చేతబడి చేస్తున్నారని భార్యాభర్తలను.. | Villagers Eliminates Husband And Wife In Odisha Due To Black Magic | Sakshi
Sakshi News home page

చేతబడి చేస్తున్నారని..

Published Sun, Jun 28 2020 1:13 PM | Last Updated on Sun, Jun 28 2020 2:18 PM

Villagers Eliminates Husband And Wife In Odisha Due To Black Magic - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొన్నాళ్ల నుంచి కొంతమంది చిన్నారులు తీవ్రఅనారోగ్యం బారినపడి చనిపోతున్నారు

భువనేశ్వర్: చేతబడి చేస్తున్నారన్న నెపంతో భార్యాభర్తలను గ్రామస్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి సమితిలోని పెండ్రాల్‌గుడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

వివరాలిలా ఉన్నాయి.. పెండ్రగుడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి కొంతమంది చిన్నారులు తీవ్రఅనారోగ్యం బారినపడి చనిపోతున్నారు. దీనికి కారణం ఆ గ్రామంలోని భార్యాభర్తలు సోమ మాఢి(50), శుక్ర మాఢి(45)లని గ్రామానికి చెందిన కొంతమంది అనుమానించారు. వారు చేసే చేతబడి కారణంగానే పిల్లలు మరణిస్తున్నారని, ఎలాగైనా వారిని అంతమొందించాలని గ్రామానికి చెందిన ముక్కా మడకామి, లక్ష్మా మడకామి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అనుకున్నదే తడవుగా రాత్రి సోమ మాఢి, శుక్ర మాఢి నిద్రిస్తున్న సమయంలో వారిపై గొడ్డలితో దాడికి ఎగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన వారిద్దరూ రక్తపుమడుగులో సంఘటన స్థలంలోనే మృతి చెందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement