
ప్రతీకాత్మక చిత్రం
మనీలా: దక్షిణ ఫిలిఫ్పైన్స్ ఒక్సిడెంటల్ మిన్డోరో ప్రావిన్స్లోని సబ్లాయన్ పట్టణ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిందిని విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను దగ్గరలోని మూడు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.