కరెంట్ షాక్: లైన్ మెన్కు తీవ్ర గాయాలు | Man injured due to electric shock in vizianagaram district | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్: లైన్ మెన్కు తీవ్ర గాయాలు

Published Sat, Jun 4 2016 11:49 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద విద్యుదాఘాతానికి గురై బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ మ్యాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద విద్యుదాఘాతానికి గురై బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ మ్యాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సబ్ స్టేషన్ వద్ద ఫోన్ పని చేయకపోతే సరి చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ లైన్‌మ్యాన్ ఎం.ఆదినారాయణ (45) శనివారం అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్ తీగలను అతడు తాకడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో స్థానికులు వెంటనే స్పందించి.... అతడిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement