దేవుడా.. ఎంతపని చేశావు..? | Short-circuit may have caused Nanded Express blaze | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఎంతపని చేశావు..?

Published Mon, Dec 30 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

Short-circuit may have caused Nanded Express blaze

నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర ్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడా.. ఆరు నెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశావా అంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు.
 
 బెంగళూరు నుంచి బయలుదేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం 26 మంది పాలిట మృత్యు శకటంగా మారింది. ఈ  ఘోర ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగిల్చింది. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు నగరంలోని విక్టోరియా ఆస్పత్రి వద్దకు చేరుకొని ‘దేవుడా ఎందుకిలా చేశావ్, ఎందుకు మా కింత శిక్ష విధించావంటూ’ విలపిస్తుంటే వారిని చూస్తున్న వారి కళ్లు కూడా చెమర్చాయి.                 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement