![two people died in road accident - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/23/aaa.jpg.webp?itok=VE86ygDg)
సాక్షి, జనగామ: జనగామలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల లోడ్తో వెళ్తున్న టాటాఏస్ వాహనం ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటాఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు రెండు గంటలు కష్టపడ్డారు. మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో 10 గొర్రెలు కూడా మృతి చెందాయి. మృతుల్లో ఒకరిని నాగారానికి చెందిన గొల్ల అంజయ్యగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment