macherla
-
మాచర్ల గొర్రె .. ఇక స్పెషలే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పల్నాడు ప్రాంతంలో బాగా పెరిగే ‘మాచర్ల గొర్రె’కు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీకి చెందిన ఒంగోలు గిత్త, అశీల్ రకం కోడి వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్బీఏజీఆర్ (నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్) ఈ గొర్రెను ఉత్తమ రకం పశువుగా నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల రకం గొర్రెలు ఉన్నాయి. దేశంలోని ఇతర రకాల గొర్రెలు, పొట్టేళ్లతో పోలిస్తే మాచర్ల గొర్రెలు విభిన్నంగా ఉన్నట్టు ఎన్బీఏజీఆర్ పేర్కొంది. దీనిపై ప్రత్యేక పరిశోధన చేసిన అనంతరం తాజా గా ఆ సంస్థ వీటిని ఉత్తమ రకం పశువులుగా గుర్తించింది. ఈ పరిశోధనలో కర్నాల్లోని ఎన్బీఏజీఆర్, గన్నవరంలోని ఎనీ్టఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.స్థానిక పరిస్థితులకు అనుకూలంగా.. మాచర్ల గొర్రెలనే గుక్కల జాల అని, గుంటూరు లోకల్ గొర్రె అని కూడా పిలుస్తారు. ఏపీలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మాచర్ల గొర్రెల జాతి చక్కగా ఇమిడిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. వీటి మాంసం మిగతా వాటితో పోలిస్తే రుచికరంగా ఉంటుందని వెల్లడించారు.శరీర బరువు ఏడాదిలో 30 నుంచి 45 కేజీల వరకూ పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖం, కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. మాచర్ల గొర్రెల పోషణ లాభదాయకంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు దీన్నే వృత్తిగా చేసుకుంటున్నారని వెల్లడించారు. రెండో స్థానంలో ఏపీ» గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో పశు సంపద భారీగా పెరిగినట్టు ఎన్బీఏజీఆర్వెల్లడించింది.» ప్రపంచంలో 13.8 % వాటా పశువులతో దేశం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో 23.74% వాటాతో అంటే 17.63 మిలియన్ గొర్రెలతో దేశంలోనేఏపీ రెండో స్థానంలోఉన్నట్టు స్పష్టం చేసింది.» వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభసాటిగాఉండటంతో ఎక్కువ మంది రైతులు దీనినే వృత్తిగా ఎంచుకుంటున్నారు. పైగా మాంసం ధర ఎక్కువగా ఉండటం వల్ల మంచి గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. -
పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. .. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. -
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైఎస్సార్సిపి క్యాడర్పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్సిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవ్వాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. -
మాచర్లలో ఉనికి కోసం చంద్రబాబు పాకులాట.. బయటపడ్డ బాబు నిజస్వరూపం
-
అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి
సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమృకోటలో రిగ్గింగ్ జరుగుతోందని తానే ఫోన్ చేసి ఎస్పీకి తెలియచేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియమించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
-
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
-
సినిమా సీన్ తరహాలో టీడీపీ దౌర్జన్యం
-
మాచర్లలో మరో టెన్షన్.. సీఈవో కీలక ప్రకటన
ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉మాచర్లకు టీడీపీ నేతలు.. మంచిది కాదు: సీఈవో ముకేష్ కుమార్ మీనాపిన్నెల్లి వీడియోపై సీ ఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాందర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీ ఓ, ఏపీ ఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందిబయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను 👉టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. -
మాచర్ల టార్గెట్గా ’దేశం‘ ఆపరేషన్ దమనకాండ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాచర్లలో జెండా పాతడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆపరేషన్కు పోలీసు ఉన్నతాధికారులు, సర్కిల్ అధికారులు అండగా నిలిచారు. పోలింగ్ రోజు, తదనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా డీఐజీ గానీ, అప్పటి ఎస్పీ గానీ, కలెక్టర్గానీ స్పందించకపోవడం దీన్ని బలపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా రిగ్గింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. చివరి నిముషంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికారినీ తీసుకురావడంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా మాచర్ల రణరంగంగాన్ని తలపించింది. టీడీపీ కుట్రలు, కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బృందం సోమవారం ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధినేత వినీత్ బ్రిజ్లాల్కు ఫిర్యాదు చేసింది. ఫ్యాక్షన్ జూలు విదిల్చిన జూలకంటి జూలకంటి బ్రహా్మనందరెడ్డిని టీడీపీ మాచర్ల ఇన్చార్జ్గా ప్రకటించినప్పటి నుంచి అక్కడ మళ్లీ ఫ్యాక్షన్ ఊపిరి పోసుకుంది. ఎప్పుడైతే ఆయనను టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిందో అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. మాచర్లను కైవసం చేసుకోవాలంటే పల్నాడు జిల్లాలో అప్పుడు ఉన్న ఐజీ, ఎస్పీ ఇతర అధికారులు ఉంటే సాధ్యం కాదని జూలకంటి, టీడీపీ అధినాయకులు గుర్తించారు. దీంతో వారు ఆ ఎస్పీని టార్గెట్గా చేసుకున్నారు. ఆయన ఉంటే బూత్ క్యాప్చర్, ఓటర్లను భయపెట్టడం కుదరని అభిప్రాయపడ్డారు. అప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా పావులు కదిపారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ అధికారులు ఉంటే తమ పన్నాగం పారదని, వారిని మార్చాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఐజీ పాల్రాజ్ను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక అధికారికి సన్నిహితంగా ఉండే అధికారిని తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించారు. పల్నాడు ఎస్పీగా గతంలో సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బింధుమాదవ్ను తీసుకువచ్చారు. వారు వచ్చిన తర్వాత కిందిస్థాయి సిబ్బందికి తెలుగుదేశం నాయకులను టచ్ చేయ వద్దంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.పేట్రేగిపోయిన పచ్చమూకలు 11న రెంటచింతలకు వెళ్లిన సీఐ నారాయణ స్వామి తెలుగుదేశం నేతలకు మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నిక నిర్వహించుకోండని చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అదేరోజున కారంపూడి మండలం వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేసి బెదిరించారు. వేపకంపల్లిలో తెలుగుదేశం నేతలు మహేష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసి అతనిపై దాడి చేస్తే తొలుత ఒక హెడ్ కానిస్టేబుల్ను పంపారు. ఆ తర్వాత సీఐ వెళ్లి మహేష్ ను కరెంట్ స్తంభానికి కట్టేయించి అవమానించారు. 12న రెంటచింతలలో నారాయణస్వామి ఉండగానే తెలుగుదేశం నేతలు మోర్తాల ఉమా మహేశ్వరరెడ్డిపై దాడి చేశారు. రెంటచింతల మండలం పాల్వయిగేట్ పోలింగ్ స్టేషన్ 201, 202 వద్ద టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఏజెంట్లనూ అనుమతించలేదు. తొమ్మిది గంటల ప్రాంతంలో ఐజీ శ్రీకాంత్ జోక్యంతో ఏజెంట్లను అనుమతించారు. జెట్టిపాలెంలో 214, 217 పోలింగ్ బూత్లలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అనుమతించలేదు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించినప్పుడు సీఐ నారాయణస్వామి వచ్చి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. తుమృకోటలో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడినప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలూ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొత్త ఈవీఎంలు పెట్టి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక కొనసాగించారు. వెల్దుర్తిలోని 137, 138, 139, 140, 141 పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఏడు గంటల తర్వాత వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిరాదు చేసినా స్పందించలేదు. ఒప్పిచర్లలో 250, 251, 252, 256 పోలింగ్ స్టేషన్లలో ఇతర సామాజిక వర్గాల వారు ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది.‘నారా’యణస్వామి భక్తి కారంపూడి సర్కిల్లో కారంపూడి, రెంటచింతల, దుర్గి పోలీసుస్టేషన్లు ఉన్నాయి ఇక్కడ బీసీ వర్గానికి చెందిన సీఐ చినమల్లయ్య సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనను అర్ధంతరంగా ఎన్నికల ముందు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తెలుగుదేశం నాయకులు తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆయన వచ్చీ రాగానే తన సామాజిక వర్గ నాయకులకు పగ్గాలు ఇచ్చేశారు. ఎన్నికల్లో మీరు ఎలాగైనా పనిచేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అభయం ఇచ్చేశారు. ఆయన ఫోన్ కాల్, వాట్సప్, ఫేస్టైమ్ డేటాను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పని చేసింది అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.వెల్దుర్తి పరిధిలో కొందరు టీడీపీ నేతలు పోలీసు కానిస్టేబుళ్ల మీద చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రిజిస్టర్ అయినా దాడి చేసిన వారిని కనీసం స్టేషన్కు కూడా పిలవలేదు. ఎన్నికల ముందు బైండోవర్ కూడా చేయలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య శిరిగిరిపాడు గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. బందోబస్తుగా వచ్చిన ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందిపై కూడా తెలుగుదేశం నేతలు దాడి చేశారు. దీనిపై రెండు ఫిర్యాదులు వచ్చినా దాడి చేసిన వారిని ఎవరినీ పోలీసుస్టేషన్కు పిలవలేదు. పైగా బాధితుడైన ఎస్ఐతోపాటు కారంపూడి, మాచర్ల టౌన్ సీఐలను బదిలీ చేశారు. దీంతో పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో రెచ్చిపోయారు. రెంటచింతలలో సుమారు రెండు లక్షల హోలోగ్రామ్ ఉన్న ఓటర్ స్లిప్లను స్వాధీనం చేసుకుంటే కలెక్టర్ చర్యలు తీసుకోకపోగా బస్ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ బిందుమాధవ్తోపాటు కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా.. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన మరికొందరు అధికారులను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
-
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
-
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
-
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంటికి టీడీపీ నేతలు తెలుగుదేశం జెండా కట్టారు. టీడీపీ జెండా తీసేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కోరగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్తో వాదనకు దిగారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి రాళ్లు రువ్వారు. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. -
జననేతకు మాచర్ల ప్రజానీకం ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)
-
చంద్రబాబును నమ్మగలమా?: సీఎం జగన్
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం క్రింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి... ఇవాళ పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూనే.. గత పాలకుడు చంద్రబాబు నాయుడి అవినీతిని ఎండగట్టారు. ‘‘మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు ఇంతటి చిక్కటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, చిరునవ్వుల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’.. దశాబ్దాల నీటి ఎద్దడికి నివారణ– వరికపూడిశెల. ఈ మాచర్ల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా ఎద్దడి మన కళ్లెదుటనే కనిపిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు పుట్టిన బిడ్డకు అందని తల్లిపాలమాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్నవారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాలు పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. దశాబ్ధాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ మారుస్తూ.. ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నింటినీ కూడా మార్చాలన్న తపన, తాపత్రయంతో ఇవాళ రూ.340 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను. గతంలో టెంకాయ కొట్టి మోసం... గతంలో మీరు గమనించే ఉంటారు. ఇదే పథకానికి గతంలో ఎన్నికలకు కేవలం నెల ముందు... గత పాలకులు 2019 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా.. ఈప్రాజెక్టుకు సంబంధించిన భూమి... ఏమాత్రం ప్రొక్యూర్ చేయకుండానే, మనందరినీ మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని చెప్పి మనందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయండి. నేడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభం... ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావడం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి కూడా ఈ ఏదాది మే నెలలో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మన హయాంలోనే ప్రొక్యూర్ చేశాం. అవన్నీ లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు లేకుండానే.. భూమి ప్రొక్యూర్ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు గత పాలకులు, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడకువచ్చి టెంకాయ కొట్టారు అని మీ అందరి తరపును నేను అడుగుతున్నాను. ఏ కార్యక్రమం చేసినా అందులో చిత్తశుద్ధి ఉండాలి. నోటిలో నుంచి మాట వస్తే అందులో నిజాయితీ ఉండాలి. ప్రజలను, రైతులను, అక్కచెల్లెమ్మలను, చదవుకుంటున్న పిల్లలను మోసం చేయాలని... మోసం తోనే అడుగులు వేస్తే... ఏం జరగబోతుందన్నది ప్రజలే 2019లోనే గట్టిగా చెప్పారు. 175 నియోజకవర్గాలను గానూ.. గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని కేవలం 23 స్ధానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చారు. అబద్దాలను నమ్మం, మోసాలకు ఓటు వేయం అని ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్తితులను మనం చూశాం. వరికపూడిశెల– 25 వేల ఎకరాలకు సాగు, తాగునీరు.. ఈ రోజు అందుకు భిన్నంగా.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తున్నాం. ఈ లిఫ్ట్ను నాలుగు పంపులతో నాగార్జున సాగర్కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్నాం. వరికెపూడిశెల వాగునుంచి రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటిదశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లిఫ్ట్ ద్వారా 20వేల మంది జనాభాకు తాగునీరందించే మంచి జరుగుతుంది. దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో ఈప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. పల్నాడు గుండె చప్పుడు విన్న వ్యక్తిగా... ఇంకా కొన్ని విషయాలు ఈ అందరితో పంచుకుంటున్నాను. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ఔషధమో పూర్తిగా తెలిసిన వ్యక్తులలో నేను ఒకరిని. మీ అందరి గుండె చప్పుడు విన్న వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి ఈ ప్రాజెక్టును దశలవారీగా మాచర్ల నియోజకవర్గం ఆ తర్వాత వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఆ తర్వాత ఎర్రగొండపాలెం వరకు తీసుకునిపోయే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన అటవీ, పర్యావరణశాఖ అనుతులన్నీ కూడా ఇఫ్పటికే తీసుకునిరాగలిగామని సంతోషంగా చెబుతున్నాను. దేవుడి దయతో దశలవారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే దశలవారీగా పూర్తవుతుందో... 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమం పూర్తవుతుంది. దాదాపుగా 1లక్ష మందికి తాగునీరు అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. పౌరషాల గడ్డ నుంచి అభివృద్ధి గడ్డగా... ఈ రోజు ఈ ప్రాజెక్టే కాకుండా..ఈ పల్నాడను, ఈ పౌరుషాల గడ్డను, అభివృద్ధి గడ్డగా మార్చడానికి, స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్ధాలుగా ఎవరూ సాహసం కూడా చేయని విధంగా... ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మీద మీ బిడ్డ ప్రభుత్వం గత 53 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ వచ్చాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా.... ఇక్కడ ఈ ప్రాంతానికి వేగంగా ఇప్పటికే పనులు జరుగుతున్న మెడికల్ కాలేజీని కూడా మన ప్రభుత్వమే తీసుకువచ్చింది. ఒక్క పల్నాడే కాదు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి 53 నెలలుగా మనందరి ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసింది. అత్యధిక ప్రాధాన్యతను పేద వర్గాల సాధికారతకు ఇచ్చాం కాబట్టే... మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా రూ. 2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేదు. ఇక నాన్ డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా రూ. 1.70 లక్షల కోట్లు.. వెరసి మొత్తం 53 నెలల కాలంలో అక్షరాలా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేలు చేసింది. లంచాలు అడిగేవాడు లేడు. ఎక్కడా వివక్ష చూపే కార్యక్రమం జరగడం లేదు. ప్రతి అక్కచెల్లమ్మల కుటుంబాల వద్దకు వచ్చి... నీకు ఏం అవసరం ఉందని ప్రతి ఇంటికి వచ్చి అడిగి మరీ తెలుసుకుని మంచి చేసే కార్యక్రమం మీ బిడ్డ పాలనేలో జరుగుతుంది. కోవిడ్ ఉన్నా ఆగని సంక్షేమం.... మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. వరుసగా రెండేళ్లు మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు. కోవిడ్ సమస్యులున్నా... ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ఆదాయాలు తగ్గినా, కోవిడ్ ఖర్చుల పెరిగినా, బాబు చేసిన అప్పుల కుంపటి ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎవరిమీదా నేరం మోపలేదు. సాకులు వెతకలేదు, చెప్పలేదు. మీ అవసరాలు మీ కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు ఖర్చులకన్నా మిన్నగా భావించి... ప్రతి ఒక్కరికీ మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా నిలబడగలిగింది. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు. అభివృద్ధి ఆపలేదు. మరోవైపు చంద్రబాబు గారి గత పాలన ఎలా జరిగింది. ఎందుకంటే రాబోయో రోజుల్లో మహా సంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఆ మహాసంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ? గతంలో పాలన ఎలా జరిగింది ? అందులో ఆ పెద్దలు, పాలకులు ఎలా పని చేశారు? మనకు మంచి చేయగలుగుతారా? లేదా అన్నది ఆలోచన చేయాలి. గతానికీ– నేటికీ తేడా చూడండి. గత పాలనకు, మీ బిడ్డ పాలనకు బేరీజు వేయాల్సిన సమయం వచ్చింది. మరోవైపు మన ప్రతిపక్ష నాయకుడ్ని చూడండి. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు మంచి చేస్తూ కనీసం ఒక్క పథకమైనా పెట్టిన చరిత్ర గతంతో చంద్రబాబుకు ఉందా? గతం మోసాల చరిత్ర.. గతంలో మనం ఏం చూశామంటే... మోసాల చరిత్రను చూశాం. వెన్నుపోట్ల చరిత్రను చూశాం. అబద్ధాల చరిత్రే మనకు చంద్రబాబు పాలనలో కనిపించింది. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశానని గానీ, కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానని గానీ, కనీసం ఒక మంచి కార్యక్రమం అమలు చేశానని కానీ ఈ పెద్దమనిషి ఓటు అడగడు. కారణం ఈ పెద్దమనిషి చేసిందేం లేదు కాబట్టి. కానీ ఈయన ఎన్నికలు రాగానే అది చేస్తాను, ఇది చేస్తానని చెబుతాడు. మాయ మాటలతో ఓట్లు అడుగుతాడు. ఆలోచన చేయండి.. మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే మీరు అండగా నిలబడాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఫలానా మంచి చేశాను, నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. మంచి చేసానని ఓటు అడగడం లేదు... మోసం చేసేందుకు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచేందుకు.. మీకు కేజీ బంగారం ఇస్తాను, మీ ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబును నమ్మగలమా ? ఇదే పెద్దమనిషి చంద్రబాబు చివరికి సొంత నియోజకవర్గం అయిన కుప్పానికి కూడా 34 ఎమ్మెల్యేగా ఉన్నా ... అక్కడ కూడా నీరిచ్చిన చరిత్ర లేదు. కుప్పానికే నీళ్లు ఇవ్వని చంద్రబాబు.. మన మాచర్లకు, మన పల్నాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్దమనిషి నీరు ఇస్తానని చెబితే నమ్మగలమా? నమ్మగలుగుతామా? కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని ఒకడు అన్నాడట. ఈ పెద్దమనిషి చంద్రబాబు మాటలు చూస్తే అవే కదా గుర్తుకొస్తాయి. కుప్పానికేం చేయలేని బాబు... 14 యేళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేపోయాడు. అలాంటి ఈ పెద్ద మనిషి... ఇక మన పల్నాడుకు గానీ, మరోప్రాంతానికి గానీ, మన గ్రామానికి గానీ, మన కుటుంబాలకు గానీ, మన సామాజిక వర్గాలకు గానీ మంచి చేస్తాడని నమ్మగలమా?. చివరికి కుప్పానికి నీళ్లు కావాలన్నా ? చివరికి కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలన్నా ? చేసేది మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని ఈ పెద్ద మనిషి చెప్పాడు. చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలుగా ఉన్న నా అక్కచెల్లెమ్మల సీ గ్రేడ్ గా, డీ గ్రేడ్ గా వారి పరపతి దిగజారిన పరిస్థితులు చూశాం. చివరకు నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేసిన ఇలాంటి బాబు.. ఒక జగనన్న అమ్మ ఒడిగానీ, జగనన్న వైయస్సార్ ఆసరా గానీ, వైయస్సార్ చేయూత గానీ, సున్నా వడ్డీ గానీ, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ ఏనాడైనా చేయగలిగాడా? చేస్తానంటే నమ్మగలమా?.. బాబు విజన్ – ప్రజల్లో చెవిలో పువ్వులు... ఈయన్ను చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఒకాయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట. ఎప్పుడూ లేస్తే మనిషిని కాదంటాడట. కానీ మంచంలోంచి లేవడు. చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతే. తాను చేసిన మంచి ఏమిటనేది ఎప్పుడూ చెప్పడు. ఆయన 2000 సంవత్సరంలో ఉంటే 2047 గురించి చెబుతాడు. 2000 సంవత్సరంలో నువ్వు ఉన్నావ్.. ఇప్పుడేం చేస్తావంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్ అంటాడు. 50 ఏళ్ల తర్వా ఏం జరగబోతోందనేది చెబుతాడు. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో ? ఎవడు పోతాడో ? ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టడం ఈజీ కదా అని ఆలోచిస్తాడు. మీ బిడ్డ 53 నెలల పాలనలో.. అదే మీ బిడ్డ పాలనలో 53 నెలల కాలంలో పల్నాడును జిల్లా చేసింది మనందరి ప్రభుత్వం. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడులోగానీ, రాష్ట్రంలో ఏ జిల్లా అయినా, గ్రామ గ్రామాన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష జరుగుతోంది.ఇంగ్లీష్ మీడియం బడులొచ్చాయి. గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కూడా మనం, మనందరి ప్రభుత్వమే. అది కూడా ఈ 53 నెలల కాలంలోనే చేశాం. వెన్ను పోటు వీరుడు.. కుటుంబంలో సొంత కూతురును ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, ఇక రాష్ట్రంలోని కోటీ 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్ లో ఆయన నేను మారాను అంటే మనం నమ్మగలమా? అని అడుగుతున్నాను.సొంత కూతురుని ఇచ్చిన మామ... ఎన్టీ రామారావు పరిస్థితే అది అయితే, నువ్వు, నీలాంటోడు, నాలాంటోడి పరిస్థితి ఏంటి?.. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పి అహంకారంతో మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ముస్లింలకు, ఎస్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వని మనిషి ఈ పెద్దమనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా ఏనాడైనా న్యాయం చేశాడా? మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్ లో నేను మారాను అంటే నమ్మగలమా? తన కొడుకు, తన మనవడు.. వీళ్లు వెళ్లే బడులు మాత్రం ఇంగ్లీషు మీడియమే. ఆ కొడుక్కు తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందంటే అదీ రాదు. అది వేరే విషయం. కానీ తన కొడుకు, మనవడు వీళ్లను చదివించింది ఇంగ్లీష్ మీడియంలోనే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలు, మన బీసీలు, మన నిరుపేద వర్గాలు వెళ్లే మన గవర్నమెంట్ బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియంకు మారకూడదట. అవి తెలుగుమీడియంలోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లిషు మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుందని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా, ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్ మారుతుందనే నమ్మకం ఉందా? అని అడుగుతున్నాను. ఇలాంటి పెద్ద మనిషి రేపు మీ దగ్గరకి వచ్చి.. నేను మారాను అంటే నమ్మగలమా?. గతంలో ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ 2 వేల నిరుద్యోగ భృతి.. ఈ మాటలన్నీ గుర్తున్నాయా ? జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొట్టి మోసం చేసాడు. స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా మన ప్రభుత్వం వచ్చిన దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మనందరి, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగితే... ఈ పెద్ద మనిషి చంద్రబాబును నమ్ముకుంటే ఇలా 2.07 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలడా? రేప్పొద్దున మీ దగ్గరకు వచ్చి నేను మారాను అంటే నమ్మగలమా?. మన అదృష్టం కొద్దీ ఈయన దిగాడు గానీ, దిగకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు, కరెంటు కంపెనీలు ఉండేవి కాదు. ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు ఉండేవి కావు. అన్నీ కూడా నీట్ గా అమ్మేసి గవర్నమెంట్ ను మూసేసేవాడు. ప్రభుత్వ రంగంలో హాస్పిటళ్లు కూడా ఉండేవి కాదు. దేవుడి దయతో ఆయన పోయాడు కాబట్టి వీటికి కొత్తరూపు వచ్చింది. ఆస్పత్రులు స్కూళ్లు మారాయి. ఆర్టీసీని కూడా గవర్నమెంట్ లో కలిసి రూపురేఖలు మారిన పరిస్థితులు మన ప్రభుత్వంలో వచ్చాయి. ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్దమనిషి వైద్య ఆరోగ్య రంగంలో... మనందరి ప్రభుత్వంలో... విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా?. పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని భవిష్యత్ లో ఈ పెద్దమనిషి అంటే నమ్మగలమా? ఆలోచన చేయండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయన్న ఈ పెద్దమనిషి... ఉచిత విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్దమనిషి, రుణాల మాఫీ దగ్గర నుంచి రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా ఏనాడైనా నిలబెట్టుకున్నాడా?. అలా రైతును మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు ఏదేదో చేస్తానంటాడు. రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తానన్న పెద్దమనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని టీవీల్లో అడ్వరై్డజ్మెంట్లు ఊదరగొట్టిన ఈ పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక రైతులను అడ్డగోలుగా మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టుకొని అది చేస్తా ఇది చేస్తాఅంటే నమ్మగలమా ?. చంద్రబాబు వాలకం ఎలా ఉంటుందంటే... నరమాంసం రుచి మరిగిన పులి బంగారం కడియాన్ని చూపుతూ ఫ్రీ గిఫ్ట్ ఇస్తా అని ఆశ పెడితే, ఎవరైనా ఆ బంగారు కడియం కోసం పులి దగ్గరకు వెళ్లే ధైర్యం చేయగలుగుతారా? ఈపెద్ద మనిషి చంద్రబాబు మాటలు నమ్మితే కూడా అదే మాదిరిగా ఉంటుంది. తన బినామీ భూములు బాగా పెరగాలన్న దుర్భుద్ధితో ఈ పెద్దమనిషి అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించాడు. మరి ఇలాంటి వ్యక్తి మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే సమన్యాయం జరుగుతుందని ఎవరికైనా నమ్మకం ఉందా?. ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా? తన హయాంలో చంద్రబాబు పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. తన హయాంలో పేదలకు సెంటు స్ధలం కూడా ఇవ్వకపోగా... మనం 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారు. అంతే కాకుండా... కులాల మధ్య సముతుల్యం దెబ్బతింటుందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా మంచి జరుగుతుందా? ఇలాంటి వ్యక్తి నేను మారాను, భవిష్యత్ లో ఇవన్నీ చేస్తానంటే నమ్మగలమా? బాబు– లంచాల పాలన... తన పాలనలో పేదలకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ, గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్దమనిషి మనసు మారాలంటే, గుండె కరగాలంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు, గుండె కరిగే ఇంజెక్షన్లు ఎన్ని ఇస్తే ఈ పెద్ద మనిషిలో మానవత్వం వస్తుందో ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి ఒకడే చెబితే నమ్మరని, తనకు తోడు ఇంకో నలుగురిని కలుపుకుంటున్నాడు. వాళ్లు అందరూ.. ప్రతి ఇంటికీ బెంజ్ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారు. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడుని కలిశాను కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నాము. మొత్తం 11 హామీలిస్తున్నామంటున్నారు బాబు– దత్త పుత్రుడి మోసం... 2014లో ఇదే దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసే పోటీ చేశాడు. ఇదే చంద్రబాబుతో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు మోదీ వీళ్లిద్దరికి తోడు మోడీ గారి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది గత చరిత్ర. అలాంటి గత చరిత్ర ఉన్నవాళ్లు ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే.. 5 హామీలు ఒకరు, 6 హామీలు ఇంకొకరు కలిసి 11 హామీల మేనిఫెస్టో ఇది. ఇది రిహార్సల్ అట, మేనిఫెస్టో ఇంకా ఎక్కువ ఇస్తారట. నిజంగా వీళ్లు మనుషులేనా? వీళ్లకు సిగ్గుందా?. అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నా... ఇటువంటి దారుణాలను సమర్థించేందుకు చంద్రబాబుకు ఒక వర్గం ఉంది. ఒక ఎల్లో మీడియా ఉంది. ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్లందరిదీ ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకొనేందుకు, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి బాబు తరపున పనిచేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు, అనేక పార్టీల్లో తన కోవర్టులు కూడా ఉన్నారు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది? ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారు? ఏ పేద వాడి కోసం చేస్తున్నారు?. కేవలం ప్రజల్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం కోసం దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి చూస్తే రాజకీయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు. ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డ చేతకాదు. ఒక వైయస్సార్కు గానీ, ఒక జగన్కు గానీ తెలిసిందల్లా ఒక్కటే. ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినడం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతాను. నేను విన్నాను– ఉన్నాను.. మీ జగన్.. నేను విన్నాను, నేను ఉన్నానని మాత్రమే మీ బిడ్డ జగన్ చెబుతాడు. ఆ తర్వత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలను ఒక బైబిల్గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి, అక్కచెల్లెమ్మల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. మీ బిడ్డ ఈ పొత్తుల్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తోడు లేదు. కారణం మీ బిడ్డ వీళ్లనెప్పుడూ నమ్ముకోలేదు. పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ దళారులను పెట్టుకోలేదు. చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు. నా ధైర్యం ఇంటింటికీ, అన్ని సామాజిక వర్గాలకూ, అన్ని ప్రాంతాలకు చేసిన మంచి. మనందరి ప్రభుత్వం ఇంటింటికీ అన్ని సామాజిక వర్గాలకు చేసిన మంచే నా ధైర్యం. బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన రూ. 2.40 లక్షల కోట్లు నా ధైర్యం. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టడం మీ బిడ్డకు మీరిచ్చిన ధైర్యం. ఎన్నికల మేనిఫెస్టో చూపించి 99 శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోను చూపి అక్కా.. మీ బిడ్డ ఇవన్నీ ఎన్నికలకు మందు చెప్పాడు. ఇవన్నీ జరిగాయా లేదా మీరే చూడండి.. జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని నిజాయితీ అడిగే చిత్తశుద్ధి. నా ధైర్యం.. నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ.. మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్ లు. ఆగ్రామంలో మార్చిన వ్యవసాయ తీరు ఆర్బీకే కేంద్రాలు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం. నాడు నేడుతో బడులు రూపు రేఖలు మార్చడం నా ధైర్యం. మన అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా ఇవ్వడం నా ధైర్యం. అమ్మ ఒడి ఇవ్వడం, వైయస్సార్ చేయూత ఇవ్వడం నా ధైర్యం. దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించి, అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ షేక్ చేసినా, ఎస్ వోఎస్ నొక్కినా 10 నిమిషాల్లో పోలీసు అన్నదమ్ములు వచ్చే వ్యవస్థను తీసుకురావడం నా ధైర్యం. నా పొత్తు ప్రజలతోనే.. ప్రజలతోనే నా పొత్తు. పేద ప్రజల కోసమే నా పార్టీ, మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టిందనే చిత్తశుద్ధి నా ధైర్యం. అందుకే దళారులతో పొత్తు పెట్టుకోలేదు. రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మోసాలకు మోసపోవద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా ? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి చేసే మనందరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. చివరగా.. కాసేపటి క్రితం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కొన్ని అభివృద్ధి పనులు అడిగాడు. ఇవాళ జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులే కాకుండా.. మరికొన్ని పనులు అడిగాడు. అందులో ఒకటి ఇక్కడున్న సీహెచ్సిని 100 పడకల ఆసుపత్రి కింద మార్చే కార్యక్రమం చేయమన్నాడు. దాన్ని మంజూరు చేస్తున్నాను. వీటితో పాటు మిగిలినవన్నీ చేస్తాను అని హామీ ఇస్తూ... తన ప్రసంగం ముగించారాయన. చదవండి: అదేపనిగా అసత్యాల ‘ఎత్తిపోతలు’ -
Palnadu Voice:జగనన్నకు మేమిచ్చే గిఫ్ట్ ఇదే
-
బాబుపై అదిరిపోయే కౌంటర్..
-
పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం: సీఎం జగన్
Updates సీఎం జగన్ మాట్లాడుతూ.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం. ►రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోత ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశాం. ►ఎలాంటి అనుమతులు లేకుండా గల పాలకులు ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయబోతే.. ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ప్రాజెక్ట్ను చేపట్టాం. ►నవంబర్ 6న అటవీశాఖ నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ఏదైనా పనిచేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ►ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో సాగునీరు అందుతుంది. ►ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ►ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించబోతున్నాం. ►పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారతకు కృషి చేశాం. రూ.2లక్షల 40వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. ►డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4లక్షల 10వేల కోట్లు అందించాం. ►కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపలేదు. ►చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. ►చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్దాలే. ►14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. ►కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా?. ►కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?. ►కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్లతో వస్తాడు. ►రాష్ట్రంలోని గ్రామగ్రామాన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. పల్నాడును జిల్లా చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ►సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా?. ►చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా అన్నది చంద్రబాబే. ►బీసీల తోకలు కట్ చేస్తానని అహంకారంగా మాట్లాడిందీ చంద్రబాబే. ►చంద్రబాబు ఇప్పటి గురించి చెప్పడు కానీ.. రాబోయే 50 ఏళ్లలో ఏం చేస్తాడో చెబుతాడు. ►అప్పటి వరకు బ్రతికి ఉండేది ఎవరు?. ►చంద్రబాబు మానవత్వంలేని మనిషి. ►ప్రజల సంక్షేమం చంద్రబాబుకు పట్టదు. ►చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారు. ►చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు. ►నాకు ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. ►చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ►రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నాం. ►మీకు మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది. ►అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. రాబోయే 30 ఏళ్లు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►పల్నాడు ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సీఎం జగన్దే ►వైఎస్సార్ వరికపూడిశెల ప్రాజెక్టుగా నామకరణం చేయాలి ►అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు ►ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు పల్నాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చినే సీఎం జగన్ ►రూ.320.26 కోట్లతో ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►తొలి దశలో 24 వేల ఎకరాలకు సాగునీరు ►ఆరు దశాబ్దాల తర్వాత పర్యావరణ అనుమతులు ►సీఎం జగన్ కృషితో కేంద్ర అటవీ శాఖ అనుమతి ►పల్నాడు ప్రాంతానికి వరికపుడిశెలతో పాటు గోదావరి జలాలు ►పల్నాడు ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ ►పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాచర్ల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమాలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు మాచర్లలో పోటెత్తిన జనం ►రైతులతో కిటకిటలాడుతున్న మాచర్ల ►సీఎం జగన్కు స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా ఎదురుచూపు ►అరవై ఏళ్ల కల నెరవేరుతుండటంతో పల్నాడు వాసుల్లో ఆనందం ►సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు బారులు తీరిన రైతులు ►ఉదయం నుండే కిటకిటలాడుతున్న సభావేదిక గ్యాలరీలు ►మాచర్ల బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►కాసేపట్లో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించనున్న సీఎం సాక్షి, అమరావతి: పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. ‘వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం జగన్ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. -
రేపు మాచర్లకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం బుధవారం మాచర్లలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరికపుడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ మాచర్ల షెడ్యూల్ ప్రకారం.. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు. పులుల అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను లైన్ క్లియర్ అయ్యింది. దాదాపు రూ.340.26 కోట్లతో జరగబోయే పనులకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్ ఇరిగేషన్(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తోంది జగనన్న ప్రభుత్వం. చదవండి: పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల -
పల్నాడు ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
-
మాచర్లలో సామాజిక జైత్రయాత్ర
-
డాక్టర్ రాధా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
ఎన్టీఆర్: జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడని పోలీసులు తేల్చి చెప్పారు. రాధను హతమార్చటంలో నిందితుడు కారు డ్రైవర్ సహాయం పొందినట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక వివాదాలే హత్యకు గల కారణాలుగా నిర్ధరించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా శుక్రవారం తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు నెలల ముందే పథక రచన.. డాక్టర్ లోక్నాథ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాధ భార్యభర్తలు. మచిలీపట్నం జవ్వారుపేటలో శ్రీ వెంకటేశ్వర తల్లిపిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. రాధ కొంత కాలంగా ప్రాక్టీస్ ఆపేసింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిరువురూ వివాహితులే. కుమారుడికి ఇటీవలే వివాహం కావటంతో గత నెలలో అత్తారింటికి వెళ్లాడు. ఇదిలా ఉండగా లోక్నాధ్, రాధల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కలహాలతో పాటు ఆర్ధికపరమైన విషయాల్లోనూ మనస్పర్ధలు ఉన్నాయి. విబేధాలు తారస్థాయికి చేరుకోవటంతో ఉమామహేశ్వరరావు భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన వద్ద సుమారు 15 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ స్ఫూర్తి జానార్ధన్ అలియాస్ మధును ఈ పనిలో సహాయం కోరాడు. సహకరిస్తే 30 లక్షల నగదుతో పాటు రాధ సంబంధించిన బంగారం మొత్తం ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందుకు మధు ఒప్పుకున్నాడు. ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసేందుకు మూడు నెలల ముందుగానే సీసీ కెమెరాలను ఉపయోగంలో లేకుండా చేశారు. ఆభరణాలు తీసి.. సీలింగ్లో దాచి.. అదును కోసం చూస్తున్న ఉమామహేశ్వరరావు కొడుకు అత్తగారింటికి వెళ్లటంతో డ్రైవర్తో చర్చలు జరిపాడు. ఆక్సిజన్ సిలిండర్లు బిగించేందుకు ఉపయోగించే రెంచీని ఆయుధంగా ఎంచుకున్నారు. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ లోక్నాథ్ రెంచీని మధుకు అందజేశాడు. సాయంత్రం రెండో అంతస్తులో అనుమానం కలుగకుండా నక్కి ఉండమని చెప్పాడు. అతడు డాక్టర్ చెప్పిన విధంగా చేశాడు. అదును చూసుకుని ఉమామహేశ్వరావు, మధు ఇద్దరూ రాధపై ఒక్కసారిగా దాడి చేశారు. మధు ఆమెను బలంగా పట్టుకోగా భర్త ఆమె తలపై రెంచీతో బలమైన దెబ్బలు కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అయిన రాధ స్పృహ కోల్పోయింది. మృతి చెందిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు మరలా రెంచీతో బలంగా ఆమె తలపై కొట్టారు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఉమామహేశ్వరరావు ఇంటి వెనుక వైపు నుంచి కింది ఫ్లోర్లోని క్లినిక్లో వెళ్లిపోయాడు. మధు ఆమె ఒంటిపై ఆభరణాలు ఒలిచి సీలింగ్లో దాచాడు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు డాక్టర్ సలహా మేరకు కారం తెచ్చి మృతురాలి ఒంటిపై చల్లాడు. గదిలో అక్కడక్కడా కారం చల్లటంతో పాటు రెంచీని ఇంటి వెనుకభాగంలో దాచి పెట్టాడు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో డాక్టర్ ఉమామహేశ్వరావు ఏం ఎరుగనట్టు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ సమాచారం ఇచ్చాడు. ఆభరణాలు స్వాధీనం.. రాధ హత్య సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మాధవరెడ్డి, సంబంధిత ఏరియా సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకున్నారు. అతని ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీస్స్టేషన్లో హత్య కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు చిక్కకపోవటంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాధను హత్య చేసింది ఆమె భర్తేనని నిర్ధారించారు. అతడికి డ్రైవర్ సహకరించినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును చేధించటంలో ప్రతిభ కనబరచిన బందరు డీఎస్పీ మాధవరెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వర్తించి హంతకులను అదుపులోకి తీసుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించేందుకు రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హరిబాబు, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐలు ఉమామహేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు. -
ఎర్రబుక్ కాదు పచ్చబుక్ పట్టాల్సింది లోకేష్
-
Macherla: 144 సెక్షన్ గడువు పొడిగింపు
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్ను పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి 144 సెక్షన్కు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. (క్లిక్ చేయండి: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్) -
మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం
మాచర్ల: కండీషన్ బెయిల్ పేరుతో టీడీపీ నేతలు మాచర్లలో అలజడి సృష్టించేందుకు మరోమారు విఫలయత్నం చేశారు. గత నెల 16వ తేదీన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం పేరుతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 12వ వార్డులో ర్యాలీగా వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ముగ్గురిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి మరో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న నిందితులందరూ కండీషన్ బెయిల్కు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్లో సంతకాలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆదివారం సంతకాలు చేసేందుకు బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మాచర్లకు తరలి రావాలంటూ వారి అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేస్తూ నెహ్రూనగర్ నుంచి పట్టణ పోలీసు స్టేషన్ వరకు గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దీంతో ఇతరులు అక్కడికి వచ్చి అలజడి సృష్టించే అవకాశం లేకపోయింది. కేవలం బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే 12.30 గంటలకు బస్సులోంచి చేతులూపుతూ వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
Macherla Constituency: టీడీపీకి దిక్కేది.. జూలకంటి జాడేది!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 55 ఏళ్లుగా ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతూ మధ్యలో టికెట్టు దక్కక విరామం తీసుకుంటూ కొనసాగుతోంది. ఇండిపెండెంట్గా, కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపు ఓటములను చవిచూడటమూ ఆ కుటుంబ పోటీదారులకు రివాజే. దాదాపు దశాబ్దం పాటు మౌనం వహించిన జూలకంటి పేరు తాజాగా పల్నాడులో వినిపిస్తోంది. వాడుకుని వదిలేయడంలో బాబు దిట్ట తన వ్యక్తిగతంతోపాటు పార్టీ అవసరాలకు సమయానుకూలంగా ఎవరినైనా వాడుకుని పక్కకు విసిరిపారేయడంలో అందెవేసిన నేతగా ప్రత్యేక గుర్తింపున్న చంద్రబాబునాయుడు తాజాగా జూలకంటిని వాడేసుకుంటూ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాలుపోస్తున్నారనే మాట పల్నాడులోని ప్రతినోటా వినిపిస్తున్నదే. రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న వారెవరైనా చర్చిస్తున్న తాజా అంశమిదే. అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ప్రాంతాల అభివృద్ధిలో పోటీపడాలే తప్ప ప్రజల్లో అశాంతిని రేకెత్తించే కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. పాలకపక్ష నాయకుల తప్పులుంటే ఎత్తిచూపడంలో తప్పులేదని, ప్రశాంతతతో పాటు వేగంగా ప్రగతిబాట పడుతున్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పడగవిప్పేలా చేస్తున్న వారెవరినీ క్షమించకూడదని పార్టీల రహితంగా ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత తీరును, జూలకంటి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తంమీద ఏడుసార్లు జూలకంటి కుటుంబం ఎన్నికల్లో తలపడగా 1972, 1983, 1999లలో విజయం సాధించడం పరిశీలనాంశం. n జూలకంటి నాగిరెడ్డి 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమి చెందారు. 1972లో అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో రంగంలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. 1983లో గురజాల స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. నాగిరెడ్డి భార్య దుర్గాంబ 1999లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూలకంటి కుటుంబాన్ని ఓటర్లు ఆదరించలేదు. 2004 నుంచి ఓటమెరుగని పిన్నెల్లి కుటుంబీకులు మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి కుటుంబం తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. 1994 ఎన్నికల్లో మాత్రం పిన్నెల్లి సుందరరామిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004లో లక్ష్మారెడ్డి గెలుపొందగా ఆయన వారసునిగా శాసనసభ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009, 2012 (బై ఎలక్షన్), 2014, 2019లలో వరుసగా విజయాలు సాధించారు. ఏడుగురి హత్యకేసుతోపాటు వివిధ కేసుల్లో చిక్కుకున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి (బ్రహ్మారెడ్డి) 2004, 2009 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డిల చేతుల్లో ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు టికెట్టు ఇవ్వకపోగా దూరంగా పెట్టడంతో బ్రహ్మారెడ్డి మౌనం దాల్చక తప్పలేదు. చివరికి నీవే శరణం అన్నట్టు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూమొక్కూ లేకుండా పోయిన దశలో చంద్రబాబునాయుడు కొన్ని నెలల కిందట జూలకంటిని రంగంలోకి దించారు. పరస్పర అవసరాల ప్రాతిపదికన రాజకీయ రచ్చకు ప్రాధాన్యమిస్తూ ఫ్యాక్షన్ కు ప్రాణం పోస్తున్నారనేది పరిశీలకుల విశ్లేషణ. అభివృద్ధి కోణంలో పల్నాడులో మరే ప్రాంతాలకు తీసిపోని రీతిలో వేగంగా అడుగులు పడుతున్నాయని ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పలుసార్లు బహిరంగంగా పిలుపునిచ్చినా టీడీపీ నుంచి కనీస స్పందన కరవైందని పాలకపక్ష ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హింసా రాజకీయాలకు ప్రాధాన్యమిస్తోందంటూ... గతంలో నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ బాంబులతో రాజకీయాలు నడిపారని, గురజాలలో అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఇప్పుడేమో మాచర్లలో ఫ్యాక్షన్ కు ఊతమిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు చంద్రబాబు ఫుల్స్టాప్ పెడితే మంచిదని హితపు పలుకుతున్నారు. 2004 నుంచి గెలుపే లేని టీడీపీ టీడీపీ ఆవిర్భావం తర్వాత మాచర్ల నియోజకవర్గంలో మొత్తం పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కేవలం నాలుగు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మూడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. 2012 నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పీఆర్కే జయకేతనం ఎగురవేస్తుండడం విశేషం. టీడీపీ నుంచి 1983లో కొర్రపాటి సుబ్బారావు, 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణప్రసాద్, 1994లో కుర్రి పున్నారెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ గెలిచారు. కాంగ్రెస్ నుంచి 1995లో నత్తువ కృష్ణమూర్తి, 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి, 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) గెలిచారు. వైఎస్సార్ సీపీ నుంచి 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పీఆర్కే విజయ పరంపర కొనసాగించారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. ఇదేం కర్మరా బాబు?) -
మాచర్లలో టీడీపీ ‘ఇదేం ఖర్మ’పై... పోలీసులకు సమాచారం లేదు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పల్నాడు జిల్లా మాచర్లలోని 16వ వార్డులో ఈ నెల 16వ తేదీన టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ చెప్పారు. గుంటూరులోని డీఐజీ కార్యాలయంలో ఆదివారం పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మాచర్ల 16వ వార్డు అత్యంత సున్నితమైన ఏరియా. అక్కడ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంది. సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వర్తించే క్రమంలో పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. అలా ఇస్తే విధిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 16వ తేదీ సాయంత్రం 5.30 సమయంలో రెండు గ్రూప్ల మధ్య చోటు చేసుకున్న గొడవను విజిబుల్ ఎస్ఐ గుర్తించి, ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈలోగా రాళ్ల దాడి జరిగింది. ఒక వర్గం నుంచి చల్లా మోహన్, మరోవర్గం నుంచి అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశాం. రెండు వీడియోలలో దాడి దృశ్యాలను ఆధారంగా చేసుకుని సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తాం’ అని డీఐజీ తెలిపారు. -
మాచర్ల అల్లర్లకు చంద్రబాబే కారణం
నరసరావుపేట: మాచర్ల అల్లర్లకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడే కారణమని ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.నరసరావుపేటలోని జీబీఆర్ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పిన్నెల్లి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం వేర్వేరుగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంటే టీడీపీకి అక్కసు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కొంత కాలంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతుండటం దారుణం అన్నారు. ఇందులో భాగంగా నెలవారి మామూళ్లతో బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని నియమించారన్నారు. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీసిన స్థానికులను కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడమేమిటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారన్నారు. ఇందుకు బదులుగా వారు కర్రలు, బండరాళ్లతో దాడి చేసి, ముగ్గురు బీసీలను చంపే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయంలో పచ్చ మీడియా దుష్ప్రచారం దారుణం అని మండిపడ్డారు. వారు తప్పు చేయకపోతే గొడవ జరిగిన గంటలోనే మాచర్ల వదిలి ఎందుకు పరారయ్యారని ప్రశ్నించారు. యరపతినేని శ్రీనివాసరావు బండారం మొత్తం అందరికీ తెలుసని, అందుకే ప్రజలు మూడుసార్లు ఓడించారని.. ప్రజాభిమానంతో తాను ఐదుసార్లు గెలిచానన్నారు. యరపతినేని ఉడుత ఊపులకు ఇక్కడ భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. బాబు పంపించిన పేటీఎం (జూలకంటి బ్రహ్మారెడ్డి) వ్యక్తిని చూసి తాము భయపడే ప్రసక్తే లేదని, ఆయన 2009లోనే తమపై ఓడిపోయాడనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఓర్వలేకే గొడవల సృష్టి : ఎంపీ లావు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగుతుంటే, ఓర్వలేకే ప్రతిపక్షం గొడవలు సృష్టిస్తోందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. మాచర్లలో గత 15 ఏళ్లుగా గొడవలు లేవని చెప్పారు. రెచ్చగొట్టే రాజకీయాలు వల్ల కార్యకర్తలు, వారి కుటుంబాలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎక్కడా, ఎప్పుడూ రెచ్చగొట్టే రాజకీయాలు చేయలేదని తెలిపారు. మాచర్లలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, ఇకపై ఇలాంటి ఘటనలను ఉపేక్షించవద్దని అధికారులకు సూచించామన్నారు. మీడియా కూడా రెచ్చగొట్టే ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ ఉడత ఊపులకు భయపడం: ఎమ్మెల్యే పిన్నెల్లి
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో వార్డు మహిళలు నిలదీశారనే అక్కసుతోనే మాపై దాడి చేసి చంపాలని చూశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నెలవారీ ముమూళ్లు ఇచ్చి బ్రహ్మారెడ్డిని ఇంఛార్జిగా పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసే మాపై దాడులు చేస్తున్నారన్నారు. ‘‘యరపతినేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరించారు. ‘‘ఇక్కడ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూలేరు. టీడీపీ నాయకులు దమ్ముంటే డైరెక్ట్గా రండి.. ఏ డిబేట్కైన సిద్ధం’’ అంటూ రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చదవండి: మాచర్ల స్కెచ్ చంద్రబాబుదే... -
‘బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు’
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారణమని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. బాబు డైరెక్షన్లోనే బ్రహ్మారెడ్డి మాచర్లలో అలజడి సృష్టించారన్నారు. హత్యా రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలో పల్నాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్ పాలనలో పల్నాడుకి జిల్లా వచ్చిందన్నారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాలను రూ. 4700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని విషయం ప్రజలు గ్రహించాలన్నారు. పులివెందులతో సమానంగా పల్నాడు అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేస్రెడ్డి పేర్కొన్నారు. -
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన పచ్చ ముఠా
-
ప్రశాంతంగా మాచర్ల..పోలీసుల ఆధీనంలో పట్టణం
సాక్షి, నరసరావుపేట, మాచర్ల, మాచర్ల రూరల్: టీడీపీ రౌడీ మూకల స్వైర విహారంతో శుక్రవారం రాత్రి అట్టుడికిన మాచర్ల పట్టణంలో శనివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తెరవలేదు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా చూశారు. ఇరు వర్గాల నేతల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి వీడియో ఫుటేజీల ఆధారంగా కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ శనివారం మాచర్ల పట్టణంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎవర్నీ ఉపేక్షించవద్దని ఎస్పీ రవిశంకర్రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మారెడ్డి వెళ్లిపోయుంటే గొడవకు తావులేదు మాచర్లలో ఉద్రిక్తత సద్దుమణిగిందని, శాంతిభద్రతలు తమ ఆధీనంలోనే ఉన్నాయని పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాచర్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెల్దుర్తి, గుండ్లపాడు గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు ర్యాలీలో పాల్గొనడం వల్లే పెద్ద ఎత్తున ఘర్షణకు కారణమైందని తెలిపారు. ఇందులో పోలీసుల వైఫల్యం ఎంతమాత్రం లేదని తెలిపారు. సంఘటన స్థలం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంతగా చెప్పినా, జూలకంటి బ్రహ్మారెడ్డి వినిపించుకోకుండా ఉద్రిక్త పరిస్థితికి దారితీసేలా ప్రవర్తించారన్నారు. బ్రహ్మారెడ్డి కార్యాలయం, వీరి మనుషుల గృహాలు దగ్ధం కాలేదని, కేవలం ఫర్నీచర్కు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు. విజువల్స్ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు. దాడుల్లో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని, వారిలో మోహన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉక్కుపాదంతో అణిచి వేస్తామని స్పష్టం చేశారు. బంగారం, డబ్బులు పోయినట్లు తమకు ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బందోబస్తులో పోలీసు సిబ్బంది అంతా చంద్రబాబు సూచన మేరకే.. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడులోనూ గొడవలు సృష్టించి హత్యలు చేయడానికి పథకం ప్రకారం కుట్రలకు తెరలేపారు. మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ 20 ఏళ్లలో అంతా ప్రశాంతంగా ఉంది. మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా 7హత్యలు చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించడం ద్వారా పల్నాడును రావణకాష్టంగా మారుస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాటి ఘటన. బీసీ నాయకులపై టీడీపీ రౌడీలు ముందస్తు వ్యూహం ప్రకారం కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. దౌర్భాగ్య పరిస్థితి నుంచి దౌర్జన్యంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ కు తెరలేపారు. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన అల్లర్లను వైఎస్సార్సీపీపై రుద్దడం సమంజసం కాదు. దోషులు ఎవరన్నది తేల్చి శిక్షలు పడేలా చూడాలని జిల్లా ఎస్పీని కోరాం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండటమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. – మీడియాతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే బీసీ నేతలపై దాడులు అమానుషం బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలు రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో టీడీపీ రౌడీమూకలు మాచర్లలో శుక్రవారం దాడి చేయడంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించాయి. బీసీల పార్టీ అంటూ దశాబ్దాలుగా టీడీపీ మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి బీసీలు వైఎస్సారీసీపీ వైపు మళ్లడంతో ఇలా దాడులకు పాల్పడుతున్నారన్నారు. మాచర్లలో బీసీలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ పిడుగురాళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి పాల్గొన్నారు. -
పల్నాడు: మాచర్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సహా కొంతమందిపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. 307,143,147,148,324,506 రెడ్ విత్ 149 సెక్షన్ కింద కేసు నమోదైంది. బ్రహ్మారెడ్డిని ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. చల్లా మోహన్రెడ్డి ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతల దాడిలో చల్లా మోహన్రెడ్డి గాయపడ్డారు. కాగా, శుక్రవారం రాత్రి మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాలు అత్యంత కిరాకతంగా ప్రవర్తించారు. విచక్షణ కోల్పోయి... బలంకొద్దీ బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమి దారుణంగా కొట్టి.. గాయపరిచారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారం చేశారు. విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని... తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం -
చంద్రబాబు హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోబోము : అంబటి రాంబాబు
-
టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే విధ్వంసం: పల్నాడు ఎస్పీ
సాక్షి, పల్నాడు: మాచర్ల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించి కారకులను పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు పల్నాడు ఎస్పీ రవిశంకర్. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. మాచర్ల దాడుల వెనుక ఫ్యాక్షనిస్టులు ఉన్నారని, వారు రాజకీయ పార్టీల అండతో రెచ్చిపోతున్నారని స్పష్టం చేశారు. టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మాచర్లకు చేరుకోవాలని టీడీపీ పిలుపునిచ్చినట్లు సమాచారం అందిన నేపథ్యంలో హెచ్చరించారు. ఎవరైనా వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఈ గొడవలో పాల్గొన్న వారందరి బ్యాగ్రౌండ్ ఫ్యాక్షన్కు చెందిన వారిగా గుర్తించాం. వెల్దుర్తి మండలంలో జరిగిన కొన్ని హత్యల్లో పాల్గొన్న వారు మాచర్లలో ఒక చోట చేరి మకాం వేశారు. వీరికి ఏదో ఒక పొలిటికల్ పార్టీ అండ కావాలి కాబట్టి, వారి సాయంతోనే చేసిన గొడవ ఇది. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందరిని అరెస్ట్ చేస్తాం. రాడ్లు, బండలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవరూ మాచర్ల వైపు రాకుండా ఉండటమే మంచిది. రెండువైపుల అందిన ఫర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నాం. ఈ గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.’ అని తెలిపారు ఎస్పీ రవిశంకర్. ఇవీ చదవండి: ‘బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు’ మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ టీడీపీ రౌడీల స్వైర విహారం -
శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేది లేదు: డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి
-
ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు: ఎమ్మెల్యే పిన్నెల్లి
-
‘ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డి ద్వారా కుట్రలు చేస్తున్న బాబు’
పల్నాడు జిల్లా: మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లే కారణమని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో పిన్నెల్లి మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడికి పాల్పడిందన్నారు. ‘మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు, లోకేష్. ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డి ద్వారా బాబు కుట్రలు చేస్తున్నాడు. కర్రలు, రాడ్లు ర్యాలీలో ఎక్కడ నుంచి వచ్చాయి. గొడవకు కారణమైన బాధ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు, లోకేష్ కలిసి ఆడుతున్న నాటకమిది. బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు. మాచర్లలో టీడీపీకి పార్టీ కార్యాలయమే లేదు’ అని అన్నారు. చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ -
మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ
విజయవాడ : మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశించారు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి. దీనిలో భాగంగా ఐజీ త్రివిక్రమ్ను మాచర్లకు పంపారు.మాచర్లలో నిన్న(శుక్రవారం) రాడ్లు, కర్రలతో స్వైర విహారం చేసిన ఘటనపై డీజీపీ ఆరా తీశారు. అదనపు బలగాలను కూడా మాచర్లలో మోహరించినట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం మాచర్లలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవాంఛనీయ శక్తులను ఉపేక్షించబోమని పేర్కొన్న డీజీపీ.. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అల్లర్ల ఘటనకు సంబంధించి నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు డీజీపీ. చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం -
కర్రలు, రాళ్లతో దాడులకు దిగిన టీడీపీ నేతలు
-
టీడీపీ రౌడీల స్వైర విహారం
సాక్షి, నరసరావుపేట, మాచర్ల: ఎదుట ఉన్నది కూడా మనుషులేనన్న విచక్షణ కోల్పోయి... బలంకొద్దీ బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమి దారుణంగా కొట్టి... మళ్లీ లేవలేనంతగా గాయపరిచారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారం చేశారు. ఇదీ... శుక్రవారం రాత్రి మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాల అత్యంత కిరాకతమైన ప్రవర్తన. విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని... తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే.... తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో ఫెలయింది. ఇక ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజానికి మాచర్లలో రెండు రోజుల క్రితం తాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచరులను అరెస్టు చేస్తారా? అంటూ బ్రహ్మారెడ్డి కొందరితో కలిసి వెల్దుర్తి పోలీస్స్టేషన్పైనే దాడికి పాల్పడ్డారు. దానికి కొనసాగింపుగానే అన్నట్టుగా... శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసే వంకతో... చుట్టుప్రక్కల ఫాక్షన్ గ్రామాలకు చెందిన తన అనుచరులను ముందే పిలిపించుకున్నారు. నిజానికి విలేకరుల సమావేశానికి అన్ని ఊళ్ల నుంచి... అంత మంది రావాల్సిన పనిలేకపోయినా... ముందస్తు పథకం ప్రకారం రాడ్లు, కర్రలతో వారిని సిద్ధంగా ఉంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా దుర్బాషలాడుతుండటంతో అక్కడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో తమను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ స్థానిక నేతలు చల్లా మోహన్, ఓర్సు కిషోర్, ఉప్పుతోళ్ల శ్రీనివాసరావులపై దాడి చేశారు. వారు కిందపడిపోయినా వదలకుండా కర్రలతో దాడులు చేస్తూ, బండరాళ్లతో బలంగా గుండెలపై కొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిస్సహాయంగా పడి ఉండిపోవటంతో... నినాదాలు చేస్తూ, ఈలలు వేసుకుంటూ పోలీసులు నచ్చజెప్పినా వినకుండా ప్రదర్శనగా రైలు గేటు వరకూ వెళ్లారు. ఒకదశలో పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగారు. కొందరు వ్యక్తులు రైల్వే గేటు వద్ద ఓ వాహనాన్ని పూర్తి స్థాయిలో దహనం చేశారు. రింగ్రోడ్డులోని మరో వాహనంపై రాళ్లతో దాడిచేశారు. మరో నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు బ్రహ్మారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి గుంటూరు పంపించారు. కారు, కార్యాలయం దగ్ధం... వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దారుణంగా దెబ్బలు తిని, నిస్సహాయంగా రోడ్డుపై పడిపోయిన విషయం వారి బంధువులు, స్నేహితులకు తెలియటంతో వారు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. తమ వారిని దారుణంగా కొట్టడం, దాదాపుగా హతమార్చే ప్రయత్నం చేయటంతో... వారి బంధుమిత్రులు టీడీపీ కార్యకర్తల జులుంను నిరసించారు. ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ కారుకు నిప్పు పెట్టారు. జూలకంటి బ్రహ్మారెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిపై కూడా దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు అగంతకులను చెదరగొట్టి... పట్టణంలో 144వ సెక్షన్ అమలులోకి తెచ్చారు. ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎక్కడికక్కడ పికెటింగ్లు ఏర్పాటుచేశారు. పథకం ప్రకారమే... కావాలనే పల్నాడులో మంటలు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే. మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడులు సృష్టించేందుకు నారా చంద్రబాబునాయుడు, లోకేష్లు పథకం ప్రకారం బ్రహ్మారెడ్డిని మాచర్లకు తీసుకువచ్చారు. నెలవారీ డబ్బులు ఖర్చులకిస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ను బతికించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. బ్రహ్మారెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చిన నాటి నుంచీ కావాలనే లేనిపోని గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. నేను 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లుగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇలాంటి అలజడులెప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్య యుతంగా ఎవరైనా ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. కానీ వీళ్లు గొడవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి... తాగి.. మహిళలను తిట్టారు. ప్రశ్నించిన కార్యకర్తలను బండరాళ్లు, రాడ్లతో కొట్టారు. దీనికి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయి. గొడవలు మొదలుపెట్టడమే కాక ఆ తరువాత పెద్ద ర్యాలీలాగా వెళ్లి స్వైర విహారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబు, లోకేష్లకు చెబుతున్నాను. మీ రాజకీయాల కోసం పల్నాడులో మంటలు రేపుతున్నారు. పల్నాడును తగలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న ఫ్యాక్షన్ ను మళ్లీ రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
మాచర్లలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్
-
గుంటూరు జిల్లాతో పింగళికి ప్రత్యేకానుబంధం
మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. జాతీయోద్యమంలో గళమెత్తిన మన ప్రాంతవాసులెందరో.. వీరిలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఒకరు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో ఆ మహానుభావునికి ప్రత్యేక అనుబంధం ఉంది. నేడు ఆయన జయంత్యుత్సవం సందర్భంగా మహనీయుని మధుర స్మృతులను ఓసారి మననం చేసుకుందాం. సాక్షి, టూరు: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంత్యుత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో స్థిరపడిన పింగళి కుటుంబం పింగళికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. 1913 బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షతన జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలో పింగళి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లాను సందర్శించి ఇక్కడి నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య పంతులు, పావులూరి శివరామ కృష్ణయ్య తదితర ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పింగళి కుటుంబ సభ్యులు 50 ఏళ్ళ క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో స్థిరపడ్డారు. జెండా రూపకల్పనకు బీజం పడింది ఇలా.. అది 1906. కోల్కతా మహానగరంలో కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భం. అప్పటి వరకు ఏ సభలు జరిగినా బ్రిటిషు జెండా ఆవిష్కరణ, వారి జాతీయ గీతం ఆలాపన ఆనవాయితీగా ఉండేది. ఆ సభలోనూ అదే తంతు జరగడం పింగళి వెంకయ్యకు నచ్చలేదు. ఇదే విషయాన్ని తన గురువు బాలగంగాధర్ తిలక్ వద్ద ప్రస్తావించారు. మనం స్వాతంత్య్రం సాధిస్తే మనకూ ఓ కొత్త జెండా వస్తోంది అని తిలక్ అన్న మాటలు పింగళి మనస్సులో బలంగా నాటుకున్నాయి. దీంతో ఆయన జాతీయ జెండా రూపకల్పనపై దృష్టిసారించారు. వివిధ దేశాల జెండాలను పరిశీలించి సుమారు 30 నమూనాలను తయారు చేశారు. ఈ క్రమంలోనే మరి కొందరు దేశ భక్తులూ జాతీయ జెండా నమూనాలు తయారు చేసే యత్నం చేశారు. పింగళి 1916లో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ (భారత దేశానికి ఒక జాతీయ పతాకం) పుస్తకాన్ని రచించారు. ఇందులోని ప్రధాన అంశాలు ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అప్పటి ప్రముఖ స్వాత్రంత్య్ర సమరయోధులు దాదాబాయ్ నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఈ పుస్తకాన్ని కొనియాడారు. ఫలితంగా ఈ పుస్తకం గాంధీ మహాత్ముడి దృష్టిలో పడింది. మహాత్ముని సూచనల మేరకు 1921లో విజయవాడలో జాతీయ కాంగ్రెస్ మహా సభ జరుగుతున్న సమయంలో పింగళి మహాత్మా గాంధీని కలిశారు. ఆయన అభీష్టం మేరకు తొలుత కేవలం పచ్చ, ఎరుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించారు. ఆ తర్వాత మహాత్ముడి సూచనలు, సలహాల మేరకు త్రివర్ణ పతాకం రూపొందింది. మొదట్లో మధ్యలో రాట్నం గుర్తు ఉండేది. ఆ తర్వాత అనేక మార్పులు జరిగి 1947లో స్వాతంత్య్రం సిద్ధించే నాటికి మువ్వన్నెల జెండా మధ్యలో అశోక చక్రంతో దేశ ప్రజల ముందు ఆవిష్కృతమైంది. జాతీయ జెండా రూపకల్పనలో పింగళి కృషిని మహాత్మా గాంధీ ‘ది యంగ్ ఇండియా’ పత్రికలో రాసిన వ్యాసంలో ప్రత్యేకంగా కొనియాడడం విశేషం. పింగళి కుటుంబానికి సీఎం సముచిత గౌరవం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది మార్చి 12న మాచర్లలో పింగళి కుమార్తె సీతా మహాలక్ష్మిని సముచితంగా సత్కరించారు. రూ.75 లక్షల చెక్కు, మెమెంటో అందజేశారు. ఇటీవల సీతామహాలక్ష్మి మరణిస్తే ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈనెల 1 నుంచి 15 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పింగళి జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్లో పింగళి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పింగళి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రి ఔదార్యాన్ని ప్రశంసించడం, ఆయనకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం. తాత జ్ఞాపకాలు అజరామరం జాతీయ జెండా రూపకల్పన చేసిన మా తాత పింగళి వెంకయ్యను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా కీర్తించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా కుటుంబంపై చూపుతున్న ప్రత్యేకాదరణకు ధన్యవాదాలు. నాకు పదిహేడేళ్ల వయస్సులో తాత మరణించారు. ఆయనతో నాకున్న కొద్దిపాటి జ్ఞాపకాలు ఎప్పటికీ అజరామరమే. – జి.వి.ఎన్.నరసింహం, పింగళి వెంకయ్య మనవడు, పింగళి జీవిత చరిత్ర రచయిత పింగళికి భారతరత్న ఇవ్వాలి కేవలం జాతీయ జెండా రూపకల్పన మాత్రమే కాకుండా దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన బహుముఖ ప్రజ్జాశాలి, బహు భాషా కోవిధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని మోదీకి పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పింగళికి తగిన గౌరవం ఇవ్వడంతో సర్కారు సహకారంతో ముందుకెళ్తాం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పింగళిని స్మరించుకోవడం సంతోషం. – స్వామి జ్ఞానప్రసన్న, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు -
టై అండ్ డైలో ఇది ‘ఆంధ్రా పోచంపల్లి’
‘పోచంపల్లి’ అని గూగుల్లో సెర్చ్ చేస్తే... టై అండ్ డై శారీస్, డ్రెస్ మెటీరియల్ అమ్మకానికి సంబంధించి ముప్పై లక్షలకు పైగా రిజల్ట్స్ వస్తాయి! తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిదు వేలలోపు జనాభా గల పోచంపల్లి నేడు టై అండ్ డై (ఇక్కత్) చేనేత, పట్టు వస్త్రాలకు ప్రపంచ రాజధాని. పోచంపల్లి టై అండ్ డైకి దాదాపు నూరేళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ, 2005 నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇందుకు ముఖ్య కారణం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పోచంపల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభించడం. ఈ గుర్తింపు ద్వారా ఈ వస్త్రాల తయారీ ప్రత్యేకతలకు మేధాపర మైన – చట్టబద్ధమైన హక్కులు లభించాయి. ఈ క్రమంలో పోచంపల్లిని యునైటెడ్ నేషన్స్ సంస్థ యూఎన్డబ్ల్యూటీఓ ‘పర్యాటకులు దర్శించదగిన గ్రామం’గా గుర్తించింది. కానీ ‘కొత్తూరు’ అని సెర్చ్ చేస్తే దాదాపు రిజల్ట్స్ నిల్! నిజానికి పోచంపల్లి వృక్షమైతే, కొత్తూరు అదే వృక్షపు బీజం! పల్నాడు జిల్లా, మాచర్ల రూరల్ మండలం, కొత్తూరు గ్రామం కేంద్రంగా టై అండ్ డై శారీస్, డ్రెస్ మెటీరియల్ వస్త్రాలను నేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్లో టై అండ్ డై వస్త్రాలు రూపొందుతున్నది కొత్తూరులోనే!! సాధారణ చేనేత వస్త్రాలు, మిల్లు వస్త్రాలు తయారైన తదుపరి... వస్త్రాలపై రంగులు అద్దుతారు. అవి పై పై రంగులు. టై అండ్ డై విధానంలో వస్త్రం తయారీ పూర్వదశలోనే నూలు దారాలు వర్ణమయమవుతాయి. ముందుగా రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా రంగులు అవసరం లేని చోట్ల రబ్బరుతో కట్టి(టై), అవసరమైన చోట్ల రంగులో ముంచుతారు (డై). రంగులలో రసాయనాల శాతం తక్కువ. నూలు దారాల దశలోనే ఈ వస్త్రానికి సహజత్వం, మృదుత్వం, మన్నిక చేకూరుతాయి. మిల్లు యంత్రాలు టై అండ్ డైతో పోటీ పడలేవు. డిజైన్లను వినియోగదారుల అభిరుచిని బట్టి రూపొందిస్తారు. కనీస ధర పదివేల రూపాయలు. లక్ష రూపాయలు పలికే హుందాగా ఉండే టై అండ్ డై చీరలు ధరించడం వీఐపీలకు ఒక స్టేటస్ సింబల్. మైక్రోసాఫ్ట్, ఎయిర్ ఇండియా తదితర సంస్థలు తమ ఉద్యోగులకు ఈ వస్త్రాలను అధికారికంగా వాడుతూ ప్రోత్సహిస్తున్నాయి. జపాన్, యూఏఈ తదితర దేశాలు డ్రెస్ మెటీరియల్, కర్టెన్లు, బెడ్షీట్లు దిగుమతి చేసుకుంటున్నాయి. నూటికి నూరు శాతం డిమాండ్ ఉన్న పోచంపల్లి టై అండ్ డై విదేశీ మారక ద్రవ్యం, జీఎస్టీ సమకూర్చడంలో అగ్రగామిగా ఉంది. పోచంపల్లి వాస్తవానికి ఒక బ్రాండ్ ఇమేజ్. పోచంపల్లి బ్రాండ్ పేరుతో ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్న టై అండ్ డై వస్త్రాలలో... పోచంపల్లి గ్రామంలో తయారయ్యే వస్త్రాలు అయిదు శాతం మాత్రమే! పుట్టపాక, గట్టుప్పల్, చండూరు, సిరిపురం, వెల్లంకి, కొయ్యలగూడెం తదితర పాత నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన గ్రామాలలో 75 శాతం తయారవుతాయి. మిగిలిన ఇరవై శాతం ‘ది నాగార్జున వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ కొత్తూరు’ ఆధ్వర్యంలో తయారవుతాయి. సాధారణ చేనేత వస్త్రకారుని నెలసరి రమారమి ఆదాయం అయిదు వేల రూపాయల కంటే తక్కువ. తెలంగాణలో పోచంపల్లి బ్రాండ్ వస్త్రకారుల ఆదాయం నెలకు రూ. 30 వేలు. అదే వస్త్రాన్ని కొత్తూరు కేంద్రంగా నేస్తున్న వస్త్రకారునికి నెలకు వచ్చే ఆదాయం పదివేల రూపాయలు మాత్రమే! దీనికి కారణం కొత్తూరు వస్త్రాలకు బ్రాండ్ ఇమేజ్ లేకపోవడమే! కొత్తూరు సొసైటీ పరిధిలోని గ్రామాల టై అండ్ డై నేతకారులు పోచంపల్లి, పుట్టపాక తదితర గ్రామాలకు వెళ్లి ముడి నూలును, సిల్క్ను కొనాలి. లేదా అక్కడ నుంచి ముడి నూలు తెచ్చిన వారి కోసం ఇక్కడ టై అండ్ డై చేసి, నేసి, అక్కడికి వెళ్లి ఇవ్వాలి. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న పోచంపల్లి సహకార సంస్థల వారు, విడిగా వ్యాపార సంస్థలకు చెందిన వారు బెంగళూరు నుంచి డైరెక్టుగా సిల్క్ ముడి సరుకు తెప్పించుకుంటారు. పరిసర గ్రామాలకు నూలు ఇచ్చి తయారైన వస్త్రాన్ని వారే తీసుకెళ్లి దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకుంటారు. పోచంపల్లి వ్యవస్థీకృతం అయింది. ఇటీవలి కాలంలో కొత్తూరు చేనేత వస్త్రకారులతో రెంటచింతల, దాచేపల్లి, మాచవరం తదితర గ్రామాల చేనేత వస్త్రకారులకు రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ విభాగం అధికారులు టై అండ్ డై శిక్షణ కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. కానీ వసతుల లేమి వల్ల ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని ఇక్కడి నేతకార్మికులు కోరుకుంటున్నారు. కొత్తూరు శ్రీ నాగార్జున చేనేత సహకార సంఘం కాలనీకి విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ అన్ని వాతావరణాలను తట్టుకునే రీతిలో, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. ఏడాది పొడవునా, పగలూ రాత్రీ టై అండ్ డై నేర్పే రీతిలో కనీసం 20 మగ్గాలతో ట్రైనింగ్ హాల్ నిర్మించాలి. తదనుగుణంగా నివాస వసతులు, రంగులు వేసుకునే గదులు నిర్మించాలి. నూలును బెంగళూరు నుంచి ఖరీదు చేసి నిల్వ ఉంచాలి. ముడిపదార్థాలు తెచ్చేందుకు, సమీప గ్రామాల్లో వస్త్రకారులకు అందజేసేందుకు, తయారైన వస్త్రాలను గుంటూరు – విజయవాడ, గన్నవరం విమానాశ్రయం, తదితర మార్కెటింగ్కు అనువైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తగిన వాహన సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా సృజనాత్మకత కలిగిన ఆకట్టుకునే డిజైన్లు రూపొందించే చేనేత సామాజిక వర్గానికి చెందిన టై అండ్ డై గురించి అవగాహన కలిగిన ఆధునిక యువతకు అవకాశాలు కల్పించాలి. హ్యాండ్లూమ్ వీవర్స్ కోసం ముద్ర లోన్స్ను, ఆన్లైన్ పోర్టల్ ద్వారా సబ్సిడీతో ఇప్పించేందుకు అధికా రులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోచంపల్లి జీఐ సాధించింది. ప్రస్తుతం వారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘నేనున్నాను’ అనే వారి మాట కోసం కొత్తూరు ఎదురు చూస్తోంది! (క్లిక్: గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ -
అక్కచెల్లెమ్మలకు అండగా సీఎం జగన్
మాచర్ల రూరల్(పల్నాడు జిల్లా): ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన డ్వాక్రా సభ్యులకు రూ.4.01 కోట్ల విలువైన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఎవరైనా ఉంటే తనను సంప్రదించవచ్చని, త్వరలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తానే గడపగడపకూ వస్తున్నానని ప్రకటించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారని కొనియాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీలు బూడిద మంగమ్మ, దాసరి చౌడేశ్వరి, యేచూరి సునీత శంకర్, శారద శ్రీనివాసరెడ్డి, రూప్లీబాయి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శేరెడ్డి గోపిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మండ్లి మల్లుస్వామి, యలమంద, మార్కెట్ యార్డు చైర్మన్లు వెలిదండి ఉమా గోపాల్, పల్లపాటి గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని వినియోగించుకోవాలి మాచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకాన్ని వెనుకబడిన మాచర్ల నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో మెట్ట రైతులు నీరు లేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి బోరు సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పథకాలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా మెట్ట రైతుల నీటి సమస్య తీర్చేందుకు వైఎస్సార్ జలకళ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
పల్నాటి చరిత్ర, సంస్కృతి బాగా ఆకర్షించాయి
కారంపూడి (మాచర్ల): పల్నాటి చరిత్ర, సంస్కృతి తనను బాగా ఆకర్షించాయని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. పల్నాడు చరిత్రపై ప్రత్యేక గీతాలు రాస్తానని, వీర కన్నమదాసు చరిత్రను అధ్యయనం చేస్తానని చెప్పారు. గద్దర్, సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డితో కలిసి గురువారం పల్నాటి రణక్షేత్రం కారంపూడిలోని పల్నాటి వీరుల గుడిని దర్శించారు. ఈ సందర్భంగా అలనాటి పల్నాటి యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గాన్ని చేబూనిన గద్దర్ తన జన్మ ధన్యమైందన్నారు. సత్యారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. తన వంతుగా ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు ‘విశాఖ ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సినిమా నిర్మిస్తున్నామన్నారు. ఈ సినిమాకు గద్దర్ పాటలు రాయటమే కాకుండా ఒక పాటలో నటిస్తున్నారని తెలిపారు. త్వరలో పల్నాడు కథాంశంతో సినిమాను నిర్మిస్తానని, దానికి వేముల శ్రీనివాసరావు కథా సహకారం అందిస్తారని చెప్పారు. -
పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ సత్కారం
-
సీఎం జగన్ను చూసి ఉద్వేగానికి లోనైన పింగళి వెంకయ్య కుటుంబం
-
పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లలో పర్యటించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లకు వెళ్లి వారిని సన్మానించారు. సీఎం జగన్ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్తో కలిసి పంచుకున్నారు. సీఎం వైఎస్ జగన్.. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం తిలకించారు. జగన్ సీఎంగా కాదు.. ఒక ఆత్మీయుడిగా.. జగన్ సీఎంగా కాదు.. ఒక ఆత్మీయుడిగా పలకరించారని పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అన్నారు. సీఎం జగన్ పలకరింపుతో వందేళ్ల ఆయుష్షు వచ్చిందన్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా పింగళి వెంకయ్య అందించారని, తండ్రిగా పింగళి వెంకయ్య తనను గాంధీకి పరిచయం చేశారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. భారత రత్న ఇవ్వండి పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. చదవండి: 'అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం పండుగలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు మాచర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లకు వెళ్లి వారిని సత్కరించనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 11.35 గంటలకు మాచర్ల చేరుకుంటారు. 11.45 గంటలకు మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీలోని పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళతారు. ఆమెను, ఇతర కుటుంబసభ్యులను ఘనంగా సన్మానిస్తారు. అనంతరం అక్కడినుంచి బయల్దేరి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: (నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా) -
అబ్బురం.. దుర్గి హస్త కళావైభవం
సాక్షి, గుంటూరు/మాచర్ల: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు’ అని సినీ కవి రాసిన పాటకు నిలువుటద్దంలా నిలుస్తున్నారు.. ఈ శిల్పకారులు. దేవ శిల్పి.. మయుడిని కూడా వీరు మరిపించగల నేర్పరులంటే అతిశయోక్తి కాదు. ఏ ఆకృతి లేని బండరాళ్లను తమ అద్భుత నైపుణ్యంతో సజీవశిల్పాలుగా మలిచే శిల్పకారులకు నెలవు.. దుర్గి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం ఉలితో అద్భుత శిల్పాలను చెక్కే శిల్పకారులకు నిలయంగా భాసిల్లుతోంది. దుర్గిలో అడుగుపెడితే.. శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంటోంది. ఇక్కడ ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు, అవసరమైతే ఇంకా ఎత్తయిన శిల్పాలను చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. వీరు రూపొందించే వివిధ దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లె పడుచుల విగ్రహాల్లో కళా నైపుణ్యం తొణికిసలాడుతుంటోంది. 12వ శతాబ్దంలోనే బీజం.. దుర్గి శిల్ప కళకు క్రీ.శ.12వ శతాబ్దంలోనే బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసి అని ఐతిహ్యం. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో 11వ శతాబ్దంలో ద్వారకాపురి కాలగర్భంలో కలిసిపోయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. 15వ శతాబ్దం నాటికి దుర్గిలో 300 మంది శిల్పులు ఉండేవారని తెలుస్తోంది. అమరావతి, నాగార్జునకొండల్లోని బౌద్ధ స్థూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురి సౌత్, నాగార్జునకొండకు వచ్చే బౌద్ధులు దుర్గి గ్రామాన్ని సందర్శించి.. ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలను కొని తీసుకెళ్తుంటారు. విదేశాలకు ఎగుమతి కనుమరుగవుతున్న దుర్గి శిల్పకళను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో 1962లో అప్పటి ప్రభుత్వం దుర్గిలో శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రం ద్వారా వందల మంది శిల్ప కళలో శిక్షణ పొంది తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో రాణిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతున్నాయి. 1984లో హైదరాబాద్లో వినాయక విగ్రహాల ప్రదర్శనలో దుర్గి శిల్పులు చెక్కిన వాటిని మెచ్చుకున్న అప్పటి సీఎం ఎన్టీ రామారావు తర్వాత దుర్గిని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయానికి దశావతరాల విగ్రహాలను దుర్గి శిల్పకారులే అందించారు. తెలంగాణలోని బుద్ధ వనానికి విగ్రహాలను అందించిన దుర్గి కళాకారుడు శ్రీనివాసరావును ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సత్కరించారు. 2017లో దుర్గి శిల్పాలకు భారత ప్రభుత్వం ఇచ్చే జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది. ఇక్కడ మలిచే లైమ్ హార్డ్ రాయి విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. అరుదైన ఈ రాయి దుర్గి గ్రామంలోనే ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ క్వారీలోనే లభిస్తుందని శిల్పులు చెబుతున్నారు. ప్రస్తుతం 15 కుటుంబాలే.. దుర్గి శిల్పకళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 300 కుటుంబాలు శిల్పకళలో ఉండగా ఇప్పుడు 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే శిల్పకళా శిక్షణా కార్యక్రమం కూడా ఆగిపోవడంతో కొత్తవారు రావడం లేదు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి కరోనా వైరస్ ప్రభావం శిల్పకళా రంగంపై కూడా పడింది. పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఉత్పత్తులు సరిగా అమ్ముడుపోవడం లేదు. శుభకార్యాల సీజన్లో చిన్న విగ్రహాలకు డిమాండ్ ఉండేది. గతంతో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తయారు చేసిన విగ్రహాలు అలానే ఉండిపోయాయి. మాకు కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. – చెన్నుపాటి శ్రీనివాసాచారి, నాగార్జున శిల్ప కళా కేంద్రం నిర్వాహకుడు, దుర్గి వృత్తిపై మక్కువతోనే.. రెండేళ్ల క్రితం నేను బీటెక్ పూర్తి చేశాను. మా కుటుంబం మొత్తం ఈ రంగంలోనే రాణిస్తోంది. మా కుటుంబంలో నేను నాలుగో తరం శిల్పకారుడిని. వృత్తిపై మక్కువతో ఇందులో రాణిస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో 150 మంది శిల్పులు పాల్గొనగా నేను రన్నరప్గా నిలిచాను. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరికొందరు యువకులు ఈ రంగంలో రాణించడానికి ముందుకొస్తారు. – సాయి వినయ్, యువ శిల్పకారుడు, దుర్గి -
పక్కా ప్లాన్తో మాచర్లలో బుద్దా,బొండా ఎంట్రీ
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి కింది స్థాయి క్యాడర్ కూడా వెనుకడుగు వేసింది. బరిలో నిలవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. దీంతో పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రశాంతగా వాతావరణాన్ని రణరంగంగా మర్చే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా వెల్దుర్తి మండలం బోదలవీడులో తమ పార్టీ కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు సాకుతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను చంద్రబాబు మాచర్లకు పంపారు. ఓ పథకం ప్రకారం టీడీపీ నాయకులు గత బుధవారం మాచర్లకు వెళ్లారు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు ఆగ్రహానికి గురై ఆవేశంలో టీడీపీ నాయకుల కారుపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నాయకులే వ్యూహం ప్రకారం వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు పథకం ప్రకారం తమపై దాడి చేశాయని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పోలీసుల వైఫల్యం ఉందని కలరింగ్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మాచర్ల ఘటనపై రూరల్ ఎస్పీ, మాచర్ల టౌన్ సీఐలపై చర్యలకు ఈసీ సిఫార్సు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఎన్నికల ప్రక్రియను భంగం కలిగించాలని టీడీపీ పన్నిన కుట్రలో పోలీసులు బలయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కా ప్లాన్తో.. పథకం ప్రకారం టీడీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ఏ చిన్న ఘటనలు చోటు చేసుకున్నా వీడియోలు ఫొటోలు చిత్రీకరించేలా వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల రెచ్చగొట్టే చర్యలకు ఆవేశంతో స్థానికులు దాడి చేయడానికి బుద్దా, బొండా ఉమాల కారును వెంబడిస్తుంటే వారి వెనుక కారులో ప్రయాణిస్తున్న వారు వీడియోలు చిత్రీకరించారే తప్ప పోలీసులకు ఫోన్ కూడా చేయలేదు. సాధారణంగా అపాయం, ప్రాణాపాయ సమయంలో ఎవరైనా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రక్షించాలని కోరతారు. అయితే మాచర్ల ఘటనలో టీడీపీ నాయకులు అలాంటి ఆలోచననే చేయలేదు. సున్నిత ప్రాంతం అని తెలిసి కూడా.. పల్నాడు ప్రాంతం అతిసున్నితమైనదని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయినా గుంటూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులను కాదని కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను మాచర్లకు పంపడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శలొస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఏదైనా నియోజకవర్గంలోకి వెళ్లే ముందు ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గ ఇన్చార్జిలకు సమాచారం ఇస్తారు. అయితే టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమ మాచర్లకు వస్తున్న విషయం తనకు తెలియదని ఆ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు పోలీసులకు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పల్నాడు ప్రాంతానికి వెళ్లి కుట్ర పూరితంగా వ్యవహరించిన టీడీపీ నాయకులు పోలీసుల వైఫల్యం వల్లే తమపై దాడి జరిగిందని విమర్శిస్తున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులే బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థపై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని పోలీస్ శాఖ సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. టీడీపీ పన్నిన కుట్రల్లో పోలీసులు బలవుతున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం డీజీపీ కార్యాలయం వద్ద హైడ్రామాకు తెర తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాచర్ల ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు ఆయన తనదైన శైలిలో యత్నించారు. డీజీపీ కార్యాలయం బయట పది నిమిషాల పాటు బైఠాయించారు. మీడియా కవరేజ్ కోసంచంద్రబాబు రోడ్డుపై కూచ్చుని హడావుడి చేశారు. మరోవైపు మాచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ తెలిపారు. పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, మాచర్ల ఘటనను సుమెటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు దేనికోసం డీజీపీ కార్యాలయం ముందు ఎందుకు బైఠాయించారో అక్కడున్న వారికి సైతం అంతుపట్టంలేదు. ఎన్నికల్లో ప్రజల నుంచి సానుభూతి పొందట కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు నాయుడు.. తాజాగా మాచర్ల ఘటనను రాజకీయ పావుగా ఉపయోగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. (టీడీపీలో కల్లోలం) తనతోపాటు కొంతమంది టీడీపీ నేతలను డీజీపీ ఆఫీసు వద్దకు వెంటవేసుకుని వచ్చిన టీడీపీ అధ్యక్షుడు.. అధికార పార్టీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేక అధినేత తలపట్టుకుంటుండగా.. మరోవైపు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా రాజీనామాలు చేయడం చంద్రబాబు అస్సలు మింగుడుపడటంలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలతో కలిసి మాచర్ల ఘటనను రాద్ధంతం చేయడానికి పూనుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఓవైపు ప్రభుత్వం భావిస్తుంటే.. సున్నితమైన అంశాలను ప్రజలను రుద్ది రాజకీయంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఆయన తీరుపై సగటు ప్రజనీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నాగార్జున సాగర్కు 64 ఏళ్లు
పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా బీడువారుతున్న పొలాలు.. కరువు రాజ్యమేలుతున్న ప్రాంతాలు.. చెంతనే నది ఉన్నా గుక్కెడు నీటికోసం దాహంతో అలమటించాల్సిన దుస్థితి.. వృథాగా పోతున్న నీటిని చూసి, ఎండిపోతున్న పంటలను చూసి నిట్టూర్పులు విడవడం తప్ప చేయగలిగిందేమి లేని పరిస్థితి. ఇవీ నాగార్జున సాగర్ నిర్మించకముందు ఉన్న సంగతి. నాటి పాలకుల దార్శనికతతో అతిపెద్ద మానవ నిర్మిత డ్యాం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆధునిక దేవాలయంగా పిలవబడిన నాగార్జున సాగర్ నిర్మాణంతో కృష్ణమ్మ పరుగు పంటపొలాల వైపు మళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమై అన్నపూర్ణగా ఖ్యాతి గడించింది.. డ్యాం శంకుస్థాపన జరిగి నేటికి 64 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, మాచర్ల: ఆధునిక దేవాలయమైన నాగార్జునసాగర్ డ్యాం శంకుస్థాపన జరిగి నేటికి 64 సంవత్సరాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మార్చేందుకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 64 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. 1955 డిసెంబర్ 10వ తేదీన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పైలాన్, విజయపురిసౌత్లలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్కు వచ్చే నీటిని నందికొండ ప్రాజెక్టు వద్ద నిలుపుదల చేసేందుకు 26 క్రస్ట్గేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. వీటితోపాటు సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, కాలువలకు అనుబంధంగా జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించారు. 1967లో నాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమైంది. కుడి కాలువకు జవహర్లాల్ నెహ్రూ, ఎడమ కాలువకు లాల్బహుదూర్ శాస్త్రి కాలువలుగా నామకరణం చేశారు. నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి నీరు విడుదలవుతున్న దృశ్యం వైఎస్సార్ హయాంలో కాల్వల ఆధునికీకరణ గుంటూరు, ప్రకాశం, కృష్ణా డెల్టా, ఖమ్మం, నల్గొండ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాకు నీరు చేరాల్సి ఉన్నా ఆల్మట్టి డ్యాం నిర్మాణం, పెంపుదల, వరదలు తగ్గిపోవటం, వచ్చిన నీటిని వచ్చినట్లు కర్నాటక రాష్ట్రం ఉపయోగించుకోవటంతో నీటి సమస్యతో చాలా సంవత్సరాలు ఆయకట్టు రైతులు ఇబ్బందిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పంటలకు నీరు ఇవ్వటంతోపాటు ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ ఆయకట్టుకు మరమ్మతులు చేశారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో డాక్టర్ వైఎస్సార్ కాలువల ఆధునికీకరణతో రైతులకు మేలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నా ఆయన అకాల మరణంతో ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో పూడిక చేరి నీటిమట్టాల గరిష్టస్థాయి తగ్గిపోయింది. దీంతో ఎన్నిసార్లు పరిశోధనలు చేసినా అధికారులు గరిష్టస్థాయి నీటిమట్టాన్ని ఉంచలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాగర్ ఆయకట్టు కుడి, ఎడమ, డెల్టా, మంచినీరు పొందుతున్న పలు ప్రాంతాల ప్రజలు తిరిగి నాలుగు నెలల నుంచి కృష్ణానదిలో భారీస్థాయిలో వరదనీరు వచ్చి తమ కష్టాలు తగ్గిపోవటంతో రైతులు ఆనందపడుతున్నారు. డ్యాం నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్) 22 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం.. విజయపురిసౌత్ వద్ద నుంచి కుడికాలువ సొరంగ మార్గం ద్వారా 392 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని పరిధిలోని 11 లక్షల ఎకరాలు సాగు చేయటానికి నాడు ప్రణాళికలు వేశారు. అయితే వివిధ పరిణామాల వలన సాగు పరిధి తగ్గిపోయింది. ఆయకట్టు పరిధిలో పూర్తిస్థాయిలో చివరి భూములకు నీరందక, లక్ష్యం నెరవేరలేదు. అదేవిధంగా ఎడమ కాలువ 349 కిలోమీటర్ల పరిధిలో 11 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. డ్యాం విశేషాలు.. ప్రధాన డ్యాం రేడియల్ క్రస్ట్గేట్లు -26 రాతి కట్టడం పొడవు -4756 అడుగులు ఎత్తు -490అడుగులు నీటి నిల్వ సామర్థ్యం -590అడుగులు ఉభయ కాల్వల పరిధి -741కి.మీ -
హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు : నలుగురు చూస్తుండగా కొడుతూ, పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లారనే బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మాచర్ల మండలం రాయవరంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మాచర్ల పీఎస్లో పనిచేసే హోంగార్డు రాజేశ్, ఆటో డ్రైవర్ శ్రీనుతో ఉన్న వ్యక్తిగత గొడవలతో అతిగా ప్రవర్తిస్తూ, అతనిపై చెప్పులతో దాడి చేశాడు. అలాగే బజారులో కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. -
పట్టాలెక్కని గద్వాల - మాచర్ల రైల్వే లైను
గద్వాల టౌన్: ఒక ప్రాజెక్టును చేపడితే తదుపరి కార్యచరణ ఉండాలనే ఆలోచనను రైల్వే ఉన్నతాధికారులు మరిచినట్టున్నారు. నిజాం కా లంలోనే గద్వాల రైల్వేస్టేషన్ను తూర్పు, పడమ ర రైల్వేలను కలిపే జంక్షన్ చేయాలనే లక్ష్యంతో 117 ఎకరాలు కేటాయించారు. కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరు గద్వాల మీదుగా వనపర్తి, నాగర్కర్నూలు, దేవరకొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు అప్పట్లోనే ప్రతిపాదించారు. ముఖ్యంగా భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తూర్పు, పడమర భారతాన్ని రైల్వే రవాణాలో ఏకం చేయాల ని ఆనాడే తలంచారు. ఆ తర్వాత కాలంలో ఆ లైన్ ప్రతిపాదనను 1990 వరకు ఎండమావిగా నే వదిలేశారు. చివరకు అది ఎ న్నికలలో వాగ్దానంగా మారింది. 2002లో అప్ప టి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గద్వాల–రాయచూరు మధ్య మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు. దశల వారీగా మాచర్ల వరకు లైన్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గద్వాల నుంచి మాచర్ల వరకు సర్వేను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా పూర్తయింది. కొత్త లైన్ను పీపీసీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించినా కార్యరూపం దాలచ్చడం లేదు. 55 కి.మీ–పుష్కర కాలం గద్వాల–రాయచూరు పట్టణాల మధ్య రాయచూరు–మాచర్లలో భాగమైన మొదటి దశను 12ఏళ్ల పాటు పనులు కొనసా..గించారు. కేవలం 55 కి.మీ. పనిని పుష్కర కాలం చేశారు. ఎ ట్టకేలకు 2013లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మం త్రి మల్లికార్జునఖర్గే రాయచూరులో గద్వాల–రాయచూరు లైన్ను ప్రారంభించారు. అప్పటి నుంచే గద్వాల–రాయచూరు మధ్య డెమో రైలు రాకపోకలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత రా యచూరు నుంచి గద్వాల, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా విజయవాడకు ఎక్స్ప్రెస్ రైలును ప్రతిపాదించారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కాకినాడ నుంచి రాయచూరు వరకు రైలు వేస్తారను కుంటే అది కూడా కర్నూలు, కాకినాడకే పరిమితం చేశారు. 3ఎక్స్ప్రెస్ రైళ్ల దారి మళ్లింపు కాచిగూడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని యశ్వంతపూర్కు నడుస్తున్న మూడు ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించాలని అధికారులు ప్ర తిపాదనలు పంపారు. కాచిగూడ నుంచి య శ్వంతపూర్కు వెళ్లే ఈ రైళ్లకు డోన్ వరకే ట్రాఫిక్ ఉండడం వల్ల డిమాండ్ ఉన్న రాయచూరు ద్వా రా మళ్లించాలని ఆలోచిస్తున్నారు. ఈ రైళ్లు కా చిగూడ నుంచి మహబూబ్నగర్, గద్వాల మీ దుగా రాయచూరు ద్వారా బెంగళూరులోని య శ్వంతపూర్ మళ్లించాలని ప్రతిపాదనలు చేశా రు. రాయచూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్ర యాణికులతో పాటు హైదరాబాద్ నుంచి రా యచూరుకు, రాయచూరు నుంచి హైదరాబా ద్కు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూడు యశ్వంతపూర్కు వెళ్లే రైళ్లను మాత్రమే మళ్లించనున్నారు. -
ఇదీ ఆత్మకూరు అసలు కథ..
-
ఆత్మకూరులో అసలేం జరిగింది?
(పల్నాడు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)/సాక్షి, గుంటూరు/మాచర్ల: మూడేళ్ల క్రితం అంగన్వాడీ ఉద్యోగం తెచ్చిన తంటా ఆ పచ్చని పల్లె పేరును ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఆ గ్రామంలో ఒకే పార్టీకి చెందిన రెండు కుటుంబాలు వైరి వర్గాలుగా విడిపోయి ఊరొదిలి వెళుతుంటే దానికి టీడీపీ రాజకీయరంగు పులిమింది. పల్నాడు ప్రాంతంలో గెలిచిన రాజకీయ పార్టీకి చెందిన వారిది పైచేయి అవుతుందని ఓడిన పార్టీ వారు కొంతకాలం ఊరొదిలి వెళ్లడం రివాజు. అయితే ఇప్పుడు కుటుంబ తగాదాలను పార్టీ తగాదాలుగా చిత్రీకరిస్తూ, ఊరొదిలి వెళ్లిన వారు వైఎస్సార్ సీపీ బాధితులంటూ ప్రతిపక్ష టీడీపీ యాగీ చేస్తుండటం ఆ ప్రాంత ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా ప్రత్యర్థి వర్గాలుగా ఉంటున్నాయి. ఆ వర్గాలకు గ్రామ మాజీ సర్పంచ్ పి.యోసేబు, మండి చార్లెస్ నేతృత్వం వహిస్తున్నారు. యోసేబు స్వయానా చార్లెస్కు పిల్లనిచ్చిన మామ కావడం గమనార్హం. వీరివురూ తొలినాళ్లలో టీడీపీలోనే ఉన్నారు. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. మూడేళ్ల క్రితం గ్రామంలో అంగన్వాడీ పోస్టు తన భార్యకు ఇవ్వాలని చార్లెస్ తన మామపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటి టీడీపీ నేతల రాజకీయ కారణాలతో యోసేబు నిరాకరించాడు. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలుగా వీరు చీలడంతో ఆధిపత్యం కోసం గొడవలు ఆరంభమయ్యాయి. కొంతకాలానికి తారస్థాయికి చేరాయి. రెండేళ్ల క్రితం సర్పంచ్ యోసేబు కాలనీలో భయోత్పాతం సృష్టించి చార్లెస్ వర్గాన్ని టార్గెట్ చేశాడు. టీడీపీ నేతల ప్రోద్బలంతో చార్లెస్ను ఊరొదిలి వెళ్లేలా చేశాడు. చార్లెస్ కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలులేని పరిస్థితులను టీడీపీ నేతలు కల్పించారు. ఆత్మకూరులో మొహరించిన పోలీసులు గ్రామంలో పెద్దలు చార్లెస్కు మద్దతుగా వచ్చినా.. పోలీస్ అధికారులతో వారిని దుర్భాషలాడించారు. చేసేదేమీ లేని పరిస్థితుల్లో చార్లెస్, అతని అనుచరులకు గ్రామ శివారులో స్థానిక పెద్దలు ఆశ్రయం కల్పించారు. ఎన్నికల రోజు కూడా గ్రామంలో యోసేబు వర్గం చార్లెస్ వర్గంపై దాడులకు యత్నించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. ప్రతి దాడులేమీ లేకపోయినా.. యోసేబు వర్గం మొత్తం ఊరొదిలి వెళ్లింది. ఆ తర్వాతే గ్రామ శివారులో తలదాచుకున్న చార్లెస్ తన అనుచరులతో కలిసి కాలనీకి వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరు గ్రామంలో అంగన్వాడీ పోస్టు మామా, అల్లుళ్ల మధ్య చిచ్చు రేపిందని చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో రాజీలు జరిగి రెండు వర్గాలు కలిసి సహపంక్తి భోజనాలు చేశారన్నారు. దాడులు జరగలేదు ఆత్మకూరు గ్రామానికి తిరిగి వచ్చిన యోసేబు వర్గంలోని కొందరు అసలు ఏం జరిగిందో ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం మారగానే చార్లెస్ వర్గం దాడులు చేస్తారనే భయంతోనే ఊరు వదిలి వెళ్లామని యోసేబు వర్గానికి చెందిన కిన్నెర రాబర్ట్ స్పష్టం చేశాడు. కిన్నెర రాబర్ట్ స్వయానా చార్లెస్కు మేనమామ కూడా. ఇలా ఊరొదిలి వెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోందని రాబర్ట్ చెప్పాడు. తమపై దాడులు జరగలేదని స్వయంగా యోసేబు కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. తన బంధువును చార్లెస్ భయపెట్టాడని, ఆ తర్వాత తమపై దాడులు జరుగుతాయని భావించి ఊరొదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ను చూసి.. కాపీ బాబు కుట్ర 1989లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామంలో పూరి పాకలను తగులబెట్టిన ఘటనలు జరిగాయి. అప్పట్లో గ్రామానికి ఎన్టీఆర్ పరామర్శకు వచ్చారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. దాడులు ఏవీ జరగకున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ నేతలు యరపతినేని, కోడెల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు రచించారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కుట్రలకు పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడంపై మండిపడుతున్నారు. పోలీసుల హామీ మేరకు వచ్చాం మా బంధువుల్లోనే వివాదం వల్ల ఆందోళన చెంది బయటకు వెళ్లాం. పోలీసుల హామీ వల్ల తిరిగి గ్రామానికి వచ్చాం. మా మధ్య ఎటువంటి రాజకీయ గొడవలూ లేవు. పోలీసుల చొరవతో మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. – పేరువాల యోసేబు, టీడీపీ నేత, ఆత్మకూరు మా మధ్య కుటుంబ గొడవలు ఉన్నాయి మా సామాజికవర్గానికి చెందిన వారిలోనే విభేదాలు ఉండి గతంలో గొడవ పడ్డాం. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవారం. గత ఐదేళ్లలో అధికారం అండతో మా ప్రత్యర్థి వర్గం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇటీవల టీడీపీ ఓటమిపాలు కావడంతో మేం వారిపై దాడి చేస్తామోననే భయంతో వారు ఊరు విడిచి వెళ్లారు. మా గొడవలకు రాజకీయాలతో సంబంధం లేదు. – మందా చార్లెస్, ఆత్మకూరు గ్రామంలో రాజకీయ గొడవలు లేవు.. మా గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ గొడవలు లేవు. మేము అందరం కలిసి ఉంటున్నాం. టీడీపీలో ఉన్న ఎస్సీల బంధువర్గంలో విభేదాల వలన చిన్న వివాదాలను పెద్దవిగా చేసి రాజకీయరంగు పులిమారు. మా గ్రామంపై విష ప్రచారం చేయటం దారుణం. – రాయపరెడ్డి, గ్రామపెద్ద, ఆత్మకూరు దాడులు నిరూపిస్తే రాజీనామా చేస్తా ఆత్మకూరు గ్రామంలో ఎస్సీలపై మా పార్టీ నాయకులు దాడి చేశారని, వారి నుంచి ఎస్సీలకు ప్రాణహాని ఉందని, గ్రామంలో వారికి రక్షణ లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చౌకబారు విమర్శలు చేసి చంద్రబాబు తన ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటున్నారు. మా పార్టీ వర్గీయులు దాడి చేయడం వల్ల గ్రామంలో ఎస్సీ కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేయడం వల్లే వాళ్లు గ్రామం విడిచి వెళ్లినట్లయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. వాస్తవం కానట్లయితే పల్నాడు ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే -
ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య
సాక్షి, గుంటూరు : మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆదిలక్ష్మి అనే మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను చంపించింది. ఇందుకోసం తన చెల్లెలి కుమారుడి సహాయం తీసుకుంది. తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని డంపింగ్ యార్డులో పడేసింది. ఈ ఘటనను విచారించిన పోలీసులు భార్య పాత్రను నిర్ధారించారు. ఆదిలక్ష్మిని, ఆమె ప్రియుడు కరీముల్లాను అదుపులోకి తీసుకున్నారు. -
పల్నాట కపట నాటకం!
సాక్షి, గుంటూరు: అధికారంలో ఉండగా పల్నాడు ప్రాంతంలో అరాచకాలకు పాల్పడిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు, వీటిని ప్రోత్సహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రశాంతతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చేస్తున్న యత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడుపై మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు గత ఐదేళ్లలో సొంత పార్టీ నేతలు ఏడుగురిని హతమార్చడంతోపాటు విచ్చలవిడిగా దౌర్జన్యాలు సాగిస్తే కనిపించలేదా? అని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా గురజాల, మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో గూండాల్లా ప్రవర్తించిన ఆ పార్టీ నేతలు ఈరోజు ఏం ముఖం పెట్టుకుని అరాచకాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసి పల్నాడు ప్రతిష్టను దిగజార్చొవద్దని హితవు పలుకుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తాము చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కిడ్నాప్లతో వికృత రాజకీయాలు.. టీడీపీ నేతలు అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏడుగురు ఎంపీటీసీలున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముప్పాళ్ల ఎంపీపీ స్థానం దక్కకుండా కిడ్నాప్లకు దిగి ఐదుగురు ఎంపీటీసీలు మాత్రమే ఉన్న టీడీపీకి చేజిక్కించుకున్నారు. 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీలతో కలసి వెళ్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబులపై మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరామ్ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ముస్తఫాతో పాటు అంబటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. పోలీసులు టీడీపీ ఒత్తిళ్లకు లొంగిపోయి తూతూమంత్రంగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వారి అడుగులకు మడుగులొత్తారు. నరసరావుపేటలో గూండాయిజం... నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల, ఆయన తనయుడు శివరామ్ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ అధికారంలో ఉండగా దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహించింది. వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన ఎన్సీవీ, గ్రామీణ కేబుల్ నెట్వర్క్ కార్యాలయాలపై గూండాలతో దాడులు చేయించి కేబుల్ పరికరాలను ధ్వంసం చేయడంతో పాటు మాజీ డీసీసీబీ అధ్యక్షుడు నల్లపాటి చంద్రశేఖర్రావుపై దాడి చేసి గాయపరిచారు. పైగా తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. గత ఐదేళ్లలో పల్నాడులో టీడీపీ హత్యాకాండ... 2014 సెప్టెంబర్ 11న కారంపూడి మండలం చినగార్లపాడులో వైఎస్సార్సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45)ని టీడీపీ వర్గీయులు హత్య చేశారు. గోవిందరెడ్డి ఇంటి మీద మూకుమ్మడిగా దాడి చేసి వెంటాడి కత్తులతో నరికి చంపారు. అడ్డువచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డిని సైతం హత్య చేసేందుకు యత్నించారు. కోటిరెడ్డి గొంతులో తల్వార్ దిగడంతో చాలా రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటికీ ఆ గాయంతో బాధపడుతున్నాడు. 2014 సెప్టెంబర్ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో వైఎస్సార్ సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిలను హతమార్చిన కేసులో ముగ్గురు టీడీపీ నాయకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో మృతి చెందాడు. అయితే అధికారం అండతో ముగ్గురు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారు. 2014 డిసెంబర్ 19న దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను టీడీపీ వర్గీయులు హతమార్చారు. కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న ఆయన్ను గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. 2015 కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత పెద వెంకటేశ్వర్లు(బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. 2017 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్సీపీ నేత సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి చంపారు. 2019 ఏప్రిల్ 11న ఎన్నికల పోలింగ్ రోజు గురజాలలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేశారు. పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారు. (చదవండి: రెండు వర్గాల ఘర్షణకు రాజకీయ రంగు!) -
మాచర్లలో 23 ఎకరాలు కాజేసిన మాజీ కౌన్సిలర్
సాక్షి, మాచర్ల: ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు. ఆ నాయకుడు వాలిపోతాడు.. చుట్టూ కంచె వేసి.. ఆ తర్వాత దర్జాగా అమ్మేస్తాడు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కౌన్సిలర్ పదవిలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీశాడు. అప్పట్లో అధికారుల కళ్లకు గంతలు కట్టాడు. ఆ కబ్జాల బాగోతాన్ని ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆయన కొనసాగిస్తున్నాడు. మాచర్ల పట్టణంలోని కోట్ల రూపాయల విలువ చేసే 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్ యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు సిద్ధమైనా రెవెన్యూ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అధికారంలో ఉందని పది సంవత్సరాలు మొదట కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టీడీపీ నాయకుడిగా వ్యవహరించిన మాజీ కౌన్సిలర్ 7వ వార్డులోని పలు చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు. ప్రభుత్వ భూమి కనపడితే చాలు ముందు రాళ్లేయటం, ఆ తర్వాత అమ్మేయటం అలవాటుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నాయకుడు దాదాపుగా 10 ఎకరాలను కాజేశాడు. ఆ ప్రభుత్వంలో కౌన్సిలర్గా ఉండి తాను ఆక్రమించిన ఇళ్లకు ఇంటి పన్ను పేరుతో ఖాళీ స్థలాలకు పన్ను వేయించాడు. అంతటితో ఊరుకోలేదు. ఇదంతా తన స్థలమేనని వ్యాపారం చేశాడు. తిరిగి కాంగ్రెస్ అధికారం కోల్పోగానే టీడీపీలో చేరాడు. 12వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందాడు. ఆ తర్వాత 7వ వార్డులోని సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో 3 ఎకరాలు, సాయిబాబా దేవాలయం వెనుక 10 ఎకరాలు, 7వ వార్డుకు వెళ్లే రహదారిలో నాలుగున్నర ఎకరాలను స్వా«ధీనం చేసుకొని రియల్ఎస్టేట్ మొదలుపెట్టాడు. ఇంత దర్జాగా వ్యాపారం చేసినా రెవెన్యూ, పురపాలక అధికారులు పట్టించుకోలేదు. అయితే ఆ కౌన్సిలర్ అంతటితో ఆగకుండా తనకు అడ్డం వచ్చిన ఓ వ్యక్తిని హత్య చేయించి కేసులో ఇరుక్కున్నాడు. హైకోర్టు ఆదేశించినా.... పోలీసులు ఆ వ్యక్తిపై రౌడీషీట్ సైతం ఓపెన్ చేశారు. అయినా ఆక్రమణలను ఆపలేదు. చివరికి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం హైకోర్టు పోలీసులకు ఆదేశాల జారీ చేయటంతో కేసులు నమోదు చేశారు. అయినా ఇప్పటికీ ఆక్రమణలను కొనసాగిస్తూ మూడు రోజులుగా ఖాళీగా ఉన్న స్థలాలలో ట్రాక్టర్ల ద్వారా రాళ్లను తోలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖాధికారులు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు అని చెప్పినా వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆక్రమణలను గుర్తించాం పట్టణంలోని 7వ వార్డులో ఇప్పటికి 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. కొంతమంది ఆక్రమణదారులపై పోలీసులకు సమాచారం ఇ చ్చాం. ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశాం. సాయిబాబా గుడి వెనుకాల 60 శాతం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. మిగతా భూ ములలో బేస్ మట్టా లు, రాళ్లు వేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –సాంబశివరావు, ఆర్ఐ -
పల్నాటి ‘రాములమ్మ’
సాక్షి, కారంపూడి : అది పల్నాడు పోరుగడ్డ.. అందులోన ఎన్నికల సంగ్రామం.. గ్రామాల్లో జోరుగా ప్రచారం.. సెగలుపుట్టిస్తున్న సూర్యుడిని లెక్కచేయక.. శ్వేదాన్ని చిందిస్తూ.. కుమారుడి విజయం కోసం అలుపెరుగక.. పరితపిస్తూ.. ప్రతిధ్వనిస్తూ.. ప్రచార పర్వంలో దూసుపోతున్నారు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి రాములమ్మ.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండ వేడిమికి తట్టుకోలేక చెట్ల కింద కూలబడుతుంటే.. ఆరుపదుల వయస్సు దాటిన రాములమ్మ లక్ష్యం, వేగం ముందు కాలం నివ్వెరబోతుంది. సమయాన్ని వృథా చేయకుండా ఇంటింటి ప్రచారంలో రాములమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గ్రామాల్లో వెల్లువెత్తుతున్న జనాదరణను చూసి పడుతున్న శ్రమను సైతం మరిచిపోతున్నారు. మరోవైపు పేటసన్నెగండ్లలో ప్రచారానికి ఆటంకం కలిగించాలని చూసిన వారిపై పల్నాటి నాగమ్మలా గర్జించారు. ఆమెకు తోడుగా కుమార్తె నాగమణి కూడా అన్న గెలుపు కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.నాలుగు రోజుల్లో మండలంలోని 11 గ్రామాలను చుట్టి వచ్చారు. వాస్తవంగా ఇంత తక్కువ కాలంలో నిజంగా ఏ ఒక్క అభ్యర్థి తరుఫు బంధువులు ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో ఎంతో కాలంగా టీడీపీకి కంచుకోటగా భావించే మండలంలో కోటకు బీటలు వారుతున్నాయి. -
పౌరుషాల గడ్డ ..మాచర్ల
సాక్షి, మాచర్ల : జీవప్రదాయినిగా పేరొందిన నాగార్జున సాగర్ జలాశయాన్ని గుండెలపై పెట్టుకున్నా.. గుక్కెడు మంచినీళ్లకు అల్లాడుతున్న నియోజకవర్గం మాచర్ల. పల్నాటి పౌరుషాల కత్తుల నెత్తుటి మరకల్లో తడిచి ఫ్యాక్షన్ రంగు పులుముకుని.. అభివృద్ధి ఆనవాళ్లను మరిచిన ప్రాంతమిది. ఇక్కడ శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ఎందరో రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు. మరెందరో ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఒకే కుటుంబంలో వారే ప్రత్యర్థులై రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేశారు. మూడు దఫాలు విజయాన్ని సాధించి నియోజకవర్గంలో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు తమ సత్తా చాటేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 2014 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గ పునర్వివిభజన సమయంలో రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు, మంచికల్లు, రెంటాల, రెంటచింతల గ్రామాలు గురజాల నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజకవర్గంలోకి మారాయి. మొత్తం ఐదు మండలాల్లో మాచర్ల మండలంలోని విజయపురిసౌత్, తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సరిహద్దుగా ఉంటుంది. కారంపూడి మండలంలోని దక్షిణం వైపు చక్ర సిమెంట్స్ తరువాత వినుకొండ నియోజక వర్గంలోని రెడ్డిపాలెం ప్రారంభమవుతుంది. వెల్దుర్తి మండలంలోని దావుపల్లి తరువాత ప్రకాశం జిల్లాకు చెందిన యర్రగొండపాలెం సరిహద్దుగా ఉంటుంది. రెంటచింతల మండలంలో ఒక వైపు గురజాల నియోజకవర్గం సరిహద్దుగా ఉంటుంది. మరోవైపున కృష్ణానది ఉంది. నాగార్జున సాగర్, గుంటూరు హైదరాబాద్, నర్సరావుపేట, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కలుపుతూ రహదారులున్నాయి. విజేతల వివరాలు నియోజకవర్గంలో 1962లో రంగమ్మరెడ్డిపై కాంగ్రెస్ తరఫున కేశవ నాయక్ గెలుపొందాడు. 1967లో జూలకంటి నాగిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి వెన్నా లింగారెడ్డి 64 ఓట్లతో విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి లింగారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి 12 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 1978లో జూలకంటి నాగిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చల్లా నారపరెడ్డి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థి నారపరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొర్రపాటి సుబ్బారావు 26 వేల మెజార్టీతో గెలిచారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి నట్టువ కృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వట్టికొండ జయరాంపై 1750 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మగడ్డ శివరామకృష్ణ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నట్టువ కృష్ణ పై 4300 ఓట్లతో గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుర్రి పున్నారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి సుందరరామిరెడ్డిపై 5600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి జూలకంటి దుర్గాంబ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై 1750 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి 31 వేల పైచిలుకుతో గెలుపొందారు. 2009లో జూలకంటి బ్రహ్మారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 9600 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 16200 ఓట్ల ఆధికత్యతో విజయం సాధించారు. 2014లో వైఎస్సాఆర్ సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై 3535 ఓట్ల ఆధికత్యతో గెలిచారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు మాచర్ల మండలంలోని 15 పంచాయతీల్లో 17 శివారు గ్రామాలున్నాయి. రెంటచింతల మండలంలో 11 పంచాయతీల్లో 3 శివారు గ్రామాలున్నాయి. దుర్గి మండలంలో 14 పంచాయతీల్లో 8 శివారు గ్రామాలున్నాయి. కారంపూడి మండలంలో 15 పంచాయతీల్లో 8 శివారు గ్రామాలున్నాయి. వెల్దుర్తి మండలంలో 16 పంచాయతీల్లో 16 శివారు గ్రామాలున్నాయి. సామాజిక వర్గాల వివరాలు రెడ్లు : 33000 కమ్మ సామాజిక వర్గం : 29000 ఎస్సీ మాదిగ : 24000 మాలలు : 9000 యాదవులు : 19000 వడ్డెరలు :15000 ముస్లింలు, దూదేకులు : 20,000 ఆర్యవైశ్యులు : 13,000 సుగాలీలు, చెంచులు, గిరిజనులు :19,000 నాయుడులు : 14,000 ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు వెనుకబడిన నియోజకవర్గంలో సాగు, తాగు నీటి పథకాలు లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరికపూడిసెల, దమ్మర్ల గొంది, జెర్రివాగు, 100 పడకల ఆసుపత్రి, గొలివాగు ఎత్తిపోతల పథకంతోపాటు అనేక అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. యాదవ, వడ్డెర, కాపు, ముస్లిం, ఆర్యవైశ్య సామాజిక వర్గాలు గెలుపును నిర్ణయిస్తాయి. ప్రత్యేకతలు నియోజకవర్గ పరిధిలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కుడికాలువ ఉంది. విజయపురిసౌత్ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. విజయపురిని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు పరిపాలించారు. నాగార్జున కొండలో ప్రస్తుతం బుద్ధిజం చరిత్ర జ్ఞాపకాలు మ్యూజియంలో పెట్టారు. బ్రహ్మనాయుడు పునఃనిర్మించిన శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం ఇప్పటికీ ఉంది. వెల్దుర్తి, మాచర్ల రూరల్, దుర్గి మండలాల్లో సాగు, తాగునీటి సమస్య ఎక్కువ. వరికపూడిసెల ప్రాజెక్టు కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతోంది. నియోజకవర్గం పక్కనే ఉన్న నల్లమల అడవులు వేదికగా నక్సల్స్ ఉద్యమాలు చేపట్టారు. వెల్దుర్తి, గొట్టిపాళ్ళ, శిరిగిరిపాడు, వేపకంపల్లి, గుండ్లపాడు గ్రామాలు ఫ్యాక్షన్ చరిత్ర కలిగి ఉన్నాయి. నియోజకవర్గ జనాభా : 3,76,946 పురుషులు : 1,94,456 స్త్రీలు : 1,82,490 మొత్తం ఓటర్లు : 2,40,670 పురుషులు : 1,19,582 స్త్రీలు : 1,21,054 ఇతరులు : 34 పోలింగ్ బూత్లు : 299 సమస్యాత్మకమైన బూత్లు : 58 -
బాబు ఇంటి ముందు తమ్ముళ్ల తన్నులాట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో సీఎం చంద్రబాబు ఇరువర్గాల నేతలను పిలిపించి మాట్లాడారు. ఈ సమావేశానికి ఎంపీ రాయపాటి సాంబశివరావు, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి, పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. సమావేశం అనంతరం అంజిరెడ్డి, చలమారెడ్డికి లక్ష్మారెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. నువ్వు నాకు చెప్పేదేంటని ఆగ్రహంతో లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు చలమారెడ్డి అనుచరులు అంజిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీఎం నివాసంలోకి చొచ్చకెళ్లే ప్రయత్నం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. అంజిరెడ్డికి సీటు కేటాయించడంతో చలమారెడ్డి అనుచరులు గత రెండు రోజులు ఆందోళన చేస్తున్నారు. ‘అంజిరెడ్డి వద్దు చలమారెడ్డి ముద్దు’ అంటూ నినదిస్తున్నారు. అంజిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ చలమారెడ్డి మండిపడుతున్నారు. -
చంద్రబాబు ఇంటి వద్ద కార్యకర్తల రచ్చరచ్చ..!
సాక్షి, అమరావతి : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసిపోయి, నామినేషన్ల ప్రక్రియా మొదలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తగ్గడం లేదు. అసమ్మతి నేతల అనుయాయులు, పార్టీ కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు పోరాడైనా తమకు నచ్చని అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని పట్టుదలగా ఉన్నారు. మాచర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అన్నపురెడ్డి అంజిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నిరసనకు దిగింది. సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు బుధవారం రెండోరోజు ఆందోళనకు దిగాయి. అంజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు హెచ్చరించారు. తమ నిరసనలను లెక్కచేయకుండా ఆయన నామినేషన్ వేస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన కొమ్మారెడ్డి చలమారెడ్డినే సీటు వరిస్తుందని అందరూ భావించగా.. అంజిరెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. -
సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద ఆందోళన
-
మాచర్ల టీడీపీలో వర్గపోరు
-
మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు.. అజ్ఞాతంలో మంగమ్మ
సాక్షి, గుంటూరు : మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ అజ్ఞాతంలోకి వెళ్లటంతో.. నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ మొదలైంది. గతంలో అధిష్టానం ముగ్గురు ఛైర్ పర్సన్ల పదవీ కాలాన్ని పంచింది. అప్పట్లో శ్రీదేవి అనే ఛైర్ పర్సన్ను బలవంతంగా పదవీనుంచి తొలగించటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత వచ్చిన మంగమ్మను సైతం బలవంతంగా పదవీనుంచి రాజీనామా చేయించారు. మంగమ్మ స్థానంలో షాకీర్ హున్నీసాను ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 15 మంది కౌన్సిలర్లతో షాకీర్ హున్నిసా బుధవారం సమావేశానికి హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఆమెను మున్నిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు.ఇందుకు అంగీకరించని మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ తన వర్గానికి చెందిన పదిమంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన మంగమ్మ కోరం ఉంటుందా? ఎన్నిక జరుగుతుందా? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
‘ఇలాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు’
సాక్షి, గుంటూరు: తన నియోజకవర్గంలోని సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖ రాశారు. మాచర్లలోని సమస్యలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందని ప్రశ్నించారు. విజయపురి సౌత్లో మెగా టూరిజం ప్రాజెక్టును ఎప్పుడు తీసుకువస్తారని నిలదీశారు. ఎస్కేబీఆర్ కాలేజ్లో పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూని ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గ సమస్యలను చెప్పాటానికి కలుస్తానంటే సీఎం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి సీఎంను గతంలో ఎప్పుడు చూడలేదని.. అందుకే బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. -
స్వయంగా సమాధి కట్టుకుని..
సాక్షి, మాచర్ల: ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల తాతిరెడ్డి లచ్చిరెడ్డి తాను సజీవ సమాధికిలో వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడని అంటూ స్వయంగా సమాధి నిర్మాణ పనులు చేపట్టాడు. పది అడుగుల లోతులో దాన్ని నిర్మించి ఇనుప తలుపులు కూడా ఏర్పాటు చేశాడు. బుధవారం మంచి రోజని, తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్కు, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో లచ్చిరెడ్డిని సమాధిలోకి వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మాచర్ల రూరల్ సీఐ దిలీప్కుమార్ నేతృత్వంలో ఎస్ఐ లోకేశ్వరరావు గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకొని సమాధిలోకి వెళ్లటం నేరమని కౌన్సెలింగ్ చేశారు. ఆధ్యాత్మిక భావనలతో పదేళ్లుగా లచ్చిరెడ్డి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. -
గుంటూరులో సైకో వీరంగం..దేహశుద్ధి
-
గుంటూరులో సైకో వీరంగం..
సాక్షి, మాచర్ల: ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన జానీ పాషాకు గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదు. గుంటూరుకు తీసుకెళ్లి పాషా తండ్రి అతడికి చికిత్స చేయించాడు. బుధవారం ఉదయం కుమారుడిని గ్రామానికి తీసుకొస్తుండగా ఒక్కసారిగా తండ్రిపై దాడి చేసి పాషా పరారయ్యాడు. అనంతరం మాచర్లలోని స్థానిక మసీదులోకి చొరబడిన పాషా ప్రార్థనలు చేస్తున్నవారిపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. సైకో దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
అంధుల క్రికెట్లో మనోడి సత్తా
సాక్షి, మాచర్ల: అంధుల క్రికెట్లో గుంటూరు జిల్లా మాచర్ల వాసి ఇల్లూరి అజయ్కుమార్రెడ్డి సత్తా చాటుతున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తూ అరుదైన విజయాలు అందిస్తున్నాడు. గతేడాది అజయ్కుమార్రెడ్డి సారథ్యంలో టీ20 వరల్డ్కప్ సాధించిన భారత జట్టు, ఈసారి వన్డే వరల్డ్ కప్ను సైతం కైవసం చేసుకుంది. శనివారం దుబాయ్లో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించి వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. అజయ్కుమార్రెడ్డి 1990 జూన్ 3న జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగిలి అజయ్కుమార్ కుడి కన్ను పూర్తిగా కోల్పోగా, ఎడమ కన్ను పాక్షికంగా దెబ్బతింది. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో అంధుల పాఠశాలలో విద్యనభ్యసించాడు. క్రికెట్పై ఆసక్తితో పట్టుదలగా సాధన చేసి అంచెలంచెలుగా ఎదిగాడు. 2017లో అంధుల టీ–20 జట్టుకు నాయకత్వం వహించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. తాజాగా మరోసారి సత్తాచాటి దేశానికి వన్డే వరల్డ్ కప్ సాధించాడు. ప్రస్తుతం అజయ్కుమార్రెడ్డి గుంటూరులో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. -
మాచర్ల–నల్గొండ రైల్వే లైను కుదరదు :కేంద్రం
న్యూఢిల్లీః మాచర్ల–నల్గొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేమని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ఈ రైల్వేలైనును 1997–98 బడ్జెట్లో రూ. 125 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారని, ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 815 కోట్లు అని తెలిపారు. సర్వే తుది దశలో ప్రజా ప్రతినిధులు ఈ మార్గాన్ని మార్చాలని సూచించారని, ఇదే సందర్భంలో దీనిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జరిపిన యోగ్యత అధ్యయనం ఈ ప్రాజెక్టులో ఆర్థిక యోగ్యత లేదని తేల్చిందని వివరించారు. స్పెషల్పర్పస్ వెహికిల్ విధానంలో గానీ, పీపీపీ విధానంలో గానీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చారు. ప్రజల్లో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ నిధుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, కానీ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయలేదని వివరించారు. -
మాచర్లలో దారుణం : తండ్రి ఉద్యోగం కోసం
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి చనిపోతే ఉద్యోగం తనకే వస్తుందన్న అత్యాశతో తండ్రినే కొడుకు అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మాచర్లలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కార్మిక శాఖలో అటెండర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు(47)కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య మాధవి 10 ఏళ్ల కిందట చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య భారతి అనారోగ్యంతో 4 సంవత్సరాల క్రితం మృతిచెందింది. దీంతో శ్రీనివాసరావు సైదమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మొదటి భార్య కుమారుడు అమర్నాథ్ తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా తనకివ్వమని కోరుతున్నాడు. తనకు ఉద్యోగం ఇవ్వడేమోనని అనుమానంతో తండ్రి చనిపోతే ఉద్యోగం తనకే వస్తుందని వ్యూహాం రచించాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం సమయంలో తండ్రిని రాయితో తలపై మోది దారుణంగా హతమార్చాడు. అనంతరం అమర్నాథ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న అమర్నాథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
కుటుంబాన్ని బలిగొన్న రాజకీయాలు
* మాచర్ల ముస్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య * నాలుగు నెలల క్రితమే భర్త మృతి * అనాథగా మారిన కుమారుడు టీడీపీ నేతల రాజకీయాలకు ఓ కుటుంబం బలైపోయింది. వీరి ఒత్తిళ్ల వల్ల రాజకీయాల్లోకి వచ్చిన మాచర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీదేవి కుటుంబం వారి రాజకీయాలకు చితికిపోయింది. నాలుగు నెలల క్రితం భర్తను కోల్పోయిన శ్రీదేవి, ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడటంతో వారి కుమారుడు అనాథగా మిగిలాడు. మాచర్ల టౌన్: రాజకీయాలే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి కుటుంబాన్ని బలితీసుకున్నాయన్న విషయం పట్టణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయానుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన భార్య పదవిని కాపాడుకునేందుకు తీవ్ర ఒత్తిళ్లకు గురై శ్రీదేవి భర్త మల్లికార్జునరావు నాలుగు నెలల క్రితం మృతిచెందారు. భర్తను కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో శ్రీదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మల్లికార్జునరావు మూడేళ్ల క్రితం అమెరికాలో సోదరుల వ్యాపారానికి చేదోడువాదోడుగా ఉండి అక్కడే జీవనం సాగించారు. మున్సిపల్ ఎన్నికల్లో మాచర్ల చైర్పర్సన్ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. టీడీపీ ఒత్తిడితోనే రాజకీయాల్లోకి.. చైర్పర్సన్ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటిస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయని, కౌన్సిలర్గా పోటీ చేయాలని ఆమె కుటుంబంపై స్థానిక టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. వార్డు కౌన్సిలర్గా ఆమె టీడీపీ తరఫున పోటీకి దిగడంతో, ఆమే చైర్పర్సన్ అభ్యర్థి అని ప్రచారం చేశారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలిస్తే చైర్పర్సన్ పదవి దక్కుతుందని పట్టణంలో పలువురు టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆమె ఆర్థిక సహకారం కూడా అందించినట్లు సమాచారం. కొందరు అభ్యర్థుల గెలుపు కోసం ఆమె అప్పులు చేసి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిసింది. టీడీపీ విజయం సాధిస్తే ముగ్గురు అభ్యర్థులు చైర్పర్సన్గా పనిచేసే విధంగా అధికార పార్టీలో ఒప్పందం జరిగింది. పార్టీ విజయం సాధించడంతో చైర్పర్సన్గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. తప్పించేందుకు తీవ్ర ఒత్తిళ్లు.. రెండున్నరేళ్లు పూర్తి కాక ముందే ఆమెను పదవి నుండి తప్పించాలని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. అయితే ఆమె మరి కొద్ది కాలం చైర్పర్సన్గా కొనసాగేలా ఆమె భర్త మల్లికార్జునరావు కృషి చేశారు. భార్య పదవి కాపాడేందుకు నిత్యం అధికార పార్టీ నేతల వెంట తిరుగుతూ తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మల్లికార్జునరావు మృతి చెందారు. ఆయన మృతి చెందిన అనంతరం మళ్లీ శ్రీదేవిపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. శ్రీదేవికి టీడీపీ నేతలకు మధ్య జరిగిన ఒప్పందాలకనుగుణంగా అనివార్య పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేశారు. చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు.. భర్తను పోగొట్టుకుని, పదవిని కోల్పోయిన తర్వాత శ్రీదేవిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆమె తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు సొంతవారి ఓదార్పు కూడా కరువైంది. అప్పుల బాధలు, మానసిక ఒతిళ్లూ తట్టుకోలేక మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఆమె పురుగు మందు తాగారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. తల్లిదండ్రులను కోల్పోయిన కుమారుడు సూర్యతేజ ప్రభుత్వాసుపత్రిలోని తల్లి మృతదేహం వద్ద రోదిస్తుండటం చూపురులను కన్నీళ్లు పెట్టించింది. -
మాచర్లలో టీడీపీ లుకలుకలు..
మాచర్ల టౌన్: మాచర్ల టీడీపీలో వర్గపోరు రసకందాయంలో పడింది. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే నాయకులు అంతగా లేకపోవడం, వర్గ పోరు, నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిని మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సమన్వయకర్త వ్యవహారం తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన అనుయాయుడైన డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేందుకు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు చేస్తున్నట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎంపీ సిఫార్సులకు ఎమ్మెల్యే మోకాలడ్డు.. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో భాగంగా ఉన్న మాచర్లలో ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అధికారుల నుంచి ఆశించిన సహకారం అందడం లేదని తెలుస్తోంది. ఆయన అధికారులకు సిఫార్సులు చేస్తున్నా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వాటికి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు టీడీపీ నేతలు నియోజకవర్గంలో తమ మాట నెగ్గడం లేదని ఎంపీ ముందు తమ గోడును వినిపించారు. దీనికి స్పందించిన ఎంపీ రాయపాటి ‘నా పనులే జరగడం లేదు. నేనెవరికి చెప్పుకోవాలి’ అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల మున్సిపల్ ఎన్నికలు జరిగి రెండున్నర ఏళ్లు గడిచినా తగినంత మెజార్టీ ఉండీ కోఆప్షన్ ఎన్నిక నిర్వహించుకోలేకపోయారు. గత వారం పార్టీలోని ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనపై కొందరు నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎంపీ రాయపాటిలకు ఫిర్యాదు చేశారు. ఇంతటితో ఆగకుండా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఓ వర్గం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రత్తిపాటి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి, మార్కెట్యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావులతో చిలకలూరిపేటలో చర్చలు జరిపారు. మాచర్ల పార్టీ వ్యవహారం సీఎం దృష్టిలో వుందని, సమన్వయంగా పనిచేసుకోకపోతే నష్టపోవాల్సివస్తుందని హితవు పలికినట్టు తెలుస్తోంది.