raod accident
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం
-
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. యువకుడి విషాదం!
మహబూబ్నగర్: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా శివారులోని హైదరాబాద్ రోడ్డుపై కారు ఢీకొని శంకర్(శివ)(18) గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం, అప్పక్పల్లికి చెందిన శ్రీనివాసులు, అంజిలమ్మ కుమారుడు శంకర్ హైదరాబాద్ రోడ్డు వెంట ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందగా.. కారు నిలుపకుండా పారిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువకుడు నారాయణపేటలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోకరి తెలియజేశారు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్థి విషాదం! -
మానవత్వమే అతడి పాలిట మృత్యువై..
మహబూబ్నగర్: మానవత్వమే అతడి పాలిట మృత్యువైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం ఇద్దరి జీవితాలను ఛిద్రం చేయడమే గాక.. వారి కుటుంబసభ్యుల ఆశలను సమాధి చేసింది. ఈ విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి నర్సింహులు, ఎస్ఐ రమేష్ వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవాజ్ (25) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 11 నెలల కిందట వివాహం కాగా.. 10 రోజుల క్రితం కూతురు జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బైక్పై తన అత్తగారి ఊరైన జడ్చర్ల పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరగా.. మండలంలోని మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ హెల్పర్ అశోక్ (30) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నవాజ్ను గమనించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా.. కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నవాజ్తో పాటు అశోక్కు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. అశోక్ది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. పాల వ్యాన్ డ్రైవర్ నర్సింహులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను కల్వకుర్తి మార్చురీకి తరలించారు. కాగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఇరువురి కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్ డ్రైవర్ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కనిమెట్టలో విషాదఛాయలు.. కొత్తకోట మండలంలోని కనిమెట్టకు చెందిన చీర్ల నాగమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు అశోక్ కొంత కాలంగా గ్రామ సమీపంలోని ఓ డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీకి చెందిన లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అశోక్ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి కూడా చదవండి: బైక్ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుల దుర్మరణం! -
పాప పుట్టిన 13 రోజులకే.. తండ్రీకొడుకుల విషాదం!
సాక్షి, కరీంనగర్: ఆ కుటుంబంలో పాప జన్మించింది.. అందరూ ఆనందంగా ఉన్నారు.. వైద్యులు డిశ్చార్జి చేయడంతో ఇంటి పెద్ద తల్లీబిడ్డను ఇంటికి పంపించాడు.. తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా ఇసుక లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. వీణవంక మండలంలోని మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి జ్యోతి డెలివరీ కోసం కరీంనగర్లోని ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 14న పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే, జ్యోతికి ఇన్ఫెక్షన్ కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో జ్యోతి భర్త మొగిలి(45) తన భార్యాబిడ్డను ఆటోలో ఇంటికి పంపించాడు. కుమారుడు శివసాయి(12)తో కలిసి కూరగాయలు, పండ్లు, ఇంటి సామగ్రి తీసుకొని, తన సొంత ఆటోలో మామిడాలపల్లికి బయలుదేరాడు. మానకొండూర్ మండలంలోని రంగపేట వద్ద ఇసుక లారీ వేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మొగిలి, శివసాయి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పైనుంచి వెళ్లడంతో శివసాయి మృతదేహం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను చూసి, కన్నీరుమున్నీరుగా విలపించారు. న్యాయం చేయాలని ఆందోళన.. అనంతరం బంధువులు కరీంనగర్–జమ్మికుంట రహదారిపై ఆందోళన చేపట్టారు. మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు రాజ్కుమార్, ఇంద్రసేనారెడ్డిలు విరమించాలని కోరగా తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తీసేది లేదని తేల్చిచెప్పారు. ఈ సంఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఓవైపు పాప జన్మించడం, మరోవైపు ఇద్దరి ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ పరిస్థితిని చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల పరామర్శ.. ప్రమాద విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఓదార్చారు. -
ఉపాధ్యాయురాలు విధులు ముగించుకుని ఆటోలో వెళ్తుండగా ఘటన.. తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్నగర్: కోయిలకొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి (40), జాయింట్ మెర్సి, పద్మప్రియ, లక్ష్మీమానస, సయబాసుల్తానా విధులు ముగించుకుని ఆటోలో మహబూబ్నగర్కు వెళ్తుండగా, పారుపల్లి స్టేజీ వద్ద పంది అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పద్మావతి మృతి చెందగా, నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవి చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్ఫోన్స్ ఆధారంగా.. -
విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!
మెదక్: నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాలు. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పెంటపర్తి బాపురెడ్డి కుమారుని వివాహం ఇటీవలే జరిగింది. ఈమేరకు ఆదివారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బాపురెడ్డి తన బావ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేటకు చెందిన సిరికొండ లింగారెడ్డి, తోడల్లుడు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్కు చెందిన ముత్యాల వెంకట్రాంరెడ్డితో కలిసి కారులో జంగరాయి నుంచి రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో జప్తి శివునూర్వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి (55) అక్కడిక్కడే మృతిచెందగా, లింగారెడ్డి (48) రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన బాపురెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ప్రమాదాలకు గురైన వాహానాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియక్ చేయించారు. ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ప్రమాదంలో మృతిచెందిన లింగారెడ్డి బీఆర్ఎస్ అంబర్పేట గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. ఏపీ యువతి మృతి
రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీసులు.. ఎన్ని నిబంధనలు విధించినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, అధిక వేగం కారణంగా ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలి అయ్యారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నైలోని ఐటీ కారిడార్లో రోడ్డు దాటుతుండగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగినులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతిచెందారు. కాగా, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీస్ ముగిసిన తర్వాత.. వారు ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఓ యువతి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇక, మృతి చెందిన యువతులు.. తిరుపతికి చెందిన ఎస్.లావణ్య (24), కేరళలోని పాలక్కడ్కు చెందిన ఆర్. శ్రీలక్ష్మీ (23)గా గుర్తించారు. వీరిద్దరూ హెచ్సీఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్లో ఎనలిస్ట్లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కి.మీల వేగంతో ఉందని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 2 Women Techies In #Chennai Run Over By Speeding Driver https://t.co/xBUo2vlpiD pic.twitter.com/5kcZgaSEXE — NDTV (@ndtv) September 15, 2022 -
ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్
సాక్షి,న్యూఢిల్లీ: బలవన్మరణాల సంఖ్యపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్లు మహారాష్ట్ర తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25వేలకుపైగా సూసైడ్ చేసుకున్నారు. 1.73 లక్షల యాక్సిడెంట్ మరణాలు గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలిపింది. యూపీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. 2020తో పోలిస్తే 2021లో మరణాలు 18.8 శాతం పెరగడం ఆందోళనకరం. చదవండి: గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా -
పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి👇 జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా? -
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్కు తరలింపు
-
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
యానాం బాలయోగి బ్రిడ్జ్పై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలంలో యానం బాలయోగి బ్రిడ్జ్పై ఓ బైక్ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిచారు. -
విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి చిన్నారులు మృతి
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలివలస వద్ద ఓ బైకును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
జడ్చర్ల టౌన్: మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కాల్సిన ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఈ విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబ్నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్యశామ్యూల్ (34)కు వన పర్తి పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్నగర్ కల్వరీచర్చిలో వి వాహం కావాల్సి ఉంది. మధ్యాహ్నం అక్కడి సుదర్శన్ ఫంక్షన్హాల్లో విందుకు సైతం ఏ ర్పాట్లు చేశారు. అందులోనే వధువు తరఫు కు టుంబ సభ్యులు, బంధువులు విడిది చేశారు. పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు మరణ వార్తతో ఇంటి వద్ద విషాదంలో బంధువులు 15 నిమిషాల్లో వస్తానని చెప్పి.. గురువారం ఉదయం అందరూ పెళ్లికి సిద్ధమవుతుండగా 15 నిమిషాల్లో వస్తానంటూ వరుడు కారులో జడ్చర్లకు బయలుదేరాడు. ఏడు గంటలకు నక్కలబండ తండా సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జడ్చర్ల సీఐ రమేష్బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన దండలను.. పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియ డంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి కో సం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహా నికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు
Gachibowli Road Accident: 2 Junior Artists Instagram Photos Viral: గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి చెందారు.హెచ్సీయూ రోడ్లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఎన్. మానస(23), ఎం. మానస(21)లు స్పాట్లోనే మరణించారు. వీరితో పాటు కారు నడిపిన అబ్ధుల్ సైతం అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో కారు రెండు భాగాలుగా తునాతునకలైంది. దీన్ని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎయిర్బ్యాగ్స్ తెరుచుకున్నా ప్రాణాలు నిలవలేదు. మృతుల్లో ఎన్. మానస స్వస్థలం (23) కర్ణాటక కాగా, ఎం. మానస(21)ది మహబూబ్నగర్ అని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్. మానసకు చెందిన ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి -
పీఏం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద రోడ్డుపై ఇద్దరి మృతదేహాలు
-
టిప్పర్ బోల్తా.. 13 మంది కూలీల దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుల్ధానాలోని సమృద్ది ఎక్స్ప్రెస్ హైవేపై టిప్పర్ బోల్తా పడిన ఘటనలో 13 మంది కూలీలు మృత్యవాత పడ్డారు. ఐరన్ లోడుతో వెళ్తున్న టిప్పర్పై కూలీలు కూర్చొన్నారు. టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడడంతో టిప్పర్పైన కూర్చొన్న కూలీలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి:వైఎస్సార్సీపీ కౌన్సిలర్ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం -
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రేన్ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు అదుపుతప్సి గుడిసెలోకి దూసుకెళ్లిట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో గుడిసెలో పది మంది నిద్రిస్తున్నారని, వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఎనిమిది మంది చనిపోయారని, మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారని అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్రాయ్ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పెర్కోన్నారు. -
అన్నదమ్ముల బైక్లు ఢీ: తమ్ముడి మృతి
సాక్షి, వైఎస్సార్ (కలసపాడు): విధి విచిత్రమంటే ఇదే. అనుకోకుండా సొంత అన్నదమ్ముల బైక్లు ఢీ కొనగా తమ్ముడు దుర్మరణం పాలైన ఘటన కలసపాడు మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. కలసపాడులోని మస్తాన్, షేక్ పీరాంబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు షేక్ షఫీ (27) విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్గా పని చేస్తున్నాడు. సిద్దుమూర్తిపల్లె సమీపంలో ఉన్న పాలకేంద్రంలో ఇతడి అన్న షేక్ షరీఫ్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇతను కలసపాడులోని ఇంటికి బయలుదేరాడు. షఫీ వ్యక్తిగత పని నిమిత్తం చెన్నారెడ్డిపల్లెకు బయలుదేరాడు. ఎదురెదురుగా వస్తున్న వీరి బైక్లు పోరుమామిళ్ల రోడ్డులోని కోతి సమాధి సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. ప్రమాదంలో షఫీ అక్కడిక్కడే మృతి చెందగా, షరీఫ్కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడికి ఐదేళ్ల కిందట కలసపాడుకు చెందిన షేక్ షాహిన్తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు. ఒక ఏడాది పాప ఉన్నారు. బక్రిద్ పండుగ రోజు చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో కుటుంబసభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఎస్ఐ రామాంజనేయులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మైలార్దేవ్పల్లిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
సాక్షి, రాజేంద్రనగర్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ వెనుక నుంచి ముగ్గరు వ్యక్తిలను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
కృష్ణాలో ట్రాక్టర్ ట్రక్ బోల్తా: నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విసన్నపేట మండలం ముతారాశి పాలెం చెందిన ఓ ట్రాక్టర్ ట్రక్ శనివారం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తలించారు. 14 మంది కూలీలకు గాయాలు కాగా, వారిని విస్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రమాద సమయంలో ఆ ట్రక్లో 18 మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా మామిడి కోతకు ట్రాక్టర్ ట్రక్లో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: అమలాపురంలో మహిళ దారుణ హత్య -
ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు సమాచారం. జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయిలతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తా పడింది. దాంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో మొత్తం 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కు బొప్పాయిల లోడుతో ధులే నుంచి చోప్డా మీదుగా రావేర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా రావేర్కు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని జల్గావ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కావాలనే యాక్సిడెంట్ చేశాడు.. బొటన వేలిని పరీక్షగా చూసి షాక్! -
విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే
సాక్షి, మంచిర్యాల : పెళ్లి సమయంలో చేసిన బాసలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన ఆ దంపతులు అంతలోనే మృత్యు ఒడిలోకి చేరారు. పెళ్లయిన ఆర్నెళ్లకే ఆ నవదంపతులను లారీ మృత్యురూపంలో కబళించింది. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ వారి ఆశలను చిదిమేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామానికి చెందిన రుద్ర రాజయ్య–పద్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు స్వరాజ్(30). ఇతడికి పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల శంకరయ్య కూతురు కృష్ణవేణి(23)తో గతేడాది జూన్ 11న వివాహమైంది. భార్యాభర్తలు గద్దెరాగడిలోనే ఉంటున్నారు. చదవండి :అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి.. ఈ క్రమంలో కృష్ణవేణి జిల్లాకేంద్రంలో కుట్టు నేర్చుకుంటోంది. స్వరాజ్ ఆమెను ప్రతిరోజూ కుట్టు శిక్షణ కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి.. అనంతరం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం దంపతులిద్దరూ బైక్పై మంచిర్యాలకు బయల్దేరారు. ఏసీసీ అంబేద్కర్ కాలనీ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ.. వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవదంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై మారుతీ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: నిద్రిస్తున్నవారి పైకి దూసుకెళ్లిన ట్రక్కు..13 మంది మృతి మరో 15 రోజుల్లో ఉద్యోగం.. రాజయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. స్వరాజ్ ఒక్కడే కుమారుడు. స్వరాజ్ కొంతకాలం హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేశాడు. రాజయ్య సింగరేణి ఉద్యోగి కావడం.. మెడికల్గా అన్ఫిట్ కావడంతో తన ఉద్యోగాన్ని కుమారుడికి పెట్టించాడు. అప్పటినుంచి స్వరాజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ఇంటివద్దనే ఉంటున్నాడు. నెలరోజుల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. మరో 15రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు భద్రత వారోత్సవాల రోజే.. రోడ్డు భధ్రత వారోత్సవాల రోజే ఈ ప్రమాదం జరగడం కలకలం సృష్టించింది. స్వరాజ్ హెల్మెట్ ధరించినా ప్రమాద సమయంలో బెల్ట్ ఊడిపోయిందని, దీంతో హెల్మెట్ ఎగిరిపోయి లారీ దంపతుల తలలపై నుంచి వెళ్లడంతోనే మృత్యుఒడికి చేరారని స్థానికుల ద్వారా తెల్సింది. స్వరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందువెళ్లుతున్న లారీని వెనక నుంచి ఢీకొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. గాయపడినవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేములువాడ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లాలోని మధిరకు చెందిన మాచర్ల శ్యామ్, శారద, శ్యామలగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు ఉన్నారు. ఈ కారులో డ్రైవర్తో పాటు 9 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కావాలనే యాక్సిడెంట్ చేశాడు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వరకు ప్రస్థానం కొనసాగించిన ఓ విద్యా కుసుమం నేల రాలిపోయింది. ఎదురుగా వచ్చిన బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదం ఆమె ప్రాణాలను బలిగొంది. ఉన్నత విద్యనభ్యసించి తమకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తుందనుకున్న కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. వివరాలు.. బులంద్షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్లో గల బాబ్సన్ కాలేజ్లో స్కాలర్షిప్నకు అర్హత సాధించింది. (యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత) ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్లో భారత్కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్తో కలిసి బైక్పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్ను వెంబండించాడు. వివిధ రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!) సదరు బైకర్ కావాలనే తమ కూతురిని వెంబడించి యాక్సిడెంట్ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జామ్ వల్ల ముందున్న బైకర్ సడన్గా బ్రేక్ వేయడంతోనే రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు బులంద్ షహర్ పోలీసులు తెలిపారు. సుదీక్షను ఎవరూ వేధించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలిలో వ్యక్తిని విచారించామని.. అతడు వేధింపుల విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే సుదీక్ష కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనే అని ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. थाना औरंगाबाद क्षेत्रार्न्तगत एक छात्रा की सड़क दुर्घटना में मृत्यु होने की दुखद घटना के संबंध में अपर पुलिस अधीक्षक @bulandshahrpol महोदय द्वारा दी गई #अपडेट बाइट @Uppolice @dgpup @CMOfficeUP @UPGovt @PrashantK_IPS90 @adgzonemeerut @igrangemeerut pic.twitter.com/xizGFZxmDa — Bulandshahr Police (@bulandshahrpol) August 11, 2020 -
ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని విద్యానగర్- నల్లకుంట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్(23) అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఎండ్రిక్ విద్యానగర్ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళ సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్పై అధిక వేగంతో వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అధిక వేగంతో డివైడర్ను డీకొని స్తంభానికి బలంగా డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. -
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విషాదం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి, చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన తండ్రి కిరణ్కుమార్, 11నెలల చిన్న కుమారిడిని ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లి మండలం పెనుమాక నుంచి నాగాయలంక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిని పెనుమాకకు చెందిన విస్సంశెట్టి దుర్గా మహాలక్ష్మి(32), 6ఏళ్ల పెద్ద కుమారుడు శ్రీమహత్గా పోలీసులు గుర్తించారు. -
కళ్లు తెరిచి చూసేసరికి షాక్
తిరువనంతపురం: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ కంటైనర్ ఢీ కొట్టడంతో 20మంది అక్కడిక్కడే మృతిచెందగా, 31 మంది గాయపడిన ఘటన గురువారం తెల్లవారు జామున తిర్పూర్ జిల్లా వద్ద చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మృతుల్లో 5 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బెంగుళూరు నుంచి కేరళకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును తిర్పూర్ జిల్లా వద్ద అవినాషి కోయంబత్తుర్ నుంచి సాలెమ్ వెళ్తున్న లారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంమైంది. ఈ ఘటనపై ఎస్పీ శివ విక్రమ్ మాట్లాడుతూ.. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ ఓవర్లోడ్తో రాంగ్రూట్లో వస్తుండగా.. తిర్పూర్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించినప్పడికి అతివేగం కారణంగా లారీని అదుపుచేయలేక పోయినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఎస్పీ శివ విక్రమ్ పేర్కొన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు ఇక ఈ బస్సులో అధికమంది కేరళలోని పాలక్కడ్, త్రిస్పూర్, ఎర్నాకుళం పట్టణాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన కరిష్మా అనే మహిళ మాట్లాడుతూ.. బస్స ప్రమాదం తెల్లవారు జామున 3:15 గంటల మధ్య జరిగిందని, ఆ సమయంలో తాను నిద్రిస్తున్నట్లు పేర్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి చూట్టు అంతా గందరగోళంగా ఉందని అందరూ హడావుడిగా పరిగెత్తడం, గాయపడ్డవారిని ఆసుపత్రి తరలిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. ఇప్పటికి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నానని అయితే బస్సులో ఎడమవైపు కుర్చోవడం వల్లే తాను బ్రతికిపోయానని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘోరం: భర్త కళ్లెదుటే...
సాక్షి, యడ్లపాడు (చిలకలూరిపేట): యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం(పుట్టకోట) గ్రామానికి చెందిన కాకాని బ్రహ్మయ్య, రమాదేవి (30) దంపతులు. వారికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి చాలాకాలం సంతానం కలుగలేదు. ఐదేళ్ల క్రితం కుమారుడు బాలమణికంఠ, 11 నెలల క్రితం కుమార్తె యశస్విని జన్మించారు. పిల్లలిద్దరినీ తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీన రమాదేవి పుట్టిళ్లయిన కొదమగుంట్లలో వెంకటేశ్వరస్వామి గుడి ప్రతిష్టకు భార్య, పిల్లలను బ్రహ్మయ్య తన బైక్పై ముందురోజు తీసుకెళ్లి దిగబెట్టి వచ్చాడు. పొలం పనులు చూసుకొని శనివారం తిరిగి బైక్పై అత్తగారింటికి వెళ్లి, రెండు రోజులు అక్కడే ఉండి సోమవారం ఉదయం స్వగ్రామానికి బైక్పై తిరుగుప్రయాణం కట్టారు. (గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం) సాతులూరు వద్దకు చేరుకోగానే వర్షం మొదలవడంతో భార్యా పిల్లలు తడిచి పోతారని భావించిన బ్రహ్మయ్య సాతులూరు జంక్షన్లో ముగ్గురిని ప్యాసింజెర్ ఆటో ఎక్కించి, ఆ వెనుకే తనూ బయలుదేరాడు. ఒడిలో కుమార్తెను, పక్కన కుమారుడిని కూర్చోబెట్టి ఆటో వెనుకే వస్తున్న భర్తను రమాదేవి గమనిస్తూనే ఉంది. ఆటో బయలుదేరి 15 నిమిషాలు గడిచాయో లేదో ట్రాలీ ఆటో ఎదురుగా వచ్చి ఢీకొంది. అంతే బ్రహ్మయ్యకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లయింది. ఒక్క ఉదుటున ఆటోవద్దకు చేరుకున్నాడు. ఒకవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన భార్య.. తల్లి పొత్తిళ్లలోనే ప్రాణం వదిలిన కుమార్తె.. గాయాలను తట్టుకోలేక నాన్నా అంటూ తల్లడిల్లుతున్న కుమారుడు.. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో తెలియక.. మొద్దుబారిన మెదడుతో గుండెలు బాదుకుంటూ భోరుమన్నాడు. బ్రహ్మయ్య తండ్రి లక్ష్మీ నారాయణకు రెండేళ్ల క్రిందట పక్షవాతం బారిన పడ్డాడు. ఏడాది కిందట మామయ్య వెంకటరామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. భార్యాబిడ్డలు దూరం కావడంతో బ్రహ్మయ్యను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు. రమాదేవి, బాలమణికంఠ, యశస్విని మృతితో కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.సాయంత్రం 5 గంటల సమయంలో నరసరావుపేట ఆసుపత్రి నుంచి రమాదేవి, చిన్నారి యశస్విని మృతదేహాలను కొత్తపాలెం గ్రామానికి తీసుకువచ్చారు. 7 గంటలకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలమణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి గ్రామానికి తరలించారు. మృతదేహాలను చూసిన కుటుంబసభ్యుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. ఎమ్మెల్యే రజని పరామర్శ నాదెండ్ల (చిలకలూరిపేట): రేపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సాతులూరుకు చెందిన అశోక్ కుమార్, చందవరం వాసి ఆవుల యువరాజ్ మృతదేహాలను ఎమ్మెల్యే విడదల రజని సోమవారం రాత్రి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు పరామర్శించారు. కలచివేసింది : ఎమ్మెల్యే శ్రీదేవి పేరేచర్ల (తాడికొండ): రేపూడి రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రేçపూడి రోడ్డు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు చిన్నారులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!
సాక్షి, ప్రకాశం/కరీంనగర్ : జిల్లాలోని గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరురుగు దుర్మరణం పాలయ్యారు. వీరంతా కరీంనగర్ జిల్లా వాసులుగా తెలిసింది. దీంతో వారి స్వగ్రామమైన భాగ్యనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో కొంపల్లి లీలా-మలహల్రావు దంపతులు, వారి కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణ ఉన్నారు. అర్చన-వంశీకృష్ణ దంపతుల కుమారులు అద్వైత (7), కృషాణ్ (5) కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. వంశీకృష్ణ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండేవాడని సమాచారం. -
కొంపల్లిలో ఇన్నోవా బీభత్సం
-
మృత్యువులోనూ వీడని బంధం
ఎంతో అన్యోన్యంగా ఉండే వారి ప్రేమ బంధాన్ని మృత్యువూ విడదీయలేకపోయింది. కుమార్తెను సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వద్ద దించి వస్తూ.. ఆమె భవిష్యత్ కోసం యోచిస్తున్న సమయంలో విధికి కన్నుకుట్టింది. కారు మృత్యు శకటంగా మారి వారిని విగతజీవులను చేసింది. ప్రమాద స్థలంలో పక్కపక్కన పడి ఉన్న భార్యాభర్తల మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. సాక్షి, కశింకోట(విశాఖపట్టణం) : మండలంలోని పరవాడపాలెం వద్ద జాతీయరహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న బైక్ను పక్క మార్గంలో అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మీద నుంచి దాటుకొని దూసుకు వచ్చి ఢీకొంది. దీంతో తుని వద్ద మల్లవరానికి చెందిన కవులూరి రమణ(35), లక్ష్మి(30) దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.బట్లపూడికి చెందిన కొండలరావు కుమార్తె అయిన లక్ష్మితో రమణకు పదేళ్ల కిందట వివాహం అయింది.వీరు అన్యోన్యంగా కలిసి ఉండేవారు. వీరికి కుమార్తె యమున, కుమారుడు జశ్వంత్ ఉన్నారు. వీరు నాయనమ్మ సత్యవతి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. రమణ వివాహానికి ముందే దువ్వాడ వద్ద రాజీవ్నగర్కు వలస వెళ్లిపోయి నివాసం ఏర్పర్చుకుని జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె యమునకు తుని వద్ద జగన్నాథగిరిలో ఉన్న ఎపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి సీటు వచ్చింది. పాఠశాలలో చేర్చి తన ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ బుధవారం పాఠశాలకు దిగబెట్టి భార్యా భర్తలు తిరుగు పయనమై తాము ఉంటున్న రాజీవ్ నగర్కు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మృతి లోను తమ బంధాన్ని వీడకుండా ఒకేసారి తనువు చాలించారు. ఇది చూపరులను తీవ్రంగా కలచి వేసింది. ఇక రమణ తల్లి సత్యవతి మల్లవరంలో ఒక ప్రైవేటు కాన్వెంట్లో ఆయాగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. చరమాంకంలో తమకు చేదోడుగా నిలుస్తాడనుకున్న ఏకైక కుమారుడు రమణ, కోడలు లక్ష్మి మృత్యువాత పడడం ఆమెను కలచి వేస్తోంది. తనకే కాకుండా తన మనవడు,మనవరాలికి ఇక దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా రోధిస్తోంది. మితిమీరిన వేగం వల్లే మితిమీరిన వేగంతో కారును నడపడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. కారు ఎత్తుగా ఉన్న డివైడర్ మీద నుంచి అవతలి రోడ్డుకు దూసుకు పోయి సుమారు వంద మీటర్ల దూరంలో ఉన్న బైక్ను ఢీకొంది. అక్కడి నుంచి రోడ్డు పక్క రాళ్లను ఢీకొని పైకి ఎగిరి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ధ్వంసమై గొయ్యిలో పడింది. కారు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయిందని ప్రమాద స్థలంలో ఉన్న ఖమ్మం జిల్లా పాలేరుకు చెందిన లారీ డ్రైవర్ దావత్ సుధాకర్ విలేకరులకు తెలిపారు. కారు నడుపుతున్న సింహాచలం ప్రాంతానికి చెందిన స్వరూప్ కారులో చిక్కుకు పోవడంతో అతి కష్టం మీద బయటకు తీసి 108 వాహనంలో తరలించినట్టుచెప్పారు. స్పృహ కోల్పోయి ప్రమాదకర పరిస్థితిలో స్వరూప్ ఉన్నట్టు 108 వాహన సిబ్బంది తెలిపారు. అతనికి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిపించి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. అతను వైద్యుడని చెప్పారు. ప్రమాద తీవ్రతను బట్టి కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రమాదంలో బైక్ కూడా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ధ్వంసమైంది. ఈ సమయంలో కారు మరో బైక్ కూడా ఢీకొనవలసి ఉండగా త్రుటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలంలో బైక్, కారు శకలాలు, మృతుల వస్త్రాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. హెచ్చరిక బోర్డు వద్దే.. జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డు ఉన్న చోటే ఈ ప్రమాదం జరిగింది. కారు హెచ్చరిక బోర్డును ఢీకొని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లింది. మొదట మృతుల వివరాలు తెలియరాలేదు. సెల్ ఫోన్ సిమ్ సాయంతో ప్రయత్నించడంతో వారి ఆచూకీ తెలిసింది. పోలీసులు ప్రమాదం గురించి తెలపడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి వారితో నిండిపోయింది. ఒకేసారి భార్యాభర్తలు మృతి చెందడంలో ఇక వారి పిల్లలకు దిక్కెవరంటూ రోదిస్తూ విషాదంలో మునిగిపోయారు. భార్యా భర్తల మృత దేహాలను ఆటోలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి సీఐ నరసింహారావు,స్థానిక అదనపు ఎస్ఐ దయానిధి సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇల్లు ముచ్చట తీరకుండానే పరలోకాలకు
పీఎం పాలెం (భీమిలి) : ఇల్లు ముచ్చట తీరకుండానే ఓ డాక్టర్ దుర్మరణం పాలయ్యాడు. సొంతంగా కొనుగోలు చేసిన ప్లాట్లో ఇంటీరియల్, ఫర్నిచర్ పనులు చేయించి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కారుషెడ్ కూడలి వద్ద జరిగింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన రాష్ట్రపతి చౌదరి(43) నగరంలోని పెదవాల్తేరులో కుటుంబంతో నివసిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో రెసిడెన్స్ మెడికల్ ఆఫీసర్గా ఆయన పని చేస్తున్నారు. కొమ్మాది సమీపంలో ఇటీవల కొనుగోలు చేసిన ప్లాటుకు అవసరమైన ఫర్నిచర్, ఇంటీరియల్ పనులు చేయిస్తున్నారు. పనుల తీరు పరిశీలించడానికి మంగళవారం తన సహచరుడు సత్యనారాయణను తీసుకుని ద్విచక్ర వాహనంపై కొమ్మాదిలోని ప్లాటుకు వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా కారుషెడ్ కూడలి సమీపంలోకి వచ్చేసరికి లారీ పక్క నుంచి వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఆ లారీకి తగిలింది. దీంతో ద్విచక్రవాహనంతోపాటు రాష్ట్రపతి చౌదరిని లారీ కొంతదూరం ఈడ్చుకుంటూ పోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చౌదరి ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచాడు. అతని సహచరుడు సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డాడు. మృతుని సహచరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవికుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆనందం ఆవిరి : రోగులకు ఉత్తమ సేవలు అందించే డాక్టర్గా రాష్ట్రపతి చౌదరికి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో మంచి పేరుంది. ఆయన భార్య ప్రభావతి ప్రముఖ ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్నారు. కుమారుడు విలాస్ చౌదరి(17) ఇటీవల ఇంటర్ పూర్తి చేయగా, కమార్తె నేహా చౌదరి(16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అం దంగా సాగిపోతున్న ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు కాటేసిందని, సొంత ఇంటిలోకి ప్రవేశించకుండానే పరలోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హెల్మెట్ ధరించినప్పటికీ ప్రాణాలు నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వెంటాడిన మృత్యువు
శ్రీకాకుళం ,ఆమదాలవలస/ భామిని: తల్లి చేయి పట్టుకుని బస్టాండ్లో నిల్చున్న ఆ బాలుడిని బైక్ రూపంలో మృత్యువు వెంటాడింది. బంధువును పరామర్శించడానికి తల్లిదండ్రులతోపాటు కలిసి వెళ్తు్తండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఇంతటి ఘోరం జరగడంతో గుండెలు అవిసేలా రోదించారు. ఆమదాలవలస పట్టణ శివార్లలోని ఎస్ఎల్నాయుడు పెట్రోల్ బంక్ ఎదురుగా (శ్రీకాకుళం పాలకొండ రోడ్డు ఓవర్ బ్రిడ్జి డౌన్లో) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందారు. ఎస్ఐ జి.వాసుదేవరావు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం. భామిని మండలం నేరడి–బి గ్రామానికి చెందిన అంపావిల్లి శ్రీను, గౌరి దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (10) తల్లిదండ్రులతో కలిసి నెల్లూరు వెళ్లేందుకు విశాఖపట్నం రైల్వే స్టేన్కు చేరుకున్నారు. వీరఘట్టం మండలంలోని గౌరి బంధువు ఒకరు మృతి చెందారని ఫోన్ రావడంతో అక్కడ నుంచి తిరిగి వచ్చారు. ఆమదాలవలస బ్రిడ్జి వద్ద పాలకొండ బస్టాప్లో బస్సు కోసం వేచి ఉన్నారు. ఇంతలో ఎల్.ఎన్.పేట మండలం రావిచంద్రి గ్రామానికి చెందిన కల్లేపల్లి అప్పలనాయుడు బైక్పై అతి వేగంతో పాలకొండ వైపు నుంచి శ్రీకాకుళం వస్తున్నాడు. అక్కడ ఉన్న డివైడర్ను ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టాడు. ప్రశాంత్ అక్కిడికక్కడే కూలిపోయి కొనఊపిరితో ఉండగా ఆమదాలవలస పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోగా బాలుడు ప్రాణాలు విడిచిపెట్టినట్లు తల్లిదండ్రులు, బంధులు చెప్పారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిని తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేరడి–బిలో విషాదం భామిని మండలంలోని నేరడి–బి గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన అంపావిల్లి శ్రీను, గౌరి దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ ఆముదాలవలసలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరు జిల్లా కొండపల్లిలో ఉంటున్న శ్రీను, గౌరిలు కుమారుడితో కలిసి ఓటు చేయడానికి నేరడికి వచ్చారు. ఆదివారం తిరుగు పయనంలో ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. -
పండగకు వస్తానని.. తిరిగి రాని లోకాలకు
బద్వేలు అర్బన్ : ఈ సారి పనికి వెళ్లి పండుగ (క్రిస్మస్) నాటికి తిరిగి వస్తా .. కుటుంబ సభ్యులమంతా సంతోషంగా పండుగ జరుపుకుందాం అని చెప్పి బయలుదేరిన ఆ యువకుడిని విధి చిన్నచూపు చూసింది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఆ యువకుడిని బలిగొంది. కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లుచల్లింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ అటు తల్లిదండ్రులను, తమ్ముళ్లను, భార్యబిడ్డను పోషించే ఆ యువకుడి అకాల మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే బద్వేలు సమీపంలోని తొట్టిగారిపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మైదుకూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన దాసరిజార్జి (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. డి.బాబు, మేరమ్మలకు ముగ్గురు కుమారులు కాగా వారిలో పెద్దవాడైన జార్జి సెంట్రింగ్ పని చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఇతనికి బి.మఠం మండలం రేకలకుంట గ్రామానికి చెందిన తులసితో రెండేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఏడాది పాప ఉంది. జార్జి నెల్లూరుజిల్లా కావలిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ పని చేస్తూ ఉన్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లిన జార్జి ఆది, సోమవారాలు కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి కావలికి వెళ్లేందుకు మంగళవారం తెల్లవారుజామున 2–30 గంటలకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. 4 గంటలకు బద్వేలు సమీపంలోని తొట్టిగారిపల్లె వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామంలోని మృతుని బంధువులు మృతదేహాన్ని పరిశీలించి జార్జిగా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారంతా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జార్జిగా గుర్తించి బోరున విలపించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మూడు గేదెలు మృతి తొట్టిగారిపల్లె సమీపంలో జార్జి మృతి చెందిన స్థలంలో మూడు గేదెలు కూడా మృతిచెంది ఉన్నాయి. అంతేకాకుండా ప్రమాదస్థలంలో వాహనానికి సంబం ధించిన చివరి నాలుగు అంకెల నంబర్ ప్లేటుతో పాటు ఫుట్బోర్డు కూడా లభించింది. దీనిని ప్రకారం ఏదైనా భారీ వాహనం గేదెలను ఢీకొని జార్జిని కూడా ఢీకొట్టి ఉండవచ్చని మృతుని బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే విచారిస్తున్నారు. -
ఎవరి కోసం బతకాలి దేవుడా?
ఆంజనేయులు, కొల్లమ్మ దంపతులకు మహేంద్ర ఒక్కగానొక్క సంతానం. ఎంతో గారాబంగా చూసుకుంటూ అనంతపురంలో డిగ్రీ చదివిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇక మేము ఎవరి కోసం బతకాలి దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ రోదించింది. అనంతపురం , ఆత్మకూరు: ఆత్మకూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. ఆత్మకూరుకు చెందిన మహేంద్ర (18), రాజేష్ అనే యువకులు పంపనూరు సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో తిరుగుపయనమయ్యారు. మరికొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. ఎదురుగా పాల వ్యాను, ఎద్దుల బండి రావడంతో వాటిని ఎక్కడ ఢీకొంటామోనని ద్విచక్రవాహనాన్ని పక్కకు తిప్పడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులనూ 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందాడు. మరో యువకుడు రాజేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ సాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
హరికృష్ణ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
అమరావతి: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, నందమూరి హరికృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీ, రాజకీయ జీవితంలో హరికృష్ణ ప్రత్యేక ముద్రవేశారని చెప్పారు. వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..నందమూరి హరికృష్ణ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కళా వెంకట్రావు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిపారు. హరికృష్ణ మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని, హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రోజు జనసేన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. -
పెళ్లి సామగ్రి తెచ్చేందుకు వెళ్లి..
