శ్రీరామ నవమిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి 10.30గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
సాక్షి, తిరుమల: శ్రీరామ నవమిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి 10.30గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి ఏడు గం టలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపం లో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమివ్వనున్నారు. రాత్రి పది గంటల తర్వాత ఆలయం లో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. 9వ తేదీన రాత్రి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.