srirama navami
-
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. -
భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక
శ్రీరామ చంద్రమూర్తి జీవిత కథే రామాయణం. ఆ రామాయణాన్ని అనుసరిస్తే చాలు మనం ఎలా వ్యవహరించాలో అర్ధం అయిపోతుంది. ఎలా ఉండకూడదో ఎలా నడుచుకోకూడదో కూడా తెలిసిపోతుంది. మనకి కర్తవ్య బోధ చేస్తూ దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే కాంతి బాటే రామాయణం. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ రామనామమే భక్తకోటికి తారక మంత్రంగా ఉండిపోయింది. ఎన్ని యుగాలు దాటినా అదే మంత్రం లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. రామ రాజ్యం రావాలంటే రాముడు చూపిన బాటలో ధర్మాన్ని ఆచరించడమొక్కటే మార్గం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. రామరాజ్యం యావత్ ప్రపంచానికే ఆదర్శ రాజ్యం ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో ప్రజలంతా ఏ చీకూ చింతా లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారో ఏ రాజ్యంలో అయితే ప్రజలు మానసిక క్షోభలు పడకుండా మనశ్శాంతిగా ఉంటారు ఏ రాజ్యంలో అయితే ప్రజలు ఆకలి దప్పులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారో దాన్ని రామరాజ్యం అంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదే రామరాజ్యం. అందుకే రాముడి పాలనలో అందరూ పిల్లా పాపలతో హాయిగా జీవించారు. వన వాసం పూర్తి చేసుకుని తండ్రి మాటను దక్కించాడు. సత్య నిష్ఠ పాటించాడు. తిరిగి అయోధ్య చేరి రాజ్యాధికారం చేపట్టాడు. పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్న సూత్రాన్ని రాముడు పాటించాడు. తన రాజ్యంలో ఓ మామూలు మనిషి తన సతీమణి సీత గురించి చేసిన వ్యాఖ్యలకు కూడా గౌరవం ఇచ్చాడు. సీత గురించి తనకు తెలిసినా ప్రజల నుండి ఓ విమర్శ వచ్చినపుడు పాలకుడిగా తాను జవాబుదారుగా ఉండాలనుకున్నాడు రాముడు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతోన్నా.. కడలి అంతటి దుఖాన్ని దిగమింగుకుని సీతను అడవుల్లో వదిలి రావల్సిందిగా తమ్ముడు లక్ష్మణుణ్నే ఆదేశించాడు రాముడు. అందులో ఓ మంచి పాలకుడు ఎలా వ్యవహరించాలన్న నీతి ఉంది. అది పాలకులందరికీ ఆదర్శమే అంటారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని ప్రజల మాటలు పట్టించుకోకుండా ఉంటే అది ధర్మ బద్ధమైన పాలన అనిపించుకోదని రాముడు అనుకున్నాడు కాబట్టే సీతను అడవులకు పంపాడు. సీతారాముల జీవన యానమే రామాయణం. అది పరమ పవిత్రం. తర తరాలకూ ఆదర్శనీయం. అందుకే అది నిత్య పారాయణ గ్రంధం కూడా. రామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు తెలీని ఆనందం ఆవహించేస్తుంది. ఒక్క సారి చదివితే మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంటుంది. చదువుతున్న కొద్దీ కొత్తగానే ఉంటుంది. అదే సమయంలో మధురంగా అమృతంలా ఉంటుంది. అందుకే యుగాల తరబడి రామాయణం కల్పవృక్షంలా వెలుగుతూనే ఉంది. శ్రీరామ నవమి అంటే లోకానికి పండగ. జనులందరికీ పండగ. సీతారాముల కళ్యాణం అంటే అదో వేడుక. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక. -
జగ్గూభాయ్తో గోపీచంద్.. అదిరిన 'రామబాణం' పోస్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. గతంలో గోపీచంద్కి లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్కి ఇది మూడో చిత్రం. ఈ వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ(గురువారం)శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో గోపీచంద్తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. పంచెకట్టులో చేతులు పట్టుకొని నడుస్తున్న స్పెషల్ లుక్ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. -
అందుకే ఆయనను సకల గుణధాముడు అన్నారు! రాముడే దేవుడు..
రాముడే దేవుడు నరుడి అవతారం ఎత్తిన అద్భుతమే రామాయణం. దేవుడే నరుడి అవతారం ఎత్తి ఆ నరులు ఎలా మసులుకోవాలో ఏది మంచో ఏది చెడో ఏది ధర్మమో ఏది అధర్మమో తన నడవడిక ద్వారానే నేర్పిన జగద్గురువు శ్రీరామ చంద్రుడు. రాముని జీవితాన్ని చదివితే చాలు జీవితాలు ధన్యం అయిపోతాయి. ఎలా జీవించాలో అర్ధం అవుతుంది. మనుషుల్లో మనిషిగా పుట్టి మనుషులకు కర్తవ్య బోధ చేసిన ఆదర్శనీయుడు శ్రీరాముడు. అందుకే యుగాల తరబడి రాముణ్ని కొలుచుకుంటున్నాం. గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. మంచి లక్షణాలు కలగలసిన మూర్తి సృష్టిలోని అన్ని మంచి లక్షణాలు అన్ని గొప్పతనాలు ఒక మూర్తిగా మారితే ఆ దివ్యమూర్తే రాముడు అవుతాడు. అందుకే ఆయన్ను సకల గుణధాముడు అన్నారు. మానవ జీవితంలో ప్రతీ ఒక్కరూ ఎలా ఉండాలో ఎలా బతకాలో ఏ విలువలు పాటించాలో ఏయే ధర్మాలు ఆచరించాలో తాను ఆచరించి అందరికీ నేర్పించిన మహానుభావుడు దశరథ రాముడు. చెడుపై మంచి సాధించే విజయంలో అడుగడుగునా ధర్మ పథానే నడవాలని చాటి చెప్పిన దేవుడు మన రాముడు. మనుషులకు ధర్మోపదేశం ఇచ్చేందుకే ఆ నారాయణుడు మనిషి అవతారం ఎత్తి రాముడయ్యాడు. ఆయనే మనకి దేవుడయ్యాడు. హరుడే నరుడైన దివ్య ఘట్టం చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం లో అవతరించాడు రాముడు. రావణ వధ కోసం శ్రీనారాయణుడు మనిషి జన్మ ఎత్తి మనుషుల్లో మనిషిగా కలిసి మెలిసి సాగించిన ప్రస్థానమే రామాయణం. అయోధ్య మహారాజు దశరథుడి ముగ్గురు రాణులు నోము ఫలమున నలుగురికి జన్మనిచ్చారు. అందులో అగ్రజుడే శ్రీరామ చంద్రుడు. కారణ జన్ముడు. సకల గుణ ధాముడు. రాముని జన్మ వృత్తాంతం భక్తులకు ఓ పర్వమే. వేల సంవత్సరాలు దాటినా యుగాలు మారినా ముల్లోకాలకూ రాముడే ఆదర్శనీయుడు ఇప్పటికీ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. రాముడు మనిషి అవతారం ఎత్తింది మనుషులకు ఓ దారి చూపించడానికే. వారిలో వ్యక్తిత్వ వికాసం కల్పించడానికే. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తన నడవడిక ద్వారానే నేర్పించాడు రాముడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. తండ్రి దశరథుడు పిలిచి నువ్వు వనవాసానికి పోవాలంటే అలాగే తండ్రీ అని మారు మాట్లాడకుండా కట్టుబట్టలతో అడవులకు బయలు దేరాడు. సకల రాజభోగాలు, సుఖాలు , అధికారం అన్నీ వదులకుని రాజభవనాన్ని అయోధ్య నగరాన్ని వీడి అడవులకు వెళ్లిపోయాడు. తండ్రుల మాటను పిల్లలు పెడచెవిన పెట్టకూడదని దీని ద్వారా నేర్పాడు రాముడు. -
రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్లో పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. -
'హరిహర వీరమల్లు' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి పోస్టర్ను రిలీజ్ చేశారు. అగ్రెసివ్ లుక్లో కనిపిస్తున్న పవన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma 🏹 - Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/8jV4BvzGJm — Mega Surya Production (@MegaSuryaProd) April 10, 2022 -
ప్రభాస్ ‘నో’ చెప్పి ఉంటే ఆదిపురుష్ ఉండేది కాదు
‘‘మీ మనసు స్వచ్ఛంగా ఉంటే మీరు ప్రతి విషయాన్ని స్వచ్ఛంగా చూస్తారు. నా మనసు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు తప్పులు చేస్తామనే భయం ఉండదు. అందుకే రామాయణం లాంటి చరిత్రను భయం లేకుండా ‘ఆదిపురుష్’గా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు ఓం రౌత్. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఇతర పాత్రల్లో పేరున్న నటీనటులతో ఓం రౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘రాముడి జీవితం నాకు ఆదర్శం’’ అన్నారు ఓం రౌత్. శ్రీరామ నవమి సందర్భంగా ‘సాక్షి’తో ఓం రౌత్ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు ఈ విధంగా... ► రాముడి గురించి రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యమా? ఓం రౌత్: కచ్చితంగా సాధ్యం కాదు. జీవితంలో ఎలా నడుచుకోవాలనేది చెప్పడానికి రాముడు మంచి ఉదాహరణ. ఆయన్ను ‘మర్యాద పురుషోత్తమ్’ అంటారు. మంచి లక్షణాలున్న రఘురాముడి గురించి చెప్పడానికి ఒక్క సినిమా సరిపోదు. అందుకే రాముడి జీవితంలోని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ‘ఆదిపురుష్’ చేశాను. ► మీరు ‘ఆదిపురుష్’ తీయడానికి 30 ఏళ్ల క్రితం రామానంద్ తీసిన ‘రామాయణ్’ సీరియల్ ఆదర్శం అనుకోవచ్చా? రాముడిని అర్థం చేసుకునే ప్రాసెస్ నా చిన్నప్పుడే మొదలైంది. నా గ్రాండ్ పేరెంట్స్ ద్వారా రామాయణం విన్నాను. అలాగే రామానంద్ సాగర్ ‘రామాయణ్’ కొన్ని విశేషాలు తెలియజేసింది. రాముడి గురించి మాట్లాడిన ప్రతిసారీ నాకు కొత్త విషయం తెలుస్తుంది. రామాయణం ఆధారంగా జపనీస్ డైరెక్టర్ యుగో సాకో తీసిన జపనీస్ సినిమా చూశాక నాకూ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. అది యానిమేషన్ మూవీ. 2000లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ సినిమా చూశాను. రాముడి గురించి విదేశీయులు అంత ఆకట్టుకునేలా తీస్తే భారతీయులమైన మనం ఎందుకు తీయకూడదనిపించింది. కరోనా లాక్డౌన్లో ‘ఆదిపురుష్’ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ► 40ఏళ్ల వయసులో... అది కూడా దర్శకుడిగా తక్కువ సినిమాల అనుభవం ఉన్న మీకు రామాయణం లాంటి పెద్ద సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదేమో? నా చిన్నప్పుడే రఘురాముడికి ఇన్స్పైర్ అయ్యాను. రాముడి జీవన విధానాన్ని ప్రపంచం మొత్తం ఆచరిస్తే బాగుంటుందనే ఆలోచన నా చిన్నప్పుడే నాకు కలిగింది. రాముడి క్వాలిటీస్ నన్ను అంతగా ఆకట్టుకున్నాయి. చిన్నప్పటినుంచీ రాముడంటే ఆరాధనాభావం ఉంది. అయినప్పటికీ రాముడి సినిమా అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ పాత్ర మీద పెంచుకున్న మమకారం ‘ఆదిపురుష్’ తీసేలా చేసింది. నేటి తరానికి రాముడి గురించి తెలియాలి. ► ‘యంగ్ రెబల్ స్టార్’ ఇమేజ్ ఉన్న ప్రభాస్ని సాత్వికంగా కనిపించే రాముడి పాత్రకు తీసుకోవాలని ఎందుకనిపించింది? తీక్షణంగా ఉండే ప్రభాస్ కళ్లు, తన ఫిజిక్ రాముడి పాత్రకు సూటబుల్. మన కళ్లు మన హృదయానికి ప్రతిబింబాలు అంటారు. మనసులో ఉన్న భావాలను కళ్లు పలికిస్తాయి. అలా ప్రభాస్ తన కళ్లల్లో కరుణ రసాన్ని చూపించగలుగుతారని పూర్తిగా నమ్మి, తనే ఈ పాత్ర చేయాలనుకున్నాను. అలాగే రాముడిలో ఉండే లక్షణాల్లో ‘పరాక్రమ వీర’ ఒకటి. రెబల్ ఇమేజ్తో ప్రభాస్ ఆ వీరత్వాన్ని చూపించగలరని నమ్మాను. ఈ క్యారెక్టర్ గురించి చెప్పి, ‘వి’ షేప్ బాడీ బాగుంటుందన్నాను. ఫిజిక్ని అలానే మలచుకున్నారు. అలాగే హిందీ భాష మీద కూడా ప్రభాస్ పట్టు సాధించారు. ► ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే.. ఈ సబ్జెక్ట్ గురించి ప్రభాస్కి చెప్పడానికి వెళ్లే ముందు కాదనరనే నమ్మకంతో వెళ్లాను. సినిమా గురించి చెప్పగానే ‘ఓకే.. చేస్తాను’ అన్నారు. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకోకపోయి ఉంటే ‘ఆదిపురుష్’ ఉండేది కాదు... తీసేవాడిని కాదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి నన్ను ఆ ‘ఆల్మైటీ’ (దేవుడు)యే ఎన్నుకున్నాడని నా నమ్మకం. నన్నే కాదు.. నటీనటులు, టెక్నికల్ టీమ్ అందర్నీ ఆ దేవుడే ఎంపిక చేసి, ఈ ప్రాజెక్ట్ చేయించాడని నమ్ముతున్నాను. ► మూడు సీన్లు విని, ప్రభాస్ ఈ సినిమా చేస్తానని అన్నారట.. అవును.. నిజమే. ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ప్రభాస్తో నాకంతగా పరిచయం లేదు. కథ చెప్పడానికి ఫోన్ చేశాను. మూడు సీన్లు విని, ప్రభాస్ ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి కథ చెప్పాను. ► ‘ఆదిపురుష్’ని దేవుడే తీయించాడని చెప్పారు. మీకు భక్తి ఎక్కువ అని తెలుస్తోంది.. మీరు సెంటిమెంట్స్ని నమ్మితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే ‘ఫైర్ యాక్సిడెంట్’ జరిగినందుకు అప్సెట్ అయ్యారా? భయపడ్డారా? ఏమాత్రం భయపడలేదు.. అప్సెట్ అవ్వలేదు. నిజానికి పెద్ద ఘటనే జరిగింది. నా టీమ్ చేసిన హార్డ్వర్క్ (సెట్ వర్క్) వృథా అయిందని బాధపడ్డాను. అయితే ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. చాలా త్వరగానే సెట్ పూర్తి చేసి, షూటింగ్ పూర్తి చేసేలా చేశాడు. జీవితంలో కష్టాలు వస్తాయి... పోతాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే... సెట్ మాత్రమే పాడయింది తప్ప, మా టీమ్లో ఉన్న ఎవరికీ ఏమీ కాలేదు. అందుకే దేవుడు మా పక్షాన ఉన్నాడని అంటున్నాను. ► ప్రభాస్ మంచి భోజనప్రియుడు.. తన టీమ్కి విందులు ఇవ్వడం ఆయన అలవాటు.. మరి మీ టీమ్కి? ప్రభాస్తో వర్క్ చేయడం నాకో మంచి అనుభూతి. ఇంటి ఫుడ్ తెప్పించి, అందరికీ ఇచ్చేవారు. షూటింగ్ సమయంలో టేస్టీ ఫుడ్స్ చాలానే లాగించాం (నవ్వుతూ). ఇంకో విషయం ఏంటంటే.. షాట్ గ్యాప్లో కూడా ఫుడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. రేపు ఏం తిందాం అని కూడా ముందు రోజు చర్చించుకునేవాళ్లం. ► ఫైనల్లీ.. మీ జీవితంపై రాముడి ప్రభావం? అది చెప్పడానికి మాటలు చాలవు. మనందరం ఉదయం నిద్ర లేచేటప్పుడు ‘మంచి జరగాలి’ అనుకుంటాం. ఆ మంచి ఎక్కడ్నుంచి వస్తుంది? మన నమ్మకంలోంచి పుట్టుకొస్తుంది. ఆ నమ్మకం ఎక్కడ నుంచి వస్తుంది? మనం నమ్మిన రఘురాముడి నుంచి వస్తుంది. రాముడి నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ‘ఆదిపురుష్’తో ప్రేక్షకులను వేల ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నా అన్నారు.. మీరు చేసిన రీసెర్చ్ గురించి? నిజానికి రామాయణం గురించి ప్రపంచం చాలానే రాసింది. మన కళ్ల ముందు బోలెడంత మెటీరియల్ ఉంది. ఎక్కువ టైమ్ కేటాయించి, అవి స్టడీ చేస్తే చాలు. నేను ఎక్కువ టైమ్ కేటాయించి, అన్నీ స్టడీ చేశాను. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ బుక్స్ చదివాను. అప్పటి కట్టడాలు ఎలా ఉండేవి? డిజైన్లు ఎలా ఉండేవి? అనే విషయాల మీద అవగాహన పెంచుకున్నాను. వేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్ టెక్నాలజీతో చూపిస్తున్నాను. నేను నమ్మిన కథను నిజాయితీగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాను. ఒక బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్ ఓ సాధనంలా ఉపయోగపడతాయి తప్ప కేవలం వాటితోనే సినిమాని నడిపించాలనుకోకూడదని నా అభిప్రాయం. అందుకే కథ బాగా రాసుకుని, దాన్ని స్క్రీన్కి ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఆ కథ ఎలివేట్ కావడా నికి వీఎఫ్ఎక్స్ వాడాను. -
రాముడు నడయాడిన పవిత్ర భూమి..కోరిన కోర్కెలు తీర్చే కోదండ రామాలయం
-
ఘనంగా శ్రీ రామాయణ జయమంత్రం కార్యక్రమం
శ్రీరామనవమి సందర్బంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీరామాయణ జయ మంత్రం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో 22 దేశాలనుంచి అనేక మంది హాజరయ్యారు. సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్, మలేషియా తెలుగు సంఘం మలేషియా, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో జయ మంత్రదీక్ష కార్యక్రమం జరిగింది. ఇండోనేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులయిన రామాయణ హరినాథ రెడ్డి ఈ జయమంత్ర దీక్షను వీక్షకులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో ఉపాసించిన జయ మంత్రం అత్యంత శక్తివంతమైనదన్నారు. వ్యక్తులు తాము అనుకున్న పనులు నెరవేరాలంటే ఈ దీక్షను 48 రోజులపాటు పాటించాలన్నారు. జయ మంత్ర ఉపాసన మనిషికి ధైర్యాన్నిస్తుందన్నారు. ఈ మంత్రం అజాత శత్రువులను చేస్తుందన్నారు. ఆశావాద దృక్పథాన్ని పెంచుతుందని, ఆయుష్షును వృద్ధి చేస్తుందన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి మూలం రామాయణమన్నారు. ప్రతి ఒక్కరు జయ మంత్ర దీక్ష తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపడానికి ముందుకొచ్చిన హరినాథ్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులయిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ.. జయ మంత్రం మన అందరినీ విజయ బాటలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 1,000 మందికి పైగా సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిపైన్స్, న్యూజిలాండ్ మొదలగు దేశాల వారు జూమ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారని తెలియజేశారు. మలేషియా తెలుగు సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ.. హనుమంతుడు ఆచరించిన జయమంత్రాన్ని ప్రజలకు తెలియజేసి, రామాయణ హరినాథరెడ్డి సమాజానికి మహోపకారం చేశారన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. శ్రీరామనవమి రోజు రెండు మహాకార్యాలను నిర్వహించుకున్నామన్నారు. మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని అంజనాద్రి పర్వతంపై హనుమంతుడు జన్మించారనే విషయాన్ని నిరూపించడం. రెండవది ఈ జయమంత్ర దీక్షను తీసుకోవటమన్నారు. అనంతరం రామాయణంలోని సందేహాలను డా. సునీత, ఉషారాణి, డా. అరుణ కుమారి తదితరులు అడుగగా హరినాథ్రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గసభ్యులకు, మలేషియా తెలుగు సంఘం వారికి, టీటీడీ, శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల వారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం జగన్
అమరావతి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీతారాముల, దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిలషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
నవమికి రాముడు?
‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్ , రావణుడి ప్రాతలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా వచ్చే నెల ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రదర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఏప్రిల్ రెండోవారం వరకు జరగుతుందని సమాచారం. -
ఏప్రిల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవు
ఏప్రిల్లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏప్రిల్లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే అని గుర్తుంచుకోవాలి. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. అలాగే, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి మీ లావాదేవీలనుముందే ప్లాన్ చేసుకోవడం అవసరం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్! -
సీతారాముల విగ్రహాలకు అభిషేకం
-
రాములోరి పెళ్లిపై కరోనా ప్రభావం
-
ఏప్రిల్లో మందిర నిర్మాణం!
పుణే/న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రామమందిర నిర్మాణాన్ని కచ్చితంగా ఏ రోజున ప్రారంభిస్తామనేది త్వరలో జరగనున్న ట్రస్ట్ తొలి భేటీలో నిర్ణయిస్తామని దేవగిరి తెలిపారు. రెండేళ్లలో మందిరాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలి విరాళం రూపాయి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ట్రస్ట్కు అందజేసింది. కేంద్రం తరఫున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము బుధవారం ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్కు విరాళాలు అందజేయవచ్చని అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మసీదుకు ఇచ్చిన స్థలం చాలా దూరంగా ఉంది మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలం అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో రోడ్డు కూడా సరిగాలేని ఓ గ్రామంలో ఉందని ‘అయోధ్య’ వివాదంలోని ముస్లిం పిటిషన్దారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేటాయించిన ప్రదేశంచాలా దూరంలో ఉంది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద స్థలం ఉన్న 67 ఎకరాల్లోనే మందిరం, మసీదు ఉండాలని 1994లో ఇస్మాయిల్ ఫరుఖి కేసులో సుప్రీం తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
సాక్షి, భద్రాచలం : భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానానికి మంత్రి చేరుకొని వాటిని సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి కిటకిటలాడింది. మిథిల కల్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా.. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి వారు సిద్ధమయ్యారు. నేడు(ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, పెళ్లి సామగ్రితో ఆలయానికి చేరుకున్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాదికోసారి శ్రీరామనవమి నా డు భద్రాద్రిలో అంగరంగ వైభంవగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం కోసం అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. దేశ నలుమూలల నుం చి తరలివచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం మహాపట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, శనివారం రాత్రి రామాలయంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమా లను తిలకించిన భక్తు లు పరవశించిపోయా రు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే.. భద్రాద్రి మిథిలా స్డేయంలో ఆదివారం ఉదయం 10.30 గంట ల నుంచి 12.30 గంట ల వరకు జరిగే రామ య్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించి తరించేందుకు ఇప్పటికే భక్తులు భారీగా చేరుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్... ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాల య పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌక ర్యం కల్పించారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. రామాలయం, మాఢవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలు గొందుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మిథి లా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ తంతు నిర్వహిస్తారు. రామతీర్థంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సీతారాములకు ఆలయ అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్రూరల్ : జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్రలో చోటు చేసుకున్న అల్లర్లపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మంగళవారం ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ.. భక్తులు, పోలీసులపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, వొడిసెల శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని దానాల్లో.. అన్నదానం మిన్న
భద్రాచలంటౌన్: అన్ని దానాల్లో.. అన్నదానం గొప్పదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, మజ్జిగ, మంచినీరు, పులిహోర, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్సెంటర్ నందు సెంట్రింగ్ అండ్రాడ్ బెండింగ్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్కో సిమెంట్ ఆధ్వర్యంలో స్థానిక మాధవి ఎంటర్ప్రైజస్ద్వారా భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైవీ రామారావు, వెంకటరెడ్డి, గడ్డం స్వామి, ఎంబీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల లీటర్ల పానకం, వడపప్పు, 2క్టింటాళ్ల పులిహోర పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, కోవూరు సంతోష్కుమార్, తిరుమలరావు, కృష్ణమోహన్, మూర్తి, పీ గౌతమ్, మహిళా అధ్యక్షురాలు సాగరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, బద్ది శ్రీనివాసరావు, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. ఇండియన్రెడ్క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల మంచినీటి ప్యాకెట్లను 5వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మారుతి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, జీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో.. భద్రాచలం విచ్చేసిన భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో బుడగం శ్రీనివాసరావు, కుంచాల రాజారాం, సాగర్, శ్రీను, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. మథ«ర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. స్థానిక బస్టాండులో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపకుడు కొప్పుట మురళీ, జీ నాగరాజు, అజిత్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామ నవమి ప్రసాదం... స్వీకరిద్దాం రారండి!
శ్రీరామ నవమి నాడు పానకం ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం. కేవలం ఒక ప్రసాదంగా మాత్రమే కాదు... అందులోనూ ఎన్నో పోషకాలూ, ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. బెల్లం ♦ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. జీర్ణ వ్యవస్థ మీద, పేగుల మీద భారాన్ని తొలగిస్తుంది ♦ బెల్లం శ్వాసకోశ వ్యవస్థనూ, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది ♦ బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఈ పీచుపదార్థాలే బెల్లాన్ని మంచి క్లెన్సర్గా పనిచేసేలా చేస్తాయని ప్రతీతి. క్లెన్సర్గా ఇది కాలేయాన్ని సైతం శుభ్రపరుస్తుంది ♦ బెల్లంలో ఖనిజాలు, లవణాలు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ♦ బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల అవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్ను హరిస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ♦ కీళ్ల నొప్పులు ఉన్నవారి బాధలకు బెల్లం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మిరియాల్లో... ♦ మిరియాలలోని పైపరిన్ అనే పోషకం మెదడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు మతిమరుపు, అలై్జమర్స్ లాంటి అనేక సమస్యలు నివారితమౌతాయి ♦ మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ను మిరియాలు సమర్థంగా అరికట్టి ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి, మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి ∙జలుబు, దగ్గులకు తొలి చిట్కా మిరియాలే ∙ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం. యాలకులు... శ్రీరామ నవమి వేసవిలో వచ్చే పండుగ. ఈకాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని గుణాన్ని నివారించడానికి తోడ్పడేవి యాలకులు. శ్రీరామ నవమి పానకానికి మంచి రుచి, సువాసనను ఇస్తాయవి. వాటితోనూ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సుగంధద్రవ్యం వల్ల కలిగే ప్రయోజనాలలో కొన్ని... ♦ ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లతోపాటు గుండెజబ్బులనూ నివారిస్తాయి ♦ దేహంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉన్నా యాలకులు నివారిస్తాయి ♦ యాలకుల్లో మూడ్ను బాగుండేలా చేసే లక్షణంతో పాటు డిప్రెషన్ను దూరం చేసే గుణం ఉంది ♦ నోటి పరిశుభ్రతనూ, ఆరోగ్యాన్ని (ఓరల్ హైజీన్)ను కాపాడతాయి. ఇక నవమి ప్రసాదంలోని వడపప్పులో... పెసర్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలివి... ♦ పెసర్లలో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ♦ ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతాయి ♦ పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి ♦ పెసర్లలో ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి అవి తోడ్పడతాయి. కొబ్బరిలో... వడపప్పులో చిన్నచిన్న కొబ్బరి ముక్కలు, కొబ్బరి కోరు వేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ♦ కొబ్బరిలో 61 శాతం డయటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి అది ఒంట్లోకి విడుదల అయ్యే చక్కెరను చాలా నెమ్మదిగా అయ్యేలా చూస్తుంది ♦ కొబ్బరిలోని సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు వయసును తగ్గిస్తాయి. కొబ్బరి తినేవారు దీర్ఘకాలం యౌవనంతో ఉంటారు ♦ కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు... ఆహారంలో కొబ్బరిని ఎక్కువగా వాడేవారికి గొంతు ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన రావు కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కొబ్బరి తిన్నప్పుడు ఆ కొవ్వుల కారణంగా ఆకలి అంతగా అనిపించదు. అందుకే కొబ్బరి తినేవారిలో ఆకలి కాస్త తగ్గడం వల్ల తినే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన బరువు తగ్గే సాధనంగా కొబ్బరిని ఎంచుకొని, దాని వాడకం పెంచుకోవడం మంచిదనేది ఒబేసిటీని తగ్గించే నిపుణులు చెబుతున్న మాట. మన సంప్రదాయంలో స్వాభావికంగానే ఆరోగ్యాన్ని కాపాడే మంచి లక్షణాలు ఉన్నాయి. శ్రీరామనవమి నాటి వడపప్పులో, పానకంలో కూడా. అందుకే నవమి నాటి ప్రసాదాలను స్వీకరిస్తే... దైవకృపకు కృప... ఆరోగ్యానికి ఆరోగ్యం. -
సోమవారం ప్రజాసంకల్పయాత్రకు విరామం
సాక్షి, గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం 120వ రోజు పాదయాత్ర ముప్పళ్లలో ముగిసింది. నేటి ఉదయం నరసారావుపేట నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఆపై బరంపేట, బీసీ కాలనీ, ఇనప్పాలెం మీదుగా పాదయాత్ర ములకలూరు చేరుకుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంచించారు. ములకలూరు, గొల్లపాడుల మీదుగా కొనసాగిన పాదయాత్రను వైఎస్ జగన్ ముప్పళ్లలో ముగించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ నేడు 12.5 కి.మీ నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఓవరాల్గా వైఎస్ జగన్ 1598.5 కి.మీ నడిచి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారు. -
పానకం, వడపప్పే ఎందుకు?
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది, దేహకాంతినిస్తుంది. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుందని పండితుల మాట. వడపప్పు తయారీ కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరరగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. పానకం తయారీ కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరాయల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ∙ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ గ్లాసులోకి తీసుకుని తాగాలి. -
వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భద్రాద్రిలోను, ఏపీలో ఒంటిమిట్టతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. -
26నే శ్రీరామ నవమి
నెల్లిమర్ల రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల 25నా లేక 26న జరపుకోవాలా? అనే విషయంపై సందిగ్ధం వీడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు రోజుల్లో ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు రామతీర్థం దేవస్థానం అర్చకుల నుంచి వివరణ సేకరించారు. అర్చకులు పంచాంగాలను చూసి ఈ నెల 25న నవమి ఉన్నప్పటికీ అష్టమి కలిసి రావడంతో కల్యాణం జరిపించేందుకు శుభం కాదని స్థానాచార్యులు నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు సాయిరామాచార్యులు తదితరులు దేవాదాయశాఖకు వివరణ ఇచ్చారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ రోజున శ్రీరాముని కల్యాణం నిర్వహించకూడదని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 26వ తేదీ ఉదయం 5.30కు నవమి పోయి దశమి వస్తుందని సూర్యోదయం తరువాత స్వామివారి వేడుకను జరుపుకోవచ్చునని అర్చకులు చెబుతున్నారు. ఆ సూచనల మేరకు దేవాదాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, 26నే రామతీర్థంలో కల్యాణాన్ని జరుపుతున్నట్లు తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 26నే సెలవు దినంగా ప్రకటిస్తూ శుక్రవారం అధికారిక జీఓను జారీ చేసింది. అష్టమితో కూడిననవమి చేయరాదు ఆదివారం నవమితో పాటు అష్టమి కూడా కలిసి వచ్చింది. ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి కల్యాణాన్ని ఆ రోజు నిర్వహించడం మంచింది కాదు. 26వ తేదీ ఉదయం 5.30 గంటలకే నవమి పోయి దశమి వస్తుంది. సూర్యోదయమైన తరువాత దశమి నాడు కల్యాణ వేడుకను నిర్వహించవచ్చు. ఇదే విషయాన్ని దేవదాయశాఖకు తెలియజేశాం. ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 25నుంచి 26వ తేదీకు మార్చింది.– సాయిరామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, రామతీర్థం -
అంతా రామమయం
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలా కల్యాణోత్సవాలు శ్రీరామ నవమి మహోత్సవం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. జిల్లాలోని పెదపూడి మండలం జి.మామిడాడలోని కోదండరామ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. అన్నవరంలోని రత్నగిరిపై, కె.గంగవరం మండలంలోని సత్యవాడలో జరిగిన కల్యాణోత్సవం కనువిందు చేసింది. ఏజెన్సీ ప్రాంతమైన వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలో శ్రీరామ నామస్మరణ మారుమోగిపోయింది. రాజమహేంద్రవరం, కాకినాడలతోపాటు అన్ని ప్రాంతాల్లోని రామాలయాలే కాకుండా వీధుల్లో కూడా స్వచ్ఛందంగా చలువ పందిళ్లు వేసుకొని అర్థరాత్రి వరకూ భజనలు, భక్తి గీతాలతో భక్తులను అలరింపజేశారు. గొల్లల మామిడాడలో.. జి.మామిడాడ(పెదపూడి) : వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. బాజాభజంత్రీలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల శ్రీరామనామస్మరణతో కోదండరాముని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై సీతారాముల వారి కల్యాణం కనుల పండువగా సాగింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లలమావిుడాడలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముని కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటకూర్మరంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 11.10 గంటలకు స్వామి వారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ సీహెచ్ అరుణకుమార్, శ్రీదేవి దంపతులు, సీతారాములకు పట్టువస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. అలాగే ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి, తోటత్రిమూర్తులు సూర్యకుమారి, పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ద్వారంపూడి వెంకటరెట్టి మంచిముత్యాలు తలంబ్రాలు స్వామి వారికి సమర్పించారు. 11.40 గంటలకు ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి శ్రీదేవి మహాలక్ష్మి ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకిలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తాడి శ్రీ వ్యవహరించారు. 12 గంటలకు ప్రారంభం.. మ««ధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ సంకల్పం ప్రారంభమైంది. మ్యధ్యాహ్నం 1.26 గంటలకు రక్షాబంధ¯ŒS చేశారు. 1.26 గంటలకు మంచి ముత్యాల దండ చూపించారు. మంత్రస్నానం చేయించారు. కన్యాదానం చేశారు. 2.05 గంటలకు జీలకర్ర బెల్లం కల్యాణమూర్తుల శిరస్సుపై ఉంచారు. 2.20 గంటలకు మాంగల్య సూత్రధారణ రాముల వారితో చేయించారు. 2.30 గంటలకు తలంబ్రాలు తంతు పూర్తి చేశారు. రామయ్య తండ్రి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట తంతు యథావిధిగా జరిగింది. కల్యాణం తలంబ్రాలు వేసుకున్నవారికి కొద్ది కాలంలోనే కల్యాణం జరుగుతుందని, ముందురోజు ఆలయానికి చేరి నిద్రించేవారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కల్యాణానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తలంబ్రాలు, బియ్యం పంపిణీ చేశారు. ఆలయ ఆర్గనైజర్ నల్లమిల్లి అచ్చుతానందరెడ్డి, పలువురు ఏర్పాట్లు పర్యవేక్షించి సేవలందించారు. జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం ర్యాలి(ఆత్రేయపురం) : ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణాన్ని బుధవారం రాత్రి 8.45గంటలకు వేదమంత్రోచ్ఛారణ నడుమ కడు రమణీయంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన శ్రీనివాసులు వెంకటచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, ఆలయ అర్చకులు కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. జగన్మోహిని, కేశవస్వామికి వేదపండితులు వాడపల్లి రంగాచార్యులు, పెద్దింటి శ్రీనివాసాచార్యులు, వాడపల్లి భాస్కరాచార్యులు , వేదపండిట్ టీవీ ఫణికుమార్, పురాణ పండిట్ హరిరామనా«థ్లు వివాహ క్రతువు నిర్వహణకు సహకరించారు. తొలుత స్వామి వార్ల ఉత్సవ విగ్రహలను గర్భగుడి నుంచి కల్యాణ మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. ముందుగా పండితులు విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, నిత్యహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు పట్టు వస్త్రాలు , మంగళసూత్రాలను సమర్పించారు. ఉదయం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూల మాలలతో అలంకరించి గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ కరుటూరి నరసింహరావు, జగన్మోహినీ కేశవస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. శ్రీరామగిరిలో.. శ్రీరామగిరి(వీఆర్పురం) : మరో భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీరామగిరి సుందర సీతారామచంద్ర స్వామివారి కల్యాణం రామనామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. పుణ్యగోదావరి, పవిత్ర శబరి నదుల సంగమ ప్రాంతానికి చేరువగా మాతంగ మహారుషి నిర్మించిన ఆలయంలో సుందర సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తజనుల నడుమ సాగింది. భక్తులు తనివితీరా కల్యాణాన్ని వీక్షించారు. సుందర సీతారామచంద్రులకు చేతులు జోడించి జేజేలు పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు వివాహ వేడుకలో భాగంగా కొండవీుద ఆలయంలో తెల్లవారుజామున ఒంటి గంటకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కల్యాణ ఘట్టాలను క్రమ పద్ధతిలో చేపట్టారు. పుణ్య నదీతీర్థాన్ని స్వామివారికి సమర్పించిన అనంతరం అర్చకులు కల్యాణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీతారాములను ఆలయంలో వధూవరులుగా చేశారు. అలాగే గర్భగుడిలోని మూలవిరాటులకు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి దేవరాజ వాహనంపై కొండ దిగువన ఉన్న కల్యాణ మండపానికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చి, వేదికపై అధిష్టింపజేశారు. అక్కడ ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శోడషోపచార పూజలను వేదపండితులు నిర్వహించారు. పూర్ణాహుతుని తదుపరి శాంతి కల్యాణాన్ని చేపట్టారు. సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కల్యాణోత్సం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాజేశ్వరి.. స్వామివారి కల్యాణానికి రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చింతూరు ఐటీడీఏ పీఓ చినబాబులు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు మరికొందరు భక్తులు స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎటపాక సీఐ ఆర్.రవికుమార్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లా¯ŒS కమిటీ సభ్యురాలు కొమరం ఫణీశ్వరమ్మ, ఎంపీపీ కారం శిరమయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యాల కుసుమాంబ, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్, వీఆర్పురం ఎస్సై ఎ¯ŒS.రామకృష్ణ , కూనవరం ఎస్సై అజయ్బాబు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS ఆచంట శ్రీనివాస్, ఏఎస్డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు. -
పండగ పూట విషాదం
- ఫ్యూజ్ వేయబోయి మృత్యువాత - పెట్నికోట గ్రామంలో ఘటన కొలిమిగుండ్ల: శ్రీరామనవమి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యూజ్ వేయబోయి ఓ యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పెట్నికోట ఎస్సీ కాలనీకి చెందిన మగదాల సుబ్బరాయుడుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేంద్రబాబు(28) స్వంతంగా నాపరాతి పాలీష్ ప్యాక్టరీ నిర్మించుకొని కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడు రోజుల క్రితం పెట్నికోటలో పెనుగాలుల బీభత్సానికి స్తంభాలు, చెట్లు విరిగి పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సురేంద్రబాబు ప్యాక్టరీకి చెందిన ట్రాన్స్ఫార్మర్లో ఎగ్జ్ఫ్యూజ్ పోవడంతో సరఫరా నిలిచి పోయింది. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ప్యాక్టరీ వద్దకు వెళుతుంటే కుటుంబ సభ్యులు కాఫీ తాగి వెళ్లమని సూచించినా త్వరగా వస్తానని వెళ్లాడు. ఏదో ఆలోచనలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను బంద్ చేయకుండా ఎక్కి ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్రాన్స్కో ఏఈ సూర్యనారాయణరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ జయనాయక్ .. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హెడ్కానిస్టేబుల్ బాబాఫకృద్దీన్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. -
12వేలమంది పోలీసులు, 500 సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్ : శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 12వేల మంది పోలీస్ సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో 200లకు పైగా శోభాయాత్రలు కొనసాగుతున్నాయని, వందల సంఖ్యలో సీసీ కెమెరాలను అడుగడుగునా ఏర్పాటు చేశామన్నారు. టాస్క్ఫోర్స్, ఇంటెలిజెన్స్, షీ టీమ్స్, టీఎస్పీఎస్ బలగాలు, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నామని సీపీ పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల లోపు శోభాయాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు. మరోవైపు భాగ్యనగర్ శ్రీరామనవమి సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. బోయిగూడ కమాన్, పురానాపూల్, బేగంబజార్ మీదగా హనుమాన్ టెకిడీకి చేరుకుంటుంది. రాత్రి హనుమాన్ టెకిడీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
భద్రాచలం: భద్రాచలం శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో శుక్రవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శ్రీ రామనవమి వేడుకలకు విజయవాడకు చెందిన యువకులు వచ్చారు. ఉదయం స్నానానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలిసింది. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు విజయవాడలోని సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు రాము(18), గుంజా శివయ్య(18)గా గుర్తించారు. -
తిరుమలలో 15న శ్రీరామనవమి ఆస్థానం
సాక్షి, తిరుమల: ఈనెల 15వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. రాత్రి 10 గంటల తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఆ రోజు నిర్వహించే నిజపాద దర్శనం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దుచేశారు. అలాగే, 16వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఆరోజు వసంతోత్సవ సేవ రద్దు చేయగా, మిగిలిన సేవలు యథావిధిగా కొనసాగుతాయి. -
శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: భద్రాదిలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఐకేరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15న శ్రీరామ నవమి వేడుకులను జరుపుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లపై వారు దృష్టిసారించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
కొబ్బరికాయ ఒకటే... కానీ లోపల చూస్తే...!
మిర్యాలగూడ టౌన్: కొబ్బరికాయ ఒక్కటే... దాన్ని కొట్టి చూస్తే లోపల రెండు భాగాలు కనిపించాయి. ఈ విశేషం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్లో చోటు చేసుకుంది. శ్రీరామనవమి పూజలో భాగంగా శనివారం కొండవీటి శేఖర్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టగా అందులో రెండు కాయలుగా ఉండడాన్ని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదేదో మంచి పరిణామంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు కూడా చూసేందుకు వారింటికి క్యూకట్టారు. -
‘శోభా’యమానం
అబిడ్స్/జియాగూడ/కలెక్టరేట్/ సుల్తాన్బజార్: జైశ్రీరామ్...జై వీర హనుమాన్ అంటూ లక్షలాది మంది భక్తుల నినాదాల నడుమ శ్రీరామ నవమి శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. ధూల్పేట్ నుంచి పురానాపూల్, జిమ్మెరాత్ బజార్, చుడీ బజార్, ఛత్రి, బేగంబజార్, సిద్దిఅంబర్బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్బజార్ వరకు నగర రహదారులు కాషాయమయంగా మారాయి. వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధూల్పేట్ గంగాబౌలిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్లోథ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగింది. మొదటిసారిగా సీతారాంబాగ్ ఆలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి నాయకులు ఈ యాత్రను నిర్వహించారు. బృందావన్ నుంచి వచ్చిన సాధ్వీ సంహిత, ఆధ్యాత్మిక గురువు స్వామి కమలానంద భారతి సీతారాం బాగ్లో ఉదయం 11 గంటలకు పూజలు చేసి... యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు గంగాబౌలిలో ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ, ఆలిండియా బీజేపీ కార్యదర్శి మురళీధర్రావులు శ్రీరాముడికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. రాత్రి వరకూ ఈ వేడుక కొనసాగింది. ఉర్రూతలూగించిన డోల్ పతక్ బ్యాండ్... పూణె నుంచి వచ్చిన కళాకారుల డోల్ పతక్ బ్యాండ్ ఉర్రూతలూగించింది. 101 మంది యువతీ యువకులు నృత్యాలు చేస్తూ... శివాజీ, శ్రీరాముడి భక్తి గీతాలు పాడుతూ బ్యాండ్లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న విగ్రహాలు ఈ యాత్రలో భారీ శ్రీరాముడి విగ్రహం, శివాజీ, హనుమంతుడు, సీతారామ లక్ష్మణలు, రాణిఅవంతిబాయి, శేషశయ్యపై ఆదివిష్ణువు, రామసేతు, శ్రీరాముడి పట్టాభిషేకం విగ్రహాలు భక్తుల మదిని దోచుకున్నాయి. ధూల్పేట్లో టీఆర్ఎస్ నాయకులు ఆనంద్సింగ్ నిర్వహించిన ఫాల్కీ యాత్రలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామ మందిరం నిర్మిద్దాం:సాధ్వీ సంహిత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ప్రతి భక్తుడూ కోరుతున్నారని బృందావన్ వీహెచ్పీ నాయకురాలు సాధ్వీ సంహిత పేర్కొన్నారు. ఛత్రీ చౌరస్తా వద్ద భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ హిందూ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గోవధ నిషేధ చట్టం పూర్తిగా అమలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. హిందువుల ఐక్యతే ప్రధానం: ఎమ్మెల్యే రాజాసింగ్లోథ హిందువులు ఐక్యంగా ఉంటే శత్రువులు పారిపోతారని యాత్ర నిర్వాహకుడు, ఎమ్మెల్యే రాజాసింగ్లోథ పిలుపునిచ్చారు. బేగంబజార్ చౌరస్తాలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర నాయకులు కేశవరాజు, రామరాజు, యమన్సింగ్, కె.రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్అంతరాయం బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అభ్యంతరం తెలిపి శోభాయాత్ర నిలిపివేశారు. పోలీసులు సైతం విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో యాత్ర కొనసాగింది. ప్రశాంతంగా ముగింపు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసింది. దీంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ బందోబస్తు సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో నిర్వహించిన శోభాయాత్రలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి బందోబస్తుకు కేటాయించారు. మరోపక్క ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా వాహనాలను దారి మళ్లించారు. ఈసారి ‘వీడియో కెమెరా మౌంటెడ్ వెహికిల్’ను యాత్ర ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో మరొక టి వినియోగించారు. వీటి ద్వారా అక్కడి దృశ్యాలను పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి, డీసీపీలు రంగనాథ్, చౌహాన్లు తిలకించారు. వీరితో పాటు అగ్నిమాపక శాఖ, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం తిలకించారు. బందోబస్తులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్ జోన్ల డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సుధీర్బాబు, కమలాసన్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు యాకుత్పురా: ఉప్పుగూడ హనుమాన్ నగర్లోని శ్రీ మంగళ్ముఖి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదని.. వెంటనే తీసేయాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీసుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటి తరువాత వివాదం సద్దుమణిగింది. -
హైదారాబాద్ లో శోభాయాత్ర
-
భక్తాగ్రేసుడిపై శ్రీరామచంద్రమూర్తి
సాక్షి, తిరుమల: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శనివారం హనుమంత వాహనం ఊరేగింపు వైభవంగా సాగింది. రాత్రి ఏడు గంటల నుంచి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుడి రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. అనంతరం రాత్రి 10 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం వసంతోత్సవాన్ని రద్దు చేశారు. -
తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి వేడుకలు
-
కల్యాణం.. కమనీయం
జానకిరాముల విశేషాలు, పెళ్లి మంత్రాలకు అర్థాలు పిల్లలకు వివరించారు ఉమ. శ్రీరామ నవమి ప్రత్యేకతను చిన్నారులు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈతరం పిల్లలకు రాముడు, ఆయన గాథ తెలియదని, అవన్నీ ఇలా వారి చేతే చేయించి చూపడం వల్ల ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారని అన్నారు పేరెంట్ కె.రాంబాబు. ‘రాముడికి బట్టలు పెట్టాం. బాసికం కట్టాం. తెర పట్టుకుని మంత్రాలు చదివాం. తలంబ్రాలు పోశాం. పూల బంతులు ఆడాం. దేవుడి పెళ్లి మేమే చేశాం. పెళ్లయ్యాక ఉంగరాల ఆట కూడా ఆడాం. ఈ కల్యాణం మాకెంతో నచ్చింది’ అంటూ మురిసిపోతూ చెప్పారు చిన్నారులు ఆశ్రీత మణికంఠ, వంశిక, అంశృత. అలాగే... బుడతలు అయోధ్యాధిపతికి కట్నకానుకలు చెల్లించే ఘట్టాన్నీ... తమ ముద్దు ముద్దు మాటలతో మహా రక్తి కట్టించారు. ‘విగ్రహాల ఆవాహన నుంచి వివాహ మహోత్సవంలోని ప్రతి ఘట్టాన్నీ సంప్రదాయబద్దంగా పిల్లలతో చేయించాం. కంకణ ధారణ, రాముడికి స్నాతకోత్సవం, యజ్ఞోపవీత ధారణం... ఇలా ప్రతి ఘట్టాన్నీ నిర్వహిస్తూ, వాటి కారణాలను వివరించాం. పిల్లలే పేరంటాళ్లను పిలిచి ఈ తంతు చేశారు. రామాయణ శ్లోకాలు వినిపించి, వారి చేత ఉచ్ఛరిస్తూ, వాటి అర్థాలను చెప్పడం వల్ల చిన్నారులు ఇంత పెద్ద కార్యాన్ని ఎంతో ఆసక్తిగా, ఓపిగ్గా పూర్తిచేశారు’ అన్నారు ఉమా చల్లా. ఓ మధు -
వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం
-
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ : శ్రీరామనవమి పండుగ సందర్భంగా శనివారం నగరంలో కొన్ని ఏరియాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అఫ్జల్గంజ్ టి.జంక్షన్, రంగమహల్ వై.జంక్షన్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్, చారర్ఘాట్, అబిడ్స్ జీపీవో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. -
శ్రీరాముని శోభను చూతము రారండి!
నేడు శోభా యాత్ర భారీ విగ్రహాల ఏర్పాటు సర్వం సిద్ధం : ఎమ్మెలే ్య రాజాసింగ్లోథ అబిడ్స్: శ్రీరామ నవమి శోభా యాత్రకు నగరంలో సర్వం సిద్ధమైంది. శనివారం నిర్వహించే ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. నగరంలోని ధూల్పేట్ గంగాబౌలి నుంచి ప్రారంభమై మంగళ్హాట్, పురానాపూల్, ఛత్రీ, బేగంబజార్, సిద్దిఅంబర్బజార్, గౌలిగూడల మీదుగా సుల్తాన్బజార్ హనుమాన్ వ్యాయామ శాల వరకు యాత్ర కొనసాగుతుంది. రెండు శోభాయాత్రలు గంగాబౌలి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్లోథ ఆధ్వర్యంలో ఏటా శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సీతారాంబాగ్ ఆలయం నుంచి కూడా భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు మరో యాత్రను ప్రారంభించనున్నారు. ఈ రెండు శోభాయాత్రలు మంగళ్హాట్ అనిత టవర్ దగ్గర కలవనున్నాయి. భారీ విగ్రహాలు సిద్ధం ఈ యాత్ర కోసం మొదటిసారిగా భారీ శ్రీరాముడి విగ్రహం, రామసేతు, హనుమంతుడి విగ్రహాలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్లోథ తెలిపారు. రామసేతుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా విగ్రహాలను ప్రదర్శిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రత్యేక ఆకర్షణగా డోల్ పతక్ బ్యాండ్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూణె నగరంలోని డోల్ పతక్ బ్యాండ్ను మొదటిసారిగా ధూల్పేట్ గంగాబౌలికి రప్పించారు. 101 మంది యువకులు ఈ బృందంలో ఉంటారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. భక్తి గీతాలు, శివాజీ మహరాజ్ గీతాలు పాడుతూ బ్యాండ్ కొనసాగుతుందని వివరించారు. పోలీస్, జీహెచ్ఎంసీ కమిషనర్ల పరిశీలిన శోభా యాత్ర ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్లు శుక్రవారం పర్యవేక్షించారు. పోలీసు కమిషనర్తో పాటు అదనపు కమిషనర్ అంజనీ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీలు రాంభూపాల్రావు, భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు యమన్సింగ్, భగవంతరావు, కె.రాములు, మెట్టువైకుంఠం, శ్రీనివాస్ యాదవ్, శ్యాం నెల్లూరి తదితరులు ఉన్నారు. -
సీత వెడ్స్ రామ
-
నవమి వేడుకలకు చంద్రబాబు దూరం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఆయన కుమారుడు లోకేష్కు కుమారుడు పుట్టినందున మైల సందర్భంగా ఒంటిమిట్టలో నిర్వహించే నవమి ఉత్సవాలకు హాజరు కావటం లేదని సమాచారం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వేరే వ్యక్తుల ద్వారా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఒంటిమిట్ట రామునికే ప్రభుత్వ లాంఛనాలు
జిల్లావాసుల కోరిక నెరవేరింది.. పార్టీలకతీతంగా ఉమ్మడిగా కలిసి చేసిన కృషి ఫలించింది.. రాష్ట్రస్థాయిలో ఆధ్యాత్మిక పరంగా జిల్లాకు విశిష్ట గుర్తింపు దక్కింది. ఇకపై ప్రతి నవమినాడు జిల్లా ప్రత్యేక శోభతో విలసిల్లనుంది.. రాష్ట్ర పటంలో జిల్లా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. ఒంటిమిట్ట కోదండరాముడికే ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు సీఎం అంగీకరించడంతో జిల్లావాసుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కడప కల్చరల్: అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు ఇక ప్రతి శ్రీరామ నవమి ఉత్సవాలలోనూ రాజ లాంఛనాలు అందుకోనున్నాడు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో జిల్లాలో ప్రత్యేకించి రాజంపేట, ఒంటిమిట్టలలో భక్తుల ఆనందోత్సాలు మిన్నంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం రాముడికి శ్రీరామ నవమి నాడు అందుతున్న ప్రభుత్వ లాంఛనాలు రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల శ్రీ కోదండ రామయ్యకు అందుతాయని జిల్లా ప్రజలు ఒంటిమిట్టకే రాజలాంఛనాలు దక్కుతాయని ఎంతో ఆశించారు. దీనికి అడ్డుపడుతూ విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కించుకునేందుకు ఆ జిల్లా వాసులు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒంటిమిట్టకే రాజ లాంఛనాలు దక్కడం అన్ని విధాల న్యాయమని స్థానిక రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన భాష, చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ముందుకు రావడంతో జిల్లా వాసుల డిమాండ్కు మరింత బలం చేకూరింది. ఎత్తులు చిత్తు ఒంటిమిట్ట రామాలయానికి ప్రభుత్వ లాంఛనాలు దక్కుతాయోనన్న భయంతో కొందరు విజయనగరం రామతీర్థం ఆలయానికి లేనిపోని ఊహాగానాలతో పురాణగాథలను అప్పటికప్పుడు సృష్టించి దినపత్రికల ద్వారా ప్రచారంచేసే కుట్ర చేశారు. కానీ, అటు పురాణ పరంగా చూసినా, ఇటు చరిత్ర పరంగా చూసినా, జనాంతికంగా గమనించినా ఒంటిమిట్ట రామాలయానికి మాత్రమే రాజలాంఛనాలకు పూర్తి స్థాయి అర్హత ఉందని ‘సాక్షి’ దినపత్రిక శాసనాలు, కైఫీయత్తులు, పేజీ నెంబర్లు సహా ఈ నెల 18న ప్రచురించింది. పౌరాణిక కథనాలతో నిర్ణయం తీసుకోవడం హేతుబద్ధం కాదని, చరిత్ర, పురావస్తుశాఖల నిపుణులతో పరిశీలింపజేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్న ప్రజాభిప్రాయాన్ని ప్రచురించింది. ప్రజా విజయం ఎట్టకేలకు జిల్లావాసులు విజయం సాధించారు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా వాసుల డిమాండుకు అంగీకారం తెలుపుతూ దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లికార్జునరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అందరి కృషి ఒంటిమిట్ట ఆలయానికి రాజలాంఛనాలు సాధించడంలో దాదాపు అందరి కృషి ఉండడం విశేషం. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఒక్కటిగా కలిసి డిమాండ్ చేయడంతో వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి గౌరవించారు. ఇంటాక్ సంస్థ నవంబరు 24న ఒంటిమిట్టలో భారీ ర్యాలీ నిర్వహించింది. సాధన క్రమం ఇలా.... రాష్ట్రం విడిపోయిన తర్వాత గత నవంబరులో ‘సాక్షి’ దినపత్రిక ‘ఇక ప్రభుత్వ లాంఛనాలు ఒంటిమిట్ట కోదండ రామునికేనా’ అన్న శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్లో చర్చను లేవనెత్తింది. అనంతరం మొదలైన ప్రజా ఉద్యమానికి ఊతమిస్తూ జనవరి 17, 26 తేదీల్లో కూడా ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రజలు, భక్తుల డిమాండ్ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాలయంలో సమావేశం నిర్వహించి రాజలాంఛనాలు ఈ ఆలయానికే దక్కాలని డిమాండ్ చేశారు. అనంతరం కడప నగరంలో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పై అంశాన్ని బలపరిచారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం తిరుమలకు రానున్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంటిమిట్ట, తాళ్లపాకలతోపాటు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించనున్నారు. ఒంటిమిట్ట రామునికే రాజ లాంఛనాలు దక్కనున్నాయన్న నేపధ్యంలో ఆయన రాక ప్రత్యేకతను సంతరించుకుంది. -
శ్రీరామనవమికి టీటీడీ నుంచే పట్టువస్త్రాలు
ఆనవాయితీ కొనసాగిస్తాం: ఈవో గోపాల్ ఖమ్మం: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రతీ ఏడాదిలాగే 2015లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు పంపిస్తామని టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి. గోపాల్ తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు పట్టువస్త్రాలు టీటీడీ నుంచే అందించామని, రాష్ట్రం విడిపోయాక కూడా ఆనవాయితీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భద్రాచాలం రామాలయ కమిటీ కోరితే ఇక్కడికి కూడా బంగారు తాపడం పంపిస్తామని చెప్పారు. -
రామయ్యకు పట్టాభిషేకం
తిలకించి.. పులకించిన భక్తజనం భద్రాచలం, న్యూస్లైన్: వైకుంఠ రాముడికి మహాపట్టాభిషేక ఉత్సవాన్ని భద్రాచలంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయ అర్చకులు ఈ క్రతువును జరిపించారు. ఈ వేడుకలను కనులారా చూసిన భక్తులంతా పులకిం చిపోయారు. మహోత్సవానికి ముందు ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పల్లకిలో ఉత్సవ మూర్తులను వేంచేయింపజేసి గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వనాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలిగిపోయేలా విష్వక్సేనపూజ చేశారు. అనంతరం పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యాహవచనం నిర్వహించారు. రామదాసు చేయించిన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి స్వామివారికి కిరీటధారణ చేశారు. తరువాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషక్తుడిని చేశారు. అనంతరం జరిగిన అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది. కాగా, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
నేడు శ్రీరామనవమి ఆస్థానం
సాక్షి, తిరుమల: శ్రీరామ నవమిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి 10.30గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి ఏడు గం టలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపం లో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమివ్వనున్నారు. రాత్రి పది గంటల తర్వాత ఆలయం లో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. 9వ తేదీన రాత్రి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. -
రాముడు సీతను అనుమానించాడా...
సీతారాముల జంట లోకానికి ఆదర్శప్రాయం వారి జంటే ఎందుకు ఆదర్శప్రాయం అయ్యింది? సీత సంగతి పక్కన పెడితే రాముడు ఎందుకు ఆదర్శం అయ్యాడు శివధనుస్సు విరిచి సీతను వివాహమాడినందుకా పట్టాభిషేకం కాదని ఆమెను అడవుల పాల్చేసినందుకా రావణుడు సీతను అపహరించి లంకలో ఉంచితే... సంవత్సరానికి కాని ఆమెను చెర నుంచి విడిపించనందుకా... తనలో సగభాగమైన సీతను అగ్నిప్రవేశం చేయించినందుకా... ఎందుకు రాముడు ఆదర్శం అయ్యాడు... ఒక్కసారి రామాయణం పరిశీలిద్దాం... గురువులు విశ్వామిత్రునితో మిథిలకు వెళ్లాడు. జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. గురువుల అనుజ్ఞతో శివధనుస్సు విరిచి, వారి ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు. సీతను తన వెంట అయోధ్యకు తీసుకువెళ్లాడు.గురువుల ఎంపిక ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. జానకి తన ప్రాణానికి ప్రాణంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అందుకే జానకిని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. కొద్దిరోజులకే... దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం నిర్ణయించాడు. రాముడు... తెల్లవారితే రాజు కాబోతున్నాడు! ఇంకేముంది! పట్టాభిషేకమే కదా! సీత మహారాణి అయిపోతుంది! ఇంత ఆనందంగా గడుపుతున్న సమయంలో... పినతల్లి కైకమ్మ అసూయకు రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వెళ్లవలసింది తను మాత్రమే కనుక, సీతను తనతో పాటు సీత కూడా కష్టాలు పడకూడదనుకున్నాడు. అందుకే తాను మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరాడు. ఇంతలో సీత వచ్చి, ‘రామా! మా అమ్మ నాకు కొన్ని నీతులు బోధించింది. భర్త సుఖాలలోనే కాదు, కష్టాలలోనూ పాలు పంచుకోవాలని చెప్పింది. అందువల్ల నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను’ అంది. అందుకు రాముడు ‘సీతా! అరణ్యమంటే - చెలికత్తెలు వింజామరలు వీచుతుంటే సుఖంగాపట్టుపరుపుల మీద నిద్రించడం, బంగారుపళ్లెంలో భోజనం చేయడం, దాసదాసీ జనం సేవ చేస్తుంటే జీవనం గడపడం అనుకోకు. అరణ్యమంటే - పులులు, సింహాలు, పాములు... వంటి ఎన్నో విషప్రాణులు ఉంటాయి. వాటి బారి నుంచి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కటిక నేల మీద పరుండాలి. సాత్వికమైన ఆహారం తినాలి. అన్నీ కష్టాలే. అందువల్ల నా అరణ్యవాసం పూర్తయ్యేవరకు నువ్వు నీ తండ్రి దగ్గర ఉండు... అని అనునయించాడు? రాముడి మాటలకు సీతకు కోపం వచ్చింది. ‘మా నాన్న ఎంత తెలివితక్కువవాడయ్యా, ఆడ రూపంలో ఉన్న పురుషుడికిచ్చి నన్ను వివాహం చేశారు’ అని కొంచెం పరుషంగాపలికింది. అసలు రాముడు తన వెంట ఎందుకు రావద్దన్నాడు... సీత తన కష్టాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఇన్నాళ్లూ రాజభోగాలు అనుభవించిన సీత ఈ నాడు ఇన్ని కష్టాలకు ఓర్చుకోగలదో లేదో అర్థం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆమె మాటలకు కోపం రాకపోగా ఎంతో ఆనందం కలిగింది రాముడికి. ఆమె పలికిన ఆ మాటలలో సీతకు రాముడిపై ఉన్న అనురాగం ప్రతిబింబించింది. అందుకే రాముడు సీతను తన వెంట అరణ్యాలకు తీసుకువెళ్లాడు. అంతటి అనురాగం ఉన్న సీత వెంట ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చనుకున్నాడు. అందుకు రాముడు అదర్శం అయ్యాడు. అరణ్యాలలో సీత తనతో ఎన్నో ఇబ్బందులు అనుభవించింది. నేలపై నిరాడంబరంగా శయనించింది. అక్కడ దొరికే కందమూలాలు మాత్రమే స్వీకరించింది. దశరథ మహారాజు ఇంటి కోడలై ఉండీ, ఎటువంటి రాజభోగాలూ అనుభవించకుండా, ఒక సామాన్య పౌరురాలిగా అరణ్యంలో జీవనం సాగించింది. తన కోసం అన్ని ఇబ్బందులు పడిన సీతను రాముడు ఎలా మరువగలడు? ఆమెకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సీతను రాముడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. ఎన్నడూ ఏ కోరికా కోరని సీత, బంగారులేడి కావాలని తన మనోరథాన్ని వ్యక్తపరిచింది. సీత కోరిక కోరినందుకు రాముడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఎంతో సామాన్యంగా జీవించే తన సీత ఇన్నాళ్లకు ఒక్క కోరికైనా కోరిందని సంబరపడ్డాడు. అంతే వెంటనే ఆ లేడి కోసం బయలుదేరాడు. ఇంతోనే జరగకూడనిది జరిగిపోయింది. పది తలల రావణుడు సీతను అపహరించుకుపోయాడు. అంతే... రాముడు పసిపిల్లవాడైపోయాడు. తన సీత లేకుండా తాను జీవించలేనన్నాడు. ఆమె మరణించి ఉంటే తక్షణమే తాను ప్రాణత్యాగం చేస్తానన్నాడు. కైక కోరిక ఆ విధంగా నెరవేరుతుందనుకున్నాడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. రాముడు మహారాజ బిడ్డ. తను కావాలనుకుంటే ఇటువంటి సీతలు వందలమంది తన కనుసన్నలలో మెలగుతారు. మరి సీతే కావాలని ఎందుకు తాపత్రయపడ్డాడు. సీతకు తెలుసు, రాముడితో అరణ్యవాసం చేయవలసి వస్తే, ఎన్నో ఇక్కట్లపాలవ్వాలి. అయినా రాముడి తోడిదే జీవితం అనుకుంది. ఆయనతో కలిసి అడుగులో అడుగు వేసింది. అంతటి సీతను మరచిపోయే బలహీనుడు కాదు రాముడు. సీత కోసం చెట్టూ పుట్టా గాలించాడు. కనిపించిన ప్రతిప్రాణి నీ తన సీత జాడ చెప్పమని అర్థించాడు. సీత కనిపించకపోతే సర్వ ప్రాణికోటినీ తన దగ్గర ఉన్న ఆయుధంతో నాశనం చేసేస్తానన్నాడు. అందుకు రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. మరి ఇంతటి రాముడు సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడనుకోవచ్చు. సీతను అన్వేషించేవరకు రాముడు సామాన్యుడు. కాని సీతను అన్వేషించాక రాముడు రాజు. ఒక రాజు తాను చేసే పనులతో తన ప్రజలకు ఆదర్శప్రాయుడు కావాలే కాని, తానే తప్పు చేసి వారికి తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే తన సీత నిప్పులాంటిదని నిరూపించాలనుకున్నాడు. సీత నిష్కలంక శీలవతి అనీ, రాముడినే త్రికరణశుద్ధిగా ఆరాధిస్తున్నదనీ, దుష్టచిత్తుడయిన రావణుని నిరోధించగల పాతివ్రత్య తేజస్విని అనీ రాముడికి తెలుసు. కాని లోకం ఉన్నదేఅది విశ్వసించాలి. రాముడి అంతరంగం ఎరిగిన సీత తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసింది.దీర్ఘకాలం రావణ అంతఃపురంలో ఉన్న స్త్రీని రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకుండా ఉండటం కోసం రాముడు అంత పరుషంగా ప్రవర్తించాడు. జానకి పాతివ్రత్య జ్వాలారూపిణి అని ప్రపంచానికి చాటాడు. తన ప్రజలకు తానేమిటో చూపాడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. - డా.పురాణపండ వైజయంతి -
తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం
ఐకమత్యానికి ప్రతీక సేవాలాల్ దీక్షలు 41 రోజులపాటు దీక్షలు కొనసాగిస్తున్న బంజారాలు నార్నూర్, న్యూస్లైన్ : ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు పెట్టింది పేరు.. అలాంటి గిరిజన తండాల్లో ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బంజారాల ఆరాధ్యదైవం, కుల గురువు సంత్సేవాలాల్ మహరాజ్ దీక్షలు చేపట్టి బంజారాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభమైన ఈ దీక్షలు.. 41 రోజులకు ముగించనున్నారు. మరికొంత మంది సోమవారం నుంచి 21 రోజులపాటు దీక్షలు స్వీకరించనున్నారు. కాగా.. దీక్షలు శ్రీరామనవమి రోజున విరమించనున్నారు. 700 మందికి పైనే.. బంజారాల ఆరాధ్యాదైవం కుల గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ పేరిట మహాశివరాత్రి సందర్భంగా అదే రోజున ఈ దీక్షలను బంజారాలు చేపట్టారు. ఆదివారం హోలీ సందర్భంగా సేవాలాల్ భక్తులు దీక్ష భూమి వద్ద సంప్రదాయ పాటలు పాడుతూ, మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తండాల్లో ప్రతి ఒక్కరూ ఈ దీక్షలను తీసుకుంటారు. దీంతో తండాల్లో 41 రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మండల కేంద్రంలోని కొత్తపల్లి (హెచ్) గ్రామంలో జాతీయ స్థాయిలో బంజారాల దీక్ష భూమి ఉంది. ఇక్కడికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది బంజారాలు వస్తారు. బంజార కులగురువు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆధ్యాత్మిక మార్గంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని చాటి చెప్పారని పెద్దలు అంటుంటారు. 11 ఏళ్లుగా ఈ దీక్ష భూమి వద్ద బంజారాలు దీక్షలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. మండలంలోని కొత్తపల్లిలో 150 మంది, మల్లంగిలో 80 మంది, గంగాపూర్లో 100 మంది, నాగల్కొండలో 80 మంది, రాజన్గూడలో 20 మంది, మాగంలో 50 మంది, బీర్పూర్లో 40 మంది, తాడిహత్నూర్లో 60 మంది, ఉమ్రిలో 50 మంది తదితర గ్రామాల్లో దీక్షలు తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం.. తరతరాల నుంచి ఈ సంప్రదాయం వస్తోం ది. ఈ తరం వాళ్లు కూడా సంప్రదాయానికి కట్టుబడి సేవాలాల్ దీక్షలను చేపట్టడం ఆనందంగా ఉంది. ప్రతి తండాల్లో సేవాలాల్ దీక్షలను చేపట్టడంతో అంత పవిత్రత నెలకొంది. ఇది ఎప్పటికీ కొనసాగించాలి. - జాదవ్ రవితాబాయి ఇంటికొక్కరు చొప్పున దీక్షలో.. 41 రోజులపాటు తం డాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఇంటికొక్క రు చొప్పున సేవాలాల్ దీక్షలను చేపడుతారు. దీక్షలు చేపట్టం వలన అంతా మంచి జరుగుతుందని నమ్మకం. పురుషులతోపాటు మహిళలు సైతం ఈ దీక్షలను చేపడుతారు. - యశ్వంత్రావ్ -
అతీత శక్తి...
విజ్ఞానశాస్త్రానికి అతీతంగా ఒక శక్తి ఉన్నదని భక్త జనం విశ్వసిస్తారు. చైతన్యయుత ప్రపం చాన్ని నడిపించే, నియంత్రించే ఏదో ఒక శక్తి ఉన్నదని వారి భావన. దీన్ని కాదనేవారూ, పూర్వపక్షం చేయడానికి ప్రయత్నించేవారూ ఎప్పుడూ ఉంటారు. స్వీయానుభవాలద్వారా మాత్రమే అలాంటి శక్తి ఉన్నదన్న విశ్వాసం ఎవరికైనా కలుగుతుంది. వివరించి చెబితే అర్థమ య్యే విషయం కాదది. చైత్రమాసం, శుక్లపక్ష ఏకాదశి, శ్రీరామనవమి మరునాడు లాంఛనప్రాయంగా చిలుకూరు బ్రహ్మోత్స వాలు ప్రారంభమయ్యేరోజు. కొంతకాలం క్రితం అలాంటి ఒకరోజున ధ్వజారోహణకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ధ్వజంపై ధ్వజ చిత్రాన్ని చిత్రించాక ధ్వజస్తంభం కిందనున్న గరుత్మంతుని చిన్న విగ్రహానికి అభిషేకం పూర్తయింది. చక్కరపొం గలి నైవేద్యం కూడా ఇచ్చారు. దీనికి రెండు పేర్లున్నాయి. గరుడపిండం లేక గరుత్మం తుని నైవేద్యం అని పిలుస్తారు. ‘యా స్త్రీ పిండం జ్ఞాతీ పుత్రవీ భవేత్’ ఏ స్త్రీ ఈ గరుడపిండాన్ని ప్రసాదంగా భావించి తింటుందో, ఆ స్త్రీ పుత్రవతి అవుతుం దని ఆగమశ్లోకం చెబుతోంది. ఈ శ్లోకాన్ని, శ్లోకార్థాన్ని చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులందరికీ చెప్పా ము. ప్రతి ఏడాదీ ఇలా ప్రసాదం ఇవ్వడం, దానివల్ల తమకు ఫలితం కలిగిందని ఎందరో మహిళలు సంతో షంతో చెప్పడం రివాజు. ఎందరో తల్లులు ఆలయానికి పాపనో, బాబునో ఎత్తుకుని వచ్చి గరుడ ప్రసాద ఫలితమే తమ బిడ్డ అని చెబుతుంటారు. గరుత్మంతుడు సర్పదోషాన్ని హరిస్తాడని ప్రతీతి. రెండు సంవత్సరాలక్రితం ఒక యువతి చిలు కూరు ఆలయానికి వచ్చింది. తనకు పిల్లలు లేరన్న బెంగ ఆమెను వేధించేది. గర్భసంచి ఉండవలసిన చోటుకన్నా కాస్త పక్కన ఉన్న కారణంగా పిల్లలు పుట్ట రని వైద్యులు తేల్చిచెప్పారట. తన బాధను ఆమె నాతో చెప్పింది. అనునయించాను. వైద్యశాస్త్ర జ్ఞానం అపా రంగా విస్తరించిన విషయం నిజమే అయినా అన్నిటికీ అతీతుడైన ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలుంటే ఎం తటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందని చెప్పాను. ఆమెకు కొంచెం సాంత్వన లభించినట్టే ఉంది. కొన్నా ళ్ల తర్వాత ఆమె మళ్లీ వచ్చింది. ఈసారి ఆమెకు కొత్త సమస్య వచ్చింది. గర్భధారణ జరిగిందట. కానీ, గర్భ సంచి అలాంటి స్థితిలో ఉన్నందువల్ల అబార్షన్ చేసు కుంటేనే మంచిదని వైద్యులు సూచించారట. ఎం దుకైనా మంచిదని మరో వైద్యుని సంప్రదించమని చెప్పాను. మరో వైద్యురాలు ఆ యువతిని పరీక్షించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆమెను ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తూ తన కనుసన్నల్లో పెట్టుకుని కాపాడారు. ఆ పర్యవేక్షణ ఫలితంగా నెలలు నిండాక ఆ యువతి పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. బాబును ఆలయానికి తీసుకుని వచ్చింది. భక్తులంతా ఆమె సంతోషాన్ని పంచుకున్నా రు. మాతృత్వం స్త్రీకి భగవంతుడిచ్చిన గొప్పవరం. ఆ వరం లభించినప్పుడు కలిగే ఆనందం మాటలకంద నిది. తన అనుభవాన్ని మైకులో చెప్పమని ఆ యువతి కోరింది. ఈసారి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ప్రారం భం కానున్నాయి. పదో తేదీనాడు ధ్వజారోహణ. ప్రతి ఏడాదిలాగే ఈసారీ భక్తులందరికీ గరుడ ప్రసాదం ఇస్తాము. ఎందరెందరో భక్తులు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం, తమ అనుభవాలను మాతో పంచుకోవ డం ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. మొదటే చెప్పాను. విజ్ఞానశాస్త్రానికి అతీతమైన శక్తి ఉంది. దాని మహిమలు అనుభవించినవారికే తెలుస్తాయి. - సౌందర్రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు