు. ధ్వంద ప్రమాణాల రాజకీయ పార్టీల నైజం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
తప్పు కప్పిపుచ్చుకునేందుకు హోదా డ్రామా
బనగానపల్లె (కర్నూలు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు డ్రామా లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ మండల నేత గుండం నాగేశ్వరరెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. ప్యాకేజీ తీసుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడిగితే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు హోదా డ్రామాలాడుతున్నారని, ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్నది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. దీక్షలు చేయడంతోపాటు యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచారన్నారు. దోచుకోవడమే టీడీపీ నాయకుల పని.. రాష్ట్రంలో టీడీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకొని..ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని కాటసాని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీజయజ్యోతి సిమెంట్ ఏర్పాటు సమయంలో భూములుకోల్పోయిన రైతుందరికీ పరిహారం అందేలా చూశానన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దద్దణాల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సర్వే చేయించానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఈ విషయాన్ని మరినట్లు ఉన్నారన్నారు. అవుకు మండలంలోని గుండ్ల శింగవరం నుంచి రామావరం వరకు రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.8.64 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ ప్రాంత ప్రజలపై కక్షగట్టిన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. రోడ్డు నిర్మాణానికి టెండర్లు వేయకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఒక్క హామీ నెరవేర్చలేదు.. నాలుగేళ్ల చంద్రబాబు పాలన కుక్కతోక వంకరలా ఉందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన çహామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ హయాంలో గిట్టుబాటు ధరలతో రైతులు సుఖసంతోషాలతో ఉండేవారన్నారు. ప్రస్తుతం రైతుల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమావేశంలో వైస్సార్సీపీ నాయకులు పీఆర్ వెంకటేశ్వరరెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్పై ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు
-
కర్నూలులో 14 సీట్లు గెలుస్తాం..
సాక్షి, కర్నూలు: కాటసాని రాంభూపాల్ రెడ్డి రాకతో జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి తన వంతు సహకారం అందించాలనే కాటసాని పార్టీలో చేరారని తెలిపారు. జగన్ను సీఎం చేయడమే లక్ష్యం: కాటసాని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమనీ, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ విషయం పార్టీ అధినేత చేతుల్లో ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాటసాని మంగళవారం నియమితులయిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ నుంచి ఎప్రిల్ 29న వెఎస్సార్సీపీలోకి చేరారు. గతంలో పాణ్యం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
వైఎస్సార్ సీపీలోకి వసంత కృష్ణప్రసాద్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా వలసలు ఊపుందుకున్నాయి. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణాజిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ సోమవారం వెల్లడించారు. మరోవైపు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా మే 5వ తేదీన వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారు. కాగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చి కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు సమీపంలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే కాటసాని
-
మాజీలకు గన్మెన్ల తొలగింపు
కర్నూలు: జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గన్మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం జిల్లా పోలీస్ అధికారులకు చేరాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డికి 3+3, రాష్ట్ర మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్రెడ్డి, కేఈ ప్రభాకర్, శిల్పా మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, మీనాక్షి నాయుడు, నీరజారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులకు 2 + 2, కోట్ల సుజాతమ్మకు 1+1 గన్మెన్లను కేటాయించి భద్రత కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 36 మంది నేతలకు 160 మందికి పైగా గన్మెన్లతో భద్రత కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మినహా మాజీలందరికీ గన్మెన్లను తొలగించాలని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తితో పాటు శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి యాదవ్ ప్రస్తుతం అత్యధిక గన్మెన్లతో భద్రతను పొందుతున్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్కు గతంలో 2+2 గన్మెన్లు ఉండగా 1+1కు తగ్గించారు. ప్రత్యర్థుల నుంచి తనకు హాని ఉందని పోలీస్ శాఖకు విన్నవించుకున్న నేపథ్యంలో గన్మెన్లను కొనసాగించేందుకు పై స్థాయి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మాజీలందరికీ గన్మెన్లను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వుల మేరకు 1, 2 రోజుల్లో నోటీసులు జారీ చేసి భద్రతను తొలగించనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో నంద్యాల శాసనసభ నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డికి మాత్రం కోర్టు ఆదేశాల మేరకు 3+2 గన్మెన్లతో భద్రత కొనసాగిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలకు 1+1, ఎంపీలకు 2+2 గన్మెన్లతో భద్రతను కొనసాగించనున్నారు. అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకుని పెయిడ్ గన్మెన్లను పొందిన వారికి కూడా తొలగించాలని హోంశాఖ నుంచి ఉత్తర్వులు అందడంతో ఆ మేరకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. -
జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు
సమైక్యాంద్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు పలికారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయానికి ఎదురుగా జగన్ సమైక్య దీక్ష చేస్తున్న వేదిక వద్దకు ఆదివారం రాంభూపాల్ రెడ్డి వచ్చి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ శనివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్కు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివస్తున్నారు. -
జగన్ దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని