గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం వద్ద ఈ రోజు తెల్లవారుజామున సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి. దాంతో కాలువులోని నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది. దాంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. త్వరలో చేతికి వస్తుందనుకొన్న పంట ఇలా నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా కుడి కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.