భద్రాచలం: భద్రాచలం శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో శుక్రవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శ్రీ రామనవమి వేడుకలకు విజయవాడకు చెందిన యువకులు వచ్చారు. ఉదయం స్నానానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలిసింది. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు విజయవాడలోని సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు రాము(18), గుంజా శివయ్య(18)గా గుర్తించారు.
గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
Published Fri, Apr 15 2016 1:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM
Advertisement
Advertisement