
సాక్షి, ఏలూరు : ఓ బ్రాందీ షాపు వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్ సమీపంలో చోటుచేసుకుంది. మృత్యుడు ఏలూరుకి చెందిన శ్రీహర్షగా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment