కళ్లు తెరిచి చూసేసరికి షాక్‌ | Road Accident In Kerala 20 Died 31 Injured | Sakshi

ఎడమవైపు కుర్చోవడం వల్లే బతికిపోయా..

Feb 20 2020 3:00 PM | Updated on Feb 20 2020 7:19 PM

Road Accident In Kerala 20 Died 31 Injured  - Sakshi

కేరళ బస్సు ప్రమాద ప్రత్యక్ష సాక్షి

తిరువనంతపురం: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ కంటైనర్‌ ఢీ కొట్టడంతో 20మంది అక్కడిక్కడే మృతిచెందగా, 31 మంది గాయపడిన ఘటన గురువారం తెల్లవారు జామున తిర్పూర్‌ జిల్లా వద్ద చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మృతుల్లో 5 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బెంగుళూరు నుంచి కేరళకు వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును తిర్పూర్‌ జిల్లా వద్ద అవినాషి కోయంబత్తుర్‌ నుంచి సాలెమ్‌ వెళ్తున్న లారీ కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంమైంది.

ఈ ఘటనపై ఎస్పీ శివ విక్రమ్‌ మాట్లాడుతూ.. అతి వేగం, లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్‌ ఓవర్‌లోడ్‌తో రాంగ్‌రూట్‌లో వస్తుండగా.. తిర్పూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించినప్పడికి అతివేగం కారణంగా లారీని అదుపుచేయలేక పోయినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఎస్పీ శివ విక్రమ్‌ పేర్కొన్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు

ఇక ఈ బస్సులో అధికమంది కేరళలోని పాలక్కడ్‌, త్రిస్పూర్‌, ఎర్నాకుళం పట్టణాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన కరిష్మా అనే మహిళ మాట్లాడుతూ.. బస్స ప్రమాదం తెల్లవారు జామున 3:15 గంటల మధ్య జరిగిందని, ఆ సమయంలో తాను నిద్రిస్తున్నట్లు పేర్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి చూట్టు అంతా గందరగోళంగా ఉందని అందరూ హడావుడిగా పరిగెత్తడం, గాయపడ్డవారిని ఆసుపత్రి తరలిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇప్పటికి ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నానని అయితే బస్సులో ఎడమవైపు కుర్చోవడం వల్లే తాను బ్రతికిపోయానని పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement