హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. అనంతపురంలో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండగా, హైదరాబాద్లో 39.1 డిగ్రీలు ఉంది.
రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాలలో ఉష్ణోగ్రత ఈ దిగువ తెలిపిన విధంగా ఉంది.
కాకినాడ - 36.5 డిగ్రీల సెంటీగ్రేడ్
కర్నూలు - 41.7
నెల్లూరు - 40.6
నిజామాబాద్ - 40.1
రామగుండం - 41
తిరుపతి - 41.8
విజయవాడ - 39.8
విశాఖపట్నం - 32.4