
సాక్షి, విజయవాడ : మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికు ఓ కేసులో సాక్షిగా హాజరుకావాలని ఏసీబీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 22న ఆర్కే ఏసీబీ ఎదుట హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని పిటిషన్ ద్వారా ఏసీబీకి నివేదించామని ఆర్కే తరుఫు న్యాయవాదులు సుధాకర్ రెడ్డి, మన్మధ రావులు తెలిపారు. దీంతో 29వ తేదీన ఆర్కే హాజరుకావాలంటూ తిరిగి ఏసీబీ అధికారులు గడువు ఇచ్చారన్నారు. కానీ ఆరోగ్యం మెరుగుపడక పోవడం వల్ల ఈ రోజు కూడా హాజరుకాలేకపోతున్నట్లు న్యాయవాదుల ద్వారా ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చే నెల 5వ తేదీన హాజరు కావాలని వాయిదా వేశారు.