ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మంత్రుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మంత్రుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర కేబినెట్ సోమవారం ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా వివిధ శాఖల వందరోజుల ప్రణాళికలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.
అలాగే రాజధానిపై భూసేకరణకు సంబంధించి విధివిధానాలపై కేబినెట్ చర్చించనుంది. దీనితో పాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఫించన్ల పెంపుపై రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది.