సుప్రీంలో విచారణకు రాని జెడ్పీటీసీ ఎన్నికల కేసు | ZPTC Election case did not come to hear the petition in Supreme court | Sakshi
Sakshi News home page

సుప్రీంలో విచారణకు రాని జెడ్పీటీసీ ఎన్నికల కేసు

Published Tue, Mar 11 2014 1:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

ZPTC Election case did not come to hear the petition in Supreme court

  •  నోటిఫికేషన్ జారీచేశామని విన్నవించిన రాష్ట్ర ఎన్నికల సంఘం  అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం
  •  సాక్షి, న్యూఢిల్లీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై సోమవారానికల్లా సానుకూలంగా స్పందించాలని, తీసుకున్న చర్యలను సోమవారం కోర్టుకు వివరించాలని గత శుక్రవారం సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు సోమవారం సుప్రీంకోర్టులో 86వ నంబరు అంశంగా జాబితాలో ఉంది.
     
    అయితే 83వ అంశం వరకే విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు మిగిలిన కేసులను బుధవారం లేదా గురువారం విచారిస్తామని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది తాము ఎన్నికల షెడ్యూలు విడుదల చేశామని వివరించబోయారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ షెడ్యూలు విడుదల చేసినట్టుగా అఫిడవిట్ ఇవ్వాలని సూచించారు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement