రూ. 4 కోట్లు కట్టాం...బోర్డు తిప్పేశారన్నా... | People Sharing Their Sorrows To Ys Jagan | Sakshi
Sakshi News home page

రూ. 4 కోట్లు కట్టాం...బోర్డు తిప్పేశారన్నా...

May 14 2018 7:21 AM | Updated on Jul 6 2018 2:54 PM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణాజిల్లా : ‘అయ్యా...  అభయగోల్డ్‌లో పొదుపు చేసుకున్నాం...తీరా బోర్డు తిప్పేశారు.ఈ విధంగా సుమారు రూ.4 కోట్లు అభయగోల్డ్‌లో కట్టాం. ఈ డబ్బులను తిరిగి మాకు ఇప్పించండి’. అని కైకలూరుకు చెందిన సత్యవతి,రమ్య,లలిత కుమారితో పాటు పలువురు మహిళా  ఏజెంట్లు జననేతన జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడును వినిపించారు. డబ్బులు కట్టించుకున్న తమను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్ది మొత్తం చెల్లించిన వారికి రూ,100 కు 10 రూపాయల చొప్పున వడ్డీకి తీసుకు వచ్చి బాధితులకు చెల్లించామని .జగన్‌కు వివరించారు. పెద్ద మొత్తం కట్టిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవ చేస్తున్నారని అధినేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నాలుగు సంవత్సరాలనుంచి కామినేని శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినప్పటికి కాలయాపని చేయడం మినహా సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలుతీసుకోలేదని వాపోయారు. మన ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యను పరిష్కరించండి అని జగన్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement