విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదాఘాతం వల్ల ఇద్దరు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి.
విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదాఘాతం వల్ల ఇద్దరు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. శుక్రవారం జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డ్లో సమస్య వస్తే ఉద్యోగులు సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో శివకుమార్, ఎం.లక్ష్మయ్య కర్రతో వైర్ను కొట్టగా షాక్కు గురయ్యారు. శివకుమార్కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు.