గనుల శాఖ మహిళా అధికారి హత్య | Female Deputy Director Of Karnataka Geology Department Found Murdered In Bengaluru - Sakshi
Sakshi News home page

గనుల శాఖ మహిళా అధికారి హత్య

Nov 6 2023 6:13 AM | Updated on Nov 6 2023 10:31 AM

Female deputy director of Karnataka geology department found murdered - Sakshi

బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్‌ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు.

కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్‌ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని        తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement