brutal murder
-
Hyderabad: కారుతో ఢీ కొట్టి.. గొడ్డళ్లతో నరికి
నాగోలు: పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని కారుతో ఢీ కొట్టి అతడు కింద పడిన తర్వాత గొడ్డళ్లు, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బోడ్డు మహేష్(31) పాత నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదై ఉన్నాయి. గతంలో అదే ప్రాంతంలో ఉన్న పగిళ్ల పురుషోత్తం మహేష్కు స్నేహితుడు. రెండేళ్ల క్రితం హయత్నగర్లో పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో మహేష్ పురుషోత్తంపై బీరు బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే స్నేహితులు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఒప్పించారు. రాజీ పడేందుకు మహేష్ గత డిసెంబర్ 20న హయత్నగర్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే అతను కోర్టు హాజరుకాకుండా తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్కు చెప్పి పురుషోత్తంను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. అదే రోజు కొత్తపేట– నాగోలు రోడ్డులో అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నట్లు సమాచారం అందడంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్తో కలిసి అతడిపై వేట కొడవలితో దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో పురుషోత్తం స్నేహితులైన గడ్డమోయిన రాము, పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషోత్తం ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు దాడికి పాల్పడిన మహేష్, బెల్లి భరత్, దాసరి సురేందర్, సుమన్, గౌతమ్కుమార్, పరుశురాంలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఇటీవలే మహేష్ అతని స్నేహితులు జైలు నుండి బయటికి వచ్చారు. అయితే మహే‹Ùపై కక్ష పెంచుకున్న పురుషోత్తం అతని స్నేహితులు అతడిని హత్య చేయాలని పథకం వేశారు. మాటు వేసి..దాడి చేసి.. శనివారం రాత్రి మహేష్ తన స్నేహితుడితో కలిసి బైక్పై ఎల్బీనగర్ శివగంగ కాలనీ నుంచి ఇంటికి వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి నిందితులు కారుతో మహేష్ బైక్ను ఢీ కొట్టారు. కింద పడిన అతను పారిపోయేందుకు ప్రయత్నించగా వారు తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్ల, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. మహేష్ వెంట ఉన్న స్నేహితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ను కామినేని హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేష్ తలపై నిందితులు గొడ్డలితో నరకడంతో గొడ్డలి తలలోనే ఇరుక్కు పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. పోలీసుల అదుపులో నిందితులు... మహేష్ ను హత్య చేసిన నిందితులు పురుషోత్తం, భరత్నగర్కు చెందిన సందీప్, నాగార్జున, రాములను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు ఈ హత్యలో ఎంత మంది ఉన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..!
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మ«ధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వ్రస్తాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవడం.. ఆదివారం రాత్రి న్యూకాలనీ ఎక్సైజ్ కార్యా లయం సమీపంలోని ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. రెండో పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. ఈమెకు నగరంలో సత్సంగంకు భజనలకు వెళ్లే అలవాటు ఉంది. శనివారం నగరానికి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో.. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్ప్రైజస్ బిల్డింగ్ ఒకటో ఫ్లోర్కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్తో పై ఫ్లోర్ రూమ్లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్లో కళావతి విగతజీవిగా పడి ఉంది. పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి. అందులో పై ఫ్లోర్లో అండలూరి శరత్కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడిన బాలుడి హత్య మిస్టరీ -
ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా?
కాళేశ్వరం: ఓ యువకుడిని ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల చంద్రక్క, అంకయ్య దంపతుల చిన్నకుమారుడు శ్రీకాంత్గౌడ్(23) నాలుగు రోజుల నుంచి తన హార్వెస్టర్తో చండ్రుపల్లిలో వరి పొలాల కోతలు చేపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు దుండగులు పల్సర్బైక్పై వచ్చి శ్రీకాంత్గౌడ్తో గొడవ పడ్డారు. కత్తులతో పొడిచి హత్య చేశారు. దీనిని గమనించిన హార్వెస్టర్ డ్రైవర్ కమ్మగోని ప్రదీప్గౌడ్ పరుగున వచ్చిన ఆపే ప్రయత్నం చేయగా అతడిపై కూడా దాడికి పాల్పడేందుకు యత్నించారు. దీంతో అతను భయపడి దుండగులు వచ్చిన బైక్ తాళాలు తీసుకుని గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులు వస్తారని భయపడిన దుండగులు పొలాల మీదుగా పరారయ్యారు.యువకుడి కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులుకాగా, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సదరు యువకుడి కాల్ డేటా పరిశీలిస్తున్నారు. మహదేవపూర్ సీఐ రామచంద్రారావు, మహదేవపూర్, కాళేశ్వరం ఎస్సైలు పవన్కుమార్, చక్రపాణితోపాటు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అన్నారం పరిధిలోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దుండగుల పల్సర్ బైక్, తమ వెంట తీసుకొచ్చిన తెల్ల కల్లు బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వద్ద హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా, దుండగులు కొమ్మెర గ్రా మంలో కూడా మృతుడి ఇంటి వద్ద, చండ్రుపల్లి పరిసరాల్లో నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘట నపై మృతుడి సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్రారావు తెలిపా రు. మృతదేహాన్ని మహదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. -
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన రమేష్ కుమార్ అనే వ్యాపారి కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. కారులో హత్య చేసి మృతదేహాన్ని అక్కడి ఓ కాఫీ ఎస్టేట్లో పడేసి కాల్చేశారు. ఈ నెల 3న చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి ఆయన భార్య నిహారిక సూత్రధారిగా తేలింది. ఈమెతో పాటు ప్రి యుడు, స్నేహితుడిని శనివారం అరెస్టు చేసిన కొడగు పోలీసులు హతుడి కారును స్వా«దీనం చేసుకున్నారు. కొడగు ఎస్పీ ఆర్.రామరాజన్ చెప్పిన వివరాల ప్రకారం.. నిహారిక స్వస్థలం యాదాద్రి– భువనగిరి జిల్లా మునీరాబాద్. గతంలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత హరియాణాకు చెందిన మరో వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. అక్కడ నివసిస్తుండగా ఓ చీటింగ్ కేసులో భార్యాభర్తలు జైలుకు వెళ్లారు. జైలులో ఉండగా హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వీరికి పరిచయమైంది. ఆ మహిళను కలవడానికి తరచూ జైలుకు వచ్చే ఆమె కుమారుడు అంకుర్ రాణాతోనూ స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండో భర్తను కూడా నిహారిక వదిలేసి.. హైదరాబాద్కు చెందిన వ్యాపారి రమేష్ కుమార్ (54)ను వివాహం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తూ ఓ ప్రముఖ సంస్థలో పని చేసేది. రూ.8 కోట్లు కాజేయాలని.. ఏపీలోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్లో వెటర్నరీ డాక్టర్గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో రమేష్ కుమార్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచి్చన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం పన్నింది. రమేష్ను హత్య చేసేందుకు అంకుర్ రాణాను సంప్రదించింది. ఈ నెల 1న అంకుర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్న నిహారిక తన భర్త వద్ద ఉంది. 3వ తేదీన తమను బెంగళూరులో దింపి రావాలంటూ భర్తకు కోరింది. దీనికి అంగీకరించిన రమేష్ కుమార్ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో ఇద్దరినీ తీసుకుని బయలుదేరారు. అంకుర్ కారు నడుపుతుండగా.. పక్క సీటులో రమేష్, వెనుక నిహారిక కూర్చున్నారు. మార్గంమధ్యలో హైవేపై కారు ఆపి.. ఊపిరి ఆడకుండా చేసి రమే‹Ùను హత్య చేశారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి బెంగళూరులోని హోరామావూ ప్రాంతం వరకు వెళ్లారు. మృత దేహాన్ని కాల్చేసి.. ఆపై నిఖిల్ను సంప్రదించిన నిహారిక తన భర్త రమే‹Ùకుమార్ హత్య విషయం చెప్పింది. అతడి సలహా మేరకు మృతదేహాన్ని ఊటీ సమీపంలోని సుంటికొప్పలో ఉన్న కాఫీ ఎస్టేట్లోకి తీసుకువెళ్లారు. పెట్రోల్ పోసి నిప్పింటించి అక్కడి నుంచి కారులో ఉడాయించారు. ఈ నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 500 సీసీ కెమెరాల్లో ఈ నెల 1 తేదీ నుంచి రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించారు. ఓ కెమెరాలో కారు కదలికలతో పాటు దాని నంబర్ కూడా పోలీసులకు కనిపించింది. దీని ఆ«ధారంగా హైదరాబాద్ వచి్చన కొడగు పోలీసులు హతుడి వివరాలు సేకరించారు. ఆపై నిహారిక, నిఖిల్లను బెంగళూరులో, అంకుర్ను హరియాణాలో అరెస్టు చేశారు. వీరి కారుతో పాటు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
నందికొట్కూరు: మండల పరిధిలోని నాగటూరు గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. నాగటూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు, శిరీష (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా శుక్రవారం మొక్కజొన్న పొలం పనులకు వెళ్లిన శిరీషను సొంత మామ గొల్ల కురుమన్న హత్య చేసినట్లు తెలుస్తోంది. పంట కోత కోసిన చేనులో కంకులు ఏరుతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్బాబు, లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిరాలి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు మామపై హత్య కేసు, భర్త నరసింహులు, అత్త మహేశ్వరి, ఆడపచులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు టౌన్ సీఐ తెలిపారు. కాగా గొల్ల కురుమన్నపై 2017లో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కురుమన్నను ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు. -
Hyderabad: మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య
మియాపూర్: ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వైజాగ్కు చెందిన బండి స్పందన(29)దీప్తీ శ్రీనగర్ కాలనీలోని సీబీఆర్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లో తల్లి నమ్రత, సోదరుడితో కలిసి నివాసముంటోంది. ఆమెకు 2022లో వారణాసి వినయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న స్పందన తల్లి నమ్రత సోమవారం ఉదయం స్కూల్కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఆమె కుమార్తెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా బెడ్రూమ్లో స్పందన రక్తపు మడుగులో కనిపించింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో ఆమె మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
మహిళ దారుణ హత్య
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు. ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.భారీ బందోబస్తుహత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య
కడ్తాల్: వాట్సాప్ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి ఇటీవల బటర్ ఫ్లై వెంచర్లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 4న సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ ఫోటోలను రవి తన గ్రామా నికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గోవిందాయిపల్లికి చెందిన గుండెమోని శివగౌడ్(25), శేషగారి శివగౌడ్(27)లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో 5వ తేదీన సాయంత్రం రవి వీరిద్దరిని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవి వద్ద బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ ఉన్నాడు. నలుగురూ మద్యం తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు..? ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారు అని రవి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికిలోనైన రవి, పల్లె రాజుగౌడ్ కత్తులలో దాడి చేసి గుండెమోని శివగౌడ్, శేషగారి శివగౌడ్ను చంపేశారు. అనంతరం విల్లాకు తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగులగొట్టారు. లోపల రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి, క్లూస్టీంతో ఆధారాలు సేకరించారు. గుండెమోని శివగౌడ్ హైదరాబాద్లోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తుండగా, శేషుగారి శివగౌడ్ డ్రైవర్గా పనిచేస్తునట్టు తెలిసింది. యువకుల హత్యలకు వాట్సాప్ వివా దమే కారణమా.. మరేదైనా ఉందా..? అని గ్రామస్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం– హైదరాబాద్ జాతీ య రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రెండుగంటలకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్కతా/ఢాకా: చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్కతాలోని బారానగర్లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్లు, ఫోన్కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్కుమార్, లోక్నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
గుంటూరు ఈస్ట్: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన నగరంలో కలకలం రేపింది. పాత గుంటూరు ఎస్హెచ్ఓ రమేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర కాలనీలో నివసించే ఆశ ఆరు నెలల కిందట రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చింది. మొదట శివ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విడిపోయింది. అనంతరం దుర్గారావుతో సహజీవనం చేసి విడిపోయింది. ఆశకు నలుగురు పిల్లలు ఉన్నారు. గతంలో మూడో వ్యక్తితో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆశ ఓ వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మూడు వంతెనల వద్ద దుర్గారావు వారిని అడ్డకున్నాడు. తనతో తిరిగి సహజీవనం చేయాలని కోరాడు. ఆశ అందుకు నిరాకరించింది. దీంతో దుర్గారావు బెదిరించాడు. అయితే, అనూహ్యంగా ఎంప్లాయీస్ కాలనీ మెయిన్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున నడిరోడ్డుపై శవమై కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన వివాహిత శ్వేత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. పాయింట్ కుక్ ప్రాంతంలోని మిర్కా వేలో ఇటీవల ఈ దారుణం చోటు చేసుకుంది. విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కన చెత్త డబ్బాలో ఉన్న మృతదేహాన్ని విక్టోరియా పోలీసులు గుర్తించారు. తర్వాత హతురాలి భర్తే వచ్చి లొంగిపోవడంతో అతన్ని అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. నగరంలోని ఏఎస్ రావు నగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత బాల్శెట్టి గౌడ్ కుమార్తె మధుగాని చైతన్య అలియాస్ శ్వేత కొన్నేళ్ల క్రితం వరికుప్పల అశోక్ రాజ్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కూడా హైదరాబాద్ వాసే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లిని ఇరుపక్షాల కుటుంబాలూ అంగీకరించలేదని సమాచారం. కత్తితో పొడిచి, బెడ్షీట్లో చుట్టి.. వివాహానంతరం అశోక్రాజ్, శ్వేత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమ ఇంట్లోనే శ్వేతను కత్తితో పొడిచి చంపిన అశోక్ శవాన్ని బెడ్షీట్లో చుట్టి ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో పెట్టాడు. తన వాహనంలో ఆ డబ్బాను పెట్టుకుని మిర్కా వేకు 82 కిమీ దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని ఓ నిర్మానుష్యమైన కచ్చా రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు. అనంతరం తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. బాలుడిని తమ ఇంట్లో వదిలేసి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ లోపు బిక్లీ ప్రాంతానికి చెందిన స్థానికులు అనుమానాస్పదంగా పడి ఉన్న చెత్త డబ్బాను గుర్తించారు. దీంతో విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షలకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే హతురాలు శ్వేత అని, ఆమె భర్త తన కుమారుడితో కలిసి ఇటీవలే హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిన అశోక్ విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో వారు అశోక్ను అరెస్టు చేశారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా.. శ్వేత మృతదేహంతో కూడిన డబ్బా పడున్న మార్గం పెద్దగా వినియోగంలో ఉండదని, రోజుకు కేవలం రెండుమూడు వాహనాలు మాత్రమే తిరుగుతూ ఉంటాయని బిక్లీలోని స్థానికులు అక్కడి మీడియాకు చెప్తున్నారు. మిర్కా వే ప్రాంతంలో తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్వేత... ఇరుగుపొరుగు వారికి అవసరమైనప్పుడు, కీలక రోజుల్లో భోజనం తదితరాలను అందజేసేదని తెలుస్తోంది. దీంతో ఆమె హత్య విషయం తెలిసిన స్థానికులు షాక్కు గురయ్యారు. శ్వేత వ్యవహారశైలిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించే అవకాశం లేదని, అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. -
హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి
బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్ఎన్నగర్లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: ఫిలింనగర్లో ఎన్ఆర్ఐ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లో మా గృహం వెనుక ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు మా గృహంలో మేనేజర్గా పనిచేస్తున్న లక్ష్మీ మాఝి(23)గా గుర్తించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామానికి చెందిన ఈమె ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మా గృహం వెనుక కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బాలేదార్ మాఝి తన కుమార్తెను దారుణంగా తగులబెట్టి హత్య చేశారని పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులొ పేర్కొన్నారు. -
భార్యకు ఎఫైర్.. అతడిని చంపాకే ఇంట్లో అడుగుపెడతానని శపథం
కడప అర్బన్ : కడప నగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధి ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం సముదాయంలోని ఓ గదిలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్ఐసీ వారి ఈడీఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. తన వద్ద పార్ట్ టైంగా పని చేస్తున్న వ్యక్తిని హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరంలోని నిరంజన్నగర్లో చిట్వేలి భవానీశంకర్(30) తన భార్య బాబాబీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవనం సాగించే వాడు. భవానీశంకర్ 14వ డివిజనల్లో వలంటీర్గా, అతని భార్య 13వ డివిజన్లో వలంటీర్గా పని చేస్తున్నారు. మరోవైపు భవానీశంకర్ ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్ఐసీలోని ఓ గదిలో ఎల్ఐసీ వారి ఈడిఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం టీం లీడర్గా వున్న గుజ్జలి మల్లికార్జున దగ్గర పార్ట్టైం జాబ్ చేసేవాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ విభాగంలో గతంలో భవానీశంకర్ భార్య బాబాబీ కూడా పని చేసేది. ప్రస్తుతం మల్లికార్జున దగ్గర భవానీశంకర్తోపాటు మల్లికార్జున భార్య శైలజ, మల్లికార్జున స్నేహితుడు, ఆటోడ్రైవర్ రంజిత్కుమార్ పని చేస్తున్నారు. మల్లికార్జునకు, కలసపాడుకు చెందిన తన అక్క కుమార్తె శైలజకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె సంతానంగా ఉంది. వివాహేతర సంబంధమే ప్రధాన కారణం భవానీశంకర్ను అతని స్నేహితుడు మల్లికార్జున, మరో వ్యక్తి వల్లూరు మండలం పాపాఘ్నినగర్కు చెందిన రంజిత్కుమార్ అనే ఆటోడ్రైవర్తో కలిసి దారుణంగా హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటనకు కేవలం వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భవానీశంకర్, మల్లికార్జున భార్య శైలజతో వివాహేతర సంబంధం కలిగి వున్నాడని తెలుసుకున్నాడు. ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి తన భార్య శైలజతో గొడవపడ్డాడు. ఈ నెల 12 తేదీన ఉదయం 7:30 గంటల సమయంలో తన భార్య శైలజతో భవానీశంకర్ను చంపిన తరువాతే ఇంటిలో అడుగుపెడతానని శపథం చేసి వెళ్లాడు. హత్య చేసేందుకు పథకం రచించాడు. తనతోపాటు వున్న రంజిత్కుమార్తో కలిసి ఆటోలో చింతకొమ్మదిన్నె మండలానికి వెళ్లాడు. అక్కడి నుంచి వైవీ స్ట్రీట్కు వచ్చి కత్తి, కొడవలిని తీసుకున్నాడు. తాను పని చేస్తున్న ఎల్ఐసీ ఆఫీసుకు వచ్చాడు. భవానీశంకర్కు ఫోన్ చేసి అత్యవసరంగా ఆఫీసుకు రావాలని పిలిచాడు. అతను గదిలోకి రాగానే గడియపెట్టి కత్తి, కొడవలితో దారుణంగా పొడిచాడు. అతను తేరుకునేలోపే మెడ, ఛాతీ, వీపు భాగాలపై కర్కశంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడివుండగా.. రంజిత్కుమార్తోపాటు బయటకు వచ్చి పరారయ్యాడు. ఈ సంఘటన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయం మధ్యలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న హతుని భార్య బాబాబీ, తన బంధువులతో పాటు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, సీఐ ఎన్.వి నాగరాజు, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, రంగస్వామి, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం. -
గనుల శాఖ మహిళా అధికారి హత్య
బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు. కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు. -
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
కోలారు: మైనర్ బాలున్ని మరో మైనర్ బాలుర గుంపు చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కోలారు నగరంలోని పీసీ కాలనీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావం, బాలలు, యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తికి ఈ హత్య అద్దం పడుతోంది. కోలారు శాంతి నగర్కు చెందిన కార్మికుడు అరుణ్, సుశీల కుమారుడు కార్తీక్ సింగ్ (17) హత్యకు గురైన బాలుడు. వివరాలు.. కార్తీక్సింగ్ నగరంలోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. పీసీ కాలనీకి చెందిన మరో మైనర్ బాలునికి కార్తీక్సింగ్తో గొడవలు ఉన్నాయి. నిందితుడు, అతని స్నేహితులు కార్తీక్ సింగ్కు పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తెలిపి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలోకి పిలిపించారు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుని నేరాల బాట వేమగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ మురుగన్ కుమారుడు దిలీప్ అలియాస్ షైన్ సూత్రధారి అని ప్రచారం సాగుతోంది. దిలీప్ గత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి కత్తితో ఒకరిపై దాడి చేశాడు, దీనిపై కోలారు నగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాగా, పోలీసు కొడుకే అని సర్దిచెప్పి పంపారు. ఇతడు గంజాయికి బానిసై స్నేహితులతో కలిసి దౌర్జన్యాలు చేసేవాడు. సుమారు 8 నెలల కిందట కూడా కార్తీక్ సింగ్ని తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి వైరల్ చేశారు. పోలీసుల గాలింపు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. హంతకులు పరారీలో ఉండి వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు 3 తనిఖా బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. కఠినంగా శిక్షించాలి: కార్తీక్ తల్లి నా కుమారున్ని ఆ దుండగులే పిలుచుకుని వెళ్లారు. నేను కొంతసేపటికి కార్తీక్ మొబైల్కు ఫోన్ చేసినప్పుడు స్విచాఫ్ వచ్చింది. కార్తీక్ను ఎవరో కొట్టి చంపారని తరువాత మాకు తెలిసినవారు చెప్పారు. హంతకులకు కఠిన శిక్షలు విధించాలి. -
లాడ్జిలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: లాడ్జిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీలో ఎస్ఎస్ రెసిడెన్సీ లాడ్జిలో ఆదివారం ఉదయం బళ్లారికి చెందిన నవీన్ (26), ఏలూరుకు చెందిన ప్రవీణ్ రెండో ఫ్లోర్లోని 211 గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రూమ్లో ఏసీ సరిగ్గా రాకపోవటంతో వారు మూడో ఫ్లోర్లోని 303కు మారారు. ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో వారి మధ్య ఘర్షణ జరగడంతో ప్రవీన్ నవీన్ను కత్తితో మెడపై పొడవటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ► సోమవారం ఉదయం గది ఖాళీ చేయాలని చెప్పేందుకు వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టగా నవీన్ బెడ్పై రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో వారు కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. నవీన్ మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం బాటిళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ కోసం గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. -
రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య
అమీర్పేట: పాత కక్షలు మనసులో పెట్టుకున్న రౌడీ షీటర్ మరో ఇద్దరితో కలిసి ఓ యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్కు చెందిన తరుణ్ (22) డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. సోమవారం రాత్రి అతను బాపూనగర్లో దుర్గామాత పూజలో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ రౌడీ షీటర్ షేక్ షరీఫ్, మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. తరుణ్ కూడా వారితో కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత షరీఫ్ తరుణ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో షరీఫ్ వెంట ఉన్న వ్యక్తులు తరుణ్పై దాడి చేశారు. దీంతో బాపూనగర్కు వెళ్లిన తరుణ్ దాడి విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో ఒక్కడిని చేసి ఎలా కొడతారంటూ అతను తరుణ్ను వెంట పెట్టుకుని మళ్లీ దాసారం బస్తీకి వచ్చాడు. తరుణ్ రాయితో షరీఫ్ను కొట్టడంతో అతను తరుణ్ కణతపై బలంగా కొట్టాడు. కిందపడి పోయిన తరుణ్పై మరో ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. అతడి అరుపులు స్థానికులు అక్కడికి చేరుకునేలోగా షరీఫ్ అతడి అనుచరులు పారి పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న తరుణ్ను పోలీసులతో కలిసి అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమీర్పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు షరీఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవీస్, ఎసీపీ వెంకటేశ్వర్రావు, సీఐ రాంప్రపాదరావు పరిశీలించారు. పథకం ప్రకారమే హత్య: హత్యకు గురైన తరుణ్ ,రౌడీ షీటర్ షరీఫ్ మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో తరుణ్ను హత్య చేసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. నాలుగు నెలల క్రితం కూడా ఫరీష్ తరుణ్కు కొట్టి సెల్ ఫోన్ పగలకొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో తరుణ్పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.నీ అంతు చూస్తానంటూ షరీఫ్ తరుణ్ను తరుచూ బెదిరించేవాడని స్నేహితులు తెలిపా రు. ఇందులో భాగంగానే పథకం ప్రకారం దసరా పండుగ రోజున తరుణ్ను దాసారం బస్తీకి పిలిపించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య దారుణ హత్య
హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్నందున పోలీసులకు లొంగిపోవాలని సూచించినందుకు ఓ రౌడీషీటర్ను మరో రౌడీషీటర్ కత్తులతో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు తన టార్గెట్లో మరో ఇద్దరు ఉన్నారని.. వారిని హత్య చేసిన అనంతరం లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ డైరీఫామ్ ప్రాంతానికి చెందిన ఖూనీ గౌస్ రౌడీషీటర్. ఇతనిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీలు, భయబ్రాంతులకు గురి చేయడం తదితర కేసులు నమోదై ఉన్నాయి. గతంలో పీడీ యాక్ట్పై జైలుకు వెళ్లిన ఖూనీ గౌస్ గత నెలలో బయటికి వచ్చాడు. బయటికి వచి్చన అనంతరం తన గ్యాంగ్తో పాత సామ్రాజ్యాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి ఐదు రోజుల క్రితం అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని డైరీఫామ్ వద్ద పాలను విక్రయించే ఓ వ్యక్తి దుకాణంపై దాడి చేశాడు. షాపును పట్టపగలే తగులబెట్టాడు. అడ్డొచ్చిన వారిని కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు..నిందితున్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా..రాజేంద్రనగర్కు చెందిన మరో రౌడీషీటర్ సర్వర్ (30) ఇటీవల ఖూనీ గౌస్ను కలిసి గొడవలు వద్దని, పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. దీంతో ఖూనీ గౌస్ శుక్రవారం రాత్రి కలుద్దామంటూ సర్వర్కు తెలిపాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సర్వర్కు ఫోన్ చేసి జనప్రియ వెంచర్ ప్రాంతంలోని మొండి ఖత్వా ప్రాంతానికి రావాలని తెలిపాడు. సర్వర్ అక్కడికి వెళ్లగానే.. తననే పోలీసులకు లొంగిపోమంటావా...అంటూ కత్తులతో విక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సర్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడే ఉన్న ఇతర స్నేహితులతో ‘మరో ఇద్దరు తన టార్గెట్ అని..వారిని చంపిన అనంతరం పోలీసులకు లొంగిపోతానని’ తెలిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పుడే అరెస్టు చేసి ఉంటే... ఐదు రోజుల క్రితం డైరీఫామ్ వద్ద జరిగిన దాడిలో నిందితుడైన ఖూనీ గౌస్ను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింద ని ఆరోపించారు. ఖూనీ గౌస్ అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తాడని... గతంలో అత్తాపూర్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పీడీ యాక్ట్ అనంతరం జైలు నుంచి విడుదలైన ఖూనీ గౌస్పై నిఘా లేకపోవడంతో ఈ సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో వెంట నే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిత మంగళవారం తీర్పు చెప్పారు. 2022 ఆగస్టులో ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోహన్నగర్లో ఈ దారుణం చోటు చేసుకోగా ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్ నేతృత్వంలో ఎస్సై సురేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లా, బిచ్పల్లి మండలం, ధర్మారం గ్రామానికి చెందిన కొనగంటి శివకుమార్, నాగలక్ష్మి దంపతుతకు పవన్(7), భరత్కుమార్(3)లు అనే ఇద్దరు సంతానం. పెళ్లికి ముందేనాగలక్ష్మికి ఇదే జిల్లా మాధవనగర్ గ్రామానికి చెందిన ముస్తాల రవితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవి హైదరాబాద్ వచ్చి పార్సిగుట్ట మున్సిపల్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ వర్కర్గా పని చేసేవాడు. ఇదే సమయంలో నాగలక్ష్మి కూడా హైదరాబాద్ వెళ్లి ఏదో పని చేసుకుని బతుకుదామని భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్ తీసుకువచి్చంది. ఇద్దరు పిల్లలతో కలిసి రవి నివాసానికి కొద్ది దూరంలోని మోహన్నగర్లో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శివకుమార్కు రవి పెయింటర్గా పని ఇప్పించాడు. నాగలక్ష్మి పెద్ద కుమారుడు పవన్ స్కూల్కు వెళ్తుండగా చిన్న కుమారుడు భరత్(3) పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్కు వెళ్లేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో రవి నాగలక్ష్మి ఇంటికి వచ్చి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. అయితే భరత్ తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి భర్త శివకుమార్తో రవికి ఫోన్ చేయించి అంగన్వాడీ సెంటర్లో ఉన్న తన చిన్న కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పించింది. దీంతో అతను భరత్ను ఇంటికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో అతడికి తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత రవి శివకుమార్కు ఫోన్ చేసి భరత్ కురీ్చపై నుంచి కిందపడ్డాడని తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో శివకుమార్ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా నాగలక్ష్మి ఏడుస్తూ నటించింది. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం చేయించగా బాలుడి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి నాగలక్షి్మతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నాగలక్ష్మి, రవిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. విచారణ అనంతరం న్యాయస్థానం రవిని దోషిగా నిర్ధారిస్తూ యావజీవ కారాగార శిక్ష విధించింది. -
వృద్ధురాలి దారుణ హత్య
తూర్పు గోదావరి: కోరుకొండ మండలం కణుపూరులో తల్లోజు పార్వతి (75) దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లో మంగళవారం రాత్రి నిద్రించిన ఆమె బుధవారం ఉదయానికి రక్తపు మడుగులో పడి ఉంది. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ఉమా మహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కణుపూరు మెయిన్ రోడ్డు బ్రహ్మాలవీధిలో పార్వతి నివాసం ఉంటోంది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన మూడో కుమారుడు వెంకటేశ్వర్లు ఇంట్లో టీవీ సీరియల్ చూసింది. అనంతరం నాలుగో కుమారుడు వీరబాబు ఉంటున్న తన ఇంటికి వచ్చి నిద్రించింది. బుధవారం తెల్లవారేసరికి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ బృందాలు వచ్చి ప్రాథమిక ఆధారాలను సేకరించాయి. రక్తపు మరకలు ఉన్న నైటీని ఆ ఇంటి లోపల షెడ్లో గుర్తించాయి. బలమైన కర్రతో కొట్టి.. పోలీసు డాగ్ తొలుత ఇంటి నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు మీదుగా సమీప ఇంటి వైపునకు పరుగులు తీసింది. తర్వాత మృతురాలి ఇంటి ఆవరణలోని షెడ్డులోకి వెళ్లింది. అనంతరం రోడ్డు మీదకు వచ్చింది. అలాగే క్లూజ్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, మృతిరాలి తలపైనున్న మరకలను పరిశీలించింది. తలపై బలమైన కర్ర లేదా రాడ్డుతో కొట్టి చంపిఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను విచారణ చేస్తున్నారు. తల్లోజు పార్వతికి తొమ్మిది మంది సంతానం. వారిలో ఐదుగురు కూతుర్లు, నలుగురు కుమారులున్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. కుమారుల్లో చిన్నవాడితో పాటు ఉమ్మడి ఇంట్లో పార్వతి నివసిస్తోంది. ఆమె భర్త సుబ్బారావు గతంలోనే మృతి చెందాడు. -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నిండు ప్రాణాన్ని బలికొన్న వివాహేతర సంబంధం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్ రామ టాకిస్ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి, కార్పొరేషన్ 39వ డివిజన్ ఖాజీపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేకల లింగయ్య సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యాత్మక భూములను కొంటూ.. వాటిని పరిష్కరించి.. విక్రయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ భూమి విషయంలో లింగయ్యకు.. మరికొందరికి వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగయ్య రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పెంపుడు కుక్కతో ప్రధాన రహదారి నుంచి పవర్ప్లాంట్కు వెళ్లే దారిలో వాకింగ్ చేస్తున్నారు. అప్పటికే మాటువేసిన దుండగులు లింగయ్యపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కృష్ణాష్టమి రోజే హత్యకు ప్లాన్..? లింగయ్యను హత్య చేసేందుకు నిందితులు కృష్ణాష్టమి రోజే ప్రత్యర్థులు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. అనంతరం వినాయక చవితి పండుగపూట రోడ్లపై ఎవరూ ఉండరని, హత్యకు అదే అనువైన సమయమని దుండగులు భావించినట్లు సమాచారం. సుమారు 12 రోజులపాటు గస్తీ నిర్వహించి.. వాకింగ్కు వెళ్లే సమయం అనుకూలమని నిందితులు నిర్ధారించుకుని పక్కా ప్లాన్ ప్రకారమే రాత్రి సమయంలో లింగయ్య వాకింగ్ చేస్తుండగా.. వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నాడు అన్న.. నేడు తమ్ముడు ఖాజీపల్లికి చెందిన మేకల లింగయ్యతో కలిపి ఐదుగురు అన్నదమ్ములు. లింగయ్య అన్న రాజయ్య 1991 ఏప్రిల్ 4న పొలం పనులకు వెళ్లి ఇంటికొస్తుండగా ఇంటి సమీపంలోనే ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. కుటుంబంలో చిన్నవాడైన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా అతడి హత్య జరిగిన 32 ఏళ్ల తర్వాత లింగయ్యను కూడా అలాగే హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీస్ పహారా మధ్య ఖాజీపల్లి లింగయ్య హత్యలో ఓ అనుమానితుడి ఇంటి ప్రహరీని లింగయ్య కుటుంబసభ్యులు కూల్చివేశారు. దీంతో ఖాజీపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. లింగయ్య అంత్యక్రియల సమయంలోనూ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారా కొనసాగించారు. డాగ్స్క్వాడ్తో దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధితుడి కూతురు మేకల సుప్రజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య
ఖమ్మం: పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి గొడ్డళ్లతో మెడపై నరికి హత్య చేసిన ఘటన కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి (49) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నాయకన్గూడెం నుంచి పాఠశాలకు బైక్పై వెళుతూ హత్యకు గురయ్యాడు. కారుతో బైక్ను ఢీకొట్టి.. వెంకటచారి బైక్ పై వెళుతుండగా నాయకన్గగూడెం శివారులో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టారు. దీంతో వెంకటాచారి కిందపడగా కారులోని వారితో పాటు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి అతని మెడపై గొడ్డలితో నరికి పరారైనట్లు స్థానిక రైతులు తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకే బైక్ రావడం సీసీ పుటేజీల్లోనూ కనిపించడంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించగా దాన్ని ప్రస్తుతం నడపటం లేదు. ఆ భవనాలను గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్రెడ్డి , ఎస్పై రమేష్కుమార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, దుండగులు పరారు కావడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు. వెంకటాచారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. -
భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా...
కావలి: బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లో ముగ్గురిని దారుణంగా హత్య మార్చిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత కోడలితో పాటు ఆమె నాన్న, అమ్మమ్మను అత్త, మామ, మరిది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి నిందితులు పరారీలో ఉండగా పోలీసులు నిఘా ఉంచి శుక్రవారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ వెంకట రమణ నిందితుల వివరాలను వెల్లడించారు. వివరాలు.. కొండబిట్రగుంటకు చెందిన మందాటి మధుసూదన్కు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వాడకుప్ప మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వయస్సున బాబు ఉన్నాడు. రైల్వే ఉద్యోగిగా పనిచేసే మధుసూదన్ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నారు. మౌనిక తన కుమారుడిని బుచ్చిలోని అమ్మమ్మ వద్ద ఉంచి తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గతనెల 28న భర్త గుండెపోటుతో చనిపోవడంతో మౌనిక కొండబిట్రగుంటలోని అత్తగారింటికి వచ్చింది. ఆమెకు తోడుగా ఆమె నాన్న వాడకుప్ప కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ కూడా వచ్చి కొండబిట్రగుంటలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తి గొడవలు తలెత్తడంతో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో మౌనిక అత్తమామలైన మందాటి మాల్యాద్రి, మందాటి ధనమ్మ, మరిది మౌళిచంద్రలు ఇనుప రాడ్లతో దాడి చేసి ముగ్గురిని హతమార్చారు. మౌనిక తల్లి వాడకుప్ప పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బుడంగుంట గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ దారుణ హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం(45) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. తొలుత రెక్కీ నిర్వహించిన ఇద్దరు దుండగులు.. కోరుట్ల నడిబొడ్డున ఉన్న క్రిస్టియన్ కాంపౌండ్ వద్దగల గుడిసె హోటల్ వద్ద ఉదయం నుంచే మాటువేశారు. ఎప్పటిలాగే టీ తాగేందుకు అక్కడకు చేరుకున్న లక్ష్మీరాజం.. హోటల్లో టీ తాగారు. స్థానికులతో ముచ్చటిస్తున్నారు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఇద్దరు అగంతకులు.. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చీరాగానే లక్ష్మీరాజం మెడపై కత్తితో మూడుసార్లు గట్టిగా పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. హఠాత్పరిణామానికి హోటల్లో ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. దుండగులు తాము వచ్చిన ద్విచక్రవాహనంపై పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుకుంటున్న లక్ష్మీరాజంను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం కోరుట్ల తొమ్మిదోవార్డు కౌన్సిలర్. వీరికి ఇద్దరు సంతానం. అధికార పార్టీ నాయకుడు కావడంతో కోరుట్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
నెల్లూరు: బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గుండెపోటుతో మృతిచెందిన కుమారుడి చావుకు కోడలే కారణమనే అనుమానం, ఆవేశంతోపాటు పాతగొడవల నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన కుటుంబసభ్యులు కోడలిపైన, ఆమె తండ్రి, అమ్మమ్మలపై ఆదివారం వేకువజామున దాడికి తెగబడి హతమార్చిన ఘటన గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూదన్కు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన మౌనికకు(32) తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు మన్విత్ ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. మధుసూదన్ బిట్రగుంట రైల్వేస్టేషన్ టెలికాం విభాగంలో పనిచేస్తూ కొండబిట్రగుంటలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, మౌనిక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్నారు. వీరి కుమారుడు మన్విత్ బుచ్చిరెడ్డిపాళెంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మధుసూదన్(35) గుండెపోటుతో మృతిచెందగా మౌనిక తన తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ, కుమారుడు మన్విత్తో కొండబిట్రగుంటకు వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం వేకువజామున మౌనిక(32), ఆమె తండ్రి కృష్ణయ్య(65), అమ్మమ్మ శాంతమ్మ(75) ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యారు. మౌనిక అత్త, మామ, మరిది ఇంటికి తాళాలు వేసి మన్విత్ను తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం బుచ్చిరెడ్డిపాళెం నుంచి మౌనిక తల్లి ఎన్నిసార్లు ఫోన్చేసినా ఎవరూ ఫోన్ తీయకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించగా మౌనిక, ఆమె తండ్రి, అమ్మమ్మ మృతదేహాలు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాయి. మౌనిక మామ(మధుసూదన్ తండ్రి) మాల్యాద్రి, మరిది చంద్రమౌళి, అత్త ధనమ్మ కనిపించకపోవడంతో వారే ఈ హత్యలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా మౌనిక అత్త ధనమ్మను గ్రామంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. పూర్తిస్థాయి విచారణ ఒకే ఇంట్లో మూడు హత్యలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. హత్యలకు కారణాలతోపాటు బయటి వ్యక్తులు ఎవరైనా సహకరించారా, హత్యల అనంతరం నిందితులు ఎక్కడికి పారిపోయారు, మౌనిక కుమారుడు మన్విత్ ఎక్కడ ఉన్నాడు, ఒకే ఇంట్లో మూడు హత్యలు జరిగినా చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకపోవడం, ఎలాంటి అరుపులు వినిపించకపోవడం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అలాగే క్లూస్ టీం సాయంతో సాక్ష్యాధారాలు కూడా పక్కాగా సేకరిస్తున్నారు. చిదిమేసిన మనస్పర్థలు చిన్నచిన్న మనస్పర్థలు, మాట పట్టింపులు రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. మనుషుల మధ్య బంధాలు సన్నగిల్లడం, తమ మాటే నెగ్గాలనే పట్టుదలే కొండబిట్రగుంటలో జరిగిన హత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మందాటి మధుసూదన్ – మౌనిక దంపతులు అన్యోన్యంగానే ఉండేవారని అని తెలిసింది. మధుసూదన్ ఫేస్బుక్ పేజీలో కూడా భార్య, కుమారుడితో దిగిన ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. చిన్నచిన్న మనస్పర్థలతో మౌనిక వేరే కాపురం పెడదామని అడగడం, మధుసూదన్ అందుకు అంగీకరించకపోవడంతో నాలుగేళ్లుగా వారు విడిగా ఉంటున్నారు. ఈక్రమంలోనే తరచూ మానసిక ఒత్తిడికి గురవుతున్న మధుసూదన్ పది రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక కొండబిట్రగుంటకు రాగా, ఆమెకు తోడుగా తండ్రి, అమ్మమ్మ కూడా వచ్చారు. కుమారుడిని కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబసభ్యులు క్షణికావేశంలోనో, కుమారుడి ఉద్యోగం, ఆస్తి కోడలికి దక్కకూడదనే ఉద్దేశంతోనే కోడలిని, ఆమె తండ్రిని, అమ్మమ్మని కూడా హతమార్చారు. కూతురిని, భర్తను, అమ్మను ఒకేసారి కోల్పోయిన మౌనిక తల్లి ఘటనా స్థలంలో కుప్పకూలిపోయింది. ఈమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. -
రౌడీషీటర్ దారుణ హత్య
బనశంకరి: పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే ఓ రౌడీషీటర్ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సిద్దాపుర మహేశ్ హత్యకు గురైన రౌడీషీటర్. మహేశ్ పలు నేరాలతో సంబంధం ఉన్న కారణంగా పరప్పన అగ్రహార జైలుకెళ్లాడు. శుక్రవారం జైలు నుంచి విడుదలైన మహేశ్ హొసరోడ్డు జంక్షన్ వద్ద కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో కారును అడ్డుకున్న ప్రత్యర్థులు మహేశ్పై మరణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి ఉడాయించారు. రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగ వ్యతిరేక గ్యాంగ్లో మహేశ్ లీడర్గా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రత్యర్థి గ్యాంగ్ రౌడీషీటర్ విల్సన్గార్డెన్ నాగ. మోహన్ అలియాస్ డబల్ మీటర్ మోహన్, సునీల్ తదితరులపై కేసులు ఉన్నాయి. 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో హాసన ఫామ్హౌస్లో రౌడీషీటర్ లింగన్నను విల్సన్గార్డెన్ నాగన్న వర్గం హత్య చేసింది. మోహన్, నంజప్ప, కణ్ణన్, కుమార్, ప్రదీప్ గ్రీస్ వాల్టర్, సునీల్ తదితరులతో కలిపి 16 మంది బృందం లింగన్నను హత్య చేశారు. హత్యకు ప్రతీకారంగా లింగన్న గ్యాంగ్లో ఉన్న సిద్దాపుర మహేశ్, విల్సన్గార్డెన్ స్నేహితుడిగా ఉన్న మదన్ను హత్య చేశాడు.దీంతో నాగన్నపై ప్రతీకారం పెరిగింది. అదే కారణంతో శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలైన మహేశ్ను నాగన్న గ్రూపు కాపుగాచి హత్య చేసింది. ఘటనా స్థలాన్ని సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ శరణప్ప పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
ముఠామేస్త్రి దారుణ హత్య
నల్గొండ: వ్యవసాయ పనులకు కూలీలను సమకూర్చే ముఠామేసీ్త్ర దారుణహత్య కు గురయ్యాడు. రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామశివారులో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. హత్యోదంతంపై పరిసర గ్రామాల ప్రజలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కాసరబాద సమీప గ్రామం జమునానగర్కు చెందిన వానరాశి లింగయ్య(50) వ్యవసాయం, ఇతర పనులకు కూలీలను సమకూరుస్తూ ముఠామేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. తనకు అందుబాటులో ఉన్న కూలీలను పని లభించే ప్రాంతానికి తీసుకువెళ్లి ఉపాధి కల్పిస్తుంటాడు. సుమారు 35రోజుల క్రితం లింగయ్య తన కుటుంబ సభ్యులతో పాటు మరో 40మంది కూలీలతో రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి వచ్చాడు. అక్కడే ఓ రైతుకు చెందిన కోళ్లఫారంలో ఉంటూ నిదానపల్లి, తుమ్మలగూడెం గ్రామాల్లో పలువురి రైతులకు చెందిన పొలాల్లో వరినాట్లు వేయించాడు. డబ్బుల కోసమే..? లింగయ్యతోపాటు వచ్చిన కూలీలు తెల్లవార్లు అతని కోసం చెట్టుచేమా వెదికారు. శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో వ్యవసాయబావి వద్దకు వెళ్లిన తుమ్మలగూడేనికి చెందిన పవన్కు తమ పొలం సమీపంలో మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బండరాయితో తల,వీపుపై బలంగా మోదిన ఆనవాళ్లను గుర్తించారు. భువనగిరి నుంచి క్లూస్టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. రైతుల నుంచి వచ్చిన కూలి డబ్బులు మొత్తం అతడి వద్ద రూ.10 నుంచి రూ.12లక్షల వరకు ఉంటాయని కూలీలు, కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆ డబ్బుల కోసమే దుండగులు లింగయ్యను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుడికి భార్య సైదమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనగిరి డీసీపీ రాజేష్చంద్ర, ట్రైనీ ఐపీఎస్ శివం ఉపాధ్యాయ, ఎసీపీ మొగులయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారివెంట సీఐ మోతీరాం, ఎస్ఐలు లక్ష్మయ్య, ప్రభాకర్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించి, హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లాపాపలను వదిలి పొట్టచేతపట్టుకుని వస్తే అన్నంపెట్టే దేవుడిని హత్య చేశారని కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. కూరగాయలు తీసుకొని వెళ్తుండగా.. నాటు వేసే పనులు దగ్గర పడుతుండడంతో కూలీలకు కూలి డబ్బులు చెల్లించడానికి లింగయ్య రైతుల వద్ద నుంచి రావలసిన బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. గురువారం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతుల వద్ద రూ.3లక్షల వరకు వసూలు చేశాడు. అనంతరం లింగయ్య నిదానపల్లిలోని ఓ కిరాణషాపులో కూరగాయలు తీసుకొని తన టీవీఎస్ ఎక్స్ల్పై చిట్యాల–భువనగిరిరోడ్డు నుంచి కూలీలు ఉండే చోటుకు బయలుదేరాడు. నిదానపల్లి శివారుకు వెళ్లగానే దుండగులు అతడి తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే కూప్పకూలి మృతిచెందాడు. అనంతరం దుండగులు అతని బైక్ డిక్కీలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు. బయటికి వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం పొద్దుపోయే వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు, కూలీలు అతడికి ఫోన్చేసినా లిఫ్ట్ చేయలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ తెలియలేదు. అదేరోజు రాత్రి లింగయ్య కుమారుడు మహేష్ తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ బండరాయితో తలపై మోది ఘాతుకం ఫ హతుడి బైక్ డిక్కీలో కనిపించని రైతుల వద్ద వసూలు చేసిన రూ.లక్షలు ఫ డబ్బుల కోసమే అంతమొందించి ఉంటారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ ఫ రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ శివారులో దారుణం -
వాచ్మెన్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): రైల్వేస్టేషన్ విస్తరణ పనుల వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రైల్వేస్టేషన్ తూర్పు టెర్మినల్ వైపు మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేట గొల్లవీధిలో ఎం.సుబ్రహ్మణ్యం(48), గాయత్రి దంపతులు ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు దివాకర్ డిగ్రీ చేసి ఇంటివద్దే ఉంటుండగా, కుమార్తె డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. సుబ్రహ్మణ్యం పగటిపూట ఇంటి వద్దనే దుస్తులను ఇసీ్త్ర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య సహాయకారిగా ఉంటుండేది. గడిచిన మూడునెలలుగా రాత్రివేళల్లో రైల్వేస్టేషన్ విస్తరణ పనుల వద్ద వాచ్మెన్గా సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే సోమవారం సాయంత్రం ఆయన విధులకు వెళ్లారు. రాత్రి సుమారు పది గంట సమయంలో భార్య, కుమారుడు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందో తెలియదుకానీ ఆయన పనిచేస్తున్న చోట మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. తల, కన్ను, చెవివద్ద గాయాలై తీవ్ర రక్తస్రావమైన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీనిని వర్క్ ఇన్చార్జి శేఖర్రెడ్డి ఉదయం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు మృతుని కుమారుడు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై తిరుపతయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు హత్య ఘటనపై ఇన్స్పెక్టర్ విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతునికి ఎవరితోనైనా విభేదాలున్నాయా? స్థానికంగా ఉండే పాతనేరస్తులు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గతంలో రైల్వేస్టేషన్లో, బుకింగ్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఉండేవి. విస్తరణ పనుల నేపథ్యంలో అవి పనిచేయడం లేదు. దీంతో సమీపంలోని సీసీఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇలా జరిగి ఉండొచ్చనే ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు. -
ఉపాధ్యాయుడు దారుణ హత్య
రాజాం సిటీ: మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలో ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ(58) దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత ఉపాధ్యాయుడి మృతిని అంతా ప్రమాదంగా భావించి, బంధువులకు సమాచారమిచ్చారు. మరోవైపు విషయం తెలుసుకున్న రాజాం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతిపై ఆరాతీశారు. రక్తపు మడుగులో ఉపాధ్యాయుడి మృతదేహం, అతడి ముఖంపై గాయాలు ఉండడంతో దానిని హత్యగా గుర్తించారు. స్థానికులతో పాటు ఉపాధ్యాయుడి స్వగ్రామంలో కూడా దర్యాప్తు చేయగా ఉపాధ్యాయుడు హత్యకు గురైనట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. రాజాం పట్టణంలోని గాంధీనగర్లో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ తెర్లాం మండలంలోని కాలంరాజుపేటలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే పాఠశాలకు బయలుదేరిన ఆయన కొత్తపేటకు దగ్గరలో హత్యకు గురయ్యాడు. మృతదేహం రోడ్డు పక్కనే బొలెరో వాహనం వద్ద పడి ఉంది. స్థానికులు ఈ విషయాన్ని రాజాం పోలీసులకు తెలియజేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు కృష్ణ మృతదేహాన్ని గుర్తించి, బంధువులకు విషయం తెలియజేశారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహంపై పడి బోరున విలపించారు. ఫిర్యాదులో ఏముంది.. తాము కొంతకాలంగా రాజాంలోని గాంధీనగర్లో ఉంటున్నామని, తన తండ్రి కృష్ణ 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారని కృష్ణ కుమారుడు శ్రావణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతకుముందు తమ స్వగ్రామం తెర్లాం మండలం, ఉద్దవోలులో రెండు పర్యాయాలు సర్పంచ్గా గెలుపొంది, సేవలందించారన్నారు. ఉద్యోగం రావడంతో రాజాంలో ఉండి, ప్రశాంత జీవనం గడుపుతున్నామని, పరోక్షంగా గ్రామంలో రాజకీయాలకు మద్దతుగా నిలుస్తుండేవాడన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన వ్యక్తికి తన తండ్రి మద్దతు ఇచ్చాడని, దీనిని ఓర్వలేక ప్రత్యర్థివర్గమైన మరడాన వెంకటనాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలు మా నాన్నపై కక్ష పెంచుకున్నారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే మా నాన్న శనివారం స్కూల్కు వెళ్తుండగా, ఇదే అదునుగా భావించిన దుండగులు హత్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
దారుణ ఘటన.. నిద్రలోనే గొంతు కోశారు..
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలంలో దారుణ హత్య జరిగింది. నిద్రపోతున్న నాగేంద్రబాబు (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం వేకువజామున మండలంలోని కానపల్లెలో ఈ దారుణ సంఘటన జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లె పంచాయతీలోని కానపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఆకుమల్ల నాగేంద్రబాబు గ్రానైట్ ఫ్లోరింగ్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో పనికి వెళ్లిన అతడు గురువారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. మద్యం తాగిన సమయంలో అతడు ఇంట్లో కాకుండా పక్కనే ఉన్న అక్క గారింటికి వెళ్లి నిద్రించేవాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగొచ్చి పక్కనే ఉన్న మిద్దైపె నిద్రించాడు. రక్తపు మడుగులో మృతదేహం.. తెల్లారినా భర్త కిందికి రాకపోవడంతో భార్య ఇమాంబీ నాగేంద్రను నిద్రలేపేందుకు శుక్రవారం ఉదయం మిద్దైపెకి వెళ్లింది. భర్త రక్తపు మడుగులో పడిఉండటం చూసి నిర్ఘాంతపోయింది. గట్టిగా కేకలు పెట్టడంతో బంధువులందరూ మిద్దైపెకి పరుగెత్తుకుంటూ వచ్చారు. నాగేంద్రబాబు హత్య గురైన విషయాన్ని పోలీసులకు తెలిపారు. రూరల్ ఇన్చార్జి సీఐ ఇబ్రహీం, ఎస్ఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను పిలిపించి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలంతో పాటు చుట్టు పక్కల ఉన్న రెండు వీధుల్లో కలియ తిరిగింది. ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు నాగేంద్రబాబు హత్యకు గురైన చోటు నుంచి ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు పడి ఉన్నాయి. హత్య కోసం వాడిన కత్తి నుంచి రక్తం కింద పడినట్లు పోలీసులు నిర్ధారించారు. రక్తపు మరకలు పడిన ఆనవాళ్లను బట్టి దుండగులు వెళ్లిన మార్గాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపైకి వెళ్లేందుకు విశాలమైన ప్రధాన ద్వారం ఉన్నా.. ఇంటి పక్కనే ఉన్న ఇరుకై న సందులో నుంచి దుండగులు మిద్దైపెకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులే నాగేంద్రను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగేంద్ర పక్కనే అతడి అక్క కుమారుడు పడుకొని ఉన్నాడు. అతడు కూడా మద్యం సేవించి నిద్రించాడని, పైగా అతడికి చెవుడని బంధువులు తెలిపారు. హత్య జరిగే సమయంలో పెనుగులాట జరిగి ఉంటుందని.. నీకు వినిపించలేదా? అని పోలీసు అధికారులు అతన్ని ప్రశ్నించారు. తనకు వినిపించలేదని పోలీసులకు తెలిపాడు. నాగేంద్రబాబు ప్రవర్తన గురించి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. శుక్రవారం వేకువ జామున హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న నాగేంద్రబాబు నాగేంద్రబాబుకు నాలుగేళ్ల క్రితం పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన ఇమాంబీతో ప్రేమ వివాహం జరిగింది. మొదట్లో వీరి పెళ్లిని ఇమాంబీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత అందరూ కలిసిపోయారు. వారికి మూడు, రెండేళ్ల వయసు గల నందన, పురుషోత్తం అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఇమాంబీ ఇంట్లోనే చిల్లర కొట్టు నిర్వహిస్తోంది. భర్త మరణంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఇమాంబీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
కరీంనగర్లో లేడీ రియల్టర్ దారుణ హత్య
కరీంనగర్ క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఒక వివాహిత నిండు ప్రాణాలు బలిగొన్నాయి. కరీంనగర్ వన్టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్నగర్లోని క్రిస్టల్ ప్లా జా అపార్ట్మెంట్లో వివాహిత గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖని 8 ఇన్క్లైన్ కాలనీకి చెందిన ఆకుల ఓదెలు–లక్ష్మిల రెండో కుమార్తె సరిత మంచిర్యాల జి ల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది. గోదావరిఖనిలో నివసిస్తున్న వారికి ఆస్మిత్రెడ్డి, మణిత్రెడ్డి సంతానం. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం నచ్చని శ్రీపాల్రెడ్డి అందుకు అభ్యంతరం తెలిపాడు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య గొడవలకు దారితీయడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్కు వెళ్తుండే ది. ఈ క్రమంలో భగత్నగర్లోని క్రిస్టల్ అపార్ట్మెంట్ 203 ఫ్లాట్లో ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. దీంతో సరిత సుమారు రూ. 20 లక్షలకుపైగా డబ్బును వెంకటేశ్కు ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీశ్ నగరంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో కుమారులతో సహా సరితత మ్ముడి ఇంట్లోనే ఉంది.జూన్ 28న కొడుకులను గోదావరిఖని పంపిన సరిత అదేరోజు సాయంత్రం వెంకటేశ్తో కలసి రియల్ ఎస్టేట్ పనులపై వరంగల్కు వెళుతున్నానని చెప్పింది. ఆమె సోదరుడు మర్నాడు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం సరిత ఫోన్ నుంచి ఆకుల సతీశ్కు వెంకటేశ్ వాట్సాప్ కాల్ చేశాడు. సరిత తల గోడకు కొట్టుకుందని, ఫ్లాట్ లోపలే ఉందని, ఆమెను తాళం పగలగొట్టి తీసుకెళ్లాలని చెప్పి పరారయ్యాడు. దీంతో కంగారుపడిన సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్... హుటాహుటిన అపార్ట్మెంట్కు వెళ్లి తాళం పగలగొట్టి లోనికి వెళ్లిచూడగా రక్తపు మడుగులో, ముఖం, తలపై తీవ్రగాయాలతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ బిగించి ఉంది. సతీశ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రధా న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణం... సరిత మృతికి వ్యాపార లావాదేవీలే కా రణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు రూ. 25 లక్షలను పెట్టుబడి కింద వెంకటేశ్కు సరిత ఇచ్చిందన్నారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వా లని అడగడంతో వెంకటేశ్ ఇవ్వలేదని.. దీనిపై ఇద్దరికీ గొడవలు జరిగేవని సతీశ్ తెలిపాడు. వెంకటేశ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
కడపలో వైఎస్సార్సీపీ నేత దారుణహత్య
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సంధ్యాసర్కిల్ సమీపంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుడు సి.శ్రీనివాసులరెడ్డి (42) దారుణహత్యకు గురయ్యాడు. బురఖాలు ధరించి మాటువేసిన దుండగులు ఒక్కసారిగా కొడవళ్లతో దాడిచేశారు. పిడిబాకులతో విచక్షణారహితంగా పొడిచారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెత్తిన శ్రీనివాసులరెడ్డి వందడుగుల దూరంలో కుప్పకూలిపోయాడు. సినిమా ఫక్కీలో హత్యచేసిన దుండగులు పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి కొన్నేళ్లుగా కడపలో నివాసం ఉంటున్నాడు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తూ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. రోజూ సంధ్యాసర్కిల్ సమీపంలో ఎర్రముక్కపల్లి దారిలో ఉన్న రాబిట్ జిమ్కు వ్యాయామానికి వెళ్లేవాడు. ఆయన కదలికలను గమనించిన దుండగులు శుక్రవారం ఉదయం జిమ్ సమీపంలో బురఖాలు ధరించి మాటువేశారు. శ్రీనివాసులరెడ్డి జిమ్ నుంచి బయటకు రాగానే మారణాయుధాలతో ఒక్కసారిగా దాడిచేశారు. కత్తిపోట్లకు గురైన శ్రీనివాసులరెడ్డి దుండగుల నుంచి రక్షించుకునేందుకు కొద్దిదూరం పరుగెత్తి కుప్పకూలిపోయాడు. అతడు రక్తపుమడుగులో తీవ్రగాయాలతో పడిపోవడంతో నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న శ్రీనివాసులరెడ్డి భార్య మౌనిక అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో భర్తను రిమ్స్కు తరలించారు. రిమ్స్కు చేరిన కొద్దిసేపటికే శ్రీనివాసులరెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసులరెడ్డి హత్యకు నిందితులతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుల్ని పట్టుకునేందుకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ సారథ్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి హత్యపట్ల ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తీవ్ర ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు మోపూరి ప్రతాప్రెడ్డి, పాలెంపల్లి సుబ్బారెడ్డి, జమీల్ మొబైల్స్ యజమాని జమీల్, గుంటి నాగేంద్రలపై క్రైమ్ నంబర్ 252/2023 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు మహాదీప్రెడ్డి (14), హనుదీప్రెడ్డి(12) ఉన్నారు. శ్రీనివాసులరెడ్డి స్వగ్రామంలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ‘లోకేశ్ పర్యటనలోనే హత్యకు బీజం’ శ్రీనివాసులరెడ్డి హత్యకేసులో నిందితులు పావులు మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి చెప్పారు. ఇటీవల టీడీపీ నేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఈ హత్యకు బీజం పడిందని ఆరోపించారు. శ్రీనివాసులరెడ్డిని హత్యచేసి అందరినీ భయాందోళనలకు గురిచేయాలని కుట్ర చేసినట్లు భావిస్తున్నామన్నారు. సూత్రధారులపై లోతైన దర్యాప్తుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
రౌడీషీటర్ దారుణ హత్య... కీలకపాత్ర పొషించిన మహిళ!
నరసరావుపేట రూరల్: చిలకలూరిపేట రోడ్డులోని ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన రౌడీషీటర్ షేక్ బాజీ (35) దారుణ హత్యకు గురయ్యాడు. 2021లో జరిగిన హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో మహిళ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ షేక్ బాజీపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2021 సెప్టెంబర్ 13న ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన షేక్ సుభాని హత్య కేసులోనూ ప్రధాన నిందితుడు. ఈ కేసులో సయ్యద్ పీర్వలి ఉరఫ్ అల్లాకసమ్ మరో నిందితుడిగా ఉన్నాడు. వీరిద్దరూ అప్పట్లో అరైస్టె మూడు నెలలు సబ్జైలులో ఉన్న అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఈ క్రమంలో సుభాని తల్లి జాన్బీ, ఆమె రెండో కుమారుడు హుస్సేన్, మరికొందరు కలిసి చిత్రాలయ టాకీస్ సెంటర్ సమీపంలో అల్లాకసమ్ను అదే ఏడాది డిసెంబర్ 21న హత్యచేశారు. ఈ కేసులో జాన్బీతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఐదు నెలలు సబ్జైలులో ఉన్న అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. తన కుమారుడిని హతమార్చిన బాజీ కోసం జాన్బీ, ఆమె అనుచరులు నిఘాపెట్టారు. విషయం తెలుసుకొన్న బాజీ కొంతకాలంగా చిలకలూరిపేటలోని తన అత్త ఇంట్లో తలదాచుకుంటున్నాడు. శపథం చేసి వరుస హత్యలు! బాజీ అదే కాలనీకి చెందిన జాన్బీతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జాన్బీ కుమారుడు సుభానిని బాజీ, అతని స్నేహితుడు అల్లాకసమ్ కలిసి హత్యచేశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారిని వదిలేది లేదని జాన్బీ కుమారుడి మృతదేహం వద్ద పోలీసుల సమక్షంలోనే శపథం చేసింది. ఈ క్రమంలోనే తన కుమారుడి హత్యకేసులో ప్రధాన నిందితులు ఇద్దరిని ఒకరి తరువాత మరొకరిని హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు. పథకం ప్రకారం.. అల్లాకసమ్ హత్య అనంతరం నరసరావుపేట నుంచి తన మకాంను బాజీ చిలకలూరిపేటకు మార్చాడు. కోర్టు వాయిదాలకు రావాలన్నా అనుచరుల రక్షణతో వచ్చి వెళ్తున్నాడు. దీంతో అక్కడ బాజీని హతమార్చడం కష్టమని భావించి రాజీ మార్గం ద్వారా జాన్బీ పథకం అమలు చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా కొన్ని రోజులుగా తిరిగి బాజీతో సన్నిహితంగా ఉంటూ హత్యకు పథక రచన చేసినట్టు సమాచారం. మంగళవారం రాత్రి బాజీని ఎస్ఆర్కేటీ కాలనీకి పిలిపించి ఫూటుగా మద్యం తాగించి.. ఆ తరువాత అతడిపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడిచేసి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకువెళ్లి అక్కడ గోతిని తీసి మృతదేహాన్ని పెట్రోల్తో తగులబెట్టి పూడ్చివేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్ఐ బాలనాగిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించారు. పోలీసుల అదుపులో నిందితులు.. హత్య అనంతరం నిందితులు రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. జాన్బీతోపాటు మరో నలుగురు హత్యలో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
మూడేళ్ల క్రితం కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
తూర్పు గోదావరి: నిద్ర పోతున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, హత మార్చిన ఘటన నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ హఫీజ్ (23) అదే గ్రామానికి చెందిన తలారి భవానీ(హసీనా)ని ప్రేమించి, మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి హఫీజ్ పెద్దలు అంగీకరించలేదు. దీంతో అతడు భార్య హసీనా ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోను, ఆరుబయట మంచంపై హఫీజ్ ఒక్కడూ పడుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హఫీజ్ ముఖంపై బలవంతంగా నొక్కి, తల వెనుక వైపు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చారు. రక్తమడుగులో ఉన్న భర్త హఫీజ్ను చూసి భార్య హసినా కేకలు వేయగా, ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ, సీఐ కె.వెంకటేశ్వరరా పరిశీలించారు. హఫీజ్ పనీ పాట లేకుండా స్థానికంగా యువకులతో కలిసి పలు గొడవలకు వెళ్తూండటంతో పాత కక్షల నేపథ్యంలో దుండగులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ట్రైనీ ఐపీఎస్ పంకజ్కుమార్ పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేంద్ర నాయక్(54) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు వ్యక్తులు మరణాయుధాలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న కాసీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం పీహెచ్సీకి తరలించారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నాయక్ కాసీపూర్కు సమీపంలోని సికరలోడ గ్రామంలో ఉన్న తన పొలానికి వ్యవసాయం పనులు చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చంద్రగిరి పంచాయతీకి చెందిన భాగో గౌడొ, అతని ఇద్దరు కుమారులు అతనిపై మరణాయుధాలతో ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో తీవ్రగాయాల పాలైన నాయక్.. అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం నిందితులు పరారయ్యారు. గత కొద్ది కాలంగా ఇరువర్గాల మధ్య తగాదాలు ఉన్నాయని సమాచారం. మృతుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా యువజన కాంగ్రెస్ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. అతని మృతిపట్ల పలువురు కాంగ్రేస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్మెన్ హత్య కేసులో ట్రయల్కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
రౌడీషీటర్ క్రాంతి దారుణ హత్య.. కొడుకుతో కలిసి హత్యలో పాల్గొన్న వ్యక్తే ?
విశాఖపట్నం: ఎంవీపీ కాలనీ పోలీస్స్టేషన్ పరిధి ఆదర్శనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రౌడీషీటర్ వాసుపల్లి లక్ష్మణరావు అలియాస్ క్రాంతి (50)ని దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనలో హత్యకు గురైన క్రాంతిపై గతంలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయి. గత కొన్నాళ్లుగా అతడు వివాదాలకు దూరంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన క్రాంతి అనుపమ బార్ ప్రాంగణంలో మద్యం సేవించాడు. అనంతరం అక్కడ చీకులు అమ్ముతున్న వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడి సమీపంలో రోడ్డుకు అటువైపు ఉన్న మెడ్ప్లస్ మెడికల్ షాపు వద్ద మందులు కొనడానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మెడ్ప్లస్ షాపులోకి వెళుతున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. మెడ, నుదిటి భాగంలో తీవ్రంగా నరకడంతో క్రాంతి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కొడుకుతో కలిసి హత్యలో పాల్గొన్న వ్యక్తే ? 2022 ఆగస్టు 17న జరిగిన అదే ప్రాంతంలో జరిగిన ఓ హత్య ఘటనలో క్రాంతి కొడుకు శ్యామ్తో పాటు పాల్గొన్న ఎర్రయ్య అనే వ్యక్తే క్రాంతిని హతమార్చినట్లు సమాచారం. ఆ హత్య కేసులో క్రాంతి కొడుకు శ్యామ్ ఏ1 కాగా ఎర్రయ్య ఏ3 ముద్దాయిగా ఉన్నాడు. ఆ ఘటన అనంతరం క్రాంతి తన కొడుకు శ్యామ్ బెయిల్ కోసం, ఇతర అవసరాల కోసం తప్ప ఆ హత్యకు సహకరించిన తనని పట్టించుకోలేదనే కక్షతో కొన్నాళ్లుగా ఎర్రయ్య రగిలిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీరు ఇరువురు కొంతకాలంగా గొడవ పడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూసిన ఎర్రయ్య గురువారం మెడికల్ షాపునకు వచ్చిన క్రాంతిపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో అతనికి వేరే వ్యక్తులు కూడా సహకారం అందించినట్లు పలువురు చెబుతున్నారు. క్రాంతిపై గతంలో కేసులు.. హత్యకు గురైన క్రాంతిపై నగరంలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయి. పీఎం పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హత్య కేసును కోర్టు కొట్టేయగా.. 2014లో 3వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ఈ ఘటన అనంతరం క్రాంతి భార్య విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తన భర్తను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం ఆయనే పలుమార్లు తనకు చెప్పాడన్నారు. ఇందుకు అవసరమైన డబ్బులు వేరే వ్యక్తులు సమకూరుస్తున్నారన్నారు. ఎవరు హత్య చేశారనే విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ హత్య నేపథ్యంలో క్రాంతి కొడుకుతో పాటు పలువురిని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యువకుడి దారుణ హత్య.. కారుతో తొక్కించి చంపిన స్నేహితుడు
ఏలేశ్వరం: స్నేహితుడే కాలయముడయ్యాడు. నిత్యం కలిసి తిరుగుతూ ఉన్న స్నేహితుడే కారుతో తొక్కించి కర్కశంగా తుది ముట్టించిన ఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. ఈ ఘటనలో పట్టణానికి చెందిన కోరాడ మణికంఠ(23) మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కోరాడ మణికంఠ, బంటు దుర్గాప్రసాద్ స్నేహితులు. అర్ధరాత్రి 11, 12 గంటల మధ్య దుర్గాప్రసాద్ కారులో మణికంఠను బయటికి తీసుకువెళ్లాడు. ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటలకు మణికంఠ తండ్రి శ్రీనివాసరావు బంధువులతో కలిసి వెతికాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు రాగా కారులో బయటకు వస్తున్న దుర్గాప్రసాద్ను నిలదీశారు. దీంతో మణికంఠ తన తాతను తిట్టాడని దీనిపై నిలదీయగా నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తానని చెప్పడంతో కారుతో తొక్కించి చంపేశానని దుర్గాప్రసాద్ చెప్పాడు. దీంతో మృతుడు తండ్రి శ్రీనివాసరావు ిఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సీఐ కిషోర్బాబు, ఎస్సై సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
తాడిపత్రిలో వివాహిత దారుణ హత్య.. వారిపైనే అనుమానం?
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): మంచంపై నిద్రిస్తున్న వివాహితను తలపై కత్తితో నరికి చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నందలపాడులో చోటుచేసుకుంది. ఆ మహిళను భర్త లేదా కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. నందలపాడుకు చెందిన రంగనాథ్రెడ్డి, శివమ్మ (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమార్తెలందరికీ వివాహమైంది. కుమారుడు రవీంద్రనాథ్రెడ్డి ఇటీవల ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో కొడుకును ఇంటికి రావొద్దని తల్లి శివమ్మ వ్యతిరేకించింది. దీంతో రవీంద్రనాథ్రెడ్డి తాడిపత్రిలోనే వేరు కాపురం పెట్టాడు. చదవండి: అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు కాగా.. భర్త రంగనాథ్రెడ్డి, భార్య శివమ్మ ఇద్దరే నందలపాడులో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి శివమ్మ తన ఇంటి వసారాలో మంచంపై నిద్రపోగా.. భర్త రంగనాథ్రెడ్డి ఇంటి మిద్దెపైకి ఎక్కి పడుకున్నాడు. గురువారం ఉదయం కిందకు దిగొచ్చిన రంగనాథ్రెడ్డి తన భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. ముమ్మాటికీ హత్యే కానీ.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 70 శాతానికి పైగా కాలిపోయిన శివమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. కాలిపోతున్నప్పుడు కేకలు వేసేదని పోలీసులు చెబుతున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో అటూఇటూ తిరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని గుర్తించిన పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి శివమ్మ హత్యకు గురైందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చి క్లూస్ టీమ్ను రప్పించారు. శివమ్మ తలపై కత్తిలాంటి పదునైన ఆయుధంతో నరికిన ఆనవాళ్లను క్లూస్ టీమ్ కనుగొంది. శివమ్మ తలపై రెండుచోట్ల బలమైన లోతు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముందుగా శివమ్మను తలపైకొట్టి హత్య చేసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. చంపిందెవరో! కాగా, శివమ్మను చంపింది ఎవరనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. తన భార్య హత్యకు గురైనా.. ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త రంగనాథరెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు ఇటీవలే మతాంతర వివాహం చేసుకున్న కుమారుడు రవీంద్రనాథ్రెడ్డిని శివమ్మ ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతడేమైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే అనుమానం కూడా ఉంది. కుమారుడు రవీంద్రనాథ్రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. శివమ్మ అంత్యక్రియలు ముగిసిన అనంతరం తండ్రీ కొడుకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం గానీ.. వారిద్దరిలో ఎవరు హంతకులో చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఉప సర్పంచ్ దారుణ హత్య
కొవ్వూరు: వేములూరు ఉప సర్పంచ్ శీని సత్యవరప్రసాద్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. వివాద రహితుడిగా పేరున్న ప్రసాద్ హత్య వార్తతో వేములూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉదయం ఆయన తన స్వగృహంలోని వరండాలో విగతజీవుడిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ, పట్టణ సీఐ ఏఎల్ఎస్ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. భార్య శ్రీకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అసలు రాత్రి ఏం జరిగిందో... శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు ప్రసాద్ ఇంటి దగ్గర స్థానికులతో మాట్లాడారని చెబుతున్నారు. 11 గంటలకు తన కుమార్తెతో ఫోన్ మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కేకలు, ఆరుపులు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా తగవు తీర్చు తున్నారేమో అనుకున్నామంటున్నారు. అసలు అర్ధరాత్రి ఏం జరిగింది? గోడవ పడింది ఎవరు? అన్నది మిస్టరీగా మారింది. ప్రసాద్ తలకు గాయమైంది. తలను గోడకు కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. విగత జీవుడిగా పడి ఉన్న ప్రసాద్ ఒంటిపై నూలు పోగు కూడా లేదు. గత కొనేళ్లుగా ఒంటరిగానే... ప్రసాద్ కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. భార్య శ్రీకళ జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు కళాశాలలో పనిచేస్తూ పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఐదారేళ్ల కిత్రం తల్లి మృతి చెందడంతో ప్రసాద్ హోటల్లో భోజనం చేస్తున్నారని చెబుతున్నారు. కుమారుడు హనురామ్ ప్రస్తుతం రాజానగరం గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కుమార్తె సుప్రజ సీఆర్ రెడ్డి కళాశాలలో ఫార్మ్–డి చదువుతుంది. ప్రసాద్కి భార్యకు మధ్య అంతగా సఖ్యత ఉండేది కాదంటున్నారు. -
పాక్లో పైశాచిక ఘటన.. భారత్ స్పందన ఇది
ఢిల్లీ: పాకిస్థాన్లో జరిగిన పైశాచిక ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్లో మైనారిటీల(హిందూ, ఇతర ముస్లిమేతర మతాల) పరిరక్షణతో పాటు వాళ్ల భద్రత బాధ్యత కూడా అక్కడి ప్రభుత్వానిదేనని కుండబద్ధలు కొట్టింది. తాజాగా.. సింజోరో పట్టణంలో బుధవారం ఓ హిందూ మహిళను ఘోరంగా హత్య చేశారు. 40 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి మరీ హత్య చేశారు. ఆపై వర్ణించడానికి వీల్లేని రీతిలో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. ఈ విషయాన్ని అక్కడి హిందూ సెనేటర్ కృష్ణ కుమారి ట్వీట్ ద్వారా వెల్లడించారు. Daya Bhel 40 years widow brutally murdered and body was found in very bad condition. Her head was separated from the body and the savages had removed flesh of the whole head. Visited her village Police teams from Sinjhoro and Shahpurchakar also reached. pic.twitter.com/15bIb1NXhl — Krishna Kumari (@KeshooBai) December 29, 2022 ఈ ఘోర హత్యాచారోదంతంపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీకి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. పాక్ గడ్డపై ఉన్న మైనారిటీల పరిరక్షణ అక్కడి ప్రభుత్వానిదే. వాళ్ల బాగోగులు కూడా చూసుకోవాలి. గతంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాం. ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నాం అని ఆయన తెలిపారు. అయితే.. ప్రత్యేకించి ఆ కేసు ఇంకా ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు. India calls on Pakistan to protect minorities after killing of Hindu women Daya Bheel in Sindh province https://t.co/c5nSo1ylWV pic.twitter.com/it5hun7Z4U — Sidhant Sibal (@sidhant) December 29, 2022 -
ప్రేమ వివాహం.. ఆపై ఆటో డ్రైవర్కు దగ్గరై.. భర్తను దారుణంగా..
సాక్షి, కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన దాడిబండ ఆమోస్ (26) దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమోస్ భార్య అరుణ ప్రోద్బలంతో ఆటోడ్రైవర్ ములకల సూర్యప్రదీప్, అతని స్నేహితుడు నేసే జీవన్కుమార్తో కలసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. నిందితులను పక్కా ఆధారాలతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శంకరయ్యతో కలసి బుధవారం సాయంత్రం డీఎస్పీ కేవీ మహేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను 2016లో కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అరుణ మైనర్ అయినందున ఆమెను హోమ్లో ఉంచి ఆమోస్పైన నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. అరుణ మేజర్ అయిన తర్వాత తిరిగి ఇద్దరూ కలుసుకుని మరోసారి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి) అల్వాల గ్రామంలో ఉన్నప్పుడు మద్యం సేవించి భార్యను అమోస్ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయంలో భార్యాభర్తలు గొడవ పడి అల్వాల గ్రామం వదిలి ఏడాది క్రితం కర్నూలుకు వచ్చారు. ఉద్యోగనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ సిటీ స్క్వేర్ మాల్లోని బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా, అదే షోరూమ్లో జాకీ దుస్తుల దుకాణంలో అరుణ సేల్స్ గర్ల్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. వీరిద్దరూ సూర్యప్రదీప్ అనే వ్యక్తి ఆటోలో వెళ్లి వస్తుండేవారు. ఆటోడ్రైవర్ సూర్యప్రదీప్తో కలసి ఆమోస్ తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్తో అరుణకు చనువు ఏర్పడి తన బాధలు చెప్పుకుంది. హత్య కేసులో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడిస్తున్న కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ భర్త తనను శారరీకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అతనిని అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్తో చెప్పుకుంది. దీంతో సూర్యప్రదీప్ పథకం ప్రకారం తన స్నేహితుడైన జీవన్ సహాయంతో ఈనెల 22వ తేదీ రాత్రి శరీన్నగర్లోని సవారితోట కాలనీ చివర గల హంద్రీ నది ఒడ్డుకు ఆమోస్ను తీసుకువెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత వెంట తీసుకువెళ్లిన రాడ్డుతో తలపై బాది హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రాడ్డు, బండరాయి, సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. చదవండి: (అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది) -
బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు
బెంగళూరులో అర్థరాత్రి జరిగిన దారుణ హత్య పెద్ద కలకలం సృష్టించింది. ఒక వ్యక్తిపై కొంతమంది వ్యక్తుల గుంపు పెద్ద ఇటుక రాయితో దాడిచేసి తలపగల కొట్టి చంపేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బెంగళూరులోని కెపీ అగ్రహార ప్రాంతంలోని ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళల గుంపు ఒక చోట కూర్చొని ఉన్న వ్యక్తి వద్దకు సముహంగా వచ్చారు. కాసేపు అతనితో వాగ్వాదానికి దిగి అతడిపై దాడి చేశారు. ఇంతలో ఒక మహిళ ఒక రాయిని తీసుకువచ్చి అతడి తలపగలు కొట్టింది. మరోవైపు కొంతమంది భాదితుడిని కదలకుండ పట్టుకుని ఉండగా... ఒక వ్యక్తి రాయితో అదేపనిగా కొడుతూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఐతే బాధితుడి కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించి...పోలీసులకు సమాచారం అందించారు. కానీ సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బాదామి ప్రాంతానికి చెందినవాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Murder On CCTV In Bengaluru, Group Smashes Man's Head With Stones#Bengaluru #cctvfootage #Murder #Badami #argument #crimenews #KPAgrahara #attackers #killed #Karnataka #news #latestupdate #dailynews #IndianJourno pic.twitter.com/sF4eyTPFF0 — Indian Journo (@indianjournoapp) December 6, 2022 (చదవండి: వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు) -
తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ఉప్పల్: ఉప్పల్లో శుక్రవారం జరిగిన తండ్రి కొడుకుల దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థిరాస్థి విషయంలో కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, విచారణలు వెరిసి ఒకే కుటుంబంలో ఇద్దరి హత్యకు దారితీసిన విషయం విదితమే. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్థి తగాదాలతో పాటు మరేదైన కోణం ఉందా అనే విషయంలో సైతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుల విచారణ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే దాదపుగా 40 మంది అనుమానితులను విచారించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా, నిందితుల చాయ చిత్రాలతో అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ నంబర్లు, సెల్ టవర్లు లోకేషన్లతో కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుల అదుపులో మరో నలుగురు శనివారం మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం అనుమానితులైన కొందరిని అదుపులోకి విచారించిన సంగతి విదితమే. దుండగులు అదే గల్లీలో బాధితుల ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణంలో వెల్లడైంది. హాస్టల్లోని సీసీ ఫుటేజీలతో పాటు డీవీఆర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తండ్రీ కొడుకుల దారుణ హత్య) -
తండ్రీ కొడుకుల దారుణ హత్య
హైదరాబాద్(ఉప్పల్): ఉప్పల్లో శుక్రవారం తెల్లవారుజామున జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తండ్రీకొడుకుల్ని దారుణంగా చంపేశారు. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎస్ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, హతుల కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78) పురోహితుడు. ఆయన భార్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు కొన్నాళ్లుగా మరో ప్రాంతంలో ఉంటున్నారు. దీంతో చాలాకాలం నర్సింహ ఒక్కరే హనుమసాయినగర్లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన చిన్న కుమారుడు, మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన నర్సింహుల శ్రీనివాస్ (45) తండ్రి బాగోగులు చూడటానికి మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చి తండ్రితో కలిసి ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పని మనిషి ఇంటి గేటు తీసుకుని లోపలకు వెళ్లింది. అప్పటికే ఆ ప్రాంతంలో వేచి ఉన్న ఇద్దరు దుండగులు భుజానికి ఉన్న బ్యాగ్తో ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించారు. పంతులు గారిని పిలవాలంటూ పని మనిషికి చెప్పడంతో ఆమె ‘మీ కోసం ఎవ్వరో వచ్చారు అయ్యగారు’ అంటూ నర్సింహకు చెప్పింది. దీంతో పూజలో ఉన్న ఆయన గది నుంచి బయటకు వచ్చి పోర్టికోలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ‘ఎవరు మీరు? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ఓ దండగుడు ఆయన సమీపంలోకి వెళ్లి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఏదో జరుగుతోందని భావించిన నర్సింహ్మ గట్టిగా అరిచారు. ఈ అరుపులు విని అక్కడకు వచ్చిన పనిమనిషి జరుగుతోంది చూసి భయంతో అరుస్తూ పరుగులు పెట్టింది. ఈలోపే మరో దుండగుడు తనతో తెచ్చుకుని కత్తితో నర్సింహ గొంతు కోశాడు. దీంతో ఆయన పక్కకు పడిపోయారు. ఈ గొడవ విన్న చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంటి మొదటి అంతస్తు నుంచి హడావుడిగా కిందికి వచ్చాడు. అప్పటికే తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్న దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గేటు సమీపంలో శ్రీనివాస్ పైనా వాళ్లు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్పకూలిన అతడు కన్నుమూశాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న స్థానికులు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు కత్తులతో బెదిరించడంతో వెనక్కు తగ్గారు. ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా టీషర్టులు ధరించి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టడం, తదితర పరిణామాల నేపథ్యంలో వీళ్లు కిరాయి హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యలపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాల వద్ద నుంచి బయలుదేరిన పోలీసు జాగిలాలు సమీపంలోనే దుండగులు పడేసిన బ్యాగ్ వరకు వెళ్లి వెనక్కు వచ్చాయి. ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెరిచిన చూడగా... అందులో కుంకుమ, పుసుపు, అగర్బత్తీలు కనిపించాయి. ఆస్తి తగాదాలు...కోర్టు వ్యాజ్యాలు నర్సింహకు కొందరితో ఆస్తి తగాదాలతో పాటు కోర్టులో వ్యాజ్యాలు ఉన్నాయి. వాళ్లు రెండేళ్ల క్రితం ఓసారి నర్సింహపై దాడి చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుల ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ముగ్గురిగా అనుమానిస్తున్నారు. మూడో వ్యక్తి కాస్త దూరంలో ఉండి ఇద్దరిని నర్సింహ ఇంటికి పంపినట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కోసం మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చిన శ్రీనివాస్ పాత కక్షలకు బలయ్యాడంటూ కుటుంబీకులు విలపించారు. వారం రోజుల రెక్కీ.. నర్సింహ హత్యకు రంగంలోకి దిగిన దుండగులు వారం రోజుల పాటు పక్కాగా రెక్కీ చేశారు. దీనికోసం వాళ్లు హతుల ఇంటి ఎదురుగానే ఉన్న ఓ డీలక్స్ హాస్టల్లో బస చేశారు. అక్కడ ఉంటూనే ప్రతి రోజూ నర్సింహ ఇంటిని పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరు వస్తుంటారు? ఆ ఇంటి పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు ఏ సమయంలో ఎలా ఉంటాయి? తదితర అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చివరకు తెల్ల వారుజాము సమయమే తమకు అనుకూలమని భావించి శుక్రవారం తమ పని పూర్తి చేసి పారిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న దుండగుల బ్యాగ్లో పూజా సామాగ్రితో పాటు కారం ప్యాకెట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన ఆ ఇంటి పని మనిషి నుంచి వాంగ్మూలం సేకరించారు. -
విశాఖలో దారుణ హత్య
-
అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికిన అత్త.. కారణం అదే?
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ అత్త.. తన కోడలి తల నరకడం సంచలనంగా మారింది. అనంతరం తలపట్టుకుని పోలీసు స్టేష్టన్కుఉ వెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. రాయచోటిలోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ.. తన కోడలు వసుంధరను దారుణంగా హత్య చేసింది. కత్తితో తన కోడలి తల నరికింది. అనంతరం వసుంధర తలను తీసుకుని పోలీసు స్టేషన్కు వెళ్లింది. కాగా, కవర్లో ఉన్న వసుంధర తలను చూసి పోలీసులు షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాల ప్రకారం.. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో, ఆమె పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా, భర్త మరణానంతరం ఆస్తులు అన్ని వసుంధర పేరు మీదకు బదిలీ అయ్యాయి. దీంతో, వసుంధర ఆస్తులను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి రాసివ్వాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది. దీంతో, వసుంధర భర్త తమ్ముడు చందు, ఆమె చిన్నత్త సుబ్బమ్మ కలిసి వసుంధరను హత్య చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం వసుంధర తల నరికి మొండాన్ని వేరు చేశారు. అనంతరం, పట్టణంలో పట్టపగలే సుబ్బమ్మ ఇలా తల పట్టుకుని పోలీసు స్టేషన్కు వెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విద్యార్థినితో చనువుగా తిరిగి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో పొడిచి..
ములుగు రూరల్: మైనింగ్ వ్యాపారం చేసే ఓ న్యాయవాది దారుణంగా హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు నడిరోడ్డుపై వెంబడించి మరీ కత్తులతో పొడిచి చంపేశారు. ములుగు జిల్లా భూపాల్నగర్ (పందికుంట) స్టేజీ వద్ద సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. మైనింగ్కు సంబంధించిన భూ వివాదాలే ఈ హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును వెనుక నుంచి ఢీకొట్టి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన మాడగుండ్ల మల్లారెడ్డి (54) కొన్నేళ్లుగా హనుమకొండ బాల సముద్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ములుగు జిల్లా మల్లంపల్లిలో పెట్రోల్ బంక్, మైనింగ్ వ్యాపారం ఉన్నాయి. వ్యాపార పనుల నిమిత్తం ఆయన తరచూ మల్లంపల్లికి వచ్చి వెళ్తుంటారు. సోమవారం సాయంత్రం ఆయన ఇన్నోవా వాహనంలో ములుగుకు వచ్చి తిరిగి హనుమకొండకు బయల్దేరారు. పందికుంట స్టేజీ వద్ద ఆయన వాహనాన్ని వెనుక నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. దీంతో మల్లారెడ్డి తన వాహనం దిగి ఆ కారులోని వ్యక్తులతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే కారులోని ఐదుగురు వ్యక్తులు మల్లారెడ్డిపై కత్తులతో దాడికి దిగారు. అది చూసి మల్లారెడ్డి పరుగుపెట్టినా దుండగులు వెంబడించి మరీ కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ ఘటనలో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత దుండగులు వచ్చిన కారులోనే పరారయ్యారని మల్లారెడ్డి వాహన డ్రైవర్ సారంగం వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భూవివాదాలే కారణం! మల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్లారెడ్డికి అక్కడి భూముల విషయంగా కొందరితో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి హత్యకు పాత కక్షలు, మైనింగ్కు సంబంధించి భూవివాదాలే కారణమై ఉండవచ్చని మల్లంపల్లి వాసులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. -
ఉసురు తీసిన ప్రేమ
పలమనేరు(చిత్తూరు జిల్లా): ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఆమె తండ్రి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి వేళ తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న యువకుడిని చూసిన తండ్రి ఆగ్రహంతో అతన్ని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరించారు. పలమనేరు మండలం పెంగరగుంట కు చెందిన ఈశ్వరగౌడ్ కుమారుడు ధనశేఖర్ (23) బెంగళూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై అతని తండ్రి ఈనెల 26న స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని ఫోన్ కాల్స్ ఆధారంగా ఆఖరి కాల్ను ట్రేస్ చేసి పెం గరగుంటకు చెందిన బాబును విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. బాబు కుమార్తె (16), ధనశేఖర్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బాలిక 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేయడంతో అతను బాలిక ఇంటికి వెళ్లాడు. పొలంవద్దకు వెళ్లిన బాబు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి వసారాలో పడుకున్నాడు. ఇంట్లోని ఓ గది నుంచి మాట లు వినిపించడంతో వెళ్లి చూడగా తన కుమార్తెతో పాటు ధనశేఖర్ కనిపించాడు. ఆగ్రహించిన బాబు ధనశేఖర్ను కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం గోతాంలో మూటకట్టి చిన్నకుంట సమీపంలోని ఓ బావిలో పడేసి ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల తరువాత బావివద్దకు వెళ్లి చూడగా శవం తేలి కనిపించింది. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కొందరి సాయంతో మృతదేహాన్ని మల్బరీ ఆకులు కత్తిరించే కట్టర్ సాయంతో ముక్కలు ముక్కలుగా చేసి సమీపంలోని అటవీప్రాంతంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. -
బొల్లారంలో దారుణ హత్య
-
మాయమైపోతున్న మనిషి!
సాక్షి, హైదరాబాద్: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా వంద మందికిపైగా ప్రత్యక్ష్యంగా చూశారు. అయినా ఈ పాశవిక ఘటనను ఒక్కరంటే ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సమాజంలో మానవ విలువలు మృగ్యం అవుతున్నాయనేందుకు నిదర్శనం. పాత కక్షల కారణంగా జరిగిన జంటహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు, నడిరోడ్డు మీద కాపుకాసి, దాడి చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన తీరు చాలా ఆందోళనకరం. మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల నిండా జనం ఉన్నారు. ఆ బస్సులు హత్య జరుగుతున్నంత సేపు హత్యోదంతాన్ని చూసి, నిందితులు పరారయ్యాక అక్కడి నుంచి కదిలారు. అంతేకాకుండా కల్వచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ దారి వెంబడి వెళ్తున్న వారు, బైక్పై వెళ్తున్నవారు దాదాపు 100 మందికిపైగా అక్కడే ఆగిపోయారు. దారుణం జరుగుతున్నంత సేపు తమ జేబుల్లో ఉన్న సెల్ఫోన్లకు పనిచెప్పారే తప్ప.. ఎవరూ కూడా వారిని ఆపేందుకు సాహసించలేదు. నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్ధరించుకున్నాక.. కొన ఊపిరితో ఉన్న వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తూ వీడియోలు తీశారు. పట్టపగలు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు వంద మంది. వీరిలో చాలామంది వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్మీడియాలో పోస్టులు, స్టేటస్లు పెడుతూ సమాజాన్ని, పోలీసులను, రాజకీయ నేతలను నిందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్నప్పుడు హత్యోదంతాన్ని వేడుకలా చూసి, తీరా అక్కడి నుంచి వెళ్లిపోయాక బాధ్యత, సమాజం, అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు అంతమంది ఉన్నా.. వారిలో ఎంతమంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిందే. హేయమైన చర్యలు.. రాజకీయ నేతలే ఇలాంటి హత్యలకు దిగడం అత్యంత హేయమైన చర్చగా చెప్పొచ్చు. అందులోనూ హైకోర్టు లాయర్లయిన గట్టు వామనరావు, పీవీ నాగమణిలను వేటాడి వేట కొడవళ్లతో నరకడం చాలా దారుణం. రాష్ట్రంలో ఇలాంటి ఘటన మొదటిది కాదు. గతంలోనూ పలు ఉదంతాలు జరిగాయి. అయితే, అందులో బాధితులు, నిందితులు సామాన్యులు. కానీ ఈ ఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వ్యక్తుల హస్తం ఉండటం అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్టపగలు జరిగిన దారుణ హత్యలన్నీ కూడా హైదరాబాద్లోనే చోటు చేసుకున్నాయి. ఈ వికృత సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. రాళ్లతో నుజ్జునుజ్జుగా.. (రాజేంద్ర నగర్ హత్య జనవరి11, 2021) రాజేంద్రనగర్లో జనవరి 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఖలీల్ను అత్తాపూర్లో నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తుండగా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేస్తూ, తరుముతూ గాయపరిచారు. కిందపడిన వెంటనే వ్యక్తి చనిపోయాడు. రాళ్లతో శవాన్ని కొడుతూ, నుజ్జునుజ్జుగా చేస్తూ తమ పాశవికతను ప్రదర్శించారు. ఈ హత్యను పలువురు వాహనదారులు వీడియోలు తీసి వైరల్ చేశారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ ముందే.. (జూన్ 26, 2019) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజగుట్ట ఠాణా ముందు జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ అన్వర్ అనే ఆటోడ్రైవర్పై మరో ఆటోడ్రైవర్ రియాసత్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ ప్రాణ భయంతో పంజగుట్ట స్టేషన్లోకి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ కన్నుమూశాడు. ఈ హత్యోదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దగ్గరికి వెళ్లేందుకు జంకిన పోలీసులు.. (నయాపూల్ మర్డర్.. 2018, నవంబర్ 28) ఆటోడ్రైవర్ గొంతుకోసి, పోలీసుల ముందే 2018 నవంబర్లో నయాపూల్ వంతెన పక్కన జరిగిన మరో హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షకీర్ ఖురేïÙ, అబ్దుల్ ఖాజా ఇద్దరూ ఆటోడ్రైవర్లు. ఆటో అద్దెల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో షకీర్ ఖురేïÙని అబ్దుల్ ఖాజా కత్తితో పొడిచి చంపాడు. షకీర్ను చంపాక, ఖాజా అక్కడే కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. ఈ హత్య అనంతరం నిందితుడిని పోలీసులు కనీసం ప్రతిఘటించలేకపోవడం, కనీసం అతడిని సమీపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసుల ముందే హత్య.. అత్తాపూర్ మర్డర్ (సెప్టెంబర్ 26, 2018) 2018 సెపె్టంబర్ 26న అత్తాపూర్ పిల్లర్ నంబర్ 138 వద్ద రమేశ్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మహేశ్ అనే యువకుడి హత్య కేసులో రమేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. మహేశ్ తండ్రి రమేశ్ను అత్తాపూర్ వద్దకు రాగానే మరో వ్యక్తి సాయంతో గొడ్డళ్లతో నరికి చంపాడు. ఈ హత్య జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు, పెట్రో కార్ సిబ్బంది కనీసం స్పందించలేదు. మనకెందుకులే అన్న ధోరణి సమాజంలో తోటి మనిషి పట్ల జాలి చూపే గుణం రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా గతంలో రోడ్డుపై ఎవరైనా దాడి చేస్తుంటే.. దారిన వెళ్లేవాళ్లు నచ్చజెప్పేవారు, వారిని నిలువరించేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న దాడిని ఆపాల్సింది పోయి జేబులోని సెల్ఫోన్ తీసి వీడియోలు తీసే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కనీస బాధ్యతగా రక్షించాల్సిన తోటిపౌరులే ప్రేక్షకులుగా మారడం శోచనీయం. ‘ఎవరిని ఎవరు చంపితే మనకెందుకులే మనం బానే ఉన్నాం కదా’అనే సంకుచిత ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే తాము ఎలాంటి సాయం చేయకపోగా.. వ్యవస్థలను నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. –వీరేందర్, సైకాలజిస్టు చదవండి: న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
సిద్దిపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య
సాక్షి, సిద్దిపేట : గతకొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. మెడపై గొడ్డలితో నరకడంతో శరీర భాగం నుంచి తల వేరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని స్వగ్రామం సిద్ధిపేట మండలం ఇమాంబాద్ అని పోలీసులు తెలిపారు. పాత కక్షనే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎల్లంగౌడ్ పలు కేసుల్లో ప్రధాని నిందుతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో శామీర్ పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇతనిపై పలు కేసులున్నట్లు సమాచారం. అయితే ఇతన్ని హత్య చేసేందుకు శత్రువులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారని, కానీ దాడి నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మాటు వేసి ఎల్లంగౌడ్ను హత్య చేశారు. -
ఇల్లరికం ఇష్టం లేక..
గచ్చిబౌలి: ఇల్లరికం ఇష్టం లేక ఓ వ్యక్తి.. భార్య, కొడుకును గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తమ వంశం అత్తవారికి మిగలవద్దనే ఇద్దరినీ హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కర్నాటక రాంపూర్ యాద్గిరి జిల్లాకు చెందిన అనంతప్ప (25) అలియాస్ చిన్నాకు తన మేనత్త కూతురు మహాదేవి(22)తో పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అనంతప్ప మేనత్తకు నలుగురూ కూతుర్లే కావడంతో అతన్ని ఇల్లరికం తీసుకునేందుకు అప్పట్లో మాట్లాడుకున్నారు. ఏడాది క్రితం మహాదేవి, కూతురు అర్చన(3), కొడుకు ఆకాష్(18 నెలలు)తో కలసి గౌలిదొడ్డికి వచ్చాడు. పెద్ద కూతురు అనురాధ అమ్మమ్మ వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం 5.30 సమయంలో నిద్రిస్తున్న భార్య మహాదేవి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఈ సమయంలో భార్య చేయి ఆకాష్ గొంతుపై ఉంది. ఆ చేయిపై మోకాలు పెట్టి అదమడంతో ఆకాష్ గొంతుకు చేయి బిగుసుకుని చనిపోయాడు. ఆడపిల్లలు వంశం మోయలేరన్న భావనతో కూతురు అర్చనను ఏమి అనలేదు. ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూర్లో ఉండే స్నేహితుడు శ్రీశైలంకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. విద్యుత్ వైర్లను ఎడమ చేతి వేళ్లకు చుట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ లోపు శ్రీశైలం విషయాన్ని నానక్రాంగూడలో ఉండే అనంతప్ప అన్న కొడుకు చెన్నప్పకు తెలిపాడు. 8 గంటల సమయంలో అతను వచ్చి చూడగా అనంతప్ప అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతప్ప ఆత్మహత్యాయత్నం చేసిన కొద్ది క్షణాల్లోనే ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బతికాడు. నిందితుడు గచ్చిబౌలిలోని ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహాదేవి, ఆకాష్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తరచుగా గొడవలు: అనంతప్ప మాట్లాడుతూ.. మహాదేవికి వాళ్ల కుల దేవత దేవమ్మ అంటే ఇష్టమని, పూజల విషయంలో ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవన్నాడు. వనిగిరి రావాలని అత్తింటి వారు ఒత్తిడి చేస్తున్నారని, ఇల్లరికం ఇష్టం లేకే భార్య, కొడుకును హత్యచేశానని చెప్పాడు. వచ్చే వారం అత్తింట్లో కుల దేవత పండగ ఉందని చెప్పడంతో బుధవారం ఉదయం పోదామని భార్యతో చెప్పినట్లు వివరించాడు. మంగళవారం సాయంత్రమే భార్య, కొడుకును చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
ప్రియుడితో కలిసి తండ్రి శరీరాన్ని కోసి..
సాక్షి, ముంబై : మైనర్తో ప్రేమ వద్దన్నందుకు ఓ యువతి తనను దత్తత తీసుకున్న తండ్రిని దారుణంగా చంపేసి శరీర భాగాలను కోసి పడేసింది. వివరాలు.. ముంబైలో ఉంటున్న బెన్నెట్ రెబెల్లో (59) ఘట్కోపర్ ప్రాంతంలోని రియా (19) అనే యువతిని రెండేళ్ల కింద దత్తత తీసుకున్నాడు. అయితే రియా ఓ మైనర్తో ప్రేమాయణం సాగిస్తుండడంతో గమనించిన తండ్రి, మైనర్తో ప్రేమ వ్యవహారం మంచిది కాదని కుమార్తెకు హితవు చెప్పేవాడు. దీంతో విసిగిపోయిన రియా తన బాయ్ఫ్రెండ్తో కలిసి నవంబర్ 27న తండ్రిని ఇంట్లోనే దారుణంగా చంపేసింది. ఎంతలా అంటే కొన ఊపిరితో తండ్రి కొట్టుమిట్టాడుతుంటే దోమల మందును ముఖంపై స్ప్రే చేసి మరీ చంపేసింది. అనంతరం పదునైన కత్తితో తండ్రి శరీర భాగాలను ముక్కలుగా కోసి వాటిని రెండు సంచులు, ఒక సూటుకేసులో నింపి సమీపంలోని మిథి నదిలో పడేసింది. మూడు రోజుల తర్వాత సూటుకేసు గురించి సమచారం అందడంతో పోలీసులు దాన్ని తెరిచి చూడగా అందులో ఒక కాలు, చెయ్యి, మర్మాయవాలు కనపడ్డాయి. దీన్ని సవాల్గా భావించిన పోలీసులు, సూట్కేసులోని చేతి భాగానికి ఉన్న స్వెట్టర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి బెన్నెట్ రెబెల్లో ఫేస్బుక్ ఖాతాను కనుగొనగలిగారు. అందులోని బెన్నెట్ విజిటింగ్ కార్డుపై ఉన్న అడ్రస్ ఆధారంగా అతని ఇంటికి వెళ్లి విచారించగా, బెన్నెట్ పది రోజుల నుంచి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు సమాధానమిచ్చారు. దాంతోపాటు యువతి దత్తత విషయం వెలుగులోకి రాగా, పోలీసులు రియాను గుర్తించి తమదైన శైలిలో విచారించడంతో తన మైనర్ ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నేరం ఒప్పుకుంది. ప్రియుడు ఘట్కోపర్ ప్రాంతంలోని తమ పక్కింటి వాడని తెలిపింది. అంతేకాక, మైనర్తో ప్రేమ వ్యవహారం తెలిశాక, బెన్నెట్ తనను లైంగికంగా వేధించాడని, అందుకే హత్య చేసినట్టు పేర్కొంది. ఈ ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. రియా తల్లిదండ్రులు ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు ఉండగా దత్తత ఎందుకు ఇచ్చారనే దానిపై విచారిస్తున్నాం. అంతేకాక, ఈ హత్య ప్రణాళిక ప్రకారం జరిగిందా? లేక యాధృచ్చికంగా జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
-
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి,శ్రీకాకుళం: టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తురు మండలం కంటిబద్రలో దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. స్థానికంగా చోటుచేసుకున్న స్వల్ప వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి జంగం అనే వ్యక్తిని అత్యంత కిరాతంగా హత్యచేశారు. వారి దాడిలో మరో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని కొత్తురు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. టీడీపీ నేతలు దాష్టీకంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ సీరియస్.. ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ విజయసాయి రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అవలంగిలో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) :ప్రశాంతతకు మారుపేరైన పాలకొండ మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్నపాటి నేరాలు తప్పితే హత్యోదంతాలు అంతగా లేని ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి చెరువులో పడేశారు. అవలంగి గ్రామ సమీపాన నాయుడు చెరువులో తేలిన మృతదేహం గ్రామానికి చెందిన కురమాన జమ్మయ్య(58)గా బుధవారం ఉదయం స్థాని కులు గుర్తించారు. ఏడాది క్రితమే మృతుడు కుమారుడు ఆదినారాయణ (30) అనుమానా స్పదంగా మృతి చెందగా, తాజాగా తండ్రి హత్యతో సర్వత్రా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తొలుత ఎవరో బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ఉంటారని స్థానికులు భావించారు. వీరి నుంచి సమాచారం అందుకు న్న ఎస్సై ఎస్ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కాళ్లు, చేతులు నైలాన్ తాడుతో కట్టేసి, శరీరంపై కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. హత్యగా కేసు నమోదు... అత్యంత పాశవికంగా జమ్మయ్య హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పించారు. పోలీసులు తీసుకువచ్చిన కుక్కలు చెరువు సమీపంలో ఓ మదుము వరకు, సమీపంలో మరో గిరిజన గ్రామమైన బర్న రహదారికి పరుగులు తీసి ఆగిపోయాయి. అలాగే క్లూస్ టీమ్ మృతదేహంపై వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ పీఆర్ఆర్ ప్రసాద్, సీఐ ఎస్ ఆదాం చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ -
వివాహేతర సంబంధం.. యువకుడు దారుణ హత్య
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోకబత్తిని వంశీ (23) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి చంద్రమోహన్ భార్యతో వంశీ కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రమోహన్ యువకుడిని పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తున్న వంశీపై చంద్రమోహన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల, ఛాతిపై దాడిచేశాడు. వంశీ అరుపులు విన్న తల్లి ప్రమీల అడ్డుకోబోగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడ్డ వంశీని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి నిందితుడు చంద్రమోహన్ను అరెస్టు చేసినట్టు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
దారుణం; తల,మొండెం వేరు చేసి..
బెంగళూరు : కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మధ్య వయస్సు గల ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీమతి శెట్టి అనే వివాహిత భర్తకు విడాకులిచ్చి ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. అనంతరం ముక్కలుగా నరికి తల, మొండెం వేరు చేశారు. శరీర భాగాలను రెండు సంచులలో ప్యాక్ చేసి మొండాన్ని నందిగూడలో, తలను నంటూర్ హైవే సమీపంలో పడేశారు. సమాచారం అందుకున్ను పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతురాలిపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. శ్రీమతి శెట్టి పండేశ్వర్లో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తోంది. భర్త సుదీప్తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె ఒంటరిగా ఉంటోంది. అయితే ఈమె హత్యతో సుదీప్కు సంబంధం ఉండే అవకాశం లేదని భావిస్తున్నాం. ఎందుకంటే అతడు మొబైల్ చోరీ కేసులో మంగళూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళూరులోని ఓ షాప్ ముందు మనిషి శరీర భాగాలు పడి ఉండటాన్ని యజమాని గమనించాడు. రక్తపు సంచులతో పాటు ఓ హెల్మెట్లో మహిళ తల ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఇందూరులో ఇద్దరి దారుణ హత్య
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్లో ఇద్దరు యువకులు దారుణహత్యకు గురయ్యారు. రెండు రోజుల కింద జరిగిన హత్యలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువకులను అధికంగా మద్యం తాగాక కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. చంపిన తరువాత నిందితులు మారణాయుధాలు, మద్యం సీసాలు ఏమి లేకుండా జాగ్రత్తపడ్డారు. వీరిని హత్య చేసి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. మూడో టౌన్ ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని ఆజ్రి గ్రామం కుదన్పూర్ తాలుకా, ఉడిపి జిల్లాకు చెందిన శ్రీకాంత్శెట్టి గత కొంత కాలంగా నిజామాబాద్ నగరంలో టీస్టాల్ను నిర్వహిస్తున్నాడు. కంఠేశ్వర్లో ఆరు నెలల కింద టీస్టాల్ నిర్వహిస్తూ ఇదే ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. ఇతడితోపాటు మరో ముగ్గురు పనిచేసేవారు నిత్యం అద్దె ఇంటికి వస్తూ వెళ్తుండేవారని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్శెట్టి మొదట వైష్ణవి హోటల్ వద్ద టీస్టాల్ నిర్వహించేవాడు. ఆ హోటల్ క్యాషియర్ సురేందర్రెడ్డి పరిచయంతో ఆయన సూచన మేరకు కంఠేశ్వర్లో టీ కార్నర్ వద్ద ఆర్నెళ్ల కింద టీస్టాల్ను ప్రారంభించాడు. అంతపట్టని విషయం.. సురేందర్రెడ్డికి కంఠేశ్వర్లో కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగి నాగభూషణం పరిచయం ఉంది. ఇతడి ఇల్లును సురేందర్రెడ్డి శ్రీకాంత్శెట్టికి అద్దెకు ఇప్పించాడు. దీంతో ఆర్నెళ్లుగా అదే ఇంటిలో ఉంటున్నాడు. రెండు రోజుల కింద రాత్రి శ్రీకాంత్శెట్టిని(32) మరో యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు. ఆ సమయంలో ఇంటి యజమాని నాగభూషణం అందుబాటులో లేరు. గురువారం రాత్రి నాగభూషణం తన ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం నీటి ట్యాంకును పరిశీలించేందుకు డాబాపైకి వెళుతుండగా కిటికీలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. మృతదేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయి. శ్రీకాంత్శెట్టి ఉంటున్న కిటీకి వద్దకు వెళ్లి గదిని చూడగా ఇద్దరు యువకులు చనిపోయినట్లు గుర్తించాడు. వెంటనే డయల్ 100కి ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి మూడోటౌన్ ఎస్ఐ సంతోష్కుమార్ చేరుకొని ఇంటి తాళం పగులగొట్టి హత్యకు గురైన యువకులను గుర్తించారు. ఒకరు శ్రీకాంత్శెట్టి కాగా మరో యువకుడు జుక్కల్ మండలం ఎడ్గి గ్రామానికి చెందిన సాయిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు మరో మృతుడు సాయి అనే యువకుడు అయి ఉండొచ్చు అని పేర్కొంటున్నారు. అయితే నిర్ధారణకు మాత్రం రాలేదు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ రాగా హత్య జరిగిన ఇంటి చుట్టు తిరిగింది. ఎలాంటి అనవాలు లభించలేదు. సంఘటన స్థలానికి సీపీ కార్తికేయ, శిక్షణ ఐపీఎస్ గౌస్ అలం, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, రూరల్ సీఐ, ఎస్ఐలు వచ్చి విచారించారు. హత్యకు గురైన శ్రీకాంత్శెట్టి తమ్ముడు ప్రవీన్శెట్టికి పోలీసులు సమాచారం అందించారు. ఈ హత్యలు ఎందుకు చేశారు, డబ్బుల విషయంలోనైన, వ్యాపార విషయంలోనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరిని ఒకేసారి హత్య చేయడంలో ఆంతర్యమేంటి, ఎంత మంది ఉన్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వీరితోపాటు ఉన్న మరో ఇద్దరు యువకులు కనిపించకుండా పోవడంతో వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. -
కేటీదొడ్డిలో హత్యల కలకలం
గద్వాల క్రైం: కూలీ పనులకు వెళ్లిన సగటు వ్యక్తులు సాయంత్రం ఇంటికి వస్తారనే ఆశ..! పొలం పనులకు వెళ్లిన రైతన్న మాత్రం నేడు క్షేమంగా ఇంటికి వెళ్లలేని దుస్థితి. కరెంటు షాక్.. విష పురుగులు.. జంతువుల దాడిలో పొలం వద్ద రైతు మృతి చెందాడనే వార్త గ్రామాల్లో చోటుచేసుకునేవి.. కానీ, ఇప్పుడు మనుషులే ఒకరిపై ఒకరు హత్యలకు తెరతీస్తున్నారు. అర్ధరాత్రి హత్యలకు తెగబడుతున్నారు. ఓ కుటంబ వ్యవస్థను నిలువునా చీల్చి వేస్తున్న దారుణ సంఘటనలు ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఇటీవల కాలంలో రైతు హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇవిగో ఘటనలు ఠి మార్చి 8వ తేదీన కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన చంద్రబండ బోయ తిమ్మప్ప(35) అనే వ్యక్తి పని నిమిత్తం శుక్రవారం రాత్రి ఇంటి నుంచి దగ్గరలో ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లిన క్రమంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగుచూసింది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఠి ఏప్రిల్ 23న కేటీదొడ్డి మండలం పాతపాలెంకు చెందిన కొలిమి వెంకటేష్(55) రోజూ మాదిరిగానే పొలానికి వెళ్లి రాత్రిపూట నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులలో దాడి చేసి హతమార్చారు. ఈయనను కూడా ఎందుకు హత్య చేశారనే విషయంపై స్పష్టత లేదు. పోలీసులు రెండు హత్యలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నెల వ్యవధిలోనే వ్యవసాయ పొలాల వద్ద చోటు చేసుకున్న ఈ హత్యలపై మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అసలు కారణమేంటి? ఈ రెండు హత్యల విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, పొలం తగాదాలు కారణమై ఉంటాయని ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి తప్పిదాలు సైతం హత్యకు కారణం కావచ్చనే గుసగుసులు వినిపిస్తున్నాయి. సొంత వ్యక్తులను తమ వర్గం వారే హత్య చేయాల్సిన పరిస్థితికి తీసుకువస్తున్నారు. అయితే ఈ రెండు హత్యల తీరును చూస్తే వివాహేతర సంబంధాలే కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొలిక్కిరాని కేసులు.. సాంకేతిక పరంగా పోలీసు శాఖ పలు కీలక కేసులను ఛేదించడంలో మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. అయితే మార్చి నెల 8వ తేదీన హత్యకు గురైన వివరాలు ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా ముమ్మరంగా ఆరా తీస్తున్నా హంతకుల ఆచూకీ తెలియలేదు. అలాగే ఏప్రిల్ 23న జరిగిన హత్య విషయంలోనూ జాగిలాలు గ్రామాల్లో పలు మార్గంలో హంతకులు వెళ్లినట్లు గుర్తించాయి. పోలీసులు సైతం కేసుల విషయంలో పలు కీలక ఆధారాలను సేకరించినప్పటికీ కేసు ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిందితులు చిక్కరు.. దొరకరు అన్న చందంగా మారింది. త్వరలోనే ఛేదిస్తాం.. కేటీదొడ్డి మండలంలో జరిగిన రెండు హత్య కేసులకు సంబంధించి హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించి తెలుసుకున్నాం. పలు కీలక ఆధారాల కోసం ఫోరెనిక్స్ నిపుణుల సహాయం తీసుకున్నాం. కేసుల విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే కేసులను ఛేదించి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. – హన్మంతు, సీఐ, గద్వాల -
మంకీక్యాప్లు పెట్టుకుని.. కంట్లో కారం చల్లి..
నిజాంపట్నం(రేపల్లె)/సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నిజాంపట్నంలో కిరాతకులు రెచ్చిపోయారు. ఒక వ్యక్తిని రాడ్లతో కొట్టి చంపారు. స్థానికుల కథనం ప్రకారం నిజాంపట్నం ఎక్స్ మిలటరీ కాలనీకి చెందిన శీలం మహిమ వర్ధన్ (46) గురువారం ఉదయం 8 గంటల సమీపంలో టీ తాగేందుకు బస్టాండ్ సెంటర్కు వచ్చాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంకీక్యాప్లు పెట్టుకుని వచ్చి మహిమవర్ధన్ కంట్లో కారం చల్లి రాడ్లతో తలపై కొట్టి హతమార్చారు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చిన మహిమ వర్ధన్ భార్య రత్నావళి, బంధువులు బాధ్యులపై చర్యలు తీసుకునేవరకూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసువెళ్లనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. అయితే ఈ హత్యకు భూ వివాదాలే కారణమని చెబుతున్నారు. 1973లో అప్పటి ప్రభుత్వం 124 మంది దళితులకు 186 ఎకరాలు పంపిణీ చేసింది. ఆ భూమిని ప్రస్తుతం పలువురు రైతులు సాగుచేస్తున్నారు. తమ భూమిని పెత్తందారులు లాక్కుని అనుభవిస్తున్నారని గతంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. ఈ వివాదాల నేపథ్యమే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలిసి వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, బంధువులను పరామర్శించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు మృతుడి భార్య, బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మృతుడి కుటుంబానికి తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ వరదరాజులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, మహిమవర్ధన్ హత్యకు టీడీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్యలో పాల్గొన్న వ్యక్తి టీడీపీ నేత బొమ్మిడి రామకృష్ణ ముఖ్య అనుచరుడని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్యలో టీడీపీ నేతల హస్తం ఉండటంతో వారిని తప్పించి వైఎస్సార్సీపీ నేతలపై మోపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
విద్యార్థి దారుణ హత్య
ఘంటసాల (అవనిగడ్డ) : నూతన సంవత్సరం వేడుకల ఆనందంలో ఉన్న మండల ప్రజలు, అధికారులు ఓ విద్యార్థి హత్య ఘటనతో ఉలిక్కిపడాల్సి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద దేవరకోట – వక్కలగడ్డ జెడ్పీ డొంక రోడ్డులో ఎవరో హత్యకు గురైనట్లు ఎస్ఐ ఎంవీకే షణ్ముఖసాయికి సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని చల్లపల్లి సీఐ ఎన్.వెంకటనారాయణ, డీఎస్పీ వి.పోతురాజులకు సమాచారం అందించారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన అల్లూరి గంగాదుర్గారావు (17) ఘంటసాల ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజు వక్కలగడ్డ నుంచి సైకిల్పై కళాశాలకు వచ్చి వెళ్తుంటాడు. అలాగే సోమవారం కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే, కళాశాలకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో గంగాదుర్గారావు తండ్రి శ్రీనివాసరావు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీశారు. కళాశాలకు చెందిన విద్యార్థులను, రామానగరం, చల్లపల్లి, యార్లగడ్డ తదితర గ్రామాలలో వెతికనా కనబడలేదు. దీంతో మంగళవారం కూడా కోసూరు తదితర గ్రామాల్లో వెతుకుతున్నారు. కాగా చిట్టూర్పు పరిధిలో గొర్రెలు మేపుకుంటూ డొంక రోడ్డుకు వచ్చిన కాపరి వెంట ఉన్న కుక్క చెరుకు తోట వద్ద మొరగడంతో అటువైపు వెళ్లి చూశాడు. డొంక రోడ్డు వద్ద చెరుకు పొలాల్లో యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించి గ్రామస్తులకు ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు, చల్లపల్లి సీఐ ఎన్.వెంకటనారాయణ, ఎస్ఐ ఎంవీకే షణ్ముఖసాయితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు. మెడ, బుజాలపై ఉన్న గాయాలను బట్టీ హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్థారించారు. దుర్గారావు మెడ వెనక భాగంపై కత్తితో బలంగా వేటు వేయడంతో పాటు భుజాలపై కూడా కత్తి గాయాలు ఉన్నాయి. ఘటనా ప్రాంతంలో కారంపొడి కూడా ఉండటంతో కళ్లల్లో కారం కొట్టి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. క్లూస్ టీమ్కు సమాచారం అందించడంతో వారు వచ్చి వివరాలను సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమా?... విద్యార్థి హత్య వెనుక వివాహేతర సంబంధం కారణంగా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలియవచ్చింది. అయినా అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. వక్కలగడ్డకు చెందిన ఆంజనేయులు అనే యువకుడితో కలిసి గంగాదుర్గారావు దీపావళికి విజయవాడలో టపాసులు అమ్మే ప్రాంతంలో సేల్స్బాయ్గా వెళ్లాడు. ఇద్దరికి వివాహేతర సంబంధం ఉన్న ఓ అమ్మాయి విషయంలో అక్కడ ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ వివాదం గ్రామ పెద్ద వద్ద పరిష్కరించుకున్నారు. అయినా, అనుకోని విధంగా దుర్గారావు హత్యకు గురవడం ఆ ప్రాంతవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. -
రాప్తాడులో రాజకీయ హత్య
అనంతపురం సెంట్రల్: రాప్తాడు నియోజకవర్గంలో హత్యారాజకీయాలకు అంతులేకుండా పోతోంది. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తుండగానే విపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన ప్రముఖ నేతను దారుణంగా హతమార్చడం సంచలనం రేకెత్తించింది. టీడీపీ నాయకులు ఎంతటికి బరితెగిస్తున్నారని చెప్పేందుకు బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యనే నిదర్శనం. దృష్టి మళ్లించి.. బుధవారం ఉదయం 11 గంటలకు గుమ్మఘట్ట మండలం భైరవాని తిప్ప ప్రాజెక్ట్ వద్ద సీఎం చంద్రబాబు పైలాన్ ఆవిష్కరణకు వచ్చారు. ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సీఎం కార్యక్రమానికి ఆత్మకూరు మీదుగానే తరలించారు. సీఎం చంద్రబాబు బీటీపీలో కాలు పెట్టే గంట ముందు అంటే పది గంటల సమయంలో ఆత్మకూరులో కాపు కాచి వైఎస్సార్ సీపీ సీనియర్ నేత జి.కేశవరెడ్డిని హతమార్చారు. పథకం ప్రకారం జరిగిన ఈ దాడిలో తాము ఎంతకైనా తెగిస్తామంటూ టీడీపీ నేతలు చెప్పకనే చెప్పినట్లేంది. పరిటాల కుటుంబం ప్రమేయంతోనే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు శ్రుతిమించిపోయాయి. ఆధిపత్యం నిలుపుకునేందుకు విపక్ష వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ప్రమేయంతోనే నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయంటూ విపక్ష పార్టీలే ఏక కంఠంతో నినదిస్తున్నాయి. గతంలోనూ ఇలానే.. రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి విషయంలోనూ ఇలానే జరిగింది. పథకం ప్రకారం తహసీల్దార్ కార్యాలయానికి రప్పించుకుని అతన్ని అధికార పార్టీ నాయకులు హత్య చేశారు. వైఎస్సార్ సీపీలో ముఖ్య నేతలకు ప్రత్యర్థులను పరిటాల కుటుంబం చేరదీస్తూ.. వారిద్వారా హత్యారాజకీయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అల్లరి మూకలు, కిడ్నాపర్లు, నేరాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారిని శ్రీరాం తన కోటరీలో చేర్చుకుంటూ దారుణాలకు తెగబడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్చేసి రామగిరి మండలం కొత్తపల్లి బంధించిన ఘటనలోనూ పరిటాల కుటుంబం హస్తమున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యలోనూ మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ ప్రమేయమున్నట్లు హతుడి బార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తండ్రి బాటలో తనయుడు తన తండ్రి పరిటాల రవీంద్ర బాటలోనే హత్యారాజకీయాలతో ఆధిపత్యం చెలాయించేందుకు శ్రీరాం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని విపక్ష వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలను హతమారుస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు కొనసాగిస్తున్నట్లు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2004కు ముందు శత్రుశేషం లేకుండా జిల్లాలో పరిటాల రవీంద్ర మారణకాండను సృష్టించారు. వందల సంఖ్యలో విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఆచూకీ లభ్యం కాకుండా పోయింది. పదుల సంఖ్యలో మృతదేహాలు వెలుగు చూశాయి. ఇదంతా పరిటాల రవి కనుసన్నల్లోనే జరిగాయనేది బహిరంగ రహస్యం. శ్రీరాం అదే బాటలో పయనిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ► 2015 ఏప్రిల్ 29న రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. ► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులను పరామర్శిం చేందుకు ఆస్పత్రికి చేరుకున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై హత్యాయత్నం. ► 2017 నవంబర్లో గొందిరెడ్డిపల్లిలో సర్పంచ్ కుమారుడు బాబయ్యపై టీడీపీ వర్గీయుల దాడి. ► 2017 నవంబర్ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త సుబ్బుకృష్ణపై దాడి. ► 2018 మార్చి 30 అనంతపురం రూరల్ మండలం కందుకూరులో శివారెడ్డి హత్య. ► అనంతరం రూరల్ మండలంలో ఎంపీటీసీ ధనుంజయయాదవ్ హత్యకు కుట్ర. టీడీపీలోకి చేర్చుకునేలా పథక రచన. -
వర్నిలో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి హత్యచేశారు. ఈ ఘటన వర్ని మండలంలో బుధవారం జరిగింది. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. -
అనుమంచిపల్లిలో వ్యక్తి దారుణ హత్య
అనుమంచిపల్లి (జగ్గయ్యపేట) : ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్య (38) వ్యవసాయ కూలీ రైతు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఈ క్రమంలో రాత్రి గ్రామంలో బ్రహ్మం గారి జెండా ఊరేగింపు ఉంది. దీంతో ఊరేగింపునకు కావాల్సిన పూజా సామాగ్రి కొనుగోలు చేసి ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి రాత్రి 8 గంటల సమయంలో వెళ్లిపోయాడు. 12 గంటలు దాటినా భర్త ఇంటికి రాలేదని భార్య సుజాత అత్తమామలు, మరిదిలకు చెప్పటంతో వారు కూడా గ్రామంలో గాలించారు. అతని ఫోన్ కూడా స్విచ్ఆఫ్ చేసి ఉండటంతో ఆందోళన చెందిన వారు గ్రామ పెద్దలకు తెలిపారు. రాత్రి కావటంతో ఉదయం ఆచూకీ తెలుసుకుందామని చెప్పటంతో కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. పంట పొలాల్లో శవంగా.. శుక్రవారం రాత్రి వెళ్లిన బ్రహ్మయ్య 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కనున్న 24 గంటల కాటా సమీపంలోని పంట పొలాల్లో రక్తపు మడుగులో శవంగా కనిపించాడు. ఉదయం అటుగా వెళ్తున్న రైతులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్లకల్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. హత్యకు ముందు మృతుడు బ్రహ్మయ్యతో పాటు మరి కొంత మంది మద్యం సేవించినట్లు, ఆ తర్వాతే హత్య జరిగిందని ఆ ప్రాంతంలోని మద్యం సీసాలను బట్టీ నిర్దారించారు. మృతుడిని పెద్ద బండరాయితో తలపై మోదటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హత్య వార్త దావానలంగా వ్యాపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఐ జయకుమార్ వచ్చి హత్య జరిగిన తీరును, మృతుడి భార్య, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ యువజన నాయకుడు సామినేని ప్రశాంత్ సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసు జాగిలంతో గాలింపు.. మచిలీపట్నం నుంచి పోలీసు జాగిలం (రాజా) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం మాస్టర్ రవి పర్యవేక్షణలో హత్య జరిగిన ప్రదేశం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర గ్రామంలోని మూడు గృహాల వద్దకు వెళ్లి తారసలాడి మళ్లీ హత్య జరిగిన ప్రదేశానికి వచ్చింది. దీంతో పోలీసులు గ్రామంలోనే కొందరు హత్యకు ప్రేరేపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేశారా, లేక చేతబడి చేయిస్తున్నాడనే వదంతుల కారణంగా చంపేశారా అన్న అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్తి వివాదం.. అన్నను నరికేశాడు..
సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆస్తి విషయంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో చోటుచేసుకుంది. వివరాలివి.. గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు ఆస్తి వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే మరొసారి ఆస్తి విషయంలో మాట్లాడుకుంటున్నారు. మాట మాట పెరిగి అది గొడవకు దారితీసింది. ఈ నేపథ్యలోనే అన్న గోపాల్ను తమ్ముడు గొడ్డలితో నరికాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పశ్చిమ గోదావరిలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. తనను ప్రేమించలేదనే కోపంతో కత్తితో నరికి చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బాపుజీ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలివి.. ప్రేమ పేరుతో కిరణ్ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రంజాన్ వేళ రౌడీ షీటర్ దారుణ హత్య
-
రౌడీ షీటర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్),(వీఆర్సీసెంటర్): అందరూ సంతోషంగా రంజా న్ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్ వద్ద ఉన్న సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్హౌస్పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్ సాయి(30) అనే రౌడీషీటర్పై పలు హత్యలు, దొంగతనాలు, బెదిరింపులకు సంబంధిం చి రూరల్, 2వ పట్టణ పోలీస్స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ కేసులో రిమాండ్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. గతేడాది ఫిబ్రవరి 20వ తేదీ ఆత్మకూరు బస్టాండ్ వద్ద బుజబుజనెల్లూ రుకు చెందిన కృష్ణయ్యను నగదు కోసం బండరాయితో కొట్టి హత్యచేసిన కేసులో కూడా సాయి ప్రధాన నిందితుడు. అయితే నెల్లూరు çనగరంలోని 54వ డివిజన్ జనార్దన్రెడ్డి కాలనీలో గత కొంతకాలంగా సాయి ఓ మహిళతో సన్నితంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఆ మహిళతో గొడవ పడి దాడి చేశాడు. ఆ మహిళ నవాబుపేట పోలీస్స్టేషన్ ఎస్ఐ వి.వి.రమణయ్య వద్దకు వచ్చి సాయి తనపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో సాయిని ఎస్ఐ మందలించి పంపేశారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వెంకటేశ్వరపురం సెంటర్కు వచ్చిన సాయి బార్లో మద్యం సేవించి బయటకు రావటాన్ని గమనించిన గణేష్, అమర్ అనే ఇద్దరు యువకులు పక్కాస్కెచ్తో తమ వెంట తెచ్చుకున్న కత్తి, బీర్ బాటిళ్లతో సాయిను అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే దాడి చేశారు. దీంతో సాయి అక్కడిక్కడే మృతిచెందాడు. సాయి మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు తమ నలు గురు అనుచరులకు చెందిన రెండు బైక్లపై వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీస్స్టేషన్ ఎస్ఐలు శ్రీహరిబాబు, వి.వి.రమణయ్య, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతోనే హత్య బస్టాండ్ సాయి హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది. సాయి, హత్యకు పాల్పడిన గణేష్లు స్నేహితు లు. గతంలో ఇద్దరూ కలిసి పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయి ఇటీవల బెయిల్పై జైలు నుంచి రావడంతో హత్యకు పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. సాయిపై దుండగులు దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు తమ సెల్ఫోన్లలో హత్యకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు. ఈ వీడియోల్లో హత్య చేసిన వారు గణేష్, అమర్లుగా గుర్తించగా, హత్య చేసి 2 బైక్లపై మరో నలుగురితో కలిసి వీరు వెళ్లడం చూస్తుంటే ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. -
’జడ్జిమెంట్ సరైనదే అని భావిస్తున్నా’
-
అది మా అమ్మ చివరి కోరిక: నాగవైష్ణవి అన్న
సాక్షి, విజయవాడ : ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తీర్పువెలువరించింది. కోర్టు తీర్పుపై నాగవైష్ణవి సోదరుడు హరీష్ స్పందించారు. నాగవైష్ణవి కేసులో జడ్జిమెంట్ కరెక్ట్గా వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. తాను ఎప్పుడు లైఫ్ అండ్ టిల్ డెత్ అనే తీర్పు వినలేదని చెప్పాడు. తీర్పు లేటుగా వచ్చిందని, రెండేళ్ళ క్రితం తీర్పు వచ్చి ఉంటే ఈ కేసు కోసం పోరాడిన తన తల్లి, బాబాయ్తో పాటు ఎంతో మంది సంతోషించేవారని పేర్కొన్నారు. ఇక మీదట మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా తీర్పు వచ్చిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని మా అమ్మ కోరుకునేదని హరీష్ కన్నీరు మున్నీరయ్యారు. నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు -
నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
-
నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు
సాక్షి, విజయవాడ : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనిపించేలా ఈ తీర్పు ఉందని ప్రజలు భావిస్తున్నారు. వైష్ణవి హత్య నేపథ్యం : విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు. ప్రభాకర్పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు. -
నాగవైష్ణవి హత్య కేసు నేడు తుది తీర్పు
-
నాగవైష్ణవి హత్య కేసు నేడు తుది తీర్పు
విజయవాడ: ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. విజయవాడలో మహిళా సెషన్స్ జడ్జి గురువారం ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నారు. కోర్టు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. విజయవాడకు చెం దిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న దారుణ హత్యకు గురైంది. హత్య జరిగే నాటికి ఆమె వయస్సు పదేళ్లు. పల్లగాని ప్రభాకర్పై కోపంతో ఆయన కుమార్తె వైష్ణవి స్కూల్కు వెళ్తుండగా నిందితులు బలవంతంగా గుంటూరు తీసుకువెళ్లి ఇనుము కరగబెట్టే నిప్పుల కొలిమిలో ఆమెను పడేసి కాల్చేశారు. నాగవైష్ణవి హ్యతకు గురికాగానే పుత్రికాశోఖంతో పల్లగాని ప్రభాకర్ కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. పల్లగాని ప్రభాకర్ మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ కేసులో ఏ3గా ఉన్నారు. నిందితులపై పోలీసులు ఐపీసీ 302, 307, 364, 201,427, 379, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. -
పట్టపగలు యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్ చేసే కట్టర్తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం హైదరాబాద్లోని యూసుఫ్గూడ జవహర్నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతడు ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అగ్గిరాముడు మధురానగర్లో ఇస్త్రీ షాపు నిర్వహించడంతోపాటు ఓ ఇంట్లో వాచ్మెన్గా పని చేస్తూ జవహర్ నగర్లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) ఏడో తరగతి వరకు చదివింది. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది. రెండు నెలల నుంచి జవహర్ నగర్లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్స్లో పని చేస్తోంది. ఈ షాపు యజమాని జ్యోత్స్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం కూడా స్టోర్స్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో యజమానురాలికి ఫోన్ చేసింది. షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని చెప్పింది. తర్వాత 3.30 గంటల సమయంలో ఓ యువకుడు షాప్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల నుంచి వేధింపులు ఆరు నెలలుగా సాగర్ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది. దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో వినియోగదారుల రద్దీ కూడా ఉండదన్న ఉద్దేశంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్ ఘాతుకానికి తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్ ఆమె మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు మధురానగర్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గతంలోనూ అతడు తమ కూతురిని బెదిరించాడని వెంకటలక్ష్మి కుటుంబీకులు తెలిపారు. రోదిస్తున్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నాం. స్థానికుల సమాచారంతోపాటు ఘటనా స్థలంలో ఉన్న సీసీఫుటేజీలు, వీధిలోని ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నాం. బాధితురాలి సెల్ఫోన్ కాల్డేటా సైతం పరిశీలిస్తున్నాం. – ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్జోన్ డీసీపీ -
అర్థరాత్రి యువకుడు దారుణహత్య..
సాక్షి, హైదరాబాద్ : ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఖైరతాబాద్లోని బీజేఆర్ నగర్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు శివకిరణ్ అనే యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బోరబండకు చెందిన శివకిరణ్గా గుర్తించారు. హత్య కేసుతో పాటు చాలా కేసుల్లో శివకిరణ్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. -
కలకలం.. యువకుడు దారుణ హత్య..
సాక్షి, ఏలూరు : ఓ బ్రాందీ షాపు వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్ సమీపంలో చోటుచేసుకుంది. మృత్యుడు ఏలూరుకి చెందిన శ్రీహర్షగా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భీమవరంలో యువకుడి దారుణహత్య
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక బ్యాంక్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రొయ్యల కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న నారిశెట్టి వెంకట సునీల్ నలుగురు స్నేహితులతో కలిసి గతరాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఆ నలుగురు కలిసి సునీల్పై దాడి చేసి హత్య చేశారు. కాగా పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తిరుపతిలోని హోటల్లో వ్యక్తి దారుణ హత్య
-
వివాహితను హత్యచేసి తగలబెట్టారు..
సాక్షి, విశాఖపట్నం : ఓ వివాహితను దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని నరవకొత్తపాలెం నరవలో చోటుచేసుకుంది. వివరాలివి.. దుండగులు ఓ మహిళను హత్య చేసి, గుర్తు పట్టకుండా తగలబెట్టేశారు. ఆమె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. అప్రమత్తమైన గ్రామస్తులు విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ ఇంతవరకూ మహిళ ఎవరనేది పోలీసులు గుర్తించలేదు. సంఘటన స్థలాన్ని ఏసీపీ అర్జున్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ.. నరవలో జరిగిన మహిళ దారుణ హత్యకు నిరసన తెలుపుతూ తాటిచెట్ల పాలెంలో ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంతేకాక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
హత్య చేసి నీళ్ల డ్రమ్లో వేశాడు..
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని కత్తితో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. పనామా వద్ద ఓ రైతు చికెన్ బజార్, లైవ్ ఫిష్ షాపులో పనిచేస్తున్నాడు. గిరి అనే వ్యక్తి అతని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్లో వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్తికోసం.. అమ్మనే చంపేశాడు!
హైదరాబాద్: కన్నతల్లి అనే కనికరం లేదు.. ఆస్తి కోసం ఏకంగా అమ్మ ప్రాణాలనే తీశాడో కొడుకు.. కుమారుల బారి నుంచి తప్పించుకునేందుకు సొంతూరు వదిలి హైదరాబాద్ వచ్చింది ఆ అభాగ్యురాలు. అయినా సరే ఆమె ఎక్కడుందనే విషయం కనుక్కుని మరీ వచ్చి ఆమెను కడతేర్చాడు. ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం మద్దికేర్కు చెందిన భాగ్యమ్మ(55)కు ముగ్గు్గరు కొడుకులు, ఓ కూతురు. భాగ్యమ్మ భర్త రామాంజనేయులు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. 20 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. ఆస్తి కోసం వేధింపులు.. రామాంజనేయులు పేరుపై పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిని పంచివ్వాలని కొడుకులు సురేశ్, కిరణ్, విజయ్ తల్లిని వేధించసాగారు. తండ్రి చనిపోయి నెల రోజులైనా గడవకముందే ఆస్తులు పంచమని వేధించడం సరికాదని భాగ్యమ్మ కొడుకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే తాము చెప్పినట్లు వినడం లేదని తల్లిపై ముగ్గురు కుమారులు కోపం పెంచుకున్నారు. భాగ్యమ్మ వద్ద ఉన్న బ్యాంక్ పాస్ పుస్తకాలు, పెన్షన్ కాగితాలను లాగేసుకున్నారు. బ్యాంక్లో నుంచి డబ్బులు తీసుకురావాలని పెద్దకొడుకు సురేశ్ ఇటీవల ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో డబ్బుల కోసం అవసరమైతే తనను చంపుతారని భావించిన భాగ్యమ్మ వారి నుంచి తప్పించుకుని నాలుగు రోజుల క్రితం నగరంలోని బల్కంపేట దాసారం బస్తీలో ఉంటున్న సోదరి వీరమ్మ వద్దకు వచ్చి తలదాచుకుంది. అడ్రస్ కనుక్కుని వచ్చి మరీ.. భాగ్యమ్మ ఎక్కడ ఉందనే విషయం తెలుసుకున్న చిన్నకొడుకు విజయ్ దాసారం బస్తీలోని వీరమ్మ ఇంటికి వచ్చాడు. బుధవారం ఉద యం వీరమ్మ పనికి వెళ్లగా ఆమె కోడలు చిట్టెమ్మ ఆరు బయట బట్టలు ఉతుకుతోంది. నేరుగా ఇంట్లోకి వెళ్లిన విజయ్ తల్లితో గొడవకు దిగాడు. తలుపులు మూసేయడంతో లోపలి నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన చిట్టెమ్మ తలుపులు తెరవాలని అరుస్తున్నా వినిపించుకోలేదు. చుట్టుపక్కల వారు ఇనుప కడ్డీలతో డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విజయ్ రోకలి బండతో భాగ్యమ్మ తలపై బలంగా బాదడంతో కుప్పకూలిపోయింది. అనంతరం తలుపు తెరిచి బయటకు వచ్చిన విజయ్.. తన తల్లిని చంపేశానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా వారిని నెట్టిసి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆర్థిక వివాదాలే హత్యకు దారితీశాయని ప్రాథమికంగా నిర్థారించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా విజయ్ కర్నూల్ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
వరంగల్లో దొంగ దారుణ హత్య
వరంగల్ సిటీ: వరంగల్ నగరంలో ఓ దొంగ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్కు చెందిన తైదాల సాంబయ్య అనే వ్యక్తి దొంగతనాలు చేయడంతోపాటు కూలీల వద్ద పత్తి, మిర్చి, ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాడు. అలాగే మార్కెట్ సమీపంలోని బాలాజీనగర్కు చెందిన పత్రి కుమార్ కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి పలుమార్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం గంధం నరేశ్, సోమేశ్వర్ సాయంతో సాంబయ్యను చంపాలని కుమార్ పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో దయానందకాలనీకి వెళ్తున్న సాంబయ్యను బలవంతంగా వీరు ఆటోలో ఎక్కించుకున్నారు. కోటి లింగాల రోడ్డుపైపు తీసుకెళ్లి కొట్టి దారుణంగా చంపారు. సాంబయ్య మొండెం, తలను వేర్వేరు చేసి గోనె సంచుల్లో మూట కట్టారు. మొండెంను మార్కెట్ గేటు సమీపంలో, తలను కాశీబుగ్గ జంక్షన్లో వదిలేశారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్యకు పాతకక్షలే కారణమని స్థానికులు తెలిపారు. -
అమ్మాయిల విషయం.. యువకుడి హత్య
సాక్షి, యశ్వంతపుర: అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ యువకుడు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన కర్ణాటకలోని కామాకిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. యువతుల వ్యవహారంలో ఇటీవల మెజిస్టిక్ వద్ద రెండు గ్యాంగ్లు కొట్టుకున్నారు. ఈ విషయంపై మాట్లాడాలని కెంగేరికి చెందిన కోటేశ్వర(21)ను అతని ముగ్గురు స్నేహితులు ఫోన్ చేసి రమ్మన్నారు. అతను కామాక్షిపాళ్య సమీపంలోని ఉన్న మైదానానికి వెళ్లాడు. ఆ సమయంలో మరో ఎనిమిది మంది అక్కడకు చేరుకుని మారణాయుధాలతో కోటేశ్వర, అతని స్నేహితులపై దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ముసుగులో వచ్చారు.. హత్య చేశారు..
సాక్షి, చెన్నై: ఓ వివాహిత గురువారం తెల్లవారుజామున దారుణహత్యకు గురైంది. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చెన్నైలోని వడపళనిలో చోటుచేసుకుంది. ముఖానికి ముసుగుతో వచ్చిన కొంతమంది ఈఈ అగాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తు తేలింది. వివరాలివి.. కాంచీపురం నగరానికి చెందిన బాలగణేష్(27) ఐదేళ్ల క్రితం జ్ఞానప్రియ(24) అనే యువతిని ప్రేమించి పెద్దల సమ్మతితో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం చెన్నైలోని వడపళనిలోని శివాలయం ఓ పూజారిగా పనిలో చేరాడు. గుడి సమీపంలో ఓ అద్దె ఇంటిలో వారు జీనవం సాగిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతో కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి విధులు ముగించుకుని బాలగణేష్ ఇంటికి చేరుకున్నాడు. కానీ గురువారం ఉదయం 6 గంటలకు ఇంటి యాజమాని విజయలక్ష్మి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమె కాళ్లు, చేతులూ కట్టిపడేసి తీవ్ర గాయాలతో ఉన్న బాలగణేశ్ ఆమె చూసింది. దీంతో భయాందోళనకు గురైనా ఆమె అతని భార్యకు విషయం చెప్పడానికి ఇంట్లోకి చూసింది. ఆ సమయంలో రక్తపు మడుగులో ఉన్న జ్ఞానప్రియ ఆమెకు కనిపించింది. ఇంటి యాజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108 అంబులెన్స్తో అక్కడి చేరుకుని తీవ్ర గాయాలైనా దంపతులను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్ఞానప్రియ చనిపోయినట్లు తేలడంతో డాక్టర్లు మృతదేహాన్ని పోస్టుమార్టనికి పంపించారు. తీవ్రగాయాలైనా బాలగణేష్ను చికిత్స నిమిత్తం చెన్నై రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతుల ఇంటి బీరువాలోని బంగారు నగలు, జ్ఞానప్రియ మెడలోని తాళిబొట్టు కూడా కనిపంచలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులను గుర్తించడానికి జాగిలంతో పాటూ వేలిముద్రల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంటిలోకి జొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. -
లవ్ ఎఫైర్: యువకుడి దారుణ హత్య
సాక్షి, మెదక్: ఓ యువకుడిని దుండగులు ముఖంపై బండరాయితో కొట్టి అతికిరాతకంగా చంపేశారు. ఈ ఘటన మెదక్ మండలం ఖాజీపల్లి గ్రామశివారులో మంగళవారం చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి ఇంత కిరాతకంగా చంపేస్తారా..? అంటూ మృతుడి బందువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మహ్మద్ గఫ్పర్ ఖాన్- ఆసియాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడైనా మోహీన్ఖాన్(22) మెదక్-చేగుంట ప్రధాన రహదారి పక్కన ఖాజీపల్లి గ్రామశివారులో దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రేమనే హత్యకు కారణమని అనుమానం.. అతనిపై కత్తితో దాడిచేసి, ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా బండరాయితో కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను మోహిన్ఖాన్ ప్రేమించి మరొక ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో ఆ బాలికను తీసుకొచ్చి అప్పగించినట్లు చెప్పారు. కోర్టుకెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఈ విషయంలో మోహీన్పై గతంలో కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి మెదక్ కోర్టులో సోమవారం పేషిక హజరై రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బస్లో తిరుగపయనమయ్యాడని మృతుడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. కానీ రోడ్డు పక్కనే దుండగుల చేతిలో కిరాతకంగా హత్యకు గురికావడం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన కొద్ది దూరంలోనే ఏపీ13జి 7809 ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించినందుకు చంపేసి ఉంటారిని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది వరకు మోహీన్పై హత్యాయత్నం, అత్యాచారం కింద రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం బృందం కూడా పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
వీడిన శ్రీశైలం యువకుడి హత్య కేసు మిస్టరీ
పెద్దదోర్నాల: మండల పరిధి ఐనముక్కల సమీపం తీగలేరు కాలువ వద్ద గత నెల 24వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాసి నేలటూరి శ్రీనివాసులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదు రోజుల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు శ్రీరాంశెట్టి భాస్కరరావుతో పాటు, హత్యను ప్రోత్సహించిన మృతుడి భార్య నేలటూరి మల్లేశ్వరిని మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు అరెస్టు చేసి వారిని శనివారం విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీకి చెందిన నేలటూరి శ్రీనివాసులు, శ్రీరాంశెట్టి భాస్కరరావులు సహ వ్యాపారులు. కాలనీలో పండ్లు, పూలు అమ్ముకుంటూ స్నేహంగా ఉండేవారు. మద్యానికి అలవాటు పడిన శ్రీనివాసులు అప్పులపాలై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న అతడి భార్య మల్లేశ్వరితో చనువు పెంచుకున్న భాస్కరరావు ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కాలక్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు శ్రీనివాసులు తిరిగి ఇంటికి చేరాడు. భార్య వివాహేతర సంబంధంపై అనుమానం వచ్చి ఆమెతో ముభావంగా ఉంటున్నాడు. తమ వివాహేతర సంబంధానికి భవిష్యత్తులో అడ్డం వస్తాడన్న కారణంతో ఎలాగైనా అతడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్న భాస్కరరావు గత నెల 24వ తేదీన తన సొంత ఆటోలో కొబ్బరి చిప్పలు నింపుకుని శ్రీనివాసులుతో కలిసి పెద్దారవీడు మండలం కుంట చేరుకున్నాడు. వేరే వాహనంలో కొబ్బరి బోండాల లోడుతో తిరుగు ప్రయాణమయ్యారు. దోర్నాల చేరుకున్న భాస్కరరావు అక్కడ ఓ మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసి శ్రీనివాసరావుకు మోతాదుకు మించి తాగించాడు. స్పృహ కోల్పోయిన శ్రీనివాసరావును తన ఆటోలో వేసుకుని ఐనముక్కల వద్ద తీగలేరు కాలువ వద్దకు చేరుకున్నాడు. అక్కడే తువాలుతో గొంతు బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్తో కాల్చి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీకి చేరుకున్నాడు. దినపత్రికల్లో వచ్చిన కథనాలు చూసిన మృతుని తండ్రి పెంచలయ్య హత్యకు గురైన వ్యక్తి తన కుమారుడేనని గుర్తించడంతో పోలీసులు దర్యాన్తును వేగవంతం చేశారు. బంధువులు వ్యక్తం చేసిన అనుమానంతో భార్య మల్లేశ్వరి, భాస్కరరావు కదలికలపై నిఘా ఉంచారు. వీరి ఫోన్కాల్స్ డేటా పరిశీలించడంతో పాటు, మండల కేంద్రంలోని సీసీ కెమోరాల్లో భాస్కరరావు వాహనం ఎటువైపు ప్రయాణించిందన్న సాక్ష్యాలు సేకరించారు. తమపై అనుమానం ఉందని పసిగట్గిన వీరి ఆటోలో గుంటూరు పారిపోతుండగా కుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మార్కాపురం కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించడంలో చరుగ్గా వ్యవహరించిన సీఐలు భీమానాయక్, మల్లికార్జునరావు, ఎస్ఐ రామకోటయ్యతో పాటు సిబ్బందిని అభినందించారు. -
శివారెడ్డి హత్యపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ
-
అట్టుడికిన అనంత
అనంతపురం న్యూసిటీ: అనంతపురం మండలం కందుకూరులో శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సర్వజనాస్పత్రి మార్చురీలో శివారెడ్డి మృతదేహాన్ని శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైటీ శివారెడ్డి సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పార్టీ నేతలు పైలా నర్సింహయ్య, మహానందరెడ్డి, నరేంద్రరెడ్డి, నాగేశ్వర్రెడ్డి, ఆలమూరు సుబ్బారెడ్డి, ప్రసాద్రెడ్డి, సుధీర్రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి, ప్రశాంతి తదితరులు ఉన్నారు. పరిటాల శ్రీరామ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చండి పరిటాల శ్రీరామ్ అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ఎఫ్ఐఆర్లో ఆయన పేరును చేర్చాలని మార్చురీ ఆవరణలోనే వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేశారు. సీఐ రాజేంద్రనాథ్యాదవ్ మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్తోపాటు పరిటాల మహేంద్ర, మురళి ప్రమేయంతోనే హత్య జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు. సీఐ ఉదాసీనతే హత్యకు కారణమని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. పోలీసులు పచ్చ చొక్కాలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాను రాజకీయంగా శాసించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు దారుణాలకు తెగిస్తున్నారని, ఎన్నికల ఎత్తుగడలో భాగంగా టీడీపీ నేతలు హత్యాకాండకు తెరదీశారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. శివారెడ్డిది ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యకు సీఎం చంద్రబాబు, మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్ చేశారు. మృత దేహంతో ర్యాలీ శివారెడ్డి మృతదేహంతో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు సర్వజనాస్పతి నుంచి ర్యాలీగా బయలు దేరారు. తెలుగుతల్లి విగ్రహం వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యాకాండపై డీఎస్పీ వెంకట్రావ్కు ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ ‘అనంత’, ప్రకాశ్రెడ్డి వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మంత్రి సునీత బాధ్యత వహించాలి పోలీసుల మెతక వైఖరితోనే శివారెడ్డి హత్యకు గురయ్యాడు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని హత్య చేయడం కిరాతకం. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస హత్యలకు మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించాలి. హత్యలు జరుగుతుంటే, అదుపు చేయాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. కేసులో భాగస్వామ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరతాం. పీర్ల పండుగలో జరిగిన గొడవ తర్వాత హత్యకు ప్రయత్నిస్తున్నారని తమ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకు రాచమర్యాదాలు చేస్తున్నారు. – వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ కిరాయి హంతకులతో హత్యలు రౌడీలు, కిరాయి హంతకులను మంత్రి సునీత, శ్రీరామ్, మహేంద్ర, మురళి దగ్గరపెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను హత్యలు చేయిస్తున్నారు. శివారెడ్డి ప్రజాదరణ కలిగిన కార్యకర్త. అతన్ని హత్య చేస్తే పార్టీ శ్రేణులు భయోత్పాతానికి గురవుతారనే చంపేశారు. కందుకూరులో పరిటాల మహేంద్ర దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ వస్తుందనే కుట్రతోనే హత్య చేయించారు. బీకేఎస్ మండలానికి చెందిన రౌడీషీటర్ బాలకృష్ణకు ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతకాక, ఓటమి భయంతో మంత్రి సునీత దాడులకు ఉసిగొల్పుతున్నారు. నసనకోటలో బోయ సూర్యంపై దాడి చేయించారు. శ్రీరామ్ తనను తీసుకెళ్లి చితకబాదాడని సూర్యం రెండుసార్లు ఎస్పీకి రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు చేసినా పోలీసులు వెనుకేసుకొస్తున్నారు. శివారెడ్డి హత్య కేసులో మంత్రి, వారి బంధువులను తప్పించాలని చూస్తున్నారు. – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాప్తాడు -
వీడియో గేమ్ కోసం అక్కను కాల్చిచంపిన తమ్ముడు
మిస్సిసీపీ : అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలిక సొంత తమ్ముడి చేతిలోనే హత్యకు గురైంది. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రంలో గత శనివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో గేమ్ కంట్రోలర్ కోసం జరిగిన వాదనే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నివేదికల్ని పరిశీలించిన అనంతరం రిమోట్ కంట్రోల్ ఇవ్వడానికి బాలిక నిరాకరించడంతోనే బాలుడు ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాలుడు వెనుక నుంచి తుఫాకీతో కాల్చడంతో బుల్లెట్ ఒక్కసారిగా బాలిక మెదడులోకి దూసుకెళ్లింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న టెన్నెసీలోని మెంఫిస్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. అసలు ఆ బాలుడికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిని హతమార్చి.. తలను పట్టుకెళ్లి..
టీ.నగర్ (చెన్నై): ఆస్తి కోసం కన్న తల్లిని హతమార్చాడో ప్రబుద్ధుడు. తల్లి తలను తెగనరికి తలతో పాటు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఈ అమానవీయ ఘటన తమిళనాడు పుదుక్కోట్టై జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కరంబకుడి సమీపాన మరవంబట్టి గ్రామానికి చెందిన తంగరాజ్ ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. అతనికి భార్య తిలగరాణి(48), ఐదుగురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఆనంద్(23) ఆస్తి పంచివ్వాలంటూ తల్లితో తరచూ తగాదాకు దిగేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం రాణికి, ఆనంద్కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో ఆనంద్ కత్తితో తల్లి రాణి తల తెగనరికాడు. తల్లి తలను బైక్లో పట్టుకెళ్లి కరంబకుడి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
రెవెన్యూ ఉద్యోగి దారుణహత్య
మేడిపెల్లి (వేములవాడ): జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి రాగుల సురేశ్(31) బుధవారం హత్యకు గురయ్యాడు. తన కూతురితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కారణంతో అదే గ్రామానికి చెందిన నల్ల గంగారెడ్డి, కొడుకు సంతోష్రెడ్డితో కలసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. సురేశ్ మేడిపెల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్. ఆయనకు భార్య శైలజ(25), కూతురు మోక్ష(2) ఉన్నారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. సదరు మహిళ విడాకులు తీసుకుని ఇంటి వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె విడాకులకు సురేశ్ కారణమని భావించిన గంగారెడ్డి పలు మార్లు సురేశ్ను హెచ్చరించాడు. ఈ క్రమంలో సురేశ్ తన మిత్రుడితో కలసి బైక్పై వస్తుండగా శివారులో దారికాచి దాడి చేశారు. కొడవలితో మెడపై, కడుపు భాగంలో పొడిచారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీనర్సయ్యపైనా దాడికి యత్నించగా పారిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
అవమానించాడనే అంతం చేశారు..
హైదరాబాద్: ‘అందరి ముందూ అవమానించాడు.. జనమంతా చూస్తుండగా చేయి చేసుకున్నాడు.. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు.. ఈ అవమానం భరించలేక అంతం చేయాలని నిర్ణయించుకున్నాం.. నలుగురు స్నేహితులం కలసి పరీక్ష రాయడానికి వెళ్తున్న సుధీర్ను నడిరోడ్డుపై వేటకొడవళ్లతో నరికి హత్యచేశాం..’సుధీర్ హత్య కేసులో కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు వెల్లడించిన విషయాలివీ. సోమవారం కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థి సుధీర్ కేసులో ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ ఎన్.భుజంగరావు, సీఐ వడ్డే ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. హత్యకు దారి తీసిన గొడవ.. ఇంటర్ చదువుతున్న మూసాపేటకు చెందిన ఎలగల సుధీర్(19) ఈ నెల 9న స్థానిక సభ్యత గ్రౌండ్లో అదే ప్రాంతానికి చెందిన ఇప్పలి కృష్ణ స్నేహితులతో గొడవ పడ్డాడు. సుధీర్ను కృష్ణ ప్రశ్నించడంతో.. వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. సుధీర్.. కృష్ణపై చేయి చేసుకున్నాడు. గొడవ విషయాన్ని సుధీర్ సోదరుడు ప్రసాద్కు చెప్పాడు. అదే రోజు సాయంత్రం కృష్ణ స్నేహితులైన జిల్లా మహేశ్, నవీన్.. సుధీర్, ప్రసాద్లకు గొడవ జరిగింది. అందరూ చూస్తుండగానే మహేశ్, నవీన్ను ప్రసాద్, సుధీర్ కొట్టారు. రాత్రి 9 గంటల సమయంలో మల్లన్న ఆలయం సమీపంలోకి వెళ్లిన మహేశ్కు అక్కడే ఉన్న సుధీర్, ప్రసాద్కు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తనపై దాడికి పాల్పడిన సుధీర్ను అంతం చేయాలని మహేశ్ నిశ్చయించుకున్నాడు. స్నేహితులు కృష్ణ, నవీన్, తేజతో కలసి పథకం వేశాడు. 2 వేటకొడవళ్లను కొనుగోలు చేసి.. వాటిని తేజ హోండా యాక్టివాలో దాచిపెట్టారు. సుధీర్ కదలికలు తెలుసుకోడానికి అదే ప్రాంతానికి చెందిన బైరెడ్ల శివ సహకారం తీసుకున్నారు. సోమవారం ఉదయం సుధీర్ పరీక్ష రాసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరి వసుంధర ఆస్పత్రి రోడ్డులో వస్తున్నాడని సమాచారం అందించాడు. కాపు కాసి.. దాడి చేసి.. దీంతో మహేశ్, మిగతా ముగ్గురు జాతీయ రహదారి పక్కనే ఉన్న సాగర్ హోటల్ వద్ద కాపు కాశారు. సుధీర్ రావడంతో అతడిని బైక్పై నుంచి లాగి కత్తులతో దాడి చేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రభాకర్, అంజి నిందితులను పట్టుకునేందుకు యత్నించగా ముగ్గురు పారిపోగా నవీన్ పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా మిగతా నిందితుల సమాచారం, సంఘటనకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు.. నిందితులు జిల్లా మహేశ్, శివను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి బుల్లెట్ వాహనం,రెండు వేటకొడవళ్లు, మూడు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల్లో ఇప్పలి కృష్ణ, తేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులకు కమిషనర్ చేతుల మీదుగా రివార్డును అందజేయనున్నట్లు ఏసీపీ భుజంగరావు సమావేశంలో తెలిపారు. -
బాసరలో దారుణం
భైంసా/బాసర(ముథోల్): బాసరలో దోపిడీ దొంగలు దారుణానికి ఒడిగట్టారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న తండ్రీ కొడుకులను పొట్టనబెట్టుకున్నారు. నగదు, నగల కోసం ఇద్దరిని బలితీసుకున్నారు. వదస్సేరిస్ గోపీనాథ్ (70), ఆయన కుమారుడు వదస్సేరిస్ రతిశ్ (45)లను హత్యచేసి దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం వీరిద్దరు నిద్రలోకి జారుకున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో కిరాతకంగా వీరిని నరికారు. నగదు, నగలతో ఉడాయించారు. అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బాసరలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కేరళ నుంచి వచ్చి.. భైంసా–బాసర ప్రధాన రహదారిపై రైల్వేస్టేషన్ సమీపంలో కేరళ రాష్ట్రంలోని ఎర్నకులానికి చెందిన వదస్సేరిస్ గోపీనాథ్ కుటుంబం స్టార్ ఇన్ రెస్టారెంట్ హోటల్ నిర్వహిస్తోంది. గోపీనాథ్ కొడుకు రతిశ్ హోటల్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఆయన భార్య శివరాణి ఇటీవలే ఎర్నకులానికి వెళ్లింది. రతిశ్ కుమారుడు అభిషేక్ హైదరాబాద్లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. కేరళ నుంచి తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు వెళ్లి కొన్ని రోజులు అక్కడే వ్యాపారం చేసుకున్నారు. 12 ఏళ్ల క్రితం వీరు బాసరకు చేరుకున్నారు. ఇక్కడే స్థిరపడి హోటల్ వ్యాపారం చేస్తున్నారు. భవనం ముందుభాగంలో హోటల్ నిర్వహిస్తూ వెనకాలే నివసిస్తున్నారు. దోపిడీ హత్యలే.. మంగళవారం రాత్రి హోటల్ మూసి వెనకాలే ఉన్న ఇంట్లో గోపీనాథ్, రతిశ్ నిద్రపోయారు. గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి రెస్టారెంట్ గోడ దూకి లోపలికి చొరబడ్డారు. హాల్లో నిద్రిస్తున్న రతిశ్ను, బెడ్రూంలో నిద్రిస్తున్న గోపీనాథ్ను కిరాతకంగా చంపేశారు. ఇంట్లో ఎవరూలేక.. రక్తపు మడుగుల్లో ఉన్న తండ్రీకొడుకుల మృతదేహాలను పోలీసు సిబ్బంది ఆటోలో వేసి పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించినా సుదూరంగా ఉన్న భార్య, బంధువులు బాసర చేరుకోలేకపోయారు. దీంతో ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు ఎన్ని చోరీకి గురయ్యాయనే వివరాలు తెలియరాలేదు. ఇలా వెలుగులోకి.. బుధవారం హోటల్లో పని చేసే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికి హోటల్ తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఏం జరిగిదని లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగుల్లో మృతదేహాలు కనిపించాయి. దీంతో సిబ్బంది బయటవారికి సమాచారం అందించారు. రైల్వేస్టేషన్లో ఉన్న చిరువ్యాపారులు, స్థాని కులు అక్కడికి చేరుకుని బాసర పోలీసులకు సమాచారం అందించారు. బాసర ఎస్సై మహేశ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై సమాచారంతో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ముథోల్ సీఐ రఘుపతి అక్కడికి వచ్చారు. క్లూస్ టీం బృందంతో వివరాలు, నమూనాలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు జాగిలాలు రహదారి వెంట పరుగెత్తాయి. జాగిలాలు పరుగెత్తిన మార్గాన్ని బట్టి ఈ సంఘటనకు పాల్పడ్డవారు ఎవరై ఉంటారని ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీ కొల్లగొట్టి.. దుండగులు సీసీ పుటేజీని కొల్లగొట్టారు. హార్డ్డిస్క్ను ఎత్తుకు వెళ్లారు. పక్క వ్యూహంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన స్థలానికి ఇరువైపులా ఉన్న దుకాణాల్లోని సీసీ పుటేజీలపై దృష్టి సారించారు. పార్థి ముఠా పనేనా? బాసరలో స్థిరపడ్డ హైదరాబాద్కు చెందిన సాలిక అశోక్, ఆయన భార్య సువర్ణ, కుమారుడు మణికంఠలను దోపిడీ దొంగలు 2013లో దారుణంగా హత్యచేశారు. పార్థి ముఠాయే ఆ కుటుంబాన్ని కడతేర్చినట్లు తేల్చిన పోలీసులు ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. జైలుశిక్ష అనుభవించిన వారు ఇటీవలే విడుదలైనట్లు సమాచారం. బాసరలో తాజాగా మళ్లీ రెండో సంఘటన జరగడంతో ఈ ముఠాయే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. 2013 సంఘటన మరిచిన బాసర వాసులు మళ్లీ ఈ సంఘటన చూసి భయాందోళనకు గురవుతున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య..
-
గొంతులు కోసి.. మహిళల దారుణహత్య..
సాక్షి, బెంగళూరు: ఉద్యాన నగరిలో హంతకులు చెలరేగిపోయారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని గొంతుకలు కోసి రక్తపుటేరులు పారించారు. బ్యాటరాయనపుర, సుద్దగుంటేపాళ్య పోలీస్స్టేషన్ల పరిధిలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. బ్యాటరాయనపుర పరిధిలోని కస్తూరిబానగర 5 వక్రాస్ 6 వ మెయిన్రోడ్డులో శివరామ్, కవితా(26) దంపతులు నివాసం ఉంటున్నారు. శివరామ్ నాయండహళ్లి ప్లైవుడ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతను గురువారం ఉదయం దుకాణం విదులకు వెళ్లగా 9 గంటల సమయంలో కవితా తన ఇద్దరు పిల్లలైన లిఖిత్, హర్షిత్ లను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి చేరుకుంది. ఈ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు చాకుతో గొంతుకోసి ఆమెను హత్యచేశారు. బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 9.50 సమయంలో కవిత తండ్రి ఇంటికి రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది. బ్యాటరాయనపుర పోలీసులు డాగ్స్క్వాడ్, వేలిముద్రనిపుణులతో చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అదనపు పోలీస్కమిషనర్ బీకే.సింగ్, డీసీపీ అనుచేత్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇంటిని ఖాళీ చేయనందుకు మహిళ గొంతుకోసిన యజమాని ఇంటిని ఖాళీ చేయలేదని అద్దెకు ఉంటున్న మహిళను గొంతుకోసి హత్యచేసిన యజమాని ఉదంతం సుద్దగుంటెపాళ్య పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కమలమ్మ అనే మహిళ ప్రైవేటు కంపెనీలో స్వీపర్గా పనిచేస్తోంది. సుద్దగుంటెపాళ్య గుండుతోపులో జగదీశ్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటుంది. ఇంటి లీజు అవధి ముగియడంతో ఖాళీ చేయాలని యజమాని జగదీశ్ సూచించాడు. అయితే అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని, అంతవరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని కమలమ్మ స్పష్టం చేసింది. ఈక్రమంలో జగదీశ్ స్నేహితులైన సంతోష్, కేశవ్తో కలిసి బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనుంచి ఇద్దరు పిల్లలను బయటికి పంపించి కమలమ్మతో గొడవపడ్డారు. ఓ దశలో జగదీశ్, మిగతా ఇద్దరూ కలిసి కమలమ్మ గొంతు కోసి ఉడాయించారు. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని పిల్లలు ఇరుగుపొరుగు వారి సాయంతో బౌరింగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సుద్దగుంటెపాళ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సంతోష్, కేశవ్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జగదీశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీ ఫలక్ నుమా పోలీస్ పరిధిలోని వట్టెపల్లిలో చోటుచేసుకుంది. వివరాలివి.. ఫలక్ నుమా రౌడీషీటర్ ఈసా(35)పై శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు తళ్వార్లతో దాడి చేశారు. సంఘటన స్థలంలోనే ఈసా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ యాదగిరి, ఏసీపీ సయ్యద్ ఫైయాజ్ సంఘటన స్థలం చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మర్చరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
గుర్రంపోడు (నాగార్జునసాగర్): మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని పట్టపగలే దారుణ హత్య చేశారు. ఘటన నల్లగొండ జిల్లా గుర్రం పోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు అనుమానించారు. రాములు కుమారుడు రామలింగయ్యపై గ్రామానికి చెందిన పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్య కత్తితో దాడి చేశారు. విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. రాములు, అతడి భార్య పెద్దమ్మ, రామలింగయ్య ఘటన స్థలికి రాగా సాయ న్న, శ్రీను, వెంకటయ్యతో పాటు పలువురు వారిపై దాడికి తెగబ డ్డారు. రాములును కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి, తలపై బండరాళ్లతో మోది దారుణంగా అంతమొందించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
భయానకం.. కిరాతక భర్త అరెస్ట్!
సాక్షి, దొడ్డబళ్లాపురం: కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు...భర్తే దైవమని సర్వం అర్పించిన భార్యను దారుణంగా చంపి శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి తల కాల్చి వేసి, శరీర భాగాలను పూడ్చివేశాడు.తర్వాత భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యా దు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. తాలూకా పరిధిలోని తపసీహళ్లికి చెందిన మునిరాజు కుమార్తె లక్ష్మి (28)కి 2011లో ఇదే తాలూకాలోని బొమ్మనహళ్లికి చెందిన రాజేశ్(35)తో వివాహమైంది. రెండు సంవత్సరాలపాటు వారి కాపురం సాఫీగా జరిగింది. తరువాత కలహాల కాపురంగా మారింది. దీంతో కుమార్తెతో లక్ష్మి పుట్టింటికి వచ్చింది. రాజేశ్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. కేసు విచారణ జరిపిన కోర్టు లక్ష్మికి ప్రతి నెలా రూ.1500 చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసు ఇంకా నడుస్తోంది. కొన్ని నెలలు డబ్బు ఇచ్చిన రాజేశ్ అనంతరం ఇవ్వలేదు. అయితే రాజేశ్కు లక్ష్మి దూరమైన కొన్నాళ్లకే పెద్దల సహకారంతో మరో వివాహం చేసుకున్నాడు. గత ఏడాది మనసు మార్చుకున్న రాజేశ్.. లక్ష్మిని తన ఇంటికి పంపించాలని ఆమె తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో లక్ష్మి గతేడాది మళ్లీ బొమ్మనహళ్లికి వచ్చింది. ఇదే నెల 9న లక్ష్మిని రాజేష్ అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి సమీపంలోని గుండసంద్ర గ్రామం చెరువుకి తీసికెళ్లాడు. అక్కడ తలను కాల్చివేసి, శరీర భాగాలను చెరువులో పూడ్చివేసాడు. అదే రోజు రాత్రి తన భార్య కనిపించడం లేదని దొడ్డబెళవంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో రాజేశ్ పొంతనలేని సమాధానాలిస్తుండడంతో తమదైన శైలిలో విచారించగా ఈ ఉదంతం వెలుగు చూసింది. భార్యపై అనుమానం రాజేశ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మికి అక్రమ సంబంధం ఉందని, గతేడాది మళ్లీ సంసారానికి వచ్చాక పరాయి పురుషులతో మాట్లాడుతుండేదని, తాను ప్రశ్నించగా కోర్టు ఆదేశం ప్రకారం ఇవ్వాల్సిన బాకీ రూ.1.75లక్షలు ఇస్తే వెళ్లిపోతానని గొడవ చేసిందని వివరించాడు. డబ్బులు ఇవ్వలేక, కేసు నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతో లక్ష్మిని అంతం చేసినట్లు నిందితుడు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. అయితే డబ్బు ఇవ్వకుండా, కోర్టు కేసునుంచి తప్పించుకునేందుకు తమ కుమార్తెను రాజేష్ హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. శరీర భాగాల వెలికితీత బుధవారం సాయంత్రం అసిస్టెంట్ కలెక్టర్ మహేశ్బాబు సమక్షంలో ఎస్పీ అమిత్సింగ్ ఆధ్వర్యంలో గుండసంద్ర గ్రామం చెరువులో రాజేశ్ పూడ్చిన లక్ష్మి శరీర భాగాలను పోలీసులు వెలికితీయించిపోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. నిందితుడిని కూడా తీసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిందితుడిని అప్పగిస్తే తామే చంపేస్తామని మృతురాలి బంధువులు గొడవ చేశారు. -
దారుణహత్య.. తల, మొండెం లభ్యం!
సాక్షి, గూడూరు: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం టేకులతండాలో శనివారం చోటుచేసుకుంది. మృతురాలి అత్త, మామ భూక్య చిలకమ్మ, హర్యానాయక్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భూక్య వినోద (25), భర్త రమేష్ కూలి పనులతోపాటు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వారికి చరణ్, సాయిచరణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తండా పక్కనే ఉన్న అయోధ్యపురం గ్రామానికి చెందిన సీతారాంరెడ్డి రైతుకు చెందిన 6 ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అందులో కొంత భాగం మొక్కజొన్న, మరికొంత పత్తి పంట సాగుచేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ బావికి ఉన్న విద్యుత్ మోటారు స్టార్టర్ అపహరణకు గురైంది. దీంతో పంటకు నీరు పారించడం ఇబ్బందిగా మారింది. స్టార్టర్ అపహరణపై అనుమానం వచ్చి వీరికి పక్కనే ఉన్న రూపురెడ్డి వెంకన్న, తునికి బొందాలు అనే రైతులను అడిగారు. వారిద్దరు కలిసి వినోద, రమేష్తో గొడవకు దిగారు. తునికి బొందాలు కత్తితో పొడిచి చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన వినోద, భర్త రమేష్, అత్తమామలు, కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ భూక్య వెంకన్నకు ఫిర్యాదు చేశారు. వెంకన్న ఐదు రోజుల తర్వాత మాట్లాడుదామని చెప్పారు. ఇరువురు డిపాజిట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో అపహరణకు గురైన స్టార్టర్ తునికి బొందాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి సీతారాంరెడ్డి, వెంకన్న, బొందాలు.. వినోద–రమేష్ దంపతులపై పగ పెంచుకున్నారు. మూడు రోజుల క్రితం రమేష్ హైదరాబాద్కు కూలి పనికి వెళ్లగా.. వినోద శనివారం ఉదయం మొక్కజొన్నకు నీళ్లు పెట్టడానికి వెళ్లింది. వినోద వెంట ఆమె 6 సంవత్సరాల కొడుకు సాయిచరణ్ కూడా వెళ్లాడు. ఉదయం పది గంటలకు ఇంటికి వచ్చి వినోద, సాయిచరణ్ అన్నం తిన్నారు. మళ్లీ నీళ్లు పెట్టేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సాయిచరణ్ తల్లి వినోద చెప్పులు పట్టుకుని పక్కనే ఉన్న ఇంటికి వచ్చాడు. తల్లి ఏదని అడిగితే సాయిచరణ్ ఏమీ చెప్పలేదు. వెంటనే మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తపు మడుగులో కనిపించింది. తల, మొండెం వేరుగా పడేశారు. సమాచారం అందుకున్న మానుకోట డీఎస్పీ నరేష్కుమార్, గూడూరు సీఐ రమేష్, ఎస్సైలు యాసిన్, రామారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ముగ్గురే చంపారు.. తమ కోడలు వినోదను సీతారాంరెడ్డి, తునికి బొందాలు, రూపురెడ్డి వెంకన్న చంపారని ఆమె అత్తామామ చిలకమ్మ, హర్యానాయక్ ఆరోపించారు. ఇటీవల జరిగిన గొడవలో కత్తితో చంపుతానని తునికి బొందాలు అన్నాడని, అతడిని మాత్రం అటు వైపు వెళ్లడం చూశానని, ముగ్గురు కలిసే చంపారని చిలకమ్మ పోలీసులకు చెప్పింది. పోలీసుల అదుపులో నిందితుడు..? వినోదను చంపిన వ్యక్తి పోలీసుల వద్దకు చేరుకున్నట్లు సమాచారం. తనతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు, ఇటీవల తనను కాదని మరొకరితో కలిసి తిరుగుతుందని, అదే కోపంతో ఒక్కడినే కత్తితో కోసి చంపానని గ్రామానికి చెందిన ఓ పెద్ద నాయకుడికి చెప్పాడని, ఆయన సూచన మేరకు లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం నుంచి సాయంత్రం చేరుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి దారుణ హత్య
సాక్షి, చెన్నై: వావి వరుసలు మరచిన ఓ యువకుడు, కుటుంబ గౌరవానికి, బంధాలకు కలంకం తెచ్చే రీతిలో కిరాతకుడయ్యాడు. వరుసకు చిన్నాన్న కుమార్తెను ప్రేమించాడు. తనకు దక్కని ఆ అమ్మాయి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ప్రేమోన్మాదిగా మారాడు. బుధవారం నిశ్చితార్ధానికి సిద్ధం అవుతున్న ఆ యువతిని మంగళవారం రాత్రి దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా వన్సైడ్ ప్రేమకు బలి అవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్నారు. అయితే చెల్లెలు వరుస అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తూ, చివరకు ఆమెను హతమార్చడం తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలం రేపింది. వన్సైడ్ లవ్.. తిరుచ్చి నెం.1 టోల్ గేట్ సమీపంలోని కీరమంగలంకు చెందిన శివ సుబ్రమణ్యన్కు హేమలత(27) కుమార్తె ఉంది. పట్టభద్రురాలైన హేమలత తిల్లె నగర్లోని ఓ మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తుంది. శివ సుబ్రమణ్యన్కు వరుసకు అన్న అయిన జ్ఞాన సంబంధం కుమారుడు సత్యకుమార్(30) ప్రతిరోజూ హేమలతను తన బైక్లో ఆ సంస్థ వద్ద డ్రాప్ చేసి, ఇంటికి తీసుకొస్తుంటాడు. వారి కుటుంబాల మధ్య హఠాత్తుగా విభేదాలు తలెత్తాయి. పక్క పక్క ఇళ్లలో ఉన్నా, మాటలు, రాకపోకలు కరువయ్యాయి. ఇందుకు సత్యకుమార్ కారణమని ఆ పరిసర వాసులు చెప్పుకునే వారు. ఆగిన నిశ్చితార్థం.. ఈ నేపథ్యంలో హేమలతకు బుధవారం తిరుచ్చికి చెందని ఓ యువకుడితో వివాహ నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లోకి వెళ్లిన సత్యకుమార్ తన చేతిలోని వేట కత్తితో శివసుబ్రమణ్యంను నరికాడు. అడ్డొచ్చిన అతని సోదరుడు వైరవేల్ను సైతం కత్తితో దాడి చేశాడు. వీరి కేకలు విని హేమలత బయటకు పరుగెత్తికు వచ్చింది. ఆ ప్రేమోన్మాది కత్తితో హేమలత గొంతు మీద నరికాడు. ఈ సంఘటన నుంచి తేరుకున్న ఇతర కుటుంబీకులు సత్యకుమార్ను అడ్డుకునే యత్నం చేయడంతో ఉడాయించాడు. గొంతు తెగడంతో హేమలతను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న సమయపురం సీఐ జ్ఞానవేల్, టోల్ గేట్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందతుడు సత్యకుమార్ కోసం గాలింపు చేపట్టారు. విచారణలో సత్యకుమార్ వన్సైడ్ లవ్, ప్రేమోన్మాదంతో సాగించిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాదిగా మారాడు.. ఒక్కరోజు సత్యకుమార్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని హేమలత దృష్టికి తెచ్చాడు. తనకు అన్నయ్య అన్న విషయాన్ని మరచినట్టున్నావని అతడ్ని ఆమె మందలించింది. ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించి అతడికి దూరంగా ఉండడం మొదలెట్టింది. అయితే, రోజు రోజుకు సత్యకుమార్ వేధింపులు పెరగడంతో కొన్ని నెలల క్రితం ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది. దీతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. హేమలతకు సత్యకుమార్ నుంచి వేధింపులు పెరగడంతో ఆమెకు వివాహ ఏర్పాట్లు చేశారు. బుధవారం నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఉన్మాదిగా మారాడు. మంగళవారం రాత్రి సత్యకుమార్ ఆగ్రహాంతో హేమలత కుటుంబాన్నే మట్టుబెట్టే యత్నం చేశాడు. అంతేకాక ఆమె గొంతు నరికి పారిపోయినట్లు విచారణలో వెలుగు చూసింది. అజ్ఞాతంలో ఉన్న సత్యకుమార్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
భార్యకు ఫోన్లో కూతుళ్ల ఆర్తనాదాలు వినిపిస్తూ హత్య..
హంట్స్విల్లే: తన ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన వ్యక్తికి అమెరికాలో మరణ శిక్ష అమలుచేశారు. 2001 నాటి ఈ కేసులో దోషిగా తేలిన డాలస్కు చెందిన అకౌంటెంట్ జాన్ డేవిడ్ బాటాగ్లియా(62)కు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న బాటాగ్లియా ఓసారి తన కూతుళ్లు ఫేత్(9), లిబర్టీ(6) వద్దకు వచ్చి వారిని కాల్చి చంపాడు. ఆ సమయంలో భోజనం చేయడానికి వారి తల్లి మేరీ జేన్ పియర్లీ బయటికి వెళ్లింది. పియర్లీకి ఫోన్ చేసి మరీ కూతుళ్ల ఆర్తనాదాలను వినిపిస్తూ బాటాగ్లియా వారిని హత్య చేశాడు. అవతలి వైపు పియర్లీ నిస్సహాయంగా ఫోన్లో.. చంపొద్దంటూ ఫేత్ తన తండ్రిని వేడుకుంటున్న మాటలను విన్నా ఏం చేయలేకపోయింది. బాటాగ్లియా(62) మానసిక స్థితి సరిగా లేదని మరణశిక్షకు అనర్హుడని, అతని తరఫు లాయర్లు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో టెక్సాస్లో తాజాగా శిక్షను అమలుపరిచారు. ఇది ఈ ఏడాది అమెరికాలో అమలుచేసిన మూడో మరణశిక్ష కావడం గమనార్హం. అన్నీ టెక్సాస్లోనే జరిగాయి. -
అనుమానం అంతం చేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రేమ అన్నాడు. సహజీవనం చేశాడు. ఓ కుమార్తె జన్మకు కారణమయ్యాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం.. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉండటంతో ప్రేమికురాలిని దారుణంగా చంపాడు. కుమార్తెను, ప్రేమికురాలి తల్లిని కూడా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చందానగర్లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గుడూరి జయమ్మ(50)కు కుమార్తె అపర్ణాదేవి(33), కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. అపర్ణ అమ్మమ్మ ఊరు పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. అదే గ్రామానికి చెందిన రావాడ మధు కేపీహెచ్బీలో సెల్ఫోన్లు రిపేర్ చేస్తుంటాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు పదేళ్ల క్రితం మధుతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే తనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారన్న విషయాన్ని దాచి అపర్ణతో సహజీవనం చేయసాగాడు. వీరికి ఐదేళ్ల వయస్సున్న పాప కార్తీకేయ కూడా ఉంది. చందానగర్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఎల్జీ ప్రమోటర్గా పనిచేస్తున్న అపర్ణ ప్రస్తుత ఫ్లాట్లో రెండున్నర నెలలుగా తల్లి, కుమార్తెతో కలసి ఉంటోంది. దుర్వాసన రావడంతో వెలుగులోకి ... బయట నుంచి తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని నారాయణరావు అనుమానం వచ్చి వెనక వైపు కిటికీలో నుంచి చూశాడు. హత్యకు గురైన అపర్ణ కాళ్లు కనిపించాయి. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కిచెన్లో రక్తపు మడుగులో పడి అపర్ణ మృతి చెంది ఉంది. బెడ్పై జయమ్మ, కార్తికేయ తనువు చాలించి ఉన్నారు. అపర్ణ తలపై బలంగా కొట్టి చంపినట్టుగా అనవాళ్లు ఉన్నాయని చెప్పిన పోలీసులు చెప్పారు. జయమ్మ, కార్తికేయ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. క్లూస్ టీం, ప్రత్యేక డాగ్ స్క్వాడ్లు ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. ఘటనాస్థలిని సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పరిశీలించారు. షానవాజ్ ఖాసీమ్ మాట్లాడుతూ ‘అపర్ణను తలపై రోకలిబండతో మోది కిచెన్లో హత్య చేశారు. బెడ్పై పడుకున్న జయమ్మ, కార్తికేయను గొంతుకు పిసికి చంపి ఉండొచ్చు. లేదంటే విషమిచ్చి చంపి ఉండవచ్చ’న్నారు. హత్య చేసిన అనంతరం బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయాడన్నారు. సీసీటీవీ కెమెరాల పరిశీలన... హత్య ఎప్పుడు, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేముకుంటలోని ఫ్లాట్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అపర్ణ సెల్ఫోన్ కాల్డేటాను పరిశీలిస్తున్నారు. చందానగర్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి శనివారం 2.48 గంటలకు విధుల్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డయింది. భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అపర్ణ రాకపోవడంతో 3.30 గంటలకు సహచర ఉద్యోగి ఫసీయుద్దీన్ ఫోన్ చేయగా కలవలేదు. రెండు నెలలుగా గొడవ... అపర్ణతో సహజీవనం చేస్తున్న మధు తరచూ వేముకుంటలోని నివాసానికి వస్తుండేవాడు. అయితే, అపర్ణను వదిలేయంటూ మొదటి భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, అదే సమయంలో పెళ్లి చేసుకోవాలంటూ అపర్ణ కూడా బలవంతం చేస్తుండడంతో ఇద్దరి మధ్య రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. అయితే, అపర్ణతో తాను సహజీవనం చేస్తున్నానని, మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. శనివారం మధ్యాహ్నం అపర్ణ ఇంటికి రాగానే తలుపు తీశానని, వెంటనే ఆమె తలను గోడకేసి బాది చంపానని నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది. -
నల్లగొండలో మరో కిరాతక హత్య
నల్లగొండ క్రైం: నల్లగొండలో మరో కిరాతక హత్య జరిగింది. మునిసిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసు గురించి మరవకముందే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టణంలోని భారత్గ్యాస్ గోదాం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కనగల్ మండలానికి చెందిన పాలకూరి రమేశ్ (32)ను దారుణంగా హత్య చేసి తల, మొండాన్ని వేరు చేశారు. తలను స్థానిక బొట్టుగూడలో ఓ సామాజిక వర్గానికి చెందిన దిమ్మెపై పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రమేశ్, అనిత భార్యాభర్తలు. అనిత కనగల్కి చెందిన రాయల రామకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఐదు నెలలపాటు అతనితో వెళ్లిపోయింది. అనితను సర్దిచెప్పి తీసుకొచ్చిన పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. రెండు నెలలుగా రామకృష్ణకు అనిత దూరం కావడంతో ..రమేశ్ను అడ్డు తొలగించుకునేందుకు స్నేహితుడైన పాత నేరస్తుడు మోసిన్ఖాన్తో చేతులు కలిపాడు. ఇతను నయాబ్కు విషయం చెప్పి ఇద్దరు కలసి హత్యకు పథకం పన్నారు. అప్పటికే మోసిన్ఖాన్కు రమేశ్ పరిచయం ఉండటంతో ఆదివారం రాత్రి ఇద్దరు కలసి మందు తాగారు. అనంతరం రమేశ్ను కత్తితో గొంతులో పొడిచి చంపారు. నిందితులు మోసిన్ఖాన్, నయాబ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే.. తగిన బదులిస్తాం..!
సాక్షి, నల్లగొండ: జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త, పార్టీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణహత్యను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి ఉత్తమ్ వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన విలేకరులకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు అమానుషమని మండిపడ్డారు. రాజకీయ కక్షల కారణంగానే శ్రీనివాస్ హత్య జరిగినట్టు భావిస్తున్నామని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గతంలోనే శ్రీనివాస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే తగినవిధంగా బదులు ఇస్తామని ఆయన హెచ్చరించారు. శ్రీనివాస్ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం నల్లగొండకు వెళ్లనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన నల్లగొండకు బయలుదేరుతారు. -
హత్య చేసి, చెట్టుకు వేలాడదీశారు..
సాక్షి, ప్రకాశం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాలివి.. జిల్లాలోని పొన్నలురు చెరువులో దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లేబర్ కాంట్రాక్టర్ దారుణ హత్య
జిన్నారం (పటాన్చెరు): ఓ లేబర్ కాంట్రాక్టర్ను దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి కాల్చి దహనం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మండలం, కాయపల్లి గ్రామానికి చెందిన కుసుమ ఆదినారాయణ(36) కుటుంబం బతుకుదెరువు కోసం జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామానికి వలస వచ్చింది. ఇక్కడి పారిశ్రామికవాడ లోని ఓ పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసేవాడు. బుధవారం రాత్రి లేబర్ కోసం ఓ వ్యక్తిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి 12 గంటలైనా తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు ఆదినారాయణకు సెల్ఫోన్కు చేయడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మరుసటి రోజు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం కనిపించడంతో కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించగా.. అది ఆదినారాయణ మృతదేహంగా గుర్తించారు. బీరు బాటిళ్లను నోట్లో, మెడపై గుచ్చి, పెట్రోల్ పోసి కాల్చి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరో కక్షపూరితంగానే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరుకు తరలించారు. -
క్షమించు జానకీ!
సీతమ్మ పేరు పెట్టుకున్న నిన్ను అంత పవిత్రంగా చూడలేకపోయాడు వాడు. నిత్యం కష్టపడే నాన్నకు సాయపడాలన్న మంచి మనసున్న నిన్ను రక్షించుకోలేకపోయాం మేము. జనారణ్యంలో మృగాళ్లు నడి రోడ్డుపై సంచరిస్తున్నారని తెలుసు.. ప్రాణాలను తోడేస్తూ ఉన్మాదంగా వికటాట్టహాసం చేస్తున్నారనీ తెలుసు. ఈ విపత్కర పరిస్థితుల్లో నీవు కేవలం ఓ గాజు బొమ్మవని తెలిసినా నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాం. టీచర్ కావాలని ఆశ పడి ఇష్టంగా పుస్తకాలు చదివే నీకు.. నీ చుట్టూనే రాక్షసులు ఉన్నారని చెప్పలేకపోయాం. జానకీ క్షమించు..రాజాం మండలం శ్యాంపురం పంచాయతీ గుయ్యానవలసకు చెందిన బోను జానకి (24) హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సాక్షి, రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం శ్యాంపురం పంచాయతీ గుయ్యానవలసకు చెందిన బోను జానకి హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం అలముకుంది. బోను సూరప్పడు, జయమ్మలకు ఆరుగురు కుమార్తెలు. అయిదుగురికి వివాహాలయ్యాయి. ఆరో కుమార్తె జానకి (24) డిగ్రీ వరకూ చదువుకుంది. టీచర్ కావాలనే ఆశతో నిత్యం పుస్తకాలు చదువుతూ ఉండేది. అయితే కష్టపడితేగాని పూటగడవని కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అక్క భారతి సహాయంతో హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో డీమార్ట్ సూపర్మార్కెట్లో పనికి కుదిరింది. అక్కడ అక్క ఇంట్లోనే కొన్నాళ్లు ఉండేది. కొద్ది నెలల క్రితం డిమార్ట్ సమీపంలోనే గదిని అద్దెకు తీసుకొని స్నేహితురాలితో కలసి ఉంటుంది. కొన్నాళ్లుగా ఆనంద్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని జానకి వెంటపడుతుండేవాడు. ఈ విషయాన్ని స్నేహితురాలితో చెప్పి జానకి బాధపడేది. ఆనంద్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, పనికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నానని రోదిస్తూ చెప్పింది. సంక్రాంతి పండుగకు వచ్చేస్తానని, పెళ్లి ప్రయత్నాలు చేయమని కోరింది. అయితే ఇంతలోనే మంగళవారం రాత్రి ఆమె ప్రేమోన్మాది ఆనంద్ చేతిలో హత్యకు గురైంది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రి సూరప్పడుతోపాటు కొంతమంది బంధువులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విద్యావంతురాలైన తమ కుమార్తెను పొట్టనపెట్టుకున్న ఆనంద్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న కుమార్తె హత్యకు గురికావడంతో తమను ఎవరు ఆదుకుంటారని జానకి తల్లి జయమ్మ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
స్నేహితుల దారుణ హత్య..
సాక్షి, అన్నానగర్: ఆరల్వాయ్మొలి సమీపంలోని సీతప్పాల్ కొండ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు దారుణ హత్యకు గురయ్యారు. హతుల్లో ఒకరు గంజాయి వ్యాపారి ఉన్నారు. సీతప్పాల్ ఎస్ఏ వీధికి చెందిన భునేష్మణి (35). ఇతని భార్య సూర్య, దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇతను గంజాయి వ్యాపారి కావడంతో ఆరల్వాయ్మొళి, భూతప్పాండి, కొట్టార్ పోలీసు స్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్నాయి. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారనే సమాచారం అందగానే సీతప్పాల్లోని కొండ ప్రాంతంలో తలదాచుకునేవాడు. ఇటీవల ఓ కేసులో అరెస్టై, ఆ తర్వాత బెయిల్పై బయటకి వచ్చిన భువనేష్మణి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తన స్నేహితుడు వడచేరి అరుగువిలైకి చెందిన షాజీ ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. భువనేష్మణి కోసం భార్య బుధవారం పలు చోట్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. సీతప్పాల్ కొండపై ప్రాంతంలో ఉంటాడనే అనుమానంతో భునేష్మణి తండ్రి మణి అక్కడికి వెళ్లి చూశాడు. అక్కడ భునేష్మణి గొంతు కోయబడిన స్థితిలో, షాజీ కత్తి గాయాలతో మృతి చెంది ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసారి పల్లమ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, హంతకుల కోసం గాలిస్తున్నారు. -
విద్యావాలంటీర్పై ఉన్మాది ఘాతుకం
-
కోర్టుకు హాజరై వెళుతుండగా..
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న ఉద్యోగిపై పదునైన కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. హత్య అనంతరం దుండగులు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. నేరేడ్మెట్లోని మల్కాజిగిరి కోర్టు, డీసీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో వినోభానగర్ మార్గంలో శుక్రవారం జరిగిన ఈ దారుణహత్య స్థానికం గా కలకలం సృష్టించింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దంపతుల మధ్య మనస్పర్థలు: మృతుని తల్లిదండ్రులు, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి కథనం ప్రకారం.. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం సమీపంలో రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్ఐ ఎంజాల శ్రీధర్, భార్య సంధ్య, కొడుకు ఎంజాల చందర్(32)తో కలసి నివసి స్తున్నారు. చందర్ గచ్చిబౌలిలోని ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన సుహాసినితో 2010లో అతనికి వివాహం జరిగింది. అయితే కొంతకాలానికే దంపతుల మధ్యలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. హత్య జరిగిందిలా.. మనస్పర్థలతో చందర్, సుహాసిని విడిపోయా రు. 2012 నుంచి వీరి మధ్య మల్కాజిగిరి కోర్టులో విడాకుల కేసు, సిటీ సివిల్, ఎస్సీ, ఎస్టీ కోర్టుల్లో మూడు కేసులు కొనసాగుతున్నాయి. శుక్రవారం చందర్ తల్లిదండ్రులతో కలసి మల్కాజిగిరి కోర్టు కేసు విచారణ కోసం శుక్రవారం ఉదయం వచ్చారు. కోర్టు సమీపం లోని వినోభానగర్ నుంచి కాకతీయ నగర్కు వెళ్లే మార్గం(కల్లు దుకాణం సమీపం)లో తమ కారును పార్క్ చేసి కోర్టుకు వెళ్లారు. 11.30 గంటల సమయంలో తిరిగి వెళ్లేందుకు చందర్ తల్లిదండ్రులతో కలసి కారు వద్దకు వచ్చారు. తల్లిదండ్రులు కారులో కూర్చున్నారు. బావా.. బావా అంటూ వచ్చి.. అదే సమయంలో వెనుక నుంచి బావా.. బావా అంటూ కొందరు పిలుస్తూ కారు వద్దకు వచ్చారు. వచ్చిన వ్యక్తులు ఏదో మాట్లాడుతుం డగా చందర్ పట్టించుకోకుండా కారు ఎక్కేందు కు డోర్ తీస్తుండగా వెనుక నుంచి కత్తితో దాడి జరిగింది. చందర్ వారిని ప్రతిఘటించే ప్రయ త్నం చేశాడు. మరికొందరు దుండగులు కత్తుల తో అతనిపై దాడికి తెగబడ్డారు. కారులో ఉన్న తల్లిదండ్రులు కేకలు వేస్తూ కిందకు దిగారు. తమ కుమారునిపై దాడి చేయొద్దని ప్రాధేయ పడినా దుండగులు జాలి చూపలేదు. మెడ కింది భాగం, గొంతు పక్కన, తలపై కత్తులతో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై చందర్ కుప్ప కూలి అక్కడికక్కడే కన్నుమూశాడు. అనంత రం నిందితులు కాకతీయనగర్ వైపు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఒక సంచిలో నిందితులు వాడిన కత్తులను గుర్తించింది. ప్రధాన నిందితునిగా అనుమాని స్తున్న వినయ్ మినహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రాధేయ పడినా వినలేదు: చందర్ తల్లిదండ్రులు తమ ఎదుటే కన్నకొడుకు విగతజీవిగా మారడంతో చందర్ తల్లిదండ్రులు శ్రీధర్, సంధ్య గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. తమ కొడుకు చందర్పై మల్కాజిగిరికి చెందిన వినయ్(బావమరిది)తోపాటు నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని వారు పోలీసులకు వివరించారు. కోర్టు పరిసరాల నుంచి కారు వరకు తమను అనుసరిస్తూ వచ్చిన దుండగులు తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని, ఎంత ప్రాధేయపడినా వినలేదని కన్నీరుమున్నీరయ్యారు. నిందితుల కోసం గాలింపు: ఏసీపీ చందర్ హత్య కేసులో అతని భార్య సోదరుడు వినయ్, మరికొంత మంది ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ కృష్ణమూర్తి విలేకరులకు వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు. -
ఏం జరిగినా మీరు మాత్రం స్పందించరు!
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పనికిరాని అంశాలపై మాత్రమే స్పందిస్తుంటారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ లవ్ జిహాద్ అంశంపై నగరంలో నిర్వహించిన ఓ సభలో ఒవైసీ స్పందించారు. ‘‘ వరుస ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటిపైనా ప్రసంగిస్తారు. తనపై ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలను ఖండిస్తారు. కానీ, అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై అస్సలు నోరు మెదపరు. రాజస్థాన్లో జరిగిన అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కానీ, మోదీ మాత్రం స్పందించలేదు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. 50 ఏళ్ల వ్యక్తి లవ్ జిహాద్ పాల్పడ్డాడన్న ఆరోపణ ఏ మాత్రం సమంజసం. కేవలం ముస్లింలు అన్న కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. వీటిని మౌనం వహించటం ఎంత వరకు సమంజసం? అని ఒవైసీ.. ప్రధానిని ప్రశ్నించారు. కాగా, పశ్చిమ బెంగాల్కు అఫ్రజుల్ ఖాన్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ ఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఉలిక్కిపడ్డ బెజవాడ..!
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో బుధవారం దారుణంగా హత్యకు గురయ్యాడు. సినీఫక్కీలో వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో హత్య చేసి పరారయ్యారు. ఆరుగురు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో సుబ్బును నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు. జన సంచారం రద్దీగా ఉండే ఏలూరు రోడ్డుకు సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. టీడీపీ యూత్ విభాగం నగర అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను తన భర్తను హత్య చేయించాడని మృతుడి భార్య దుర్గ, ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సాక్షి, విజయవాడ/గుణదల: విజయవాడ నగరం మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి నాజర్పేటకు చెందిన వేమూరి సుబ్రహ్మణ్యం(35)అలియాస్ సుబ్బు కొద్దికాలంగా విజయవాడ రాజరాజేశ్వరీపేటలో కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు. అతను భార్య దుర్గ, కుమారుడు తేజ (17), మనోజ్ (14)తో కలిసి నివసిస్తున్నాడు. గతంలో సుబ్బు టీడీపీ యువజన నాయకుడు కాట్రగడ్డ శ్రీను వద్ద పనిచేసేవాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, కాల్మనీ వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. సుబ్బు ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. మాచవరం ఏరియాలోకి రాగానే మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు సుబ్బుపై దాడిచేశారు. వెంట తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లతో విచ్చణారహితంగా నరికారు. ఎడమ భుజం పూర్తిగా ఛిద్రమై ఎముకలు బయటపడ్డాయి. అకస్మాతుగా చోటుచేసుకున్న సంఘటనతో ఉలిక్కిపడ్డ జనం తేరుకుని భయంతో పరుగులు తీశారు. నిందితులు బైక్లపై పరారయ్యారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీం వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు సుబ్బును హత్య చేసిన హంతకులలో ఇద్దరు పట్టుబడ్డారు. హత్య విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తెనాలికి చెందిన వారు కావడంతో అక్కడి వారితో కూడా సుబ్బుకు విభేదాలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులను అడ్డుకున్న పోలీసులు సుబ్బు హత్య విషయం తెలియడంతో కుటుంబసభ్యులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న సుబ్బును చూసిన భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం వద్దకు వెళ్లకుండా కొద్దిసేపు నియంత్రించడంతో భార్య దుర్గ, తండ్రి వెంకటేశ్వర్లు బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై నరికి చంపిన వారని ఆపకుండా తమను ఆపుతున్నారేమని ప్రశ్నించారు. క్లూస్ టీం రానిదే ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో దూరంగా నిలబడిపోయారు. శ్రీనే హత్య చేయించాడు.. కాట్రగడ్డ శ్రీను నివాసం కూడా సంఘటనా స్థలానికి అతి సమీపంలో ఉండటంతో అతనే ఈ హత్య చేయించాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. గతంలో శ్రీను వద్ద సుబ్బు పనిచేశాడని, ప్రస్తుతం మానేయడంతో మరో వర్గంతో చేతులు కలిపి ఈ హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం..డీసీపీ ఈ హత్యకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ గజరావుభూపాల్ సంఘటన స్థలం వద్ద విలేకరులకు చెప్పారు. రెండేళ్ల కిందట సుబ్బు అన్నయ్య సత్యనారాయణ కూడా హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. అప్పటి నుంచి సుబ్బుకు శత్రువులు ఉండి ఉంటారని తెలిపారు. సుబ్బుకు సంబంధించిన అన్ని వివరాలు తెనాలిలో ఉంటాయని అక్కడి పోలీసులతో సంప్రదించి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మాచవరం పోలీసులను టీంలుగా విభజించి తెనాలి ప్రాంతానికి పంపించామని వివరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లు సేకరించిన వివారాలు, పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నా భర్తను పొట్టన పెట్టుకున్నారు.. నా భర్తను చంపేశారు. నా కుంటుంబం రోడ్డున పడింది. పగ తీరకపోతే మమ్మల్ని కూడా పొట్టన పెట్టుకోండి. పొట్ట తిప్పల కోసం విజయవాడ వస్తే నా భర్తను పొట్టన పెట్టుకున్నారు. నడిరోడ్డుపై నరికి చంపారు. ఇదెక్కడి ఘోరం. దుర్గ(సుబ్బు భార్య) నా బిడ్డను శ్రీనే చంపాడు.. నా బిడ్డను చంపింది కాట్రగడ్డ శ్రీనునే. లేకపోతే గవర్నర్ పేట వెళతానని చెప్పిన నా బిడ్డ మాచవరం డౌన్కు వెళ్లి హత్యకు గురికావడమేంటి. కాట్రగడ్డ శ్రీను ఇంటికి సమీపంలో ఈ హత్య పథకం ప్రకారమే జరిగింది. వెంకటేశ్వర్లు(సుబ్బు తండ్రి) -
స్కార్పియోతో ఢీకొట్టి.. కత్తులతో నరికారు !
సాక్షి, పసుపల ( కర్నూలు): పసుపల గ్రామం సమీపంలో దారుణహత్య జరిగింది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నడుస్తున్న అధిపత్యం ఈ దారుణానికి దారితీసింది. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి సమాచారం మేరకు.. రుద్రవరం గ్రామానికి చెందిన బోయకృష్ణ (33)కర్నూలులోని ముజఫర్ నగర్లో తన రెండవ భార్య ఇంట్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ప్రత్యర్థులు కాపు కాశారు . అక్కడికి రాగానే తన స్కార్పియో ఏపీ 26 ఏఎన్ 4945తో బోయ కృష్ణ నడుపుతున్న పల్సర్ వాహనాన్ని ఢీ కొట్టి ఆయన కాలుపై ఎక్కించారు. కాలు విరిగిన కృష్ణ అక్కడి నుంచి కదలలేకపోయాడు. తర్వాత అతడిని అతి దారుణంగా కత్తులతో తలపై, గొంతుపై నరికి పరారయ్యారు. తర్వాత ఆ దారిగుండా వెళ్తున్న స్థానికులు రక్తపుమడుగులో పడి ఉన్న బోయకృష్ణను గుర్తించి కర్నూలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మహేశ్వరరెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతీకార హత్యే బోయకృష్ణను ప్రత్యర్థులే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కురువవేంకటేశ్వర్లు, కురువ మధుసూదన్, బోయ పెద్ద ఎల్లయ్య, బోయ చిన్న ఎల్లయ్య, కురువజగదీశ్, కురువమురళీ, కురవ మధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతుడు బోయకృష్ణ 2016 డిసెంబర్ 6న సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన కురువరాముడి హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇతను ఆరు నెలల క్రితమే బెయిల్పై బయటకు వచ్చాడు. మొదటి భార్యను చూసేందుకు ఊరికి రావడంతో ఆయన ప్రత్యర్థులు పథకం రచించి తిరిగి వెళ్తుండగా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటర్ ప్లాంట్ విషయంలో విభేదాలు 2015 సంవత్సరంలో గ్రామంలోని సుంకులమ్మ గుడిలో ఫిల్టర్ నీళ్ల ప్లాంట్ పెట్టడానికి కురువరాముడు ఏర్పాట్లు చేశాడు. బోయ కృష్ణ వర్గం దేవాలయంలో నీళ్ల ప్లాంట్ వద్దని వేరే చోట పెట్టాలని అడ్డుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యం మొదలైంది. ఈ పోరులో కురువ రాముడుని గతేడాది డిసెంబర్లో ప్రత్యర్థులు మట్టుబెట్టారు. ఏడాది తిరగకముందే హతుడి కుమారులు ప్రతీకారం తీర్చుకున్నారని గ్రామంలో చర్చ సాగుతోంది. స్కార్పియోలో టీడీపీ కండువాలు బోయకృష్ణను చంపడానికి నిందితులు వాడిన ఏపీ 26 ఏఎన్ 4945 స్కార్పియో వాహనంలో టీడీపీ కండువాలు ఉన్నాయి. అనుమానితుల్లో ఒకరైన కురువ వేంకటేశ్వర్లు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడి అనుచరుడు. తండ్రి హత్య తర్వాత ఆయన పంచాన చేరాడు. అంతకు ముందు ఆ నేతే.. తన అనుచరుడిగా ఉండమని బోయకృష్ణను కోరితే ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో తమ ప్రత్యర్థి వెంకటేశ్వర్లుకు ఆ నేత అన్ని విధాలుగా సహాయం చేసి హత్య చేయించాడని బోయకృష్ణ బంధువులు సంఘటన స్థలంలో ఆరోపించారు. -
పాత కక్షలతోనే రౌడీషీటర్ హత్య!
సాక్షి గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గుంటూరు రౌడీషీటర్ బసవల వాసు హత్య కేసును గుంటూరు అర్బన్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ విజయారావు వివరాలు వెల్లడించారు. ఓ గొడవలో గుంటూరులోని సంగడిగుంటకు చెందిన చక్రకోటి సాయి, బాలాజీ నగర్కు చెందిన సింగంశెట్టి సతీష్లపై గతంలో వాసు దాడికి పాల్పడ్డాడు. దీన్ని మనసులో ఉంచుకున్న సతీష్ తన మిత్రుడైన రౌడీషీటర్ కావటి రాజేష్తో పాటు ఎస్.కె.ఆదాం, ఎస్.కె.సులేమాన్, గట్టుపల్లి శివరామకృష్ణలతో కలిసి ఆదివారం రాత్రి వాసును దారుణంగా హత్య చేసి పారిపోయారు. -
30 సెకన్లలో 30 సార్లు నరికి..
-
30 సెకన్లలో 30 సార్లు నరికి..
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39) అలియాస్ వాసును నలుగురు దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో.. అరండల్ పేట 12వ లైన్లో ఆది వారం రాత్రి సుమారు 8–26 గంటలకు అంతా చూస్తుండగా నడి రోడ్డుపై వాసును హతమార్చారు. గుంటూరులోని విద్యానగర్ 4వ లైన్లో నివాసం ఉంటున్న వాసు మరి కొందరితో కలసి ఆదివారం రాత్రి అరండల్పేట 12వ లైన్లో ఉన్న అన్వర్ బిర్యానీ పాయింట్కు వెళ్లాడు. బిర్యానీ తిని తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాకిరి నాగ చైతన్యతో కలసి బయటకు వచ్చిన సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు వాసుపైన దాడి చేసి కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపారు. ముందుగా ఏపీ16ఏఈ 9199 నంబర్ స్కార్పియో వాహ నంతో వాసును ఢీకొట్టి.. అతను కిందపడ్డ తర్వాత అతి కిరాతకంగా 30 సెకన్లలో నలుగురు దుండగులు కలసి 30 సార్లు నరికి హతమార్చారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్న జనం తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు. వాసు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ దుండగులు అదే స్కార్పియోలో పరారయ్యారు. ఆదివారం రద్దీగా ఉండే అరండల్పేటలో దుండగులు వాసును హత్య చేశారంటే పక్కా పథకం ప్రకారం అక్కడకి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
రూ. 25 వేల కోసం వ్యక్తి హత్య!
యాలాల(తాండూరు): రూ.20వేల కోసం ఓ వ్యక్తిని తోటి స్నేహితులే దారుణంగా హత్య చేశారు. గుప్తనిధులు వెలికితీద్దామని వెళ్లి అతడి జేబులో డబ్బులను గమనించి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం గుంతలో మృతదేహాన్ని పూడ్చివేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయిపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. వికారాబాద్ డీఎస్పీ స్వా మి, ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్ తెలిపిన వి వరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేం ద్రానికి చెందిన మందా శ్యామ్యూల్ (27) కొన్నేళ్ల క్రితం వికారాబాద్కు వలస వచ్చాడు. ఇక్కడే మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్యామ్యూల్కు యాలాల మండలం రాస్నంతండాకు చెందిన శివరాజు, పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన చందర్, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతవాసి పాషాతో పరిచయం ఏర్పడింది. వీరందరూ మేస్త్రీలు కావ డంతో స్నేహితులయ్యారు. ఇదిలా ఉండగా.. శ్యామ్యుల్ అవసర నిమి త్తం ఇటీవల తండ్రి చిన్నయ్య నుంచి రూ. 25 వేల తెచ్చుకున్నాడు. గుర్తిం చిన పాషా.. ఈవిషయాన్ని శివరాజు, చందర్లకు చెప్పాడు. ఎలాగైనా సరే.. శ్యామ్యూల్ వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే.. రాస్నం శివారులోని సంగాయిపల్లి తండాలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని వెలికి తీద్దామని పథకం వేశారు. వారంరోజుల క్రితం రాస్నం శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుప్తనిధుల కోసం గుంతను తవ్వారు. అక్కడే శ్యామ్యూల్తో పూజలు కూడా చేయించారు. అదను చూసి అతడిపై కట్టెతో బలంగా బాది అతడి వద్ద ఉన్న రూ. 25 వేలు తీసుకున్నారు. అనంతరం అదే గుంతలో శ్యామ్యూల్ను పూడ్చి పెట్టారు. శ్యామ్యూల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి కనిపించడం లేదని మృతుడి తండ్రి ఈనెల 2వ తేదీన వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అనుమానంతో శ్యామ్యూల్ స్నేహితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా పైవిషయాలు వెల్లడించి నేరం అంగీకరించారు. నిందితులను మంగళవారం సాయం త్రం సంగాయిపల్లి తండా శివారులో సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. వికారాబాద్ తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, డీఎస్పీ, సీఐ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. యువకుడి హత్య విషయం స్థానికంగా తెలియడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. త్వరలో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
క్షణికావేశం...
మానవత్వం మంటగలుస్తోంది. శనివారం సూర్యాపేట జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు హత్యలే దీనికి నిదర్శనం. రామలక్ష్మణుల్లా కలిసుండాల్సిన అన్నదమ్ములు చిన్న ఇంటి స్థలం విషయంలో ఘర్షణ పడ్డారు.. ఈ క్రమంలో అన్నను తమ్ముడు తన కుమారుడితో కలిసి హతమర్చాడు. మరో ఘటనలో కలకాలం కలిసుంటానని బాస చేసిన భర్త మద్యంతాగి కుటుంబాన్ని బజారు పాలు చేస్తుండగా.. మద్యం తాగొద్దు అని చెప్పిన భార్య మొడకు భర్త ఉరిపెట్టి చంపాడు. ఈ ఘటనలు జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. మద్దిరాల (తుంగతుర్తి) : కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు కడతేర్చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గోరెంట్లలో శనివారం తెల్లవారు జామున 5.30 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరెంట్ల గ్రామానికి చెందిన గుండగాని సాయిలు(60), గుండగాని ఎల్లయ్య అన్నదమ్ములు. తమ్ముడు ఎల్లయ్య 25 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం ఒంగోలు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. మూడు నెలల క్రితం గోరెంట్లకు వచ్చిన ఎల్లయ్య ఇక్కడే ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య గ్రామంలోని ఇంటి స్థలం విషయంలో అప్పుడప్పుడు ఘర్షణ జరిగేది. ఆ విషయాన్ని మనుసులో పెట్టుకున్న ఎల్లయ్య శనివారం తెల్లవారు జామున బహిర్బూమికి వెళ్తున్న సాయిలును ఎల్లయ్య అతని కొడుకు సురేష్ వారి ఇంటి వాకిలిలోకి తీసుకెళ్లి దాడి చేశారు. దీంతో సాయిలు కింద పడ్డాడు. సాయిలు కుమారుడు నాగయ్య ఇంటి వెనుకకు వెళ్లి చూడగా సాయిలు కింద పడి ఉండడాన్ని గమనించాడు. నాగయ్యను చూసిన.. ఎల్లయ్య, సురేష్ అక్కడి నుంచి పరారయ్యారు. మృత్యువుతో పోరాడుతున్న సాయిలును చికిత్స నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షలు చేస్తుండగా.. పరిస్థితి విషమించి సాయిలు మృతిచెందాడు. సాయిలుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బలరాంనాయక్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఎం.నాగేశ్వర్రావు, సీఐ.శ్రీనివాస్ సందర్శించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తుంగతుర్తి ఎస్ఐ బాలునాయక్ సిబ్బంది శ్రీనివాస్, వెంకటరాములు, ప్రసాద్, సైదులు, హేమంత్ తదితరులు ఉన్నారు. నిందితుల రిమాండ్ సాయిలును హత్యచేసిన ఎల్లయ్య, అతని కొడుకు సురేష్ను శనివారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్కు తరిలిస్తున్నట్లు సిఐ.శ్రీనివాస్ తెలిపారు. కట్టుకున్నవాడే.. కడతేర్చాడు మఠంపల్లి (హుజూర్నగర్) : తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న భార్య మెడకు ఉరిపెట్టి కడతేర్చాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున మఠంపల్లిలోని ఎస్సీకాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లికి చెందిన కస్తాల పున్నయ్య చిన్నకుమార్తె రమణ(33)తో సూర్యాపేటకు చెందిన సూరారపు జానీకి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. జానీ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా జానీ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో రమణ ఇద్దరు కుమారులను తీసుకుని తల్లిగారి ఊరైన మఠంపల్లికి వచ్చి కూలినాలి చేసుకుని పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో జానీ తాను మద్యం తాగడం లేదని, భార్య పిల్లలతో కలిసి ఉంటానని ఆరు నెలల క్రితం మఠంపల్లికి వచ్చాడు. రమణ తండ్రి పున్నయ్య కుమార్తె కాపురం చక్కదిద్దాలనే సంకల్పంతో తన ఇంటిలోనే ఒక గదిని వారికి ఇచ్చాడు. జానీ హుజూర్నగర్లో పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల జానీ తిరిగి మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 13న మద్యం తాగి వచ్చిన భర్త జానీని అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రమణ ఇదేమిటని ప్రశ్నించింది. దీంతో జానీ భార్యతో గొడవపడ్డాడు. విషయం తెలిసిన తండ్రి పున్నయ్య కూతురికి, అల్లుడికి నచ్చజెప్పాడు. శనివారం తెల్లవారుజామున కూతురు ఇంటికి వెళ్లి తలుపులు తెరిచిన పున్నయ్యకు రమణ మెడకు కండువా చుట్టి ఉరి వేసి ఉండడాన్ని గమనించాడు. ఆ సమయంలో జానీ ఇంట్లోలేడు. దీంతో రమణను అల్లుడు జానీ హతమార్చి పరారయ్యాడని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కోదాడ డీఎస్పీ రమణా రెడ్డి, సీఐలు రవి, నర్సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హుజూర్నగర్కు తరలించారు. పున్నయ్య ఫిర్యాదు మేర కు అల్లుడు జానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. తల్లి మృతదేహంపై పడి ఇద్దరు పిల్లలు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. -
ముందుగా భర్తని.. ఆ తర్వాత భార్యని..!
ఒంగోలు: వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. బంగారపు కడ్డీలు తక్కువ ధరకు వస్తున్నాయని తనకు తెలిసిన వారు చెప్పారంటూ బుడబుక్కల శ్రీనివాసులు ఇటీవల పల్లపోతు శ్రీనివాసులుతో చెప్పాడు. ఆ మాటలు నమ్మిన పల్లపోతు శ్రీనివాసులు ఆయనకు రూ.15 లక్షలిచ్చాడు. అయితే బంగారపు కడ్డీలు తీసుకొస్తానని వెళ్లిన బుడబుక్కల శ్రీనివాసులు వాటిని ఇవ్వలేదు. దీంతో తన డబ్బు తనకివ్వాలంటూ వ్యాపారి ఒత్తిడి పెంచాడు. ముందుగా భర్తని.. ఆ తర్వాత భార్యని..! ఈ క్రమంలో 28వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో కారులో వచ్చిన బుడబుక్కల శ్రీను డబ్బులిస్తానంటూ పల్లపోతు శ్రీనివాసులును వెంట తీసుకెళ్లాడు. కారులోనే మరికొందరితో కలిసి శ్రీనివాసులును హత్యచేశాడు. ఆ తర్వాత అదే కారులో వచ్చి అతడి భార్య ప్రమీలాదేవి(35)ని కూడా భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి హత్యచేశాడు. పల్లపోతు శ్రీనివాసులు, ప్రమీలారాణి సెప్టెంబర్ 28న రాత్రి నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబసభ్యులు 30న ఒంగోలు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. టూటౌన్ ఎస్ఐ కేశన వెంకటేశ్వరరావు అదేరోజు కేసు నమోదుచేశారు. జిల్లా ఎస్పీ బి.సత్యఏసుబాబు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్తో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలతో దంపతుల అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించారు. బుడబుక్కల శ్రీనివాసులే దంపతులను 28వ తేదీ రాత్రి హత్యచేసి ఒంగోలు ఎస్ఎస్ ట్యాంక్–1కు పడమర బైపాస్కు సమీపంలోని చెట్లలో పూడ్చి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు నిందితులను మంగళవారం రాత్రి మార్కాపురం ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను బయటకు తీయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
గళమెత్తిన పాత్రికేయ లోకం
గౌరీ హత్యపై పెల్లుబికిన నిరసనలు - కదలిన ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాలు - పలుచోట్ల ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం - జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కన్నడనాట లంకేశ్ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేశ్ దారుణ హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. జర్నలిస్టు సంఘాలు, ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాలు, మహిళా పాత్రికేయ సంఘాలు, కవులు, రచయితలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తూటాలకు, హత్యలకు జర్నలిజం ఎన్నటికీ తలవంచబోదంటూ నినదించారు. నిజాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా అంటూ నిలదీశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్ వద్ద ఐజేయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ... ‘‘ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. జర్నలిస్టుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాలి. గోవింద్ పర్సారే, నరేంద్ర ధబోల్కర్, ఎంఎం కల్బుర్గీ, గౌరీ లంకేశ్ హత్యలన్నింటికీ ఒకే కారణం కనిపిస్తోంది. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి’’అని డిమాండ్ చేశారు. బీజేపీ అండతోనే మతతత్వ శక్తులు ఈ హత్యకు పాల్పడ్డాయని ఐజేయూ నాయకులు కె.శ్రీనివాస్రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడేవారిపై దాడులు ఎక్కువయ్యాయని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ఐజేయూ కార్యదర్శి నరేందర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం నేత సంధ్య, పశ్య పద్మ, సామాజికవేత్త దేవి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్కుమార్ పాల్గొన్నారు. గౌరీ స్ఫూర్తిని కొనసాగిస్తాం నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా ఇండియా (ఎన్డబ్ల్యూఎంఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్క్లబ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. జర్నలిస్టులు ప్లకార్డులు పట్టు కుని గౌరీ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖైరతాబాద్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎన్డబ్ల్యూఎంఐ ప్రతినిధులు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, కార్యదర్శి ఎస్.విజయ్కుమార్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరేందర్, రాజేశ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమణ పాల్గొన్నారు. ఏపీలోనూ జర్నలిస్ట్ సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మానవత్వానికే మచ్చ గౌరీ లంకేశ్ హత్య మానవత్వానికే మాయని మచ్చ అని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జయ«ధీర్ తిరుమల్రావు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ, తెలంగాణ రచయితల వేదిక, అరసం, తెలంగాణ ప్రజాస్వామిక వేదికల సంయుక్త ఆధ్వర్యంలో గౌరీ హత్యను ఖండిస్తూ సంతాప సభ నిర్వహించారు. మరోవైపు గౌరీ లంకేశ్ హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్(టీబీజేఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(ఐఎఫ్డబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు (హెచ్యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గౌరీ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నేతలు జి.ఆంజనేయులు, మామిడి సోమయ్య, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ హత్యను తీవ్రంగా ఖండించింది. ఖండించిన సీపీఐ, సీపీఎం: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే వందలాది మందిని వేధింపులకు గురిచేస్తున్నారని, దళితులపై దాడులు పెరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గౌరీ హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆరెస్సెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చంపేస్తున్నారని డీవైఎఫ్ఐ ఒక ప్రకటనలో విమర్శించింది. నేడు ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన గౌరీ లంకేశ్ హత్యను నిరసిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు సోమాజీగూడలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. -
రెండేళ్లు.. 172 దాడులు
24 ఏళ్లలో 70 మంది జర్నలిస్టుల మృత్యువాత - ఆందోళన కలిగిస్తోన్న జర్నలిస్టులపై దాడులు - పత్రికా స్వేచ్ఛా సూచిలో 136వ స్థానంలో భారత్ ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య నేపథ్యంలో అసలు దేశంలో జర్నలిస్టులకు రక్షణ ఎంత అనే ప్రశ్న ఉదయిస్తోంది. 2014, 2015 ఈ రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఏకంగా 142 దాడులు జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ 142 దాడులకు సంబంధించి 73 మంది అరెస్ట్ అయినట్టు ఎన్సీఆర్బీ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో పార్లమెంట్లో ప్రకటించింది. జర్నలిస్టులపై దాడులకు సంబంధించి 2014 నుంచి ఎన్సీఆర్బీ గణాంకాలను సేకరిస్తోంది. 2014లో 114, 2015లో 28 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 64 కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్లో 26, బిహార్లో 22 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 79 శాతం ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఇక మధ్యప్రదేశ్లో అత్యధికంగా 42 మంది (2014లో 10 మంది, 2015లో 32 మంది) అరెస్ట్ అయ్యారు. 24 ఏళ్లలో 70 మంది మృత్యువాత.. మొత్తంగా చూస్తే 1992 నుంచి 2016 వరకూ అంటే 24 ఏళ్ల కాలంలో వివిధ కారణాల వల్ల మరణించిన జర్నలిస్టుల సంఖ్య 70 వరకూ ఉంటుందని ద కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రకటించింది. వీరిలో 40 మంది జర్నలిస్టుల మరణాలు నిర్ధారణ అయ్యాయని, 27 మంది హత్యకు గురికాగా.. మరో 13 మంది ప్రమాదకరమైన అసైన్మెంట్లను అప్పగించడం వల్ల మరణించినట్టు వెల్లడించింది. కాగా, రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక–2017 ప్రకారం.. 180 దేశాల్లో మనదేశం 136వ స్థానంలో నిలిచింది. – సాక్షి తెలంగాణ డెస్క్ -
మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ దారుణ హత్య..
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ బోయ బాదన్నను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. గురువారం ఉదయం వాకింగ్ చేస్తుండగా దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో తల, భూజాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. -
టీ తాగుతుండగా దాడి.. 27కత్తిపోట్లు
-
టీ తాగుతుండగా దాడి.. 27కత్తిపోట్లు
ముంబయి: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండుమంది కత్తులతో వీర విహారం చేశారు. పట్టపగలే ఓ వ్యక్తిపై అతిదారుణంగా దాడి చేశారు. 27సార్లు ఆ వ్యక్తిని కర్కశంగా నరికి చంపారు. మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రఫికుద్దీన్ అనే వ్యక్తి స్థానికంగా నేరాలు చేస్తుండేవాడు. అతడు ధులేలో రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఒకేసారి పదకొండు మంది కత్తులు, కర్రలు, తుపాకీతో వచ్చి దాడికి దిగారు. తొలుత కర్రలతో కొట్టి అనంతరం కత్తులతో 27 వేట్లు వేశారు. అనంతరం తుపాకీతో అతడి తలపై కాల్పులు జరిపి దారుణంగా చంపేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్కూటర్లు, బైక్లపై పారిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగే సమయంలో వర్షం కూడా వస్తుండటంతో రక్తంపారి ఆ ప్రాంతమంతా భీతావాహంగా కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిపై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. -
టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య: అనూహ్య మలుపు!
వరంగల్: టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్ (45) దారుణ హత్య కేసు దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. మురళి హత్యకేసులో పలువురు కాంగ్రెస్ నేతల ప్రమేయమున్నట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, ఏ-5 పోతుల శ్రీమాన్, ఏ-6గా కానుగంటి శేఖర్ పేర్లను పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అయిన మురళి గత గురువారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయనను సాయంత్రం 6:30 సమయంలో సొంత ఇంట్లోనే ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం హత్యాయుధాలను దారి పొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే.. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తమ పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్రెడ్డి, శ్రీమాన్, శేఖర్ తెలిపారు. మురళి తమకు మంచి స్నేహితుడని, మురళి హత్యను తమను కలిచివేసిందని చెప్పారు. ఆధారాల్లేకుండా ఎఫ్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేయడం బాధాకరమని వారు తెలిపారు. -
టీఆర్ఎస్ నేత దారుణహత్య
♦ వరంగల్ కార్పొరేటర్ మురళిని వేట కొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు ♦ పంచాయితీ పేరుతో ఇంట్లోకి ప్రవేశం ♦ ఆఫీసులో చర్చిస్తూనే హఠాత్తుగా దాడి ♦ చేతులు, తలపై వేట్లతో కుప్పకూలిన మురళి.. తాపీగా బైకులపై వెళ్లిపోయిన దుండగులు ♦ దారి పొడవునా వేట కొడవళ్లు గాల్లో తిప్పుతూ పోలీస్స్టేషన్లో లొంగిపోయిన వైనం సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. గురువారం సాయంత్రం 6:30 సమయంలో ఆయన్ను సొంత ఇంట్లోనే ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం హత్యాయుధాలను దారి పొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు! పంచాయితీ పేరుతో వచ్చారు... మురళి హన్మకొండ బుద్ధభవన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కుటుంబంతో సహా ఇంటి కింది భాగంలో ఉంటూ పై భాగంలో ఒక గదిని కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పంచాయితీ చేయాలంటూ రేగుల చిరంజీవి అనే వ్యక్తి తొలుత మురళిని సంప్రదించాడు. అతన్ని పైన ఆఫీసులో కూర్చొమ్మని చెప్పి, మురళి స్నానం చేసి మేడపైకి వెళ్లినట్టు తెలుస్తోంది. తర్వాత బొమ్మతి విక్రం, మార్త వరుణ్ బాబు అనే మరో ఇద్దరు కూడా ఆఫీసులోకి వెళ్లారు. వెళ్తూనే మురళితో వాగ్వాదానికి దిగారు. ఆ వెంటనే విక్రం, వరుణ్Š, చిరంజీవి ముగ్గురూ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో మురళిపై దాడి చేశారు. విచక్షణారహితంగా నరికారు. ప్రాణభయంతో మురళి చేతులు అడ్డుగా పెట్టడంతో రెండు చేతులకూ లోతైన గాయాలయ్యాయి. అనంతరం తలపైనా వేట్లు వేయడంతో ఆఫీసు గదిలోనే ఆయన కుప్పకూలిపోయారు. 26 ఏళ్ల పగ తీరిందంటూ నినాదాలు దాడి అనంతరం నిందితులు ముగ్గురూ తాపీగా మేడపై నుంచి దిగారు. ‘నా తండ్రిని చంపిన వాణ్ని చంపాం. మా 26 ఏళ్ల పగ తీరింది’ అని నినాదాలు చేస్తూ బైకులపై వెనుదిరిగారు. దారి పొడవునా వేట కొడవళ్లు గాల్లో తిప్పుతూ వెళ్లి హన్మకొండ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. స్థానికులు వెళ్లి చూడగా మురళి రక్తపు మడుగులో పడి ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు హుటాహుటిన మాక్స్కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి ఆయన శ్వాస తీసుకుంటుండంతో డాక్టర్ల బృందం చికిత్స ప్రారంభించింది. కాసేపటికి మురళి శరీరం స్పందించకపోవడంతో మరణించినట్లుగా నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేయూకు తరలింపు మారణాయుధాలతో సహా లొంగిపోయిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి కేయూ పోలీస్స్టేషన్కు తరలించారు. మురళి హత్య నగరమంతా దావానలంలా వ్యాపించింది. మురళి నివాసం వద్ద జనం భారీగా గుమిగూడారు. మాక్స్కేర్ ఆస్పత్రికి అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, తెలంగాణ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పాత కక్షలే కారణం మురళిపై దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. 1990ల్లో కుమార్పల్లిలో స్థానిక కాంగ్రెస్ నేత బొమ్మతి జనార్దన్ (జెన్నీ)కి, మురళికి రాజకీయంగా, మార్కెట్ ప్రాంతంపై ఆధిపత్యపరంగా గొడవలుండేవి. ఈ క్రమంలో 1991లో జెన్నీని నరికి చంపారు. ఈ కేసులో మురళే ప్రధాన నిందితుడు. జెన్నీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో విక్రం బీటెక్ చేసి హన్మకొండలోనే ఉంటున్నాడు. తండ్రిని చంపిన మురళిని ఎప్పటికైనా కడతేరుస్తానని విక్రం పలుమార్లు అన్నట్టు స్థానికులు చెబుతున్నారు. 2007లో కూడా అతను మురళిపై దాడి చేశాడు. దీనిపై హన్మకొండ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. అదను చూసి స్నేహితులు చిరంజీవి, వరుణ్బాబు సాయంతో గురువారం మురళిని హతమార్చాడు. -
పట్టపగలు దారుణ హత్య
యువకుడిని కత్తితో పొడిచి చంపిన పాత నేరస్తుడు - బంజారాహిల్స్లో నడిరోడ్డుపై ఘటన - ఇద్దరూ పాత నేరస్తులే.. ఇద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లే! - పాత కేసులు గుర్తుచేస్తూ పోలీసులను రెచ్చగొడుతున్నాడంటూ కక్ష - మాట్లాడదామంటూ పిలిచి హత్య హైదరాబాద్: సమయం శనివారం మధ్యాహ్నం 3 గంటలు.. ఎప్పుడూ బిజీగా ఉండే బంజారాహిల్స్ ప్రాంతం.. రోడ్ నంబర్ 7లో రోడ్డు పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.. ఇంతలో ఒకతను తన వెంట తెచ్చిన కత్తి బయటికి తీశాడు.. మరో వ్యక్తిని విచ్చలవిడిగా పొడిచి చంపేశాడు.. ఆ ఇద్దరూ పాత నేరస్తులే.. ఇద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లే! తనపై ఉన్న కేసుల గురించి సమాచారమిచ్చి అరెస్టు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడనే ఆగ్రహంతో వసీం అనే పాత నేరస్తుడు మారోజు రత్నాచారి (28) అనే ఆటోడ్రైవర్ను హత్య చేశాడు. మాట్లాడదాం రమ్మని చెప్పి.. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దుప్పెల్లికి చెందిన మారోజు రత్నాచారి తన భార్య ముగ్గురు పిల్లలతో కలసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీ నగర్లో ఉంటున్నాడు. ఆటోడ్రైవర్గా, అద్దె ఇళ్ల బ్రోకర్గా పనిచేస్తున్నాడు. అతడిపై బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. ఈ క్రమంలో పోలీసు ఇన్ఫార్మర్గా మారాడు. రత్నాచారికి పోలీస్ ఇన్ఫార్మర్గానే పనిచేసే పాత నేరస్తుడు వసీంతో కొంత కాలం కింద పరిచయమైంది. వసీం కూడా పలు స్నాచింగ్ కేసుల్లో అరెస్టై విడుదల అయ్యాడు. అయితే ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్ల పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లలో పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో సరూర్నగర్ సీసీఎస్లో వసీంపై కేసు కూడా ఉంది. ఈ క్రమంలో వసీం అడ్రస్ చెబుతానని, అతడిని అరెస్టు చేయాలంటూ సరూర్నగర్ సీసీఎస్కు రత్నాచారి సమాచారమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన వసీం.. రత్నాచారిపై కక్షగట్టాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రత్నాచారికి ఫోన్ చేసి రోడ్ నంబర్ 7లోని మీసేవ వద్దకు రావాలని, మాట్లాడుకుందామని పిలిచాడు. కొంత సేపటికి చారి అక్కడికి రాగానే.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దీంతో చారి చెయ్యి తెగిపోయింది, తలపై తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం సాయంత్రమే వసీంను అదుపులోకి తీసుకున్నారు. -
చెన్నైలో జంట హత్యలు
కేకేనగర్(చెన్నై): విడిపోయిన భర్తతో కలిసి కాపురం చేయడానికి అన్నతోపాటు చెన్నైకి వచ్చిన బెంగళూరు యువతి, ఆమె అన్న సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన యువతి మామను పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై సమీపంలోని పల్లికరనై సాయ్బాలాజీ నగర్కు చెందిన కోశలన్ (65) ఆటోడ్రైవర్. ఆయన కుమారుడు వినాయకమూర్తి (28) కంప్యూటర్ ఇంజినీర్. అతనికి బెంగళూరుకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ వరలక్ష్మి (26)తో నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. వినాయకమూర్తికి ప్రమాదంలో అనారోగ్యం పాలయ్యాడు. ఆ విషయాన్ని దాచి పెళ్లి జరిపించడంతో అతనితో కాపురం చేయడం ఇష్టంలేక పెళ్లయిన మూడు నెలలకే వరలక్ష్మి బెంగళూరులోని తన పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ నేపథ్యంలో భర్తతో మళ్లీ కలిసి కాపురం చేయడానికి వరలక్ష్మి, అన్న కోదండం (30), అక్క భవాని (33) స్నేహితురాలు మాలతితో కలిసి బెంగళూరు నుంచి చెన్నైలోని భర్త ఇంటికి సోమవారం సాయంత్రం వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో కోశలన్ మాత్రమే ఉన్నాడు. వరలక్ష్మి వినాయకమూర్తితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడుతున్నట్లు కోదండం తెలిపారు. అయితే దీనికి కోశలన్ ఒప్పుకోలేదు. వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ సమయంలో కోదండం కోశలన్ను కొట్టాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన కోశలన్ వెంటనే ఇంట్లోకి వెళ్లి వేట కత్తితో వచ్చి అందరినీ నరికేస్తానని హెచ్చరించడంతో అక్కడి నుంచి వారంతా పరుగులు తీశారు. అయినా కోశలన్ వారిని వెంటాడి కోదండం, వరలక్ష్మిలను నరికి హత్యచేశాడు. అడ్డు వచ్చిన భవానికి కూడా కత్తిపోట్లు తగిలాయి. మాలతి పారిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సౌత్ చెన్నై పోలీసు జాయింట్ కమిషనర్ అన్బు, సహాయ కమిషనర్ గోవిందరాజ్, పోలీసులు అక్కడకు చేరుకుని కోదండన్, వరలక్ష్మి మృత దేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలకు పోరాడుతున్న భవాని, పల్లికరనైలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కోశలన్ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. దీనిపై పల్లికరనై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం తమ్ముడినే హతమార్చాడు..
గుత్తి: ఎట్టకేలకు యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించగలిగారు. ఆస్తి కోసం సోదరుడే... రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని హత్య చేసినట్లు తేలింది. ఈ యేడాది ఏప్రిల్ 19న గుత్తి మండల పరిధిలోని వన్నేదొడ్డి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గ్రామానికి చెందిన లోకేష్(19) అనే యువకుడు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది. ఎవరు హత్య చేశారో తెలియలేదు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం కేసును సివిల్ పోలీసులకు బదిలీ చేశారు. అయినా హత్యా మిస్టరీ వీడలేదు. ఎట్టకేలకు రెండు మాసాల తర్వాత హంతకుని కాల్ డేటా ఆధారంగా హత్యా మిస్టరీని పోలీసులు శుక్రవారం చేధించారు. లోకేష్ను అతని సోదరుడు రైల్వే ఉద్యోగి(గ్యాంగ్మెన్) శ్రీనివాసులు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని కొందరు వన్నేదొడ్డి గ్రామస్తులు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ కోణంలో విచారణ వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో సొంత సోదరుడే లోకేష్ను అతి కిరాతకంగా కొడవలితో ముక్కలు ముక్కలుగా నరికి రైల్వే ట్రాక్పై పడేసినట్లు తేలింది. దీంతో నిందితుడు(హంతకుడు) శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విచారణలో తానే తన తమ్ముడిని ఆస్తి కోసం హత్య చేసినట్లు అన్న అంగీకరించినట్లు తెలిసింది. తమ్ముడిని హత్య చేస్తే ఆస్తి అంతా తనకు దక్కుతుందనే దురుద్దేశంతో శ్రీనివాసులు లోకేష్ను వన్నేదొడ్డి ట్రాక్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొడవలితో అతి దారుణంగా హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించాలనే నెపంతో మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై పడేశాడు. తాపీగా ఇంటికెళ్లిపోయాడు. మృతుని తండ్రి సుంకన్న రైల్వే గ్యాంగ్మెన్గా పని చేస్తుండేవాడు. అయితే గత ఐదు సంవత్సరాల క్రితం తండ్రి వీఆర్ఎస్ ఇచ్చి పెద్దకుమారుడు శ్రీనివాసులకు ఉద్యోగం ఇప్పించాడు . చిన్న కుమారుడు లోకేష్కు పది లక్షల నగదు, ప్లాట్లు, ఇళ్లు రాసి ఇచ్చాడు. లోకేష్ను హంతమొందిస్తే ఆస్తితో పాటు నగదు మొత్తం తనకే వస్తుందనే దురాశతో పథకం ప్రకారం తమ్ముడిని అతిదారుణంగా హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేశాడు. అయితే ఫోన్ కాల్ డేటా హంతకున్ని పట్టించింది. -
మాజీ సీఎం మద్దతుదారుడి దారుణ హత్య
►ఎంజీఆర్ నగర్లో ఘాతుకం – ఉద్రిక్తత ►పోలీసుల మోహరింపు ►ఐదుగురి అరెస్టు కేకేనగర్: చెన్నై ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్న ఓపీఎస్ వర్గ నిర్వాహకుడిని 2వ అంతస్తు నుంచి కిందకు లాక్కొచ్చి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్యకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంజీఆర్ నగర్ సూలై పల్లం అన్నా వీధికి చెందిన కుమార్ అలియాస్ చిన్నకుమార్ (39). ఇతడు అన్నాడీఎంకేలో 137వ వార్డు అన్నాడీఎంకే సహాయ కార్యదర్శిగా పదవి వహించాడు. జయలలిత మృతి తర్వాత జె. దీపా వర్గంలో కుమార్ చేరారు. శశికళ నుంచి ఓపీఎస్ విడిపోయిన తర్వాత ఓ పన్నీర్ సెల్వంకు సన్నిహిత మద్దతుదారుడిగా మారాడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు కుమార్ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో ఐదుగురు అతని ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో చిన్నకుమార్పై దాడి జరిపారు. రెండవ అంతస్తు నుంచి అతడిని బరబరా లాక్కొని వచ్చి ఇంటి ముందు నిలబెట్టి దారుణంగా నరికారు. రక్తం మడుగులో పడి ఉన్న కుమార్ మృతి చెందాడని వారు పారిపోయారు. ప్రాణాలతో పోరాడుతున్న అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎంజీఆర్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో చిన్నకుమార్, అతని మిత్రుడు శ్రీనివాసన్ అను అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపార పోటీలో ఏర్పడిన పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి చెన్నై సమీపంలో గూడువాంజేరికి చెందిన శ్రీనివాసన్ (40), మణి (20), మది (20), రోజా (22), బాలకృష్ణన్లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుంది
డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : ప్రేమ వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లెర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నరేష్ తల్లిదండ్రులు వెంటకయ్య–ఇందిరమ్మలను పరామర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు çశ్రీనివాసరెడ్డి చేతిలో హత్యకు గురయినట్లు వెంకటయ్య తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ మండల అ«ధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, కొరటికల్ సర్పంచ్ కొడిమాల యాదగిరిగౌడ్, ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి, సింగిల్విండో చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పాల సంఘం చైర్మన్ జెన్నాయికోడే నాగేష్, మండల ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, నాయకులు కట్టెకోల హన్మంతుగౌడ్, పోతగాని మల్లేశంగౌడ్, మహేష్ ఉన్నారు. -
సీమలో మరో నేత దారుణ హత్య
-
సీమలో మరో నేత దారుణ హత్య
చిత్తూరు: కర్నూల జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య మరువక ముందే మరో నేత హత్య వెలుగులోకి వచ్చింది. రాయలసీమలో మరో రాజకీయ నాయుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కె.వి.బి పురం మండలంలోని కస్తూరిబా మోడల్ స్కూల్ సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజశేఖర్రెడ్డి(42)ని గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. శనివారం రాత్రి 10గంటల సమయంలో ఇటుకల బట్టీ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా దారి కాసిన దుండగులు కత్తులతో నరికి చంపారు. అతని మెడపైన నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడు వేసిన కేకలు విని చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడు అప్పటికే మృతి చెందాడు. రాజశేఖర్ మెడపై బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో కేవీబీ పురం ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న పిచ్చాటూరు ఎస్సై మనోహర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మొదట యాసిడ్ పోసి అనంతరం కత్తులతో దారుణంగా హత్యచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధాలే కారణమై ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అర్ధరాత్రి ఘాతుకం..!
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : పాకలో ఆదమరచి నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం మేడారంలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల మారయ్య కుమారుడు అంజయ్య(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో పాటు తనకున్న గొర్లను కాసుకుంటూ అప్పుడప్పుడు ఆటో కూడా నడుపుతున్నాడు. బుధవారం వ్యవసాయ భూమి వద్ద నుంచి గొర్లను తోలుకొచ్చి ఇంటి సమీపంలోని పాకలో తోలాడు. భోజనం చేసిన అనంతరం వాటికి కావలిగా అంజయ్య కూడా పాకలోనే నిద్రించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు గొడ్డలితో వచ్చి అంజయ్యపై దాడి చేసి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహంపై దుప్పటి కప్పి గొడ్డలిని అక్కడే వదిలి పరారయ్యారు. వెలుగులోకి ఇలా.. గురువారం ఉదయం పాకవైపు వెళ్లిన స్థానికులకు రక్తపు మరకలు కనిపించాయి. అప్పటికీ అంజయ్య లేవకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి అక్కడికి వచ్చి పరిశీలించగా దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ శివరాంరెడ్డి, కొండమల్లేపల్లి ఎస్ఐ శంకర్రెడ్డి పరిశీలించారు. ఘటన స్థలంలో లభించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ గొడ్డలిని అల్లుడు ముత్యాలుకు ఇచ్చానని అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని మారయ్య అనుమానం వ్యక్తం చేశాడు. మారయ్యను హత్య చేయబోయి..? నిత్యం గొర్లకు కావలిగా పాకలో అంజయ్య తండ్రి మారయ్య పడుకునేవాడు. బుధవారం పంచాయితీ అనంతరం మారయ్య బంధువుల ఊరికి వెళ్లాడు. దీంతో అంజయ్య పాకలో నిద్రించాడు. అయితే దుండగులు పాకలో దుప్పటి కప్పుకుని నిద్రించింది.. మారయ్యే అనుకుని హతమార్చి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయితీలో జరిగిన వాగ్వాదాన్ని మనసులో పెట్టుకుని అల్లుడు ముత్యాలే హత్య చేసి ఉంటాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గొడవే కారణమా..? ఎడ్ల మారయ్య కుమార్తె సీత ముత్యాలమ్మను ఇదే మండలం తిరుమలగిరికి చెందిన ముత్యాలుతో 20 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఒక పాపను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ముత్యాలు వ్యవసాయం, గొర్లను సాదుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఇటీవలి కాలంలో ఎకరం భూమిని విక్రయించాడు. దీంతో పాటు సాదుకోవడానికి మామ మారయ్య ఇచ్చిన గొర్లను కూడా అమ్ముకున్నాడు. డబ్బుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో మూడు మాసాల క్రితం ముత్యాలమ్మ పుట్టింటికి వచ్చింది. దంపతుల తగువును పరిష్కరించేందుకు బుధవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పెంపుడు కుమార్తె పేరిట రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని మారయ్య, అంజయ్య పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే ముత్యాలుకు అంజయ్య, మారయ్యకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది మనసులో పెట్టుకుని ముత్యాలు అర్ధరాత్రి వచ్చి దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిన్నంటిన రోదనలు దారుణ హత్యకు గురైన అంజయ్యకు భార్య ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం అతడి భార్య నిండు చూలాలు. ఈ క్రమంలో భర్త హత్యకు గురవడంతో ‘‘ చంటి పిల్లలతో నేనేట్టా బతికేది దేవుడా’’ అంటూ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శివరాంరెడ్డి తెలిపారు. -
వేటకొడవళ్లతో వెంటాడి.. వేటాడి
అది ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన రహదారి.. జన సమ్మర్ధంతో ఆ రహదారి కిటకిటలాడుతోంది. ఎవరి పనుల మీద వారు బిజీగా వెళ్తున్నారు.. ఇంతలో ఒక్కసారిగా చేతుల్లో వేటకొడవళ్లు పట్టుకున్న నలుగురు వ్యక్తులు చంపండి.. చంపండి.. అంటూ కేకలు వేస్తూ ఓ వ్యక్తిని వెంటాడుతున్న దృశ్యం. అంతే.. క్షణాల్లో ఆ వ్యక్తిపై తమ చేతిలోని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలతో అలాగే పరుగులు పెడుతూ.. ఇక పరుగెత్తలేక రోడ్డుపై నిస్సహాయంగా పడిపోయిన ఆ వ్యక్తిని ఒకరు ఒడిసి పట్టుకుంటే.. మరొకరు వేటకొడవలి తీసుకుని మొద్దులు నరికినట్లు కసితీరా నరికి చంపి తాపీగా నడుచుకుంటూ వెళ్లారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దారుణ హత్య ప్రొద్దుటూరులో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం టీబీరోడ్డులో గురువారం ఉదయం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతి ప్రసాద్రెడ్డి (34) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ భక్తవత్సలం తెలిపిన వివరాల మేరకు బోరెడ్డి మారుతి ప్రసాద్రెడ్డి తండ్రి మునిరెడ్డి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అతను ఇంటి వద్ద ఉండి పొలం పనులు చూసుకునేవాడు. అతని అక్క అనురాధా ప్రొద్దుటూరులోని శాస్త్రీనగర్లో నివాసం ఉంటున్నారు. ఈమె రూరల్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈమెకు టీచర్స్ కాలనీకి చెందిన చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఈ విషయం అతని బామ్మర్దులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డితోపాటు భార్య నిర్మలకు తెలిసింది. ఈ క్రమంలో 2014లో నిర్మల శాస్త్రీనగర్లోని అనురాధ ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. ఇకపై తన భర్తను ఎప్పుడు ఇంటి వద్దకు రానివ్వద్దని హెచ్చరించారు. ఈ విషయం అనురాధ తమ్ముడు మారుతి ప్రసాద్రెడ్డికి తెలియడంతో నిర్మల ఇంటికి వెళ్లి ఎందుకు మా అక్కను తిట్టావని బెదిరించాడు. ఇకపై ఇలా చేస్తే నీ అంతు చూస్తానని ఆమెను హెచ్చరించాడు. ఈ సంఘటనపై నిర్మల రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మారుతి ప్రసాద్రెడ్డిపై 447, 507 సెక్షన్ల కింద బెదిరింపుల కేసు నమోదైంది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మల సోదరులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు మారుతి ప్రసాద్రెడ్డిపై పగను పెంచుకున్నారు. మారుతి ప్రసాద్రెడ్డిని హతమార్చాలని పథకం.. రఘునాథరెడ్డి ప్రకాశం జిల్లా, కనిగిరి తాలుకా, పామూరులో హెల్త్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. అతను ఏడాది క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొద్దుటూరులోనే ఉంటున్నాడు. మారుతి ప్రసాద్రెడ్డిని చంపేందుకు పలువురితో కలిసి వ్యూహరచన చేసేవాడు. నెల రోజుల క్రితం పోలీసులకు ఈ విషయం తెలియడంతో రఘునాథరెడ్డి, పెద్ద దండ్లూరుకు చెందిన పట్నం ధరణి, ఈశ్వరరెడ్డినగర్కు చెందిన వెంకటరమణలను త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. ఇటీవల వీరు బెయిల్పై బయటికి వచ్చారు. రఘునాథరెడ్డి జైలులో ఉన్నప్పుడు నిర్మల ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో మారుతి ప్రసాద్రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఈ విషయం జైలు నుంచి రాగానే తన సోదరులతో ఆమె చెప్పింది. మారుతి ప్రసాద్రెడ్డి సింగపూర్లో ఉన్నందున చాలా కాలం నుంచి 2014లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు రావడం లేదు. తల్లి వెంకటలక్ష్మమ్మకు గుండె ఆపరేషన్ చేయడంతో రెండు నెలల క్రితం అతను సింగపూర్ నుంచి వచ్చాడు. గురువారం వాయిదా ఉందని తెలియడంతో దేవగుడి నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఈ కేసులో వాయిదా కోసం నిర్మల కూడా తన సోదరులతో కలిసి కోర్టుకు వచ్చింది. ఉదయం 10.10 గంటలకు కోర్టు ముందు ఉండగా ఎందుకు మా అక్క ఇంటి తలుపులు తట్టావని రఘునాథరెడ్డి అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డితో పాటు మరో ఇద్దరు మారుతి ప్రసాద్రెడ్డిని వెంటాడారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతను టీబీ రోడ్డు వెంట పరుగులు తీశాడు. మధ్యలోనే కత్తి పోట్లకు గురైన అతను మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే కింద పడిపోయాడు. శ్రీనివాసులరెడ్డి గట్టిగా పట్టుకోగా రఘునాథరెడ్డి వేట కొడవలితో అందరూ చూస్తుండగానే దారుణంగా నరికి చంపాడు. పట్టపగలే అతి దారుణంగా నరకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. కళ్ల ముందే అతను దారుణ హత్యకు గురవుతున్నా నివారించడానికి ఎవరూ సాహసం చేయలేదు. చుట్టూ గుమి కూడిన ప్రజలు చంపొద్దు.. చంపొద్దు అంటూ గట్టిగా కేకలు వేశారు. అందరూ చూస్తుండగానే మారుతి ప్రసాద్రెడ్డి ప్రాణాలు గాలిలో కలిశాయి. విషయం తెలియడంతో సీఐలు బాలస్వామిరెడ్డి, ఓబులేసు, ఎస్ఐలు సంఘటనా స్థలానికి వచ్చారు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ఓబులేసు తెలిపారు. డీఎస్పీ భక్తవత్సలం సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో హత్య దృశ్యాలు సినిమా షూటింగ్ను తలపిస్తూ జరిగిన మారుతి ప్రసాద్రెడ్డి హత్య సంఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కొన్ని సెకండ్లలోనే వాట్సాప్, ఫేస్బుక్లో హత్య దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సెల్ఫోన్లలో హల్చల్ చేశాయి. అది ఫ్యాక్షన్ హత్య కాదు– వివాహేతర సంబంధమే కారణం ► పోలీసుల అదుపులో నిందితులు ► విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు కడప అర్బన్ : ప్రొద్దుటూరు పట్టణం మార్కెట్యార్డు సమీపంలో గురువారం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డి (36) దారుణంగా హత్యకు గురయ్యాడని, ఈ హత్యతో ఫ్యాక్షన్కు గానీ, ముఠా కక్షలకుగానీ, రాజకీయంగా కానీ ఎలాంటి సంబంధం లేదని జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.సత్య ఏసుబాబు అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డిని ప్రొద్దుటూరు పట్టణం నడింపల్లెకు చెందిన నరసాపురం శ్రీనివాసరెడ్డి, రఘునాథరెడ్డిలు మార్కెట్యార్డు సమీపంలో దారుణంగా హత్య చేశారన్నారు. ఈ హత్య వెనుకగల కారణాలు ప్రాథమికంగా ఇలా ఉన్నాయని ఆయన వివరించారు. హతుడు మారుతిరెడ్డి సోదరి అనూరాధ ప్రొద్దుటూరుపట్టణంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోందన్నారు. అనూరాధకు నిందితుల బావమరిది చంద్రశేఖర్రెడ్డితో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్రెడ్డి భార్య నిర్మల, ఆమె కుమారుడు అనూరాధ ఇంటికి వెళ్లి వారితో గొడవపడ్డారన్నారు. ఈ వివాహేతర సంబంధం ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలకు, కక్షలకు దారి తీసిందన్నారు. గురువారం తనపై ఉన్న పాత కేసు వాయిదా కోసం కోర్టుకు హాజరయ్యేందుకు మారుతిరెడ్డి వస్తుండగా నిందితులు హత్య చేశారన్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్ఫోర్స్ సీఐ నాయకుల నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై దారుణహత్య
ప్రొద్దుటూరులో వేట కొడవళ్లతో వెంటాడి చంపిన ప్రత్యర్థులు ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన ఓ యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు నడిరోడ్డులో వేట కొడవళ్లు చేత బట్టుకుని వెంటాడి నరికి చంపిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీప్రసాద్రెడ్డి (34) డిగ్రీ చదువుకున్నాడు. మూడేళ్ల కిందట విజయవాడకు చెందిన మహిళతో వివాహం కాగా ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. తండ్రి చనిపోవడంతో కొంతకాలం ఇంటివద్దే ఉండి పొలం పనులు చూసుకున్న అతడు తర్వాత సింగపూర్ వెళ్లి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన సోదరిని తిట్టిందనే కోపంతో నిర్మలమ్మ అనే మహిళను ఆమె ఇంటికెళ్లి బెదిరించాడనే ఆరోపణలపై రూరల్ పోలీస్స్టేషన్లో మారుతీప్రసాద్రెడ్డిపై కేసు నమోదైంది. అయితే చాలాకాలంగా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. నెలరోజుల కిందట సింగపూర్ నుంచి వచ్చిన అతను గురువారం వాయిదా ఉండటంతో ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చాడు. అతడిపై ఫిర్యాదు చేసిన నిర్మలమ్మ, ఆమె బంధువులు కూడా వచ్చారు. కోర్టు వద్ద మారుతీప్రసాద్రెడ్డితో వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న వేటకొడవళ్లతో అతడిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అతను జమ్మలమడుగు రోడ్డువైపు పరుగెత్తాడు. నలుగురు వ్యక్తులు వేట కొడవళ్లతో అతని వెంటపడ్డారు. రెండు కత్తిపోట్లు తగలడంతో మార్కెట్ యార్డు వద్ద కిందపడిన మారుతీప్రసాద్రెడ్డిని నిర్మలమ్మ సోదరులు శ్రీనివాసులరెడ్డి, రఘునాథరెడ్డిలు అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్యచేశారు. అనంతరం ఇద్దరు నిందితులను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు
-
నీవు లేక నీ జ్ఞాపకాలే తోడుగా..
♦ ప్రజాదరణ నేతగా ఎదిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి ♦ కష్టాలను ఎదురీదుతూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ♦ కుట్రలను ఛేదిస్తూ.. ప్రత్యర్థులను అధిగమిస్తూ.. ♦ కొండంత అండను కోల్పోయిన పత్తికొండ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రజానేత. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం తపించే నాయకుడు. పత్తికొండ నియోజకవర్గంలో మంచికి మారుపేరుగా ప్రజల మనసు చూరగొన్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జీగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెళ్లేవారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారు. అధికార పార్టీ నేతల అక్రమాలను నిలదేసేవారు. ఇటీవల తాగు నీటి సమస్య పరిష్కారం కోసం ప్రజల తో కలిసి భారీ ధర్నా కూడా నిర్వహించారు. ప్రజాక్షేత్రంతో దూసుకుపోతున్న నారాయణ రెడ్డికి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ నాయకులు ఎన్నో ఎత్తుగడలు పన్నారు. ఆయన వర్గీయులను బెదిరింపు లకు గురిచేశారు. పలువురిపై దాడులు కూడా చేశారు. అయినా బెదరక.. కార్యకర్తలకు, తన వర్గీయులకు చెరుకులపాడు అండగా నిలబడ్డారు. ప్రజల కోసం..వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాల కోసం పోరాడారు. దీంతో ప్రత్యర్థి శిబిరంలో వణుకు పుట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే భయంతో అతన్ని హతమార్చేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కాపుకాసి..బాంబులు వేసి..వేటకొడవళ్లలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో వెల్దుర్తి మండం కృష్ణగిరి వద్ద దారుణంగా నరికి హతమార్చారు. దారుణ హత్యలో టీడీపీకి చెందిన కీలక నేత హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, సోమవారం జిల్లా బంద్కు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కర్నూలు(అర్బన్): అధికార పార్టీ ఆది నుంచి చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ... అవసరమైతే అంతమొందించేందుకు అనేక రూపాల్లో కుట్రలు పన్నుతూనే వచ్చింది. అయినా ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడకుండా, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలంటు ... పత్తికొండ ప్రజలకు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 32 వేల ఓట్లను సాధించారంటే ... ప్రజల్లో ఆయనకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తోంది. అతి చిన్న వయస్సులోనే తండ్రి శివారెడ్డి హత్యతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటు పత్తికొండ, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లోని అభ్యర్థుల విజయావకాశాలను శాసించే స్థాయికి ఎదిగారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నాటి నుంచే నారాయణరెడ్డిని ఎదో ఒక విధంగా దెబ్బ తీయాలని చూస్తూనే వచ్చింది. పత్తికొండ అభివృద్ధికి అహర్నిషలు కృషి... అధికారం ఉన్నా, లేకపోయినా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి చెరుకులపాడు ఎంతో కృషి చేశారు. పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ, జూటూరు, మందగిరి, పులికొండ, చక్రాళ్ల, చందోలి తదితర గ్రామాల్లో తాగునీటి బోర్ల ఏర్పాటు చేయించారు. అలాగే పత్తికొండలోని కటికేవీధిలోని ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ, సిమెంట్ రోడ్డు నిర్మాణం నారాయణ రెడ్డి చొరవతో పూర్తయింది. యువతకు జాబ్మేళాతో 20 మంది యువకులకు ఉపాధి అవకాశాలతో పాటు, పేదలకు వైద్యసాయం అందించేందుకు సహకారం అందించారు. మద్దికెర మండలంలో సుమారు రూ.2కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు. కొత్తపల్లి మద్దికెరకు రూ.98 లక్షలతో రోడ్డు నిర్మాణం, మద్దికెరలోని నేసే వీధిలో ఓవర్హెడ్ ట్యాంకు ఏర్పాటు చేయించారు. అలాగే పెరవలి, మద్దికెర గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఎంపీ బుట్టారేణుక సహకారంతో యశ్వంత్పూర్–కాచిగూడా రైలు మద్దికెరలో నిలిపేందుకు కృషి చేశారు. ఆపదలో ఉన్న వారికి వైద్య సాయం, ఎర్రగుడి, తుగ్గలి, జొన్నగిరి, పెండేకల్, రాంపురం గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. ఒకే రోజు 27 శుభకార్యాలకు హాజరు తనకు పరిచయం ఉన్న ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా, తప్పక హాజరయ్యే మనస్థత్వం నారాయణరెడ్డిది. ఒకానొక సందర్భంలో ఒకే రోజు 27 శుభ కార్యాలకు హాజరైన నారాయణరెడ్డిని చూసి‡ వైఎస్సార్సీపీ నేతలే విస్తు పోయారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా పల్లె ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తు, ఎంతో ఆత్మీయతను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాలకు చెందిన వారు ఎవరు అనారోగ్యాలకు గురై కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్సకు చేరినా, వారికి నేనున్నాంటు భరోసా ఇస్తు ఆయా ఆసుపత్రుల యాజమాన్యలతో మాట్లాడి ఫీజులు తగ్గిస్తు మెరుగైన వైద్యం చేయించేందుకు కృషి చేస్తు వచ్చారు. చెరుకులపాడు శ్రీమంతుడు కర్నూలు (అర్బన్): ముఠాకక్షల ఖిల్లాగా ముద్రపడిన చెరుకులపాడు గ్రామాభివృద్ధికి నారాయణరెడ్డి ఎంతో కృషి చేశారు. 1995లో నారాయణరెడ్డి తండ్రి శివారెడ్డిపేరుతో స్మారక సంస్థను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. అప్పటి వరకు ప్రాథమికోన్నత పాఠశాల మాత్రమే నడుస్తున్న ఆ గ్రామంలో ఆ పాఠశాలను పదోతరగతి వరకు అప్గ్రేడ్ చేయడంలో జిల్లా విద్యాధికారులతో సంప్రదించి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేశారు. గ్రామ వాసులందరితో శ్రమదానం చేయించి పాఠశాలను నిర్మింపజేశారు. జిల్లాలోని ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి విద్య అధికారులతో చర్చించి ఆ ఉపాధ్యాయులను తన పాఠశాలకు రప్పించి తొలి సంవత్సరంలోనే ఆ పాఠశాలలో రికార్డు స్థాయి ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు. అప్గ్రేడ్ చేసి పదోతరగతి ప్రారంభించిన తొలి సంవత్సరంలో చెరుకులపాడు పాఠశాల పదోతరగతిలో 512 మార్కులు సాధించి జిల్లాలోనే ఒక ఉత్తమ పాఠశాలగా పేరు గడించింది. అనంతరం ప్రతి సంవత్సరం నూటికి 100శాతం ఫలితాలను సాధిస్తూ చెరుకులపాడు పాఠశాల వెల్దుర్తి మండలంలోఉత్తమ పాఠశాలగా పలువురి మన్నలను పొందడానికి నారాయణరెడ్డే కారణం. 24 గంటల్లో అంగన్వాడీ కేంద్ర నిర్మాణం: విద్యారంగ అభివృద్ధి కోసం అంకితమై పని చేసిన నారాయణరెడ్డి చెరుకులపాడు గ్రామంలో తానే దగ్గరుండి 24 గంటల్లో అంగన్వాడీ కేంద్ర నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ సంఘటననే అన్ని టీవీ చానళ్లు ప్రచారం చేశాయి. ఉన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు నిర్వహిస్తూ విద్యారంగ మేధావులను ఆహ్వానిస్తూ సన్మానించిన నారాయణరెడ్డి చెరుకులపాడు గ్రామంలో విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ గ్రామంలోని పసుపురాతి హరిత అనే విద్యార్థిని ప్రపంచ స్థాయిలో వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించడంతో అప్పటి జిల్లా కలెక్టర్ రాజేశ్వర్తివారిని, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని ఆహ్వానించి ఆమెను ఘనంగా సన్మానించారు. కప్పట్రాళ్ల కేసులో నిర్దోషి జిల్లాలో సంచలనం రేపిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో చెరుకులపాడు నారాయణరెడ్డిని నిందితునిగా చేర్చి ఇబ్బంది పెట్టాలని అధికార పార్టీ పన్నిన పన్నాగాన్ని ఆదోని న్యాయ స్థానం తిప్పికొట్టింది. తనపై ఆపాదించబడిన కేసులో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరెడ్డి తీర్పు చివరి రోజున తనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంతో చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని స్వయంగా అనుభవించానని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పగవాడికి సైతం ఇలాంటి దుస్థితి రాకూడదని బోరున విలపించారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సందేశాలు: ఇటీవలి కాలంలో చెరుకులపాడు నారాయణరెడ్డి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సందేశాలను తన మిత్రులు, సన్నిహితులకు నిత్యం పంపేవారు. ప్రతి రోజు తాను పా ల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను అప్ లోడ్ చేసే వారు. ఈ నేపథ్యంలోనే తాను మరికొన్ని గంట ల్లో హత్యకు గురవుతానని తెలియక ముందు వెల్దుర్తిలోని లిమ్రా ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఫొటోలను కూడా చివరి సారిగా తన సెల్ఫోన్ వాట్సాఫ్ ద్వారా పోస్టు చేశారు. వాట్సాఫ్లో వచ్చిన ఫోటోలను చూసి ఆయన బంధుమిత్రులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్ర పత్తికొండ : కంగాటి లక్ష్మీ నారాయణరెడ్డి 1986లో కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ⇔ 1987లో చెరుకులపాడు గ్రామ సర్పంచుగా విజయం సాధించారు. ⇔ డీసీసీ ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్లు బాధ్యతలను నిర్వహించారు. ⇔ కృష్ణగిరి మండల జడ్పీటీసీగా బరిలో నిలిచి ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలైయ్యాడు. పదవులు అందివచ్చినా రాకపోయినా పార్టీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారు. ⇔ 1999లో వైఎస్ఆర్ అభయంతో పత్తికొండ అసెంబ్లీ నుంచి బరిలో నిలుస్తున్న సమయంలో మాజీ మంత్రి ఎస్సీ సుబ్బారెడ్డి, తనయుడు ఎస్సీ మోహన్రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లోకి రావడంతో ఆనాడు నారాయణరెడ్డిని బుజ్జగించి ఎస్పీ మోహన్రెడ్డిని బరిలో దించారు. ⇔ 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఓటమిపాలయ్యాడు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లు కోల్పోతే, నారాయణరెడ్డికి మాత్రం 31 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ నాయకుల్లో రెండో స్థానంలో నిలిచారు. ⇔ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ పత్తికొండ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ⇔ నియోజకవర్గంలో 168 గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తీరును, అవినీతిని ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ⇔ నారాయణరెడ్డి తన నియోజకవర్గంలో దూసుకెళ్తుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం మొదలెట్టారు. ఇది జీర్ణించుకోలేని రాజకీయ నాయకులు అతడిని మట్టుబెట్టాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు మాటు వేసి ఆదివారం హత్య చేశారు. చెరుకులపాడులో విషాదఛాయలు కర్నూలు (వైఎస్ఆర్సర్కిల్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో ఆయన స్వగ్రామం చెరుకులపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్తను తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించడంతో గ్రామస్తులు, అభిమానులు, కార్యకర్తలు మృతదేహాన్ని చూసేందుకు కర్నూలు ఆసుపత్రికి తరలివెళ్లారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ నిర్మాణుష్యంగా మారాయి. దాహార్తి తీర్చిన జలదాత గ్రామంలో నిత్యం ఏ కార్యం జరిగినా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు నారాయణరెడ్డి ఉచితంగా మంచినీటి ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మృతి చెందడంతో గ్రామస్తులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీవి హత్యా రాజకీయాలే తెలుగు దేశం పార్టీ హత్యా రాజకీయాలను పోషిస్తుంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఆ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధిచెబుతారు. ప్రశాంతంగా జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడటం మంచి పద్ధతి కాదు. అడ్డువచ్చిన వారిని చంపుకుంటూ పోతే మళ్లీ పాత రోజులే వచ్చి పల్లెలు నాశనమవుతాయి. – కె.తిరుమల్రెడ్డి, పెట్రోల్ బంకు యజమాని, చనుగొండ్ల రాజకీయంగా ఎదుర్కోవాలి సమాజంలో హత్య రాజకీయాలు మంచివి కావు. సాధారణ పౌరుల ప్రశాంత జీవనానికి అవి భంగం కలిగిస్తాయి. గతంలో ఉన్న ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో అంతా బాగున్నాం. తిరిగి జిల్లాను ఈ తరహా రాజకీయాలు నెలకొనడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కొనేవారికే భవిష్యత్ ఉంటుంది. – పువాడి భాస్కర్, వ్యాపారి, ఆత్మకూరు రాజకీయానికి మాయని మచ్చ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంలో రెండు కళ్లు లాంటివి. అధికార పక్షం ప్రతిపక్ష నాయకులను హత్య చేయిస్తూ పోతే తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలే పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న హత్యలు ప్రజాస్వామ్యంలో రాజకీయానికి ఉన్న అర్థాన్ని మార్చి వేస్తున్నాయి. దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేవిధంగా ఉంది. – సి.నారాయణ, పత్తికొండ హత్యలు అనాగరిక చర్య ఓ వైపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న దేశంలో ఇంకా హత్యలు చేసుకోవడం అనాగరిక చర్య. పార్టీలకతీతంగా అందరూ రాజకీయ హత్యలను ఖండించాలి. ఆధిపత్య పోరులో విభేదాలు ఏర్పడితే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచాలి. – టి.మాధవరెడ్డి, సీనియర్ న్యాయవాది ఫ్యాక్షన్ను చిచ్చు రేపుతున్నారు టీడీపీ నేతలు ఫ్యాక్షన్ చిచ్చు రేపుతున్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి తన ప్రాణాలకు ముప్పుందని ఎన్నో మార్లు ప్రభుత్వానికి, పోలీసులకు బహిరంగంగా విన్నవించుకున్నా రక్షణ కల్పించలేకపోయింది. నియోజవర్గ స్థాయి నాయకుడే తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు చోద్యం చూశారు. ప్రభుత్వమే హత్యా రాజకీయాలు పోత్సహించడం దురదృష్టకరం. – గుండామణి, ఆళ్లగడ్డ -
టీడీపీ వర్గపోరు:ఇద్దరి దారుణహత్య
-
వేమవరంలో ఇద్దరి దారుణ హత్య
ఎమ్మెల్సీ బలరాం వర్గీయులపై ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల దాడి బల్లికురవ: ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారు తీవ్ర గాయాలతో చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని కరణం బలరాం వర్గీయులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, అంజయ్య (48), పేరయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు (40), ముత్యాలరావు, వీరరాఘవులు రెండు బైక్లపై రాజుపాలెం గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గ్రామ కూడలికి రాగానే రవికుమార్ వర్గీయులైన మాలెంపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మారుతి, శాఖమూరి సీతయ్య, మరో 40 మంది కర్రలతో బైకులపై వస్తున్న వారిపై దాడి చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో రోడ్డుపై స్పీడు బ్రేకర్లు ఉండటంతో రెండు బైకులు స్లో అయ్యాయి. అది గమనించిన రవికుమార్ వర్గీయులు ఆరుగురి కంట్లో కారం కొట్టి కర్రలతో తీవ్రంగా దాడిచేసి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాల్లో తొలుత చిలకలూరిపేట వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు మృతి చెందారు. -
మామిడికాయల కోసం దారుణ హత్య
తమ్ముడిని చంపిన అన్న జగిత్యాల రూరల్: మామిడి కాయల కోసం ఓ అన్న తమ్ముడిని చంపిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్ అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా, ఒక చెట్టు కాయలను నాంపెల్లి లక్ష్మణ్ (41) సోమవారం కోస్తుండగా రెండో సోదరుడు నాంపెల్లి శ్రీను వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి లక్ష్మణ్పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. లక్ష్మణ్ కేకలు వేయగా, సమీపంలోనే ఉన్న మరో సోదరుడు హన్మాండ్లు వచ్చాడు. దీంతో శ్రీను అతడిపైనా దాడికి ప్రయత్నించాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్ను స్థానికులు 108లో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు దుబాయ్లో బస్ డ్రైవర్ కాగా, వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.