సీతంపేట : వివాహ శుభకార్యం జరుగుతుండగా సామగ్రి తీసుకురావడానికి వెళుతూ ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక గిరిజనుడు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పులిపుట్టి బ్రిడ్డి వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. కొండపోడు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న గిరిజనుడు దుర్మరణం చెందారు. సాయం చేసేందుకు వెళ్లి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సీతంపేటలో వివాహం జరుగుతుండగా వాటర్ ప్యాకెట్లతో పాటు ఇతర సామగ్రి అయిపోవడంతో వాటిని తీసుకురావడానికి మోహన్కాలనీకి చెందిన గ్రామస్తులు ఊయక దోమయ్య(30)తో పాటు ఊయక మంగయ్య, బిడ్డిక కొండలు, ఊయక బిల్లింగు(డ్రైవర్) కొత్తూరు వెళుతున్నారు. మార్గమధ్యంలో పులిపుట్టి బ్రిడ్జి వద్ద అదుపు తప్పి ఆటో బోల్తాపడడంతో దోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. గ్రామంలో శుభకార్యం జరుగుతుండగా సంఘటన చోటుచేసుకోవడంతో విషాదం నెలకొంది. మృతుడికి భార్య సుగుణతో పాటు ఐదేళ్లు మూడేళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద తల్లి వెక్కివెక్కి ఏడుస్తుంటే ఏమైందో తెలియక పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. కొండపోడు పనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న గిరిజనుడిపై ఆటోరూపంలో మృత్యువు వచ్చిందని, అందరు చిన్నపిల్లలు కావడంతో తమకు దిక్కెవరని మృతదేహం వద్ద సుగుణ విలపిస్తోంది. ఎస్ఐ కె.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఊయక మంగయ్య, బిడ్డిక కొండలు, ఊయక బిల్లంగును కొత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ముగ్గురి ఉసురు తీసిన అక్రమ ఇసుక రవాణా
-
బొలెరోను ఢీ కొన్న డీసీఎం ; ఐదుగురు మృతి
-
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమేలియా ప్రాంతంలో జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక జిల్లా కలెక్టర్ దిలిప్ కుమార్ మీడియాకు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యోగా గురు మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యోగా గురుతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఓ కాంగ్రెస్ నాయకుడు కూడా ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫాగుహ బాటియా ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యోగా గురు లక్ష్మీపతి వర్మ వెళ్తున్న కారును ఎదురుగా వ్యతిరేక మార్గంలో వచ్చి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఇదే సమయంలో యోగా గురు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం ముగ్గురు చనిపోయారు. మృతుడు యోగాగురు లక్ష్మీపతి ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు సన్నిహితుడు. ఈ ఘటనలో యోగాగురుతో పాటు కాంగ్రెస్ నాయకుడు ధరం రాజ్ వర్మ, హరి మోహన్ అగర్వాల్(58) మరో కారులో చనిపోయారు. గాయపడిన ఆరుగురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
హైదరాబాద్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
-
మూసాపేట ఫైఓవర్పై రోడ్డు ప్రమాదం
-
గుజరాత్లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి
-
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
రేగొండ(భూపాలపల్లి): ప్రమాదవశాత్తు బైక్ చెట్టుకు ఢీకొని దంపతులు మృతి చెందిన సంఘటన రేగొండ శివారులోని జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని సుల్తాన్పురం శివారు వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన చిరిపోతుల రవి, అరుణ దంపతులు చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి వివాహానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సుల్తాన్పురం శివారులోని కోళ్లఫారం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. దీంతో రవి, అరుణ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రమాదంలో మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు -
ప్రొఫెసర్ కోదండరామ్ కారుకు ప్రమాదం
-
అథ్లెట్ల ప్రాణాలు తీసిన పొగమంచు
-
ప్రమాదవశాత్తూ బస్సు కిందపడి విద్యార్థి మృతి
నిజామాబాద్ : నగరంలోని కంఠేశ్వర్ బస్టాప్ వద్ద గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న బస్సు ఎక్కే క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. విద్యార్థిపై నుంచి బస్సు వెనక టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మదన్(21) నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పైనల్ ఇయర్ చదువుతున్నాడు. బస్సు నిజామాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
-
సిరివెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
కర్నూలు : సిరివెళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ స్విఫ్ట్ కారు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం మధురపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో ప్రవీణ్ గౌడ్ (25), ప్రవీణ్ (26)లు అక్కడికక్కడే మృతిచెందగా..అర్జున్ రెడ్డి (26), చంద్ర మోహన్ (25)తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే వీరు కొత్తగా మారుతీ మారుతీ స్విఫ్ట్ కారు కొన్నారు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా సిరివెళ్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భీమిలీ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం, యువకుడి మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి క్రాస్ రోడ్డు జంక్షన్ వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. హోండా ఆక్టివాపై వస్తున్న ఇద్దరిని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంవీపీ కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఫిరోజ్(20), అనిశ్చితలకు తీవ్రగాయాలు అయ్యాయి. మధురవాడలోని గాయత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా ఫిరోజ్ మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఫిరోజ్ వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి
చింతపల్లి(విశాఖపట్నం): వేగంగా వెళ్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను గణేశ్(12), నరసింగరావు(14)గా గుర్తించారు. క్షతగాత్రులను చింతపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యానులో కోరుకొండ సంతకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. -
లారీ బోల్తా.. ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు
తుని(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం పేటగుంట వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జిప్సం లోడుతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ పేటగుంట వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లోడుపై కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో పాములూరి వీరేంద్ర(33) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుదని భావిస్తున్నారు. -
పర్వతంపై నుంచి పడ్డ బస్సు; 26 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 400 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు. గురువారం కిక్కిరిసిన ప్రయాణికులతో, పర్వత ప్రాంతంలో ఇరుకైన రహదారిలో వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. దాదాపు 200 మీటర్ల దిగువకు బస్సు దొర్లుకుంటూ వెళ్లి నదిలో పడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను కాపాడి వారిని హెలికాప్టర్లలో నేపాల్ గంజ్లోని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం మరి కొంతమంది క్షతగాత్రులను రక్షించారు. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించింది. నేపాల్ లో పర్వత ప్రాంతాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటం, బస్సులు కండీషన్లో లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలౖయెన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వీరయ్య(29) మేడ్చల్ పట్టణంలోని బాలాజీనగర్లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మండలంలోని పూడూర్కు నివాసి మణికుమార్(19)తో కలిసి గ్రామ పరిధిలోని డైమండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురును పండుగ కోసం తీసుకెళ్లేందుకు వీరయ్య మామ వచ్చాడు. దీంతో వీరయ్య, తన మిత్రుడు మణికుమార్ సాయం తీసుకొని రెండు బైకులపై తన భార్యతో పాటు మామను నగరంలోని ఎల్బీనగర్లో వదిలిపెట్టి తిరిగి సోమవారం రాత్రి వీరయ్య ఇంటికి చేరుకున్నారు. అనంతరం వీరయ్య బైక్ను ఇంటి వద్ద ఉంచి మణికుమార్ బైక్పై ఇద్దరూ బయలుదేరారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై చెక్పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక శామీర్పేట్ రోడ్డుకు యూటర్న్ తీసుకుంటుండగా నగరం వైపు వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న వీరయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనం నడుపుతున్న మణికుమార్ తలకు తీవ్రగాయాలవగా ఆయనను నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మంగళవారం వీరయ్య మతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్వస్థలానికి తీసుకెళ్లారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నిర్మల్ టౌన్ : పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎస్సై సునీల్కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన గౌతంరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి ఏపీ25ఎల్ 9009 నెంబర్ కారులో నిజామాబాద్ వైపు Ðð ళ్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారును నడుపుతున్న గౌతంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మిగతా వారు తీవ్ర గాయాలపాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మందమర్రి : పట్టణంలోని రాష్ట్రీయ రహదారిపై పాత సోనియా దాభా వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్పై వెళ్తున్న బోయిన తిరుపతి(21) దుర్మరణం చెందాడు. అదనపు ఎస్సై తుకారాం కథనం ప్రకారం... మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు మోటార్సైకిల్పై వస్తున్న తిరుపతిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే బైక్ పైనుంచి కింద పడ్డ తిరుపతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తిరుపతిని తాండూరు మండలం కిష్టంపేట పంచాయతీ పరిధి తంగళ్లపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి తండ్రి సదయ్య సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే–5 గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. సదయ్యకు ముగ్గురు కూతుళ్లు కాగా, తిరుపతి ఒక్కడే కుమారుడు. మంచిర్యాలలోని స్నేహితుల వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పినట్లు తెలిసింది. తిరుపతి మంచిర్యాలలోని ఎంవీఎన్ కాలేజీలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తుకారాం తెలిపారు. కాగా, హెల్మెట్ లేకపోవడంతో తలభాగంలో అయిన గాయానికి తిరుపతి మృతిచెందడం గమనార్హం. -
రెండు బైక్లు ఢీ.. ఒకరి మృతి
విజయవాడ: విజయవాడ ఎంజీ రోడ్డులో పీవీటీ మాల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాబు అనే యువకుడు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పెళ్లి వ్యాన్ -ప్రైవేటు బస్సు ఢీ: 15 మంది మృతి
-ప్రకాశం జిల్లా చెర్లోపాళెం వద్ద దుర్ఘటన - పెళ్లి బృందం వ్యాన్ను ఢీకొన్న బస్సు..15 మంది దుర్మరణం,25 మందికి తీవ్రగాయాలు - కారులో వెళ్లడంతో పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు క్షేమం కందుకూరు : మరికాసేపట్లో గుడిలో పెళ్లికి హాజరవుతామని ఆనందంలో ఉన్న బంధువులను మృత్యువు వెంటాడింది. దీంతో పెళ్లి కుటుంబంతో పాటు బంధువుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాళెం మండలం చెర్లోపాళెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎంలో మానకొండలో ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కూమార్తె, పెళ్లి కుమారుడు ముందు కారులో వెళ్లగా కుటుంబసభ్యులు, బంధువులు వెనుక డీసీఎంలో బయలుదేరారు. మానకొండకు వెళుతున్న డీసీఎంను ఎదురుగా కందుకూరు వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు క్యాబిన్లోకి డీసీఎం దూసుకుపోవడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. డీసీఎం ఢీకొట్టిన వెంటనే బస్సు పక్కనున్న కాల్వలోకి బోల్తాకొట్టింది. పెళ్లి బృందంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని, అతివేగంగా నడపడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, విజయవాడ ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
పెళ్లి వ్యాన్ -ప్రైవేటు బస్సు ఢీ
-
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని ఒకటో మలుపు వద్ద మహారాష్ట్రకు చెందిన టెంపో ట్రావెలర్ పిట్టగోడను ఢీకొన్నది. దీంతో ఆ వాహనంలో వెళ్తున్న 10 మంది భక్తులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ, కారు ఢీ: ఒకరి మృతి
అల్వాల్: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున నగరంలోని బొల్లారం కంటెయినర్ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. వివరాలు.. కూకట్పల్లి యల్లమ్మబండకు చెందిన కొంతమంది భక్తులు యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో బాబు (19), అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా, ప్రస్తుతానికి వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8మంది ఉండగా అందూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కరాలకు వెళ్తూ.. ఇద్దరి మృతి
సబ్బవరం (విశాఖపట్టణం): వేగంగా వెళ్తున్న రెండు వ్యాన్లు ఢీ కొని ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున విశాఖ జిల్లా సబ్బవరం మండలం అతకపల్లి గ్రామ సమీపంలోని సున్నంబట్టీల వద్ద జరిగింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలానికి చెందిన పలువురు గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వ్యాన్లో బయలుదేరారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన పలువురు రాజమండ్రిలో పుష్కరాలకు వెళ్లి తిరిగి వ్యాన్లో వస్తున్నారు. కాగా, ఈ రెండు వ్యాన్లు విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు రెడ్డిపేట గ్రామానికి చెందిన సుభద్ర, మరో వృద్ధుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని పెట్రోలింగ్ అధికారులు కేజీహెచ్కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనంద్ కుటుంబాన్ని ఆదుకుంటాం
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలోగల షాదన్ కాలేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రయాణిస్తోన్న ద్విచక్రవాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను మహ్మద్ నదీం, నసీర్ బిన్ సలేహ్ బిన్ అపేన్ గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, బంధువులకు సమాచారం అంజేస్తామని పోలీసులు చెప్పారు. -
"బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
-
'బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: మడకశిర ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఉరవకొండ వైఎస్సార్ సిపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటన బాధాకరమని విశ్వేశ్వరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో సహాయ చర్యల్లో పాల్గొనాలని జిల్లా వైస్సార్ సిపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్థలికి రానున్నట్టు ఆయన తెలిపారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం
-
పెరుగుతున్న మృతుల సంఖ్య
-
ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలికి ఏపీసీసీ చీఫ్ రఘవీరా బయలుదేరి వెళ్లారు. సంఘటనపై ఆయన దిగ్భాంతి వ్యక్తం చేశారు.జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండకు బయలుదేరిన బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. -
ప్రమాద వార్త కలిచి వేసింది: వైఎస్ జగన్
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ఆయన అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేకమంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 12మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 10మంది మృతి