నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ కోడెల: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: నిబంధనలు, సభా సాంప్రదాయాలకు విరుద్దంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సభా సాంప్రదాయాలను కాపాడాలని ప్రతిపక్ష పార్టీ కోరుతోందని ఆయన అన్నారు.
గతంలో రాజధాని ఏర్పాటుపై చర్చ జరిగిందని, ఇప్పుడు సభలో చర్చించడానికి అభ్యంతరమేమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుపై సభలో చర్చకు స్పీకర్ అనుమతించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.