అవతరణ వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరం | Telangana ministers boycott AndhraPradesh formation day | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరం

Nov 1 2013 9:27 AM | Updated on Jul 29 2019 5:31 PM

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారు. దాంతో తెలంగాణ జిల్లాల్లో మంత్రులకు బదులు కలెక్టర్లే జెండా ఆవిష్కరించనున్నారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారు. దాంతో తెలంగాణ జిల్లాల్లో మంత్రులకు బదులు కలెక్టర్లే జెండా ఆవిష్కరించనున్నారు.  ఈ మేరకు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.  మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా నవంబర్ 1న తెలంగాణవ్యాప్తంగా విద్రోహదినాన్ని పాటించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది.

తెలంగాణలోని గ్రామస్థాయి వరకు నిరసనర్యాలీలు నిర్వహించాలని సూచించింది. ఇక   ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement