సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన భాగస్వామ్య పక్షాలన్నిటితో మాట్లాడేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తామే కోరామని, దానికి విధిగా హాజరవుతామని సీపీఐ స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాము ఇప్పటికే కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు నివేదిక ఇచ్చామన్నారు. జీవోఎంకు నివేదించాల్సిన సూచనలు, సలహాలపై కూడా నివేదికను తయారుచేశామని, పార్టీ రాష్ట్ర కౌన్సిల్లో చర్చించి మంగళవారం సమర్పిస్తామని చెప్పారు. కాగా, సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నగర శివార్లలోని యాప్రాల్లోని ఒక ప్రైవేటు క్లబ్లో జరుగనున్నాయి.
Breadcrumb
అఖిలపక్షంలో వైఖరి చెబుతాం: నారాయణ
Published Tue, Nov 5 2013 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
తెలంగాణ ఇచ్చేది ఇలాగా?
* అఖిలపక్ష భేటీలో కేంద్రంపై విపక్షాల ధ్వజం * టీ బిల్లు మీద కాంగ్రెస్ తీరుపై బీజేపీ నిరసనగళం * అదే బాటలో లెఫ్ట్, తృణమూల్ సహా విపక్షాలు * విభజనపై కాంగ్రెస్లోనే ఏకాభిప్రాయం ...
-
అఖిలపక్షంలో మేం పాల్గొనలేదుగా..! : చంద్రబాబు నాయుడు
అందరితో చర్చించామని ఎలా చెబుతారు? షిండేకు బాబు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: విభజన అంశంపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ హాజరు కాలేదని, అలాంటపుడు అందరితో చ...
-
..ఇంకా ఉంది
* అసంపూర్తిగా ముగిసిన జీవోఎం భేటీ * నేటి రాత్రి 8 గంటలకు మళ్లీ మంత్రుల బృందం సమావేశం * రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదంటూ లీకులు * పరిణామాలను అంచనా వేసేందుకే?.. రేపు కే...
-
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో చిన్న చిన్న సమస్యలున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. విభజన సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. ఈ శీతాకాల సమ...
-
జీవోఎం భేటీలు ఇంకా ఉన్నాయ్: షిండే
రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశాలు ఇంకా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే చెప్పారు. హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జీవోఎం భేటీ ముగ...
Advertisement