సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన పలువురు ఐఎఫ్ఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మునీంద్రను అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(ఎన్విరాన్మెంట్)గా, బి. ఆనంద్ మోహన్ను ఖమ్మం కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా బదిలీ చేస్తూ పోస్టింగ్లు ఇచ్చారు. పీవీ రాజారావును వరంగల్ సోషల్ ఫారెస్ట్రీ సర్కిల్ కన్సర్వేటర్గా, బి. శ్రీనివాస్ను హైదరాబాద్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా, ఎస్. రమేశ్ను దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డెరైక్టర్గా నియమించారు. సంజీవ్కుమార్ గుప్తాను కవాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డెరైక్టర్గా, వినయ్ కుమార్ను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డెరైక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.