గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పి.రామసుబ్బా రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ నియమితులయ్యారు.
ఏపీ ఎమ్మెల్సీలుగా నియామకం
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పి.రామసుబ్బా రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
గతంలో ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ఎ.చక్రపాణి, ఆర్.రెడ్డెప్పరెడ్డిల పదవీ కాలం ఈ ఏడాది మే 27వ తేదీతో ముగిసింది. వారి స్థానంలో అధికార పార్టీ సూచన మేరకు వీరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు.