వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి | patient died due to wrong treatment | Sakshi
Sakshi News home page

వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి

Published Tue, Mar 17 2015 4:18 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు

పాల్వంచ : కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.... స్థానికంగా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చెరుకూరి రామారావు(40) కడుపులో మంటగా ఉండడంతో ప్రసాద్ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యుడు ప్రసాద్‌.. రామారావుకు ఇంజెక్షన్ ఇచ్చి, మందులు రాసిచ్చారు. అయితే ఆ తర్వాత 10 నిముషాలకే రామారావు ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు. అతడు మృతి చెందినట్టు వైద్యుడు ధ్రువీకరించారు. కాగా వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రామారావు మృతి చెందినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement