
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో దారుణం జరిగింది. రాష్ట్రంలో కలకలం రేపిన దాచేపల్లి ఘటన మరవక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని దేవర పల్లిలో 55ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. గ్రామంలో గురుస్వామిగా చెలామణి అయ్యే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment