జీపు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ చనిపోయింది. గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరు : జీపు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ చనిపోయింది. గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం మదాల గ్రామానికి చెందిన యార్లగడ్డ పుల్లమ్మ(50) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన జీపు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.