![ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా](/styles/webp/s3/article_images/2017/09/3/51413409926_625x300.jpg.webp?itok=djHSEslg)
ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని రావులపాలెంలో ఓ ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేశామని ఓ అధికారి తెలిపారు. రూ. 30 లక్షల విలువైన విత్తనాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.