ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం | Six Killed in Road accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం

Dec 25 2017 9:34 AM | Updated on Aug 30 2018 4:17 PM

Six Killed in Road accident - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా అచ్చరపాక్కం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు పక్కన ఆగివున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం అధికంగా ఉండటంతో కారు ధ్వంసమైంది.

దీంతో లోపల ఉన్నవారు నీటిలో నుంచి బయటకు రాలేకపోయారు. కారులో మొత్తం ఎనిమిది మంది ఉండగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పుదుకొట్టే జిల్లా వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కారును చెరువులో నుంచి బయటకు తీయించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement