నీటితొట్టెలో పడి చిన్నారి మృతి | Boy Died In Water Tank Chittoor | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

Published Thu, Aug 9 2018 10:54 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Boy Died In Water Tank Chittoor - Sakshi

యుగంధర్‌(ఫైల్‌) బాలుడు పడి మృతి చెందిన నీటి తొట్టె

రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యంకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు యుగంధర్‌(4) నీటితొట్టెలో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. యుగంధర్‌ సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు.

బాలుని కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గాజులమండ్యం పోలీసులను ఆశ్రయించారు. అయితే బుధవారం నీటితొట్టెలో నుంచి దుర్వాసన రావడంతో.. అనుమానం వచ్చి చూశారు. బాలుడు నీటితొట్టెలో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ముద్దులొలికే చిన్నారి విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement