విజయనగరం జిల్లా జామి మండలంలో దారుణం చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా జామి మండలంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని చంపి కాల్చేశారు. మండలంలోని అన్నంరాజుపేట గ్రామ సమీపంలోని మామిడితోటలో దాదాపు పూర్తిగా కాలిపోయిన మృతదేహం శుక్రవారం స్థానికుల కంటబడింది. ఘటనా స్థలంలో మద్యం సీసాలు పడి ఉన్నాయి. ఈ విషయమై వారు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.