vizianagaram district
-
జనసేన వర్సెస్ టీడీపీ.. నేతల మధ్య కొట్లాట
సాక్షి, విజయనగరం జిల్లా: నెల్లిమర్ల మండలం బూరాడపేటలో టీడీపీ-జనసేన నేతల కొట్లాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డీలర్ పోస్ట్ విషయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం నెలకొంది. ఆదివారం గ్రామంలో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన నేతలు కర్రలతో దాడి చేసుకున్నారు. జనసేన మండల నేత కరుమజ్జి గోవింద్తో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.పెనుకొండలో టీడీపీ వర్సెస్ బీజేపీమరోవైపు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనుచరులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుయాయుల మధ్య భూ వివాదం రచ్చకెక్కింది. ఇరు వర్గాలు తరచూ ఘర్షణలకు దిగుతుండడంతో చుట్టుపక్కల రైతులు.. కియా కార్ల పరిశ్రమ వద్ద ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా తెగని భూ పంచాయితీతో పదేపదే పోలీస్ స్టేషన్కు వెళ్లడం, దారులు మూసేయడం, జేసీబీలతో రోడ్లు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాడ్లు, కర్రలతో గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. -
వసంత పంచమి వేళ..విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
జనసేన కార్యకర్తపై టీడీపీ దౌర్జన్యం.. పురుగుల మందుతో బెదిరింపు
-
భోగాపురం పనులు చకచకా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విభజిత ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు విజయనగరం జిల్లా భోగాపురం వద్ద శరవేగంగా జరుగుతున్నాయి. 2014–19 టీడీపీ హయాంలో అపరిష్కృతంగా వదిలేసిన సమస్యలను తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించిన సంగతి తెలిసిందే. భూసేకరణను పూర్తి చేయడమే గాక నిర్వాసితులకు పరిహారం, పునరావాసం విషయంలోనూ అడ్డంకులన్నీ తొలగించింది. కేంద్రం వద్ద పెండింగ్లోనున్న అనుమతులన్నీ తీసుకువచ్చింది. ఆ తర్వాతే 2023 మే 3న నాటి సీఎం వైఎస్ జగన్ ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా ఈ పనులన్నీ ఊపందుకున్నాయి.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 30% పనులు పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్ నాటికి ప్రధాన నిర్మాణ పనులన్నీ 56 శాతానికి చేరాయి. మిగతావన్నీ పూర్తి చేసి 2026 డిసెంబర్ నాటికల్లా తొలి దశ పూర్తిచేయడమే లక్ష్యంగా నిర్మాణ సంస్థ జీఎంఆర్ నిర్మాణాల వేగాన్ని మరింతగా పెంచింది. ఉత్తరాంధ్ర ప్రగతికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్పోర్టు కంపెనీల్లో ఒకటైన జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో చేపట్టింది. వాస్తవానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ 2025 డిసెంబర్కి మొదటి దశ పూర్తి చేయాలని అభిలషించారు. ఇందుకు జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధిపతి గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) కూడా సానుకూలంగా స్పందించారు. అందుకనుగుణంగానే ల్యాండ్ ఫిల్లింగ్, రన్వే, టెర్మినల్ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. ఈ పనులన్నీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 56 శాతం పూర్తి అయ్యాయని అధికారులు చెబుతున్నారు. పూర్తి అయితే ప్రగతికి దోహదం...ఏటా 4 కోట్ల మంది విమాన ప్రయాణం చేసేలా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో తొలి దశ నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసిన తర్వాత తదుపరి దశ పనులు చేపడతారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రగతికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఊతంగా నిలుస్తుంది. దేశీయ, విదేశీ విమానయానం మరింతగా ఊపందుకుంటుంది. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో ఫార్మా, ఆక్వా తదితర పరిశ్రమల విస్తరణకు, ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు ఆధారమవుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.⇒ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ ప్రక్రియను రూ.835.48 కోట్లతో పూర్తి చేసింది. ⇒ 4 గ్రామాల్లోని 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో అన్ని మౌలిక వసతులతో ఈ పునరావాస కాలనీలను నిర్మించింది.⇒ ప్రతి కుటుంబానికి 240 చదరపు గజాల ఇంటిస్థలం, అక్కడ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి రూ.9.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.⇒ విమానాశ్రయానికి ఏటా 5 ఎంఎల్డీ నీటి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తక్షణమే 1.7 ఎంఎల్డీ నీటి సరఫరాకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి రూ.5.30 కోట్లు మంజూరు చేసింది.⇒ 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా ఏర్పాట్లకు రూ.2.62 కోట్ల నిధులు విడుదల చేసింది.⇒ విమానాశ్రయానికి సేకరించిన భూమిలోనున్న విద్యుత్తు లైన్లు, స్తంభాల స్థలామార్పిడికి రూ.2.30 కోట్ల వ్యయం చేసింది.⇒ స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి భోగాపురం మండలం బసవపాలెం వద్ద 24.30 ఎకరాల భూమి కేటాయించింది.⇒132/133 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి భోగాపురం మండలం కొంగవానిపాలెం వద్ద 5.47 ఎకరాల భూమి ఇచ్చింది. -
కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న బయాలజీ ఉపాధ్యాయుడు ఎం. వెంకటరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత శనివారం విద్యార్థినీని అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్పై తాకాడు. దీంతో మూడు రోజులుగా బాలిక ముభావంగా ఉంటూ తిండితినడం మానేసింది.తల్లి ఏమైందంటూ బాలికను ప్రశ్నించగా, ఉపాధ్యాయుడు తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని బయటకు చెప్పింది. ఆదివారం సెలవు కావడం, సోమవారం సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరు కావడంతో తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడితో పాటు హెచ్ఎంను ప్రశ్నించారు. అనంతరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి కీచక ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గణేష్, సిబ్బంది పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో కుమార్తెపై తండ్రి లైంగిక దాడిపెద్దముడియం: కూటమి ప్రభుత్వ విచ్చలవిడి మద్యం విధానం వావివరసలను మర్చిపోయేలా చేస్తోంది. బంధాలను, అనుబంధాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతురి మీదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె (16) పదో తరగతి వరకూ చదివి తల్లితో పాటు కూలి పనులకు వెళుతోంది. ఆమె తండ్రి హమాలీ పనికి వెళుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా కూతురు అనారోగ్యంగా ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో తండ్రి చేసిన అకృత్యాన్ని కూతురు బయటపెట్టింది. వెంటనే భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. బాలికలపై లైంగిక దాడి చేసిన యువకుడికి పాతికేళ్లు జైలుపోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు విశాఖ లీగల్: బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనంది మంగళవారం తీర్పు చెప్పారు. బాలికలకు నిందితుడు రూ.లక్ష చొప్పున చెల్లించాలని, ప్రభుత్వం చెరో రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు.. వివాహితుడైన అమరాపల్లి అరవింద్(25) పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర వుడా కాలనీలో నివసిస్తున్నాడు. బాధిత బాలికలు(15, 13), వారి తల్లి.. పాత పెందుర్తి దగ్గర బీసీ కాలనీలో నిందితుడి ఇంటికి సమీపంలో ఉండేవారు. నిందితుడు బాలికలతో చాలా చనువుగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా పెద్ద బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2019 జూలైలో తల్లికి తెలియకుండా ఇద్దరు బాలికలనూ తన కారులో ఒంగోలు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరిపైనా లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నేరాభి యోగపత్రంలో పేర్కొ న్నారు. విషయం తెలియడంతో బాలికల తల్లి 2019 నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ స్వరూపరాణి దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. -
డయేరియా బాధితులకు వైఎస్ జగన్ భరోసా
-
సెప్టెంబర్లోనే డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలింది. 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్లో కూడా డయేరియా ఔట్బ్రేక్ ట్రెండ్ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్ఆర్టీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టి ఉంటే వ్యాధి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ఈ నెల 15 తర్వాత కేసులు విపరీతంగా పెరగడం, మరణాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వ యంత్రాంగం గుర్లపై దృష్టి సారించింది. అప్పటికే నష్టం తీవ్రమైంది. ఇప్పటికీ ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది.తాగునీరు కలుషితమవడమే కారణంగుర్ల మండలంలో తాగు నీరు కలుషితమైన కారణంగానే డయేరియా ప్రబలినట్లు ఆర్ఆర్టీ నివేదించిందని బుధవారం వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సేకరించిన 44 నీటి నమూనాలలో 31 నమూనాల్లో కోలిఫాం ఉన్నట్లు తేలింది. 57 మల నమూనాలను పరీక్షించగా భూతల, భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. నీటి వనరు అయిన చంపా నదిలో దహన సంస్కారాలు, జాతరలు, పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నారని కమిటీ గమనించింది. చంపా నది వెంబడి ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ డయేరియా కేసులు నమోదయ్యాయి. వ్యాధుల వ్యాప్తి నివారణకు అవసరమైన క్లోరినేషన్ పేలవంగా ఉంది. నీటి నమూనాలలో క్లోరిన్ అవశేషాలేమీ లేకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాగు నీటి ప్రధాన వనరైన చంపా నది నీటిని తరచుగా క్లోరినేషన్ చేయాలని, నీటి సరఫరా పైపుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మరమ్మతులు చేయాలని కమిటీ సూచించింది. డ్రైనేజీ గుండా నీటి పైపులు వెళ్లకుండా చూడాలని సిఫార్సు చేసింది. విజయనగరం జిల్లా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున తరచూ నీరు, ఇతర నమూనాల పరీక్షలకు వీలుగా రీజినల్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది’ అని వైద్య శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. -
నేడు విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.కాగా, వైఎస్ జగన్ బుధవారం గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించారు. గుంటూరు జీజీహెచ్కు చేరుకున్న ఆయన.. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకున్న వైఎస్ జగన్.. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానం
గుర్ల: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి పోయింది. డయేరియాతో పది మంది చనిపోయినా ఒక్కరే అంటూ చేసిన ప్రకటన తప్పని తేలింది. ఇప్పటికే డయేరియా మరణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. జిల్లా కలెక్టర్ డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డయేరియా కారణంగా ఒకరు మృతి చెందారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ చేసిన ప్రకటనలు తప్పని తేల్చారు. గుర్లలో 10 మంది డయేరియా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఇస్తామని పవన్ ప్రకటించారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి, కలెక్టర్ అవాక్కయ్యారు. ఒక్కరే చనిపోయారంటూ కలెక్టర్ ప్రకటించి మృతుల సంఖ్యను దాచి పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పదిమంది చనిపోయారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానంమరోవైపు గుర్లలో పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి ఘోర అవమానం జరిగింది. గుర్ల పీహెచ్సీలో డయేరియా రోగులను పరామర్శించడానికి పవన్తో పాటు వెళ్లేందుకు మంత్రి కొండపల్లిని పవన్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దీంతో పవన్ ఆస్పత్రిలో వున్నంత సేపు కొండపల్లి మెయిన్ డోర్ బయటే నిలబడడ్డారు. దీంతో పవన్ తీరుపై జిల్లా టీడీపీలో చర్చ జరుగుతుండగా.. తమ మంత్రినే అవమానిస్తారా’ అంటూ కొండపల్లి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోరారు. పవన్తో పాటు తెలంగాణ సీఎస్కూ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు పవన్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
ఎట్టకేలకు కదలిక
సాక్షి, అమరావతి/గుర్ల: విజయనగరం జిల్లా గుర్ల డయేరియా ఘటనలపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నెల 13న డయేరియా వ్యాప్తి మొదలై 470 మందికిపైగా దీని బారినపడగా.. వారిలో శనివారం నాటికి 11 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరో ఐదు కేసులు నమోదు కాగా, ఎన్.పాపారావు(62) మృత్యువాతపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం చలనం లేనట్టుగా వ్యవహరించింది. బాధితులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించడంలో విఫలమైంది. బాధితులకు ప్రభుత్వ పాఠశాలలోని బల్లలపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తూ, చికిత్స చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఓ పక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సైతం బాధితుల పక్షాన నిలిచారు. దీంతో ఆదివారం హుటాహుటిన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్తో విచారణకు ఆదేశించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సిరి సైతం ఆదివారం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గుర్ల పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా.. డయేరియా ప్రబలి పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వైద్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎండగడుతూ నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. రోగులకు అవసరమైన బెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామంలోని జెడ్పీ హైసూ్కల్లో చికిత్స పొందుతూ కోలుకున్న వారిని ఇళ్లకు పంపించేశారు. మిగిలిన బాధితులను గుర్ల పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో అదనంగా 8 బెడ్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేసినట్టు గుర్ల పీహెచ్సీ వైద్యాధికారి చెన్నయ్ తెలిపారు. మరణాలు లేవంటూ బుకాయింపు గుర్లలో డయేరియా మరణ మృదంగం సృష్టిస్తుంటే ప్రభుత్వం మాత్రం అక్కడ ఏమీ జరగనట్టుగానే వారం రోజులపాటు వ్యవహరించింది. 470 మందికిపైగా డయేరియా బారినపడినట్టు స్థానికులు చెబుతున్నారు. తమ వాళ్లు డయేరియాతోనే మృతి చెందారని 12 మంది కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డయేరియా కారణంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టు ఆదివారం ప్రకటించింది. ప్రతిపక్షం బాధితుల పక్షాన నిలవడంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని విజయనగరం జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.నేడు పవన్కళ్యాణ్ పర్యటన గుర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సోమవారం పర్యటిస్తారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారని పేర్కొంది.నీటి కాలుష్యమే కారణం: వైద్యశాఖ గుర్లలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం తెలిపారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపగా.. కలుíÙతమైనట్టు తేలిందని పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఈ నెల 13న ఒక కేసుతో ప్రారంభమై 18వ తేదీ వరకూ వరుసగా కేసులు నమోదైనట్టు తెలిపారు. మరణాల సంఖ్యపై వివిధ రకాల వార్తలొస్తున్నాయని, వాస్తవంగా డయేరియాతో ఒక్కరే మరణించగా, ఏడుగురు ఇతర వ్యాధులతో మరణించారని వివరించారు. -
పేదల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అప్పలరాజు డయేరియా విజృంభించిన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా ఒకే ఊరిలో 450 మంది అతిసారం బారినపడి బాధపతున్నారని, వారిలో 11 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా పేదలు మృతి చెందారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వైద్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అప్పగించారని... కానీ చంద్రబాబు ప్రభుత్వం డయేరియా బాధితులకు వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బెంచీలు, కుర్చీలపై రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారంటేనే ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కనీసం రోగులకు బెడ్ కూడా వేయకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు–నేడు’ అభివృద్ధి పనుల వల్లే ఇప్పుడీ బెంచీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా సదుపాయాలు కలిగాయని, ఒకవేళ గుర్ల పాఠశాలను ఇలా తీర్చిదిద్ది ఉండకపోతే ఇప్పుడు రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేసేవారా...? అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల్లోని పీహెచ్సీల నుంచి బెడ్స్ తీసుకొచ్చి వేయించడం కూడా తెలియదా..? అని మండిపడ్డారు. ఇవేవీ చేయలేనప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఎందుకొచ్చారని, ఫొటోలు తీయించుకోవడానికా అని నిలదీశారు.సీఎం చంద్రబాబు మద్యం మత్తు, ఇసుక మాఫియా నుంచి బయిటకొచ్చి పేదల గురించి పట్టించుకోవాలని అన్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేశ్ పక్కనేవున్న గుర్ల మండలంలో వందల మంది కష్టంలో ఉంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, రక్షిత నీటి విభాగం శాఖల పూర్తి వైఫల్యానికి నిదర్శనమే గుర్ల విషాదమన్నారు. ఆ రెండు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. వందలాది ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా గ్రామంలో జ్వరాలు వస్తే తక్షణమే ఫీవర్ సర్వే చేయించి కారణాలు తెలుసుకుని నిరోధించే చర్యలు చేపట్టే వారమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివసరావు చెప్పారు. ఇప్పుడీ ప్రభుత్వం డయేరియా రోగులను స్కూల్ పిల్లల బెంచీలపై పడుకోబెట్టి కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
డయేరియా మరణమృదంగం..
-
డయేరియా గుప్పెట్లో విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఐదు గ్రామాల్లో గురువారం సాయంత్రానికి 450 మందికిపైగా డయేరియా బారిన పడ్డారు. శుక్రవారం కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. చాలామందికి ఇళ్ల వద్దనే వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరేచనాలు అధికంగా అవుతున్నవారిని గుర్ల జెడ్పీ హైసూ్కల్లో వైద్యశిబిరానికి, గుర్ల పీహెచ్సీ, చీపురుపల్లి, నెలిమర్ల సీహెచ్సీలకు తరలించి చికిత్స చేస్తున్నారు. అవసరమైనవారిని విజయనగరంలోని సర్వజన ఆస్పత్రి, గోషాస్పత్రి, విశాఖలోని కేజీహెచ్లకి తరలిస్తున్నారు. గురువారం నాటికి డయేరియా బారిన పడి ఏడుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుర్ల గ్రామానికి చెందిన పతివాడ సూరమ్మ (68) ఇంటివద్దే చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి సీతమ్మ డయేరియాతో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై గుర్ల గ్రామానికే చెందిన కలిశెట్టి రవి (28) మృతిచెందాడు. ప్రైవేట్ బోర్లపైకి నెపంమండలంలో గత శనివారం నుంచి డయేరియా పంజా విసురుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. విజయనగరం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం అలా ముఖం చూపించి వెళ్లిపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ వచ్చి గుర్లలో పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టరు, ఇతర అధికారులు రెండు, మూడు రోజులుగా వచ్చి వెళుతున్నారు. చంపావతి నది నుంచి వస్తున్న తాగునీటి వల్లే డయేరియా విజృంభించిందనే సందేహంతో ఆ నీటి నమూనాలకు పరీక్షలు చేయించిన ఆర్డబ్ల్యూఎస్ (రక్షిత మంచినీటి విభాగం) అధికారులు.. ఆ నీటివల్ల సమస్య లేదని తేలిందని చెబుతున్నారు. గ్రామస్తులు మరుగుదొడ్ల వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి వదిలేయడం వల్ల అలా భూమిలో ఇంకి ప్రైవేటు బోర్లలోకి వస్తున్న నీటిని వినియోగించడం వల్లే డయేరియా వచ్చి ఉండవచ్చని జిల్లా ఉన్నతాధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు.ఇంకెన్ని చూడాలో... » గుర్లకు చెందిన మామిడిపాక ప్రవీణ్కుమార్కు ఈ నెల 16న వివాహం జరిగింది. అప్పటికే డయేరియా లక్షణాలు అధికమవడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. » గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి విధులకు వెళ్లకుండా అప్పటి నుంచి ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు. -
విజయనగరం జిల్లాలో విజృంభిస్తోన్న డయేరియా
-
డయేరియా డేంజర్ బెల్స్..
-
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
ఊయలలో పసికందుపై అఘాయిత్యం
రామభద్రపురం: రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే.. విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ మధుర గ్రామ పరిధిలోని జీలికవలసలో శనివారం 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో పసి పాపకు స్నానం చేయించిన తల్లి ఊయలలో నిద్ర పుచ్చి0ది. గ్రామంలోకి నిత్యావసర సరుకులు రావడంతో.. కొనుగోలు చేసేందుకు తల్లి వీధిలోకి వెళ్లింది. ఇంతలో అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన నేరళ్లవలసకు చెందిన.. బాధిత చిన్నారికి తాత వరసైన బోయిన ఎరకన్నదొర (40) ఊయలలో నిద్రలో ఉన్న పాపపై లైంగిక దాడి చేయడంతో ఏడ్చింది. పక్కింటి వారు పాప ఏడుస్తున్న విషయాన్ని తల్లికి కేక వేసి చెప్పగా.. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడమని తన పెద్ద కుమార్తెకు చెప్పింది. పెద్ద కుమార్తె చూసి ‘చెల్లిని తాతయ్య ఎత్తుకున్నాడు. రక్తం వస్తోంది’ అని తల్లికి చెప్పింది. తల్లి పరుగున వచ్చేసరికి ఎరకన్నదొర పాపను ఊయలలో వేసేసి పారిపోయాడు. పసిపాపకు రక్తస్రావం కావడాన్ని చూసిన తల్లి ఎరకన్నదొరను వెంబడించి అతడిపైకి కర్ర విసిరింది. ఆమె వెంబడించడం చూసి గ్రామస్తులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా.. ఎరకన్నదొర తప్పించుకుపోయాడు. పాపను బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఘోషాస్పత్రికి తరలించారు. బాడంగి వైద్యాధికారులు పోలీసులను సంప్రదించాలని సూచించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్టీం సహాయంతో జీలికవలస గ్రామానికి వెళ్లి పాప దుస్తులను సీజ్ చేశారు. ఆదివారం వేకువజామున నేరళ్లవలసలో నిందితుడు ఎరకన్నదొరను అదుపులోకి తీసుకుని అతని దుస్తులపై ఉన్న రక్తపు మరకలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పాప విజయనగరం ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. డీఎస్పీ వెంట సీఐ తిరుమలరావు, ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఉన్నారు.బాలల హక్కుల కమిషన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఆరు నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఘోషాస్పత్రి పర్యవేక్షణ అధికారిణి అరుణ శుభశ్రీతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. కాగా.. ఈ ఘటనను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిండితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇదేం విష సంస్కృతి!? : బొత్స
విజయనగరం: పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు, యూనివర్సిటీల్లో వీసీలను బెదిరించడం వంటి విషసంస్కృతి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దౌర్జన్యాలు, కిరాతక చర్యలకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి దుశ్చర్యలు కొనసాగకూడదని హితవు పలికారు. అధికారంలో ఉన్న వారు సంయమనం పాటించాలని సూచించారు. విజయనగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ప్రైవేట్ ఆస్తులపై దాడులా? టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇటీవల విజయనగరంలో వైఎస్సార్సీపీ ఆఫీసుకు వచ్చి బెదిరించారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూలేదు. చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. ఇదిలాగే కొనసాగితే సివిల్ వార్గా మారే ప్రమాదముంది. రుషికొండలోవి పూర్తిగా ప్రభుత్వ భవనాలే.. అలాగే, విశాఖ రుషికొండలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలను ఎలా ఉపయోగించుకుంటారో ప్రభుత్వంలో ఉన్న వారి ఇష్టం. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విడిది కోసం వాటిని వాడుకోవచ్చు. అవి పూర్తిగా ప్రభుత్వ భవనాలే. ఇంతకుముందు ఉన్న భవనాల స్థానంలోనే అత్యాధునికంగా నిరి్మంచాం. ప్రస్తుత ప్రభుత్వం రూ.4,000 పింఛన్ పథకాన్ని అమలుచేయడాన్ని స్వాగతిస్తున్నామని, మిగిలిన ఐదు గ్యారంటీలు అమలుచేసే శక్తిని ఆ భగవంతుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి వరకు పాలన చూసిన తరువాత స్పందిస్తాం.వీసీలను బెదిరిస్తారా? యూనివర్సిటీల వీసీలను రాజీనామాలు చేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు చేయడం అస్సలు సమంజసం కాదు. వీసీగా నామినేట్ అయిన వ్యక్తి పనితీరు బాగా లేదనిపిస్తే విచారణ చేసుకోవాలి. ఎన్నికైన నేతలు 200–300 మందిని తీసుకుని ఆఫీసులకెళ్లి బెదిరింపులకు పాల్పడడం తప్పు. ఇక మా ప్రభుత్వంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించాం. టెట్ కూడా నిర్వహించాం. ఆ సమయంలో 50 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని వారే చెప్పారు. మెగా డీఎస్సీ అని 25 వేల పోస్టులైనా ఇస్తారనుకున్నాం.. కానీ, 16 వేల పోస్టులకే ఎందుకు పరిమితమయ్యారో తెలీడంలేదు. మా ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ ఉద్యోగం కూడా ఇవ్వలేదనడం తప్పు. 15 వేల పోస్టుల వరకు ఇచ్చాం. -
నా మాటే శాసనం
విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీడీపీ నేతల పెత్తనం మొదలైంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ పరిధిలోని 49వ సచివాలయానికి వెళ్లిన అధికార పార్టీ నాయకురాలు అనుఽరాధ బేగం నేరుగా సచివాలయ రెవెన్యూ కార్యదర్శి కుర్చీలో కూర్చుని అక్కడి ఉద్యోగులపై పెత్తనం చెలాయించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కానీ, ప్రస్తుతం కానీ ఎటువంటి పదవిలో లేని ఆమె ఉద్యోగి కుర్చీలో కూర్చుంటే సచివాలయ అడ్మిన్ కార్యదర్శి సందర్శకుల కుర్చీలో కూర్చున్నారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ నాయకులను వెంట తీసుకువెళ్లి సచివాలయ ఉద్యోగులకు వారిని పరిచయం చేసి వారు చెప్పినట్లు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. చివరిలో ఆమె సచివాలయ సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగడం విశేషం. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో ఎటువంటి పదవులు లేని వ్యక్తులు ఉద్యోగులపై అజమాయిషీ చెలాయించడం ఎంతవరకు సమంజసమంటూ చర్చించుకుంటున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు దగ్గర ప్రస్తావించగా ఆ విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో పులి సంచారం
-
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్వర్క్ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది. -
వలసల గడ్డపై...ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, పార్వతీపురం మన్యం: వలసలకు, వెనుకబాటుతనానికి నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి విజయనగరం జిల్లా. జగన్మోహన్రెడ్డి పాలనలో ఈ ప్రాంత దశా దిశా మారిపోతోంది. రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరానికి చేరువగా ఉండటం, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరగడం, విశాఖపట్నం–రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తికావడం విజయనగరానికి వరంలా మారాయి. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, 519 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్టీయూ–జీవీ... ఇవన్నీ విజయనగరం జిల్లాకు కలికితురాయి కానున్నాయి. అభివృద్ధికి రాచబాట గ్రీన్ఫీల్డ్ హైవే... అటు రాష్ట్ర పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరాన్ని ఇటు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ను అనుసంధానం చేస్తూ విజయనగరం జిల్లా మీదుగా ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే సాకారమవుతోంది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, ఎల్.కోట, కొత్తవలస మండలాల మీదుగా వెళ్లే దీని పొడవు: 75.03 కిమీ. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3,778 కోట్లు వెచి్చస్తోంది. ప్రజల కల... ప్రభుత్వ వైద్య కళాశాల! విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని సాకారం చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. శంకుస్థాపన చేసిన ఆయనే రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి గత ఏడాది సెపె్టంబరు 15న ప్రారంభోత్సవం కూడా చేయడం విశేషం. దీంతో ప్రజలు అత్యవసర వైద్యానికి, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల కోసం విశాఖపట్నం వరకూ పరుగులుపెట్టాల్సిన పరిస్థితి తప్పింది. 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. : 222 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ... పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి గత ఏడాది మే 3వ తేదీన భూమి పూజ జరిగింది. అంచనా వ్యయం: రూ.23.74 కోట్లు. కేటాయించిన నిధులు: రూ.25 కోట్లు. 6 ఎకరాల్లో నిర్మించనున్న ఈ జెట్టీ వల్ల 5,053 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ‘వైభోగా’పురం... ► గత ఏడాది మే 3న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు రూ.4,500 కోట్లతో జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టింది. 2025 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యాలు. ► ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం. ► ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుంది. ► భీమిలి బీచ్ కారిడార్ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది. ► విమానాశ్రయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ► విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూమి 2203.26 ఎకరాలు ► భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.835.48 కోట్లు ► 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో టౌన్íÙప్ల నిర్మాణం. మన్యంలో ఇదిగో సంక్షేమాభివృద్ధి ► రూ.100 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయం ► జిల్లా కేంద్రంలో రూ.600 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 కోట్ల చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు. ► అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.126 కోట్ల చొప్పున జమ. ► జగనన్న విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు.. ► జగనన్న వసతి దీవెన ద్వారా రూ.15.84 కోట్లు. ► జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల్లో భాగంగా ముగ్గురికి రూ.లక్ష చొప్పున సాయం. ► పింఛన్ కానుక కింద నెలకు రూ.37 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ ఆసరా కింద రూ.378 కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.147 కోట్లు, వైఎస్సార్ కల్యాణ మస్తు కింద రూ.11.84 కోట్లు, జగనన్న తోడు కింద రూ.7.59 కోట్లు చొప్పున లబ్ధి కలిగింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట ► పీఎంజీఎస్వై, ఆర్సీఈపీఎల్డబ్ల్యూ గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులు రూ.1,260 కోట్లతో జరుగుతున్నాయి. ► 190 4జీ సెల్ టవర్లకు 77 పూర్తయ్యాయి. ► 58 రహదారులకు అటవీ అనుమతులు మంజూరు. n సీతంపేటలో గిరిజన మ్యూజియం, జగతిపల్లి, అడాలి వ్యూ పాయింట్ల వద్ద పర్యాటక పనులు రూ.1.40 కోట్లతో, గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్.కె.పాడులో ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు రూ.1.80 కోట్లతో చేపడుతున్నారు. ‘గిరి’జన ప్రగతికి దిక్సూచి... ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) సొంత భవనాల నిర్మాణ పనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది ఆగస్టు 25న భూమి పూజ చేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మర్రివలస గ్రామ సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. సీటీయూఏపీ కోసం ఏపీ బడ్జెట్లో రూ.834.83 కోట్లు కేటాయించారు. 519.03 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేయడానికి 42 నెలలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ.23.60 కోట్లు ఇచ్చారు. -
YSRCP: విజయనగరం జిల్లా అభ్యర్థులు వీళ్లే
విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
గ్రూపులతో గుంజాటన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ఎవరికివారే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొత్తగా పా ర్టీలో చేరినవారికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటం పాతనేతలకు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. నాటి నుంచి ఇక్కడి టీడీపీ నాయకులు జనానికి ముఖం చాటేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారన్నది అగమ్యగోచరమే. విజయనగరంలో మూడు ముక్కలాట... విజయనగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. దశాబ్దాలుగా పా ర్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్కు ఇంటా, బయటా వర్గపోరు తప్పట్లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు తాజాగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారులుగా చేరారు. ఈ ఇద్దరి పోకడ అశోక్కు, ఆయన కుమార్తె అదితికి సుతరామూ ఇష్టం లేదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎటువంటి సామాజిక బలం, ఓటుబ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేద్దామన్న ఆలోచనతో వాజీ సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మరోవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నవారి జాబితాలో మీసాల గీత తర్వాత వాజీ శ్రీనివాసరావు చేరారు. ఆ ఇద్దరి నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికీ వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీచేశారు. బేబినాయనకు కేడర్ సమస్య బొబ్బిలిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన)కే టికెట్ లభిస్తుందనేది అందరి మాట. ఆయన సోదరుడు సుజయ్కృష్ణ రంగారావు సీన్లోకి వస్తే సీటు తన్నుకుపోతాడనే భయం బేబీనాయన అనుచరుల్లో ఉంది. కానీ మండలాల్లో కేడర్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అన్నిచోట్లా గ్రూపు తగాదాలున్నాయి. రామభద్రపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటా్నయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కళా, ప్రతిభల మధ్య నలుగుతున్న కోండ్రు రాజాం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న కోండ్రు మురళీమోహన్కు అక్కడి సీనియర్ నేతలైన కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి వర్గాలతో తెగని పేచీ ఉంది. ఇప్పటికే రేగిడి మండలంలో కళా వెంకటరావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు కోండ్రుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజాం మండలం పొగిరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ జడ్డు విష్ణుమూర్తి కోండ్రు ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికీ రావట్లేదు. మరోవైపు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఈసారి తనకు ఎలాగైనా రాజాంలో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశలో పావులు కదుపుతున్నారు. కోళ్లకు కృష్ణ సెగ శృంగవరపుకోటను మొదటి నుంచీ ఏలుతున్న కోళ్ల కుటుంబానికి గొంప కృష్ణ రూపంలో సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తానే సీనియర్ననీ... లోకేశ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పుకుంటుండగా చంద్రబాబు అండతో ప్రవాస భారతీయుడు గొంప కృష్ణ వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు లలితకుమారి ప్రతి గ్రామానికి వెళ్లి బంధువుల ఇళ్లల్లో ఆంతరంగిక సమావేశాలు పెడుతున్నారు. నెల్లిమర్లలో అంతా అయోమయం నెల్లిమర్ల టీడీపీ టికెట్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగార్రాజుకు ఖరారైనట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా మరో ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డెంకాడ మండలానికి చెందిన కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ మండలానికి చెందిన పతివాడ తమ్మునాయుడు, నెల్లిమర్ల మండలానికి చెందిన కడగల ఆనంద్కుమార్ ఉన్నారు. బంగార్రాజు స్పీడుకు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వర్గీయులు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవికే అవకాశం ఉంటుందన్న ప్రచారమూ లేకపోలేదు. నిమ్మకకు పెరిగిన అసమ్మతి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణకు సొంత పా ర్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. ఆయనకు పోటీగా పడాల భూదేవి, వంగర మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు తేజోవతి కళా వెంకటరావు ప్రోత్సాహంతో టికెట్ కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన టీడీపీ నాయకులైన సామంతుల దామోదరరావు, ఖండాపు వెంకటరమణ తదితరులు నిమ్మక తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు భూదేవికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. వీరికి అచ్చెన్నాయుడు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారాలవల్ల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. నాయుడు పక్కలో బల్లెంలా ‘కరణం’ గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీకి అంతా తానే అని భావిస్తున్న కేఏ నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పక్కలో బల్లెంలా మారారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆమె కూడా పొత్తులో భాగంగా తనకే టికెట్ కేటాయించాలని యత్నిస్తున్నట్టు తెలిసింది. గంటా పేరుతో గందరగోళం చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నా చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. గంటా ఇక్కడ పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పనిసరైతే స్థానిక కేడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అంతో ఇంతో కేడర్ బలమున్న కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజుకు ప్రతిసారీ పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ఆయన స్తబ్దుగానే ఉన్నారు. కురుపాంలో కుమ్ములాట... కురుపాంలో టీడీపీ టికెట్ కోసం ఎనిమిది మంది కుమ్ములాడుకుంటున్నారు. తోయక జగదేశ్వరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇప్పించడంలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కీలక పాత్ర పోషించారు. ఇది నచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు మరో ఏడుగురు ఆశావాహులను తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రదీప్కుమార్ దేవ్ తనయుడు వీరేశ్దేవ్ కూడా టికెట్కోసం అశోక్ గజపతి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్వతీపురంలో తెరపైకి ఎన్నారై దశాబ్దాలుగా పా ర్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఇక్కడ డబ్బు పెట్టగలిగిన ప్రవాస భారతీయుడు బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్న బాబు హామీతో చిరంజీవులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అంత ఉత్సాహం అయితే ఆయనలో కనిపించడం లేదు. మరో సీనియర్ నాయకుడు గర్భాపు ఉదయభానుకు చంద్రబాబు గత రెండు ఎన్నికలుగా మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సాలూరులో ఆగని వర్గపోరు... సాలూరులో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్.కె.భంజ్దేవ్ మధ్య వైరం కొనసాగుతోంది. ఇరువురూ బయటకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా... ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చలేని అధిష్టానం ఇక్కడ కూడా ఓ ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
నకిలీ రిజిస్ట్రేషన్లు.. టీడీపీ నేతల భూకబ్జా
-
పోలిపల్లిలో కబ్జా గళం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రూ.వందల కోట్ల విలువైన భూములు అవి. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూ దందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేశ్ సభతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు 27లో 45 ఎకరాలున్న ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లోనే మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములను కాజేసేందుకు తిరుమలరెడ్డి ఆదినారాయణ, అతడి కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధ్రువపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్కు, మిగతా ఐదు ఎకరాలను కోనేరు కరుణాకరరావుకు 2000లో విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ఆర్డీవో నాగేశ్వరరావు ఆ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దారు, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని 2005లోనే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందిన సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ కాజేసిన వైనాన్ని ‘సాక్షి’ జిల్లా ప్రతినిధి ఇప్పటికే బట్టబయలు చేశారు. బినామీ బాగోతం ఇలా... విలువైన భూములను కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బినామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమలరెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు! పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1.2.2000వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో సబ్రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్లో పెట్టారు. దీంతో నకిలీ పాసుపుస్తకం, టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31.3.2000న సబ్రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు. చుట్టూ తిరిగి పులవర్తికే.. పట్టాదారు పుస్తకం, టైటిల్ డీడ్స్పై అనుమానం కలగడంతో కొనుగోలుదారులైన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకరరావు ఆర్డీవోను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణను అడ్డుకుని కొనుగోలుదారులతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబుకు విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకరరావు నుంచి నాలుగు ఎకరాలను సుబ్రహ్మణ్యమే స్వయంగా తన పేరున, మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలా చుట్టూ తిరిగి మొత్తం పది ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది! మారణాయుధాలతో దాడులు.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమలరెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్పై విచారణ మొదలైంది. అవేవీ భోగాపురం తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీవో, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించినా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు, అమనాం, రావాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీమూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వారిని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మూకలు మారణాయుధాలతో ఆ భూమిలోనే తిష్ట వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఎస్పీగా పని చేసిన ఓ పోలీసు అధికారి భార్య పేరిట 2.43 ఎకరాలు, ఆయన బావమరిది పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సలహాదారుడిగా వ్యవహరించడం భూముల కబ్జాలో ఆ పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆక్రమణదారుల కోసమేనా యువగళం టీడీపీకి చెందిన భూ ఆక్రమణదారులు, అక్రమార్కులకు కొమ్ము కాయటానికే లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లుగా ఉంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు భోగాపురం మండలంలో పలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్క పోలిపల్లి గ్రామ పరిధిలోనే రూ.వందల కోట్ల విలువైన భూములను రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా లోకేష్ నిస్సిగ్గుగా అదే చోట యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు, పెత్తందారులకు టీడీపీ కొమ్ము కాస్తున్నట్లు దీన్నిబట్టి రుజువవుతోంది. తీరు మారని టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు -
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. -
విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయనగరం: లక్కవరపు కోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఉదయం టీ కాచుకునే సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి రణస్థలం: మండలంలోని పైడిభీమవరం ఏపీటోరియా (అరబిందో) పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ఎలక్ట్రీషియన్ మహంతి బాలకృష్ణ(34) విద్యుత్షాక్తో మృతి చెందాడు. స్థానిక కార్మికులు, సీఐటీయూ నాయకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటోరియా పరిశ్రమలోని కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న బాలకృష్ణ శనివారం ఉదయం 9 గంటలకు జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. ఫెన్సిలిన్ ఫ్లాంట్ ప్రొడెక్షన్ బ్లాక్–1లో బ్లూవేర్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు, యాజమాన్యం సహకారంతో పరిశ్రమ అంబులెన్స్లో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపంచనామా నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస. చదవండి: వివాహేతర సంబంధం..‘నిత్యా, నా భర్తను వదిలేయ్’ -
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విజయనగరం జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని బొద్దాం గ్రామంలో అశేష జనవాహిని విశేష స్వాగతం మధ్య జైత్రయాత్రగా సాగింది. అడుగడుగునా జనం బస్సు యాత్రలో వచ్చిన నేతలకు అపూర్వంగా స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగున్నరేళ్లలో సాగించిన అభివృద్ధి పనులను నేతలు పరిశీలించారు. అనంతరం రాజాం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, బొత్స అప్పల నర్సయ్య,ధర్మాన కృష్ణదాస్, కళావతిలు హాజరయ్యారు. జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది- డిప్యూటీ సీఎం బూడి ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందని, వెనుకబడిన అనేక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు బాలల చదవుల బాధ్యతను జగన్ తీసుకుని తన భుజస్కందాల మీద వేసుకున్నారని, రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతాలకు పెన్షన్ రూ. 3 వేలు అందనున్నాయని, రెండు వేళ్ళు చూపిస్తున్న టీడీపీ నేతలకు మూడు వేలు అందనున్న నేపథ్యంలో మూడు వేళ్లు చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ కుటుంబంలో అనేక మార్పులుచోటు చేసుకున్నాయని, ఈ సామాజిక సాధికారత ఎవరి వల్ల సాధ్యమైందో, జగన్ ఏ విధంగా సాధికారత సాధించారో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు మంరిత మేలు: స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ వైయస్సార్ సీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సు యాత్ర సభకు ప్రజలు తరలిరావడం సీఎం జగన్ పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు నిదర్శనమన్నారు. తాండ్ర పాపా రాయుడు పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైయస్సార్ సీపీని గెలిపించారన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ప్రకటించారు. టీడీపీ హయాంలో విద్య,వైద్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేసారని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారన్నారు. అవినీతి లేకుండా లంచగొండులకు చోటు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలను జగన్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందచేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతుండటం అభివృద్ధి కాదా అని తమ్మినేని ప్రశ్నించారు. పేదలకు ఆర్థిక సాధికారత జగన్ పాలనలో కలగడంతో కొనుగోలు శక్తి పెరిగి దేశంలోని జీడీపీలో గణనీయ వృద్ధి సాధించడమే కాకుండా, అనేక రంగాల కేంద్ర సూచీల్లో కూడా మెరుగైన స్థానాల్లో రాష్ట్రం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాయని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చంద్రబాబును చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసారు. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం: ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, పార్టీకతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలకు 1970 కోట్లు రాజాం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కేటాయింపులు చేసారని అన్నారు. చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో పేదలకు అన్యాయం చేయడమే కాకుండా ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ మ్యానిఫెస్టో రూపొందించి దానిని పవిత్ర గ్రంధంగా గుర్తించి అమలు చేస్తున్నారని వివరించారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలకు చోటు లేకుండా జగన్ పాలన చేస్తున్నారని, సామాజిక సాధికారితను ప్రజలు గుర్తించి అన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. ప్రజల కోసం జగన్ ఉన్నారు.. జగన్ కోసం జనం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి బడుగుల ఆత్మాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బస్సు యాత్రను గాలి యాత్ర అని లోకేశ్ అంటున్నారని, ఇది బీసీల ఆత్మగౌరవ యాత్ర, టీడీపీ పై చేసే దండయాత్ర, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చేసే జైత్రయాత్ర అని తెలుసుకోవాలని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక అభివృద్ధి చేస్తున్న జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైందని విమర్శించారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
గిరిజన వర్సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని 562 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యూనివర్సిటీ నిర్వహణకు అవసరమైన.. విస్తరణకు అనువుగా భవనాల నిర్మాణ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల అనుమతి కోసం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి పంపించారు. తొలివిడతగా కేటాయించిన రూ.300.50 కోట్ల వ్యయంతో యూనివర్సిటీకి ప్రాథమికంగా అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. వర్సిటీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు చెందిన 20 విభాగాల్లో ప్రతి ఐదింటికి 10 చొప్పున 40 తరగతి గదులు నిర్మిస్తారు. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా 500 మందికి సరిపడేలా వసతి గృహాలు, వెయ్యి మందికి సరిపడే ఆడిటోరియం, 300 మంది సామర్థ్యం గల మరో ఆడిటోరియం, అడ్మినిస్ట్రేషన్ భవనం, సెంట్రల్ లైబ్రరీ, స్కిల్ సెంటర్, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నివాస భవనాలు 100 చొప్పున నిర్మించేందుకు వీసీ ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేలా యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త భవనాల్లోనే తరగతులు వచ్చే విద్యా సంవత్సరం కొత్తగా నిర్మించే భవనాల్లోనే తరగతులు నిర్వహించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం యూనివర్సిటీలో 8 పీజీ, 6 అండర్ పీజీ కోర్సులు నడుస్తున్నాయి. మరో రెండు కోర్సులను వచ్చే విద్యా సంవత్సరానికి కొత్తగా తీసుకొస్తాం. ఇందుకోసం 77 మంది బోధన, 89 మంది బోధనేతర సిబ్బంది అవసరం. ప్రస్తుతం బోధన సిబ్బంది 18 మంది, బోధనేతర సిబ్బంది 12 మంది వరకు ఉన్నారు. మిగిలిన పోస్టుల నియామకానికి ప్రతిపాదనలు పంపించాం. – ప్రొఫెసర్ టీవీ కట్టిమణి, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ -
నేడు శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరంలో బస్సు యాత్ర
-
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత
మాడుగుల రూరల్: ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గురువారం అందజేశారు. ప్రమాదంలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు లక్ష్మి (52) ఆదివారం రాత్రి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. విశాఖ కింగ్జార్జి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. -
13కు చేరిన మృతులు
ఆరిలోవ(విశాఖతూర్పు)/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర): విజయనగరం జిల్లా భీమాలి–ఆలమండ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. మొత్తం 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన వారిని విశాఖ కేజీహెచ్, రైల్వే, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్లో స్పెషల్ గార్డుగా ఉన్న మరిపి శ్రీనివాసరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. విశాఖ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. రైల్వే అధికారులు కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయనకు తల్లితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అమల, పీజీ చదువుతున్న కుమార్తె హర్షప్రియ, బీటెక్ చదువుతున్న కుమారుడు చంద్రదీప్ ఉన్నారు. మృతిచెందిన లోకో పైలట్ మధుసూదనరావు(ఫైల్), మృతిచెందిన పలాస ప్యాసింజర్ గార్డు శ్రీనివాసరావు(ఫైల్) శ్రీనివాసరావుది పార్వతీపురం కాగా, ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. అలాగే, రాయగడ ప్యాసింజరుకు లోకో పైలట్గా ఉన్న విశాఖ జిల్లా తంగేడు గ్రామానికి చెందిన శింగంపల్లి మధుసూదనరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సూర్యలత, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉద్యోగరీత్యా మధుసూదనరావు కుటుంబం సహా విశాఖలో ఉంటున్నారు. విశాఖ కేజీహెచ్లో ఇద్దరికి శస్త్ర చికిత్స విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురిని కేజీహెచ్కు తరలించగా.. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన నల్ల కుమారి, విశాఖ జిల్లా గాజువాక దయాల్నగర్ ప్రాంతానికి చెందిన ముర్రు లక్ష్మిలకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. నల్ల కుమారికి ఆర్థోపెడిక్ వార్డులో శస్త్ర చికిత్స అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్కుమార్ తెలిపారు. లక్ష్మికి సాయంత్రం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు అందించడానికి, పోస్టుమార్టం నిర్వహించడానికి ముగ్గురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులను విజయనగరం పంపినట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు తెలిపారు. అలాగే ఆర్థోపెడిక్ వైద్యుడు భగవాన్ను క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడానికి విజయనగరం పంపినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో 8మందిని విశాఖ తరలించారు. వీరిలో నలుగురు కేజీహెచ్లో, మరొకరు ఆరిలోవ హెల్త్ సిటీలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని రైల్వే హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో పలాస పాసింజర్ స్పెషల్ గార్డు మరిపి శ్రీనివాసరావు ఆదివారం రాత్రే మృతిచెందారు. మిగిలిన బి.తేజేశ్వరరావు, పి.శ్రీనివాసరావు రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కూడా రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఆదివారం విధులు ముగించుకుని గోపాలపట్నం నుంచి పలాస రైలులో తమ సొంత ఊరు శ్రీకాకుళం వెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు. మృతుల వివరాలు 1. కె.రవి (గొడికొమ్ము, జామి మండలం, విజయనగరం జిల్లా) 2. గిడిజాల లక్ష్మి (ఎస్పీ రామచంద్రాపురం, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 3. కరణం అప్పలనాయుడు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 4. చల్లా సతీష్ (తోటపాలెం, విజయనగరం) 5. శింగంపల్లి మధుసూదనరావు (లోకో పైలట్, ఎన్ఏడీ, విశాఖపట్నం) 6. చింతల కృష్ణమనాయుడు (గ్యాంగ్మన్, కొత్తవలస, విజయనగరం జిల్లా) 7. పిల్లా నాగరాజు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 8. మరిపి శ్రీనివాసరావు (పలాస ప్యాసింజర్ గార్డ్, ఆరిలోవ, విశాఖపట్నం) 9. టెంకల సుగుణమ్మ (మెట్టవలస, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 10. రెడ్డి సీతంనాయుడు (రెడ్డిపేట, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా) 11. మజ్జి రాము (గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 12. సువ్వారి చిరంజీవి (లోకో పైలట్, కుశాలపురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా) 13. ఒక మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. నేను విజయనగరం జిల్లా రాజాంలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండు రోజుల సెలవులకు విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం పలాస ట్రైన్ ఎక్కా. చీపురుపల్లిలో దిగాలి. ఆఖరి చివరి నుంచి రెండో బోగీలో ఉన్నాను. సాయంత్రం వేళలో రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. రైల్లోని లగేజ్ షెల్ఫ్లో ఉన్న సామాన్లు నాపై పడ్డాయి. దీంతో కంగారుపడ్డాను. ఒక్కసారిగా బోగీ 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. నేను, నా స్నేహితుడు కలిసి బోగీలోని రాడ్లను పట్టుకుని బయటకు వచ్చేశాం. – వి.అవినాష్, ఇంజినీరింగ్ విద్యార్థి, మునగపాక -
బాధితులకు భరోసా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్ : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కలి్పంచారు. విధి వంచనతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న వారికి పెద్ద కొడుకులా అండగా నిలిచి వారి కన్నీరు తుడిచి ఓదార్చారు. రైలు ప్రమాదమైనా సరే... రాష్ట్ర పరిధిలో సంభవించటంతో శనివారం రాత్రి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. సీఎం ఆదేశాలతో స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూ సోమవారం ప్రమాద స్థలానికి బయలుదేరారు. అయితే ట్రాక్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలగవచ్చని అధికారులు చెప్పటంతో అక్కడకు వెళ్లకుండా విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ నేరుగా పరామర్శించారు. మానవీయ దృక్పథంతో స్పందించి పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదం పెద్దదే అయినా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి సహకరించటంతో 24 గంటలు తిరక్కముందే ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతివ్వగలిగామని రైల్వే అధికారులు పేర్కొనటం గమనార్హం. సీఎం సైతం క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను స్వయంగా పరామర్శించి, తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ధైర్యం చెప్పారు. విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు ఢీకొనడం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస ప్యాసింజర్ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే సిబ్బంది సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రిలోను, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హుటాహుటిన చేర్చారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మానవీయ కోణంలో సకాలంలో స్పందించి ఘటన వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేయటమే కాక రాష్ట్రంలో వివిధ శాఖలను అప్పటికప్పుడు అప్రమత్తం చేసి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షించారు. ప్రతి ఒక్కరికీ పరామర్శ.. ఆదివారం అర్ధరాత్రి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో స్వల్ప గాయాలైన వారు కొందరు చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 22 మంది బాధితులకు రెండు వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ రైలు దుర్ఘటనకు సంబంధించిన చిత్రాలను చూశారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి బొత్స సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలైన వారికి ఇంకా ఏమైనా మెరుగైన వైద్యం అవసరమా అని వైద్యులను అడిగారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదని, పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు స్పష్టంగా చెప్పారు. ఉదారంగా ఎక్స్గ్రేషియా.. రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. స్వల్పగాయాలైన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. నెలరోజుల కన్నా ఎక్కువ రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారికి.. వైకల్యం కారణంగా ఉపాధి పొందలేని వారికి రూ.5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షల వరకూ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీంతో.. క్షతగాత్రుల్లో ఎవరెవరికి ఎంత ఎక్స్గ్రేషియా చెల్లించాలో నిర్ణయించేందుకు డాక్టర్లతో కమిటీ వేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఈ మొత్తాన్ని మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా అందిస్తామని చెప్పారు. సీఎం ఏరియల్ సర్వే.. వాస్తవానికి రైళ్లు ఢీకొన్న ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని సీఎం జగన్ తొలుత నిర్ణయించారు. అయితే, ట్రాక్ పునరుద్ధరణ పనులు, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ దృష్ట్యా సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్లో నేరుగా విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆసుపత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకుల పరామర్శ అనంతరం విశాఖకు తిరిగివెళ్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, శంభంగి వెంకటచిన అప్పలనాయుడు, జోగారావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్బాబు, రఘురాజు, వరుదు కళ్యాణి, విజయనగరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు ఉన్నారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలి. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదు. పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలి. క్షతగాత్రుల్లో కొంతమంది ఇంకా షాక్లో ఉన్నారు.. పూర్తిగా కోలుకున్నామని వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. మృతుడి తండ్రి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్ ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన లోకో పైలట్ సువ్వారి చిరంజీవి మృతిచెందడంతో ఆయన తండ్రి సన్యాసిరావును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. సీఎంను చూడగానే ఒక్కసారిగా సన్యాసిరావు బోరున విలపించారు. ‘ఒక్కగానొక్క కొడుకు మృతిచెందాడు.. ఈ వయసులో మాకు ఎవరు దిక్కు’.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సీఎం వెంటనే ఆయన కన్నీళ్లు తుడుస్తూ.. ‘అధైర్య పడొద్దు.. కుటుంబానికి అండగా ఉంటా’మంటూ ఓదార్చారు. కుటుంబ సభ్యుడిలా ఓదార్చారు.. వైద్యులు బాగా చూస్తున్నారా.. ఏ పనిచేస్తున్నావు.. మీది ఏ గ్రామం... దెబ్బలు ఏమైనా తగిలాయా.. అంటూ కుటుంబ సభ్యుడిలా సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను ఓదార్చారు. వైద్యులు బాగా చూసుకుంటారు, అధైర్య పడొద్దు.. మెరుగైన వైద్య సేవలు అందించమని వైద్యులకు చెప్పానని సీఎం చెప్పారు. విజయనగరం నుంచి విశాఖపట్నం కళాసీ పనికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో నేను గాయపడ్డాను. – కొల్లి ఎర్ని ఆంజనేయులు, బురదపాడు గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా ఆప్యాయంగా పలకరించి.. ఓపిగ్గా అంతా విన్నారు.. డాక్టర్లు బాగా చూసుకుంటారు.. ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అధైర్య పడొద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించి నాకు తగిలిన గాయాలు గురించి అడిగారు. నొప్పులు తగ్గాయా, ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. ఓపిగ్గా నేను చెప్పింది అంతా విన్నారు. తాపీ పనికోసం కొత్తవలస వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి రైలులో వస్తుండగా ప్రమాదంలో గాయపడ్డాను. – గదల మహాలక్ష్మినాయుడు, చుక్కవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు.. అది చాలు ఆరోగ్యం ఎలా ఉంది.. మా తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తాం. వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామని సీఎం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైద్యానికి ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. అది చాలు. – రెడ్డి రాము, ఎం.అలమండ గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా -
అవినీతి రహిత సంక్షేమాన్ని సాధ్యం చేసిన జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘సంక్షేమ పథకాలను బీదలకు నేరుగా అందించలేకపోతున్నామని గతంలో ఓ ప్రధాన మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఉన్న వారు తినేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైసా అవినీతి జరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లక్షల కోట్లు బీదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా అవినీతి రహిత సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ధర్మాన ప్రసంగించారు. గత టీడీపీ పాలనలో పచ్చ జెండా కట్టిన వాడికి, జన్మభూమి కమిటీలకు, డబ్బులిచ్చిన వారికే పథకాలు అందేవని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పుడు అర్హుడైతే చాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వివరించారు. ఎక్కడా ఏ అధికారీ, వైఎస్సార్సీపీ కార్యకర్త నయా పైసా లంచం అడిగిన దాఖలాల్లేవన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో జరిగిన భూసర్వేతో కలుగుతున్న అవస్థల నుంచి తప్పించడానికి తమ ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఏ రైతునూ సర్వే రాళ్లు, పాసు పుస్తకం కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. ఇటువంటి పరిపాలనే కదా ప్రజలు కోరుకుంటారని చెప్పారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను నమ్మించి వంచించిన చంద్రబాబు ముఠాకు ఎవరైనా ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీ పాలనలో చూపించడానికి లోపాల్లేక.. దేశమంతా పెరిగిన కరెంట్ బిల్లులు, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలను అడిగితే వాస్తవమేమిటో చెబుతారని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత దశాదిశా మార్చడానికి, ఇక్కడి పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖలో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తన పాలనలో ఏనాడూ ఏ ఒక్క మేలూ చేయకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీని ఆదరించారని, వారినే చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. బాబుకు, టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని, అన్ని వర్గాల సంక్షేమ సారథి వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి : బొత్స పజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స చెప్పారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిష్పక్షపాతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులకు, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోలేమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఈ వర్గాలకు మేలు చేకూరిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో బీసీలకు టికెట్టు ఇచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సవాలు విసిరారు. యాత్ర సందర్భంగా మీడియాతో బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు నిత్య నయవంచకుడు అని, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. -
YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..
సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సామాజిక సాధికారిత రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు సీఎం జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో రకంగా విష ప్రచారం చేయడం దారుణం’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న నాయకుడు సీఎం జగన్. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోంది. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. అర్హులందరీకి అభివృద్ది, సంక్షేమ పలాలు అందిస్తున్నాం. కులం మతం తో సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతి గ్రామం లో సచివాలయం ఏర్పాటు చేసి, నిరుద్యోగులను వాలంటర్ లు గా నియమించి ప్రభుత్వ సేవలు ఇస్తున్నాం. ప్రతి పేదవాడి మొహం లో చిరునవ్వు చూడాలని సామజిక న్యాయం చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ‘బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చింది అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను ఎవరూ అమలు చేయలేదు. జగన్ సీఎం అయ్యాక మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇచ్చారు. కుల మతాలకు సంబంధం లేకుండా అవకాశాలు కల్పించింది వైఎస్సార్సీపీ. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చింది సీఎం జగన్. బీసీలు తోక కత్తిరిస్తామని, మీ అంతుచూస్తామని చంద్రబాబు మాట్లాడారు. మరి బీసీలను అవహేళన చేసిన చంద్రబాబును నమ్ముతామా. ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు ఎస్సీ లను అవమానించారు. చంద్రబాబు మోసాలను జనం గమనించాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేసి 650 హామీలు ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజు 5 సంతకాలు చేసి రైతు రుణ మాఫీ చేయలేదు. చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ ప్రజలు బ్యాంకుల్లో అప్పులు అయిపోయారు. నాకు ఓటు వేయండి అప్పులు తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పాడు. అప్పులు తీర్చలేదు. మేం 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మోసం చెప్పాం. అందుకే మీరు మాకు ఓటు వేశారు. మేం అధికారం లోకి వచ్చాక వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడుతలు డబ్బులు వేసి నాలుగో విడత వేయడానికి సిద్దం గా ఉన్నాం. ఇది కదా మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు పాలన లో రైతులు రుణాలు తీర్చలేకపోతే బ్యాంకులు అవమానించాయి. జగన్ పాలన లో సక్రమం గా రైతు బరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసిన వాడికి ఓటు వేయవద్దు. రాజకీయాల్లో తప్పు చేసిన వాడికి ఓటు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోతాం. ఒక్కసారి జగన్కి ఓటు వేస్తే 30లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు. ఇలాంటి వారికి ఓటు వేయాలి కదా. మా ప్రభుత్వం ఏనాడు మా పార్టీకి ఓటు వేయలేదని అడగలేదు. కానీ మేం అందరికి పథకాలు ఇచ్చాం. కరెంట్ బిల్ ఈ ఒక్క రాష్ట్రం లోనే పెరిగిందా. దేశం లో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేక ధరల విషయంతో తికమక పెడుతున్నారు. అలాంటి వాళ్లని ఎదురు ప్రశ్నించండి. స్కూల్స్లో కార్పొరేట్ సదుపాయాలు కల్పించాం. పిల్లలకు సాక్స్ నుండి పుస్తకాలు, పౌష్టిక ఆహారం వరకు నాణ్యమైనవి ఇచ్చాం. పిల్లలకు ఓటు లేదని వాళ్లని వదిలేయలేదు. మంచి విద్యా అందిస్తున్నాం. ఈ వేళ చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ఎవరు. 3లక్షల 30 వేల కోట్ల పేద వాళ్లకి జగన్ అందించారు. పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చారు. మధ్య దళారీ లు లేరు. అవనీతి లేని పాలన జరుగుతుంది. గ్రామ సచివాలయాలు వచ్చాయి. మండల కేంద్రంకి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ప్రజల డబ్బు చంద్ర బాబు సొంతానికి వాడుకున్నాడని నిరూపణ అయింది. కేంద్ర సంస్థలు చెప్తే పోలీస్లు అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. ప్రజా ధనం దోచుకుంటే శిక్ష తప్పదు’ అని అన్నారు. -
భోగాపురం పనులు ‘టేకాఫ్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 5,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. 2025 నాటికల్లా ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలనేది లక్ష్యం. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణ పనులను చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు పది అడుగుల ఎత్తున ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప ముళ్లతో కూడిన కంచెను ఏర్పాటు చేయనున్నారు. పటిష్టంగా పొడవైన రన్వే.. కీలకమైన రన్వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఒక క్రమంలో లేకపోవడంతో తొలుత సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు. నేరుగా రోడ్డు అనుసంధానం... చెన్నై– కోల్కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం నుంచి, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ఎనిమిది సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ. 18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయడానికి భోగాపురం మండలంలోని ముక్కాం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సమీపంలోనే స్టాఫ్ క్వార్టర్లు... విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని అడ్డంకులను అధిగమించి... విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించాం. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. కొంతమంది రైతులకు సంబంధించిన పరిహారం కోర్టులో జమచేసింది. నాలుగు గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించింది. అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించాం. విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. – చింతా బంగార్రాజు, భోగాపురం తహసీల్దార్ -
నేడు విజయనగరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ
పార్వతీపురం/కురుపాం: వివిధ సమస్యలతో బాధ పడుతున్న వారిని కురుపాం పర్యటనలో బుధవారం సీఎం జగన్ మనసున్న మారాజుగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి చెందిన రెండేళ్ల చిన్నారి గుదే జియశ్రీకి బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ కారణంగా పెరుగుదల లోపించింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో చిన్నారి తల్లి గుదే గౌరి సీఎంకు సమస్యను విన్నవించింది. వెంటనే స్పందించిన సీఎం.. వైద్యం కోçÜం రూ.10 లక్షలు సాయం అందిస్తామని, తక్షణ సాయంగా రూ.లక్ష అందజేయాలని కలెక్టర్ నిషాంత్కుమార్ను ఆదేశించారు. బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్న పార్వతీపురంలోని రామానందనగర్కు చెందిన ఎనిమిదేళ్ల బేతా హాసిని వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, ఆదుకోవాలని బాలిక తండ్రి శ్రీనివాసరావు సీఎం జగన్కు విన్నవించారు. తక్షణ సహాయంగా రూ.3 లక్షలు అందించాలని సీఎం కలెక్టర్ను ఆదేశించారు. మరో 11 మంది కూడా సీఎంకు వారి సమస్యలు చెప్పుకున్నారు. వారందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం హామీ మేరకు బాధితులందరికీ 24 గంటలు గడవక ముందే కలెక్టర్, ప్రజాప్రతి–నిధులు చెక్కులు అందజేశారు. సీఎం ఉదారత పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాలికకు గ్రోత్ హార్మోన్ కేసులో కీలక మలుపు
విజయనగరం: జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన బాలిక గ్రోత్ హార్మోన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన తల్లి తనను శారీరకంగా, మానసికంగా వేధించేదని.. ఇంటికి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండమని, తనకు హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చి శరీరం పెరిగేలా చేసిందని.. తనను చదువుకోనివ్వకుండా టార్చర్ చేసేదని.. ఒక మైనర్ బాలిక చైల్డ్ లైన్కు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని ఆమె తల్లి చెబుతోంది. దీనికి సంబంధించి బాధిత బాలిక తల్లి ఒక వీడియోను బయపెట్టింది. తన కుమార్తెకు ఎటువంటి గ్రోత్ హార్మోన్స్, స్టెరాయిడ్స్ వంటివి ఇవ్వలేదని బాలిక తల్లి వాదిసఓతంది. తన కుమార్తెను మెడికల్ టెస్టులకు అనుమతించి వాస్తవాలు విచారించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. తన కుటుంబానికి సన్నిహితుడైన అయి వ్యక్తి బాలికను ట్రాప్ చేశాడని ఆమె ఆరోపిస్తోంది. టెన్త్లో మెరిట్ స్టూడెంట్ అయిన తన బిడ్డకు దెయ్యం పట్టిందని భూత వైద్యం పేరిట పాస్టర్ అభిషేక్ పాల్, దేవరాజ్లు పలుమార్లు లైంగిక దాడి చేశారని చెబుతోంది. వారి అఘాయిత్యం చేసిన వీడియో బయటకు వస్తుందనే కారణంతో బాలికతో చైల్డ్ లైన్కు తప్పుడు ఫిర్యాడు చేయించారని పేర్కొంది. మైనర్ బాలికపై అభిషేక్ పాల్ అనే వ్యక్తి మరో వ్యక్తి చేసిన భౌతిక దాడి దృశ్యాలు సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంఆ వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వీడియోలను పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. అదే సమయంలో అభిషేక్ పాల్, దేవరాజ్లను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, 15 ఏళ్ల కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలంటూ హార్మోన్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ను తల్లే వాడించినట్లు ఇటీవల ఒక వార్త సంచలన సృష్టించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించినట్లు బాధిత బాలిక ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూడటంతో ఆ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు -
రాష్ట్రం భానుడి భగభగలో మండుతోంది! సాదారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటె ఎక్కువగా నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీని విశ్లేషించినప్పుడు చాలా ప్రాంతాల్లో అసౌకర్య సూచికలు (డిస్కంఫర్టబుల్ ఇండెక్స్) పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ఎండ ప్రభావంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. వారం రోజుల పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. మంగళవారం 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రపురం, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. -
రైతు ఇంట ప్రకృతి పంట.. విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం
రాజాం(విజయనగరం జిల్లా): పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల సాధనకు రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని అమాంతం పెంచారు. ఫలితంగా ఆహార ఉత్పత్తులు కషితమవుతున్నాయి. ప్రమాదకరంగా మారి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మానవాళిని రక్షించేందుకు, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తిచేసేందుకు వ్యవసాయశాఖ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం సత్ఫలితాలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కారణంగా ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఆరోగ్యకర ఆహార ఉత్పత్తుల ఎగుమతికి ఆస్కా రం కలుగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడితోనే ఆదాయం సమకూరుతోంది. 33 వేల ఎకరాల్లో... జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో 33 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో కేవలం 10 పంచాయతీల్లో, పదిహేను ఎకరాల్లో ప్రారంభమైన సాగు 2022వ సంవత్సరం రబీనాటికి 33 వేలఎకరాలకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 157 పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. 32 వేల మంది రైతులు సాగులో భాగస్వాములయ్యారు. ఖరీఫ్లో 90 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి చేశారు. 390 మంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈ విధానాన్ని అమలుచేసేందుకు రైతులకు సహకరిస్తున్నారు. గ్రామాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్బీకేల సాయంతో.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. సేంద్రియ, ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తోంది. యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. సాగును లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గ్రామ పంచాయతీల్లో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చి రైతులకు రాయితీపై అందిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి, చెరకు, మొక్కజొన్న , మినుములు, పెసర, ఆముదం, నువ్వులు, వేరుశనగ, రాగులు, కొర్రలు, సామలు తదితర పంటలను ప్రకృతి సేద్యంలో రైతులు సాగుచేస్తున్నారు. ఎరువుల తయారీ చాలా సులభం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ ఎరువు తయారీ చాలా సులభం. ఆవుపేడ, వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం ప్రధానమైన ముడిసరుకులు. వీటిని తగిన మోతాదులో ప్రకృతి వ్యవసాయం అధికారులు, సిబ్బంది సలహాలతో ఒక రోజు వ్యవధిలో ఎరువులు తయారు చేయవచ్చు. అగ్ని అస్త్రం, ఘన, ధ్రవ జీవామృతాలు, భీజామృతాలు, కషాయాలు తయారుచేసి వరి, మొక్కజొన్న, చెరకు వంటి పంటలతో పాటు చిరుధాన్యాలు, కూరగాయల పంటల్లో వినియోగించవచ్చు. వీటి వలన పంటలో వైవిధ్యం కనిపించడంతో పాటు పంటపొలాలు సారవంతంగా మారి నేలల్లో ఆర్గాన్, కార్బన్ ఉత్పత్తులు పెరుగుతాయి. వీటి ఫలితంగా వచ్చే దిగుబడి ప్రతీ మనిషికి ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక పోషకాలు కలిగిఉంటాయి. మంచి ఫలసాయం మేము కూరగాయల పంటలకు ఎక్కువుగా సేంద్రియ ఎరువు, జీవామృతాలు వినియోగిస్తున్నాం. మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలు స్థానికంగానే అమ్ముడవుతున్నాయి. – పొగిరి అన్నంనాయుడు, మామిడిపల్లి, సంతకవిటి మండలం ఎరువుల వినియోగాన్ని తగ్గించాం వరి, మొక్కజొన్న పంటకు గతంలో ఎక్కువుగా యూరియా, డీఏపీలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు పశువుల గెత్తం, ఆవు పేడ, కషాయాలు, పచ్చిరొట్ట ఎరువులు వినియోగిస్తున్నాం. పంటలో చీడపీడలు తగ్గి, దిగుబడి పెరుగుతోంది. – టి.అప్పలనాయుడు, లక్ష్మీపురం, రాజాం మండలం -
పరిశ్రమలపై రాయితీల జల్లు
విజయనగరం ఫోర్ట్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు ఆర్థిక ఊతం అందిస్తోంది. రాయితీల జల్లు కురిపిస్తోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలకు విద్యుత్ను రాయితీపై సరఫరా చేస్తోంది. బిల్లుల భారం తగ్గించి అధిక ఉత్పాదకతకు తోడ్పాటునందిస్తోంది. జిల్లాలో సగానికిపైగా విద్యుత్ను వినియోగించే ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల ఆర్థిక వృద్ధికి విద్యుత్ రాయితీలు ఉపయోగపడుతున్నా యి. పరిశ్రమలు ఇలా.. జిల్లాలో 11 ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు ఉన్నాయి. ఫేకర్ ఎల్లాయీస్ లిమిటెడ్, హిరఎలక్ట్రో స్మిల్టర్స్ పీవీటీ లిమిటెడ్, ఆంజనేయ ఫెర్రో ఎల్లాయీస్ లిమిటెడ్, మీడీఏ మినరల్ దాతు ప్రైవేట్ లిమిటెడ్, మోరో ఎల్లాయీస్ పీవీటీ లిమిటెడ్, సిరి స్మిల్టర్స్ ఎనర్జీపీవీటీ లిమిటెడ్, జిందాల్ స్టేషనల్స్ లిమిటెడ్, ఆరో శ్రీ వెంకటేశ్వర స్వామి స్టీల్స్, డెక్కన్ ఫెర్రో ఎల్లాయీస్ లిమిటెడ్, శ్రీ మహలక్ష్మి స్మిల్టర్స్ పీవీటీ లిమిటెడ్, బెర్రా ఎల్లాయీస్ లిమిటెడ్ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి రూ.80 కోట్ల వరకు రాయితీ ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 80 కోట్లు వరకు విద్యుత్ రాయితీ కల్పిస్తోంది. ఏడాదికి జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు కలిపి 3,252 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. వీటిలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు 2,400 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నాయి. 852 మిలియన్ యూనిట్లు మిగతా విద్యుత్ వినియోగదారులు వినియోగిస్తున్నారు. పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదం ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు ప్రభుత్వం విద్యుత్ను రాయితీపై సరఫరా చేస్తోంది. ఏడాదికి రూ.77.93 కోట్ల విలువైన్ విద్యుత్ను రాయితీపై సరఫరా చేస్తున్నాం. ఇది పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. – పి.నాగేశ్వరరావు, విద్యుత్శాఖ ఎస్ఈ -
ప్రాణాలతో సెల్గాటం..!
విజయనగరం: వైపు పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, ఏమరుపాటుగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని, మీ భద్రత.. మీ చేతిలోనే ఉందంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. కొందరు వాహనచోదకుల్లో మార్పు రావడంలేదనేందుకు విజయనగరం పట్టణం పరిసరాల్లో శుక్రవారం ‘సాక్షి’కి చిక్కిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నవారిని చిత్రాల్లో చూడొచ్చు. -
సంబరంగా సంక్రాంతి.. ఆ ఉమ్మడి జిల్లాలో వందల కోట్ల ఖర్చు
విజయనగరం: సంక్రాంతి వచ్చింది.. ఇంటింటా సరాదాలు తెచ్చింది... కరోనా ప్రభావంతో గత రెండేళ్లు ఆంక్షలు నడుమ చేసుకున్న తెలుగింట పండగను ఈ ఏడాది మూడురోజులపాటు వైభంగా జరుపుకున్నారు. ఇళ్ల అలంకరణ, నూతన వస్త్రాలు, ప్రత్యేక వంటకాలతో పల్లెల్లో కొత్త సందడి కనిపించింది. సామాన్యుడు, సంపన్నుడనే తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వారు పండగను ఆస్వాదించారు. ఏడాదిలో మొదటిగా జరుపుకునే పండగకు ప్రత్యేక స్థానం కల్పిస్తూనే ఖర్చులోనూ అదే ప్రాధాన్యమిచ్చారు. ఈ మూడు రోజుల కోసం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు కోట్లలో ఖర్చు చేశారంటే పండగ సందడి అర్థం చేసుకోవచ్చు. నూతన వస్త్రాల కోసం రూ.250 కోట్ల పైమాటే... సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు వస్త్ర దుకాణాలకు పెద్ద పండగ వచ్చినట్టే. ఏడాదిలో చేసే వ్యాపారం ఈ ఒక్క నెలలోనే సాగుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. దీంతో వీటి వ్యాపారానికి గిరాకీ పెరుగుతుంది. విజయనగరం పట్టణంలో ‘బాలాజీ టెక్స్టైల్ మార్కెట్’లో జోరుగానే విక్రయాలు సాగాయి. సుమారు 250 వరకు బ్రాండెడ్, సాధారణ దుకాణాలుండగా.. ప్రధానంగా పిల్లల రెడీమేడ్ దుస్తులు, మహిళల చీరలు అమ్మకాలు అధికంగా సాగాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాలను నుంచి రిటైల్ వ్యాపారులు ఈ మార్కెట్కి వచ్చి నిత్యం విక్రయాలు చేస్తుంటారు. రిటైల్ వ్యాపారంతో బిజీగా ఉన్న దుకాణ యాజమాన్యులు సాధారణ వినియోగదారుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకువేసి షాపు ముందే ఆరుబయట తాత్కాలిక అమ్మకాలు చేశారు. పట్టణంలోని కన్యకాపమేశ్వరి ఆలయం కూడలిలోని ఉల్లి వీధి, గంటస్తంభం జంక్షన్, మెయిన్రోడ్డు ప్రాంతాల్లోని ప్రధాన షాపుల్లో కూడా వస్త్రవిక్రయాలు జోరుగా సాగాయి. మొత్తంగా జిల్లాలో ఈ ఏడాది రూ.250 కోట్ల వరకు వస్త్ర వ్యాపారం సాగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విందు.. వినోదాల కోసం.. కొత్త అల్లుళ్లకు మర్యాదలు, ప్రతి ఇంటా పిండి వంటలు ఘుమఘుమలతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. పండగ మూడు రోజుల పాటు మాంసాహారానికి, పిండివంటకాలు, వినోద ఖర్చుల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేయగా అందులో కేవలం మాంసాహారానికి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. కిలో మటన్ ధర రూ.800 పలికింది. గతేడాది రూ.700 ఉన్న ధర ఈ ఏడాది రూ.100 పెరిగింది. అలాగే, చికెన్ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది స్కిన్తో కలిపి రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.190 నుంచి రూ.200 వరకు పలికింది. ఇతర సరదాల కోసం రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా. పెరుగుతున్న ఖర్చు... తెలుగువారింట ఎంతో ఆడంబరంగా జరుపుకొనే సంక్రాంతి పండగ ఖర్చు ఏటేటా పెరుగుతోంది. శుభకృతనామ సంవత్సరంలో జనవరి 14, 15, 16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరుపుకున్న పండగ కోసం రూ.కోట్లలో ఖర్చయినట్లు వ్యాపార వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో 166 మద్యం దుకాణాలు ఉండగా... బార్లు 31 వరకు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన పక్షం రోజుల్లో సుమారు రూ.25 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. విలాసాలు, ఆడంబరాలకు జనం వెనుకాడకుండా మరో రూ.20కోట్లు వరకు ఖర్చుచేసినట్టు అంచనా. ప్రయాణ ఖర్చు రూ.4 కోట్ల పైమాటే.. వివిధ ప్రాంతాల నుంచి పండగకు పల్లెలకు చేరుకున్న వారు గతవారం రోజుల్లో సుమారు రూ.4 కోట్లు వరకు ఖర్చు చేశారు. విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, ఎస్.కోట డిపోల్లో సుమారు 560 ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండగా... సాధారణ రోజుల్లో రూ.40 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. కేవలం విజయనగరం జిల్లా కేంద్రం నుంచి విజయవాడ, హైదరాబాద్కు 14 సర్వీసులు నిర్వహించగా... సాధారణంగా నడిపే 111 సర్వీసుల నుంచి ççపండగ నేపథ్యంలో రూ.2 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంచనా. వ్యక్తిగత వాహనాలపై రాకపోకలకు మరో రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా. భక్తజన జాతర.. వేపాడ: విజయనగరం జిల్లాలో సంక్రాంతి, కనుమ పండగలు వైభవంగా జరిగాయి. కనుమ పండగను పురస్కరించుకుని సోమవారం పలు గ్రామాల్లో నిర్వహించే తీర్థాలకు జనం పోటెత్తా రు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వేపాడ మండలం కొండగుళ్లు బ్రహ్మాలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతర జనసంద్రాన్ని తలపించింది. జాతరలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను అలరించాయి. -
వెదురుతో ఆదరువు.. చేతిపనికి సాంకేతికత జోడింపు
రాజాం (విజయనగరం జిల్లా): వెదురుకర్రతో తయారు చేసిన బుట్టలు అందరికీ తెలిసినవే. వెదురు కర్ర తట్టల గురించి చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఇవన్నీ ఎప్పటినుంచే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్న వస్తుసామాగ్రే. అయితే వాటికి భిన్నంగా ఇదే ముడిసరుకుతో మరెన్నో వస్తువులు కూడా తయారుచేసి ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వొచ్చు. కాస్తా సాంకేతికత తోడైతే చాలు ఇదే వెదురుకర్ర ఎన్నో అధ్బుతాలు సృష్టిస్తుందని రాజాం పట్టణానికి చెందిన జీఎంఆర్ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిరూపిస్తోంది. గత ఏడాది కాలంగా రాజాం చుట్టపక్కల గ్రామాలకు చెందిన వెదురుపనివారికి వెదురుతో తయారు చేసే అందమైన వస్తుసామగ్రిపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధమే లక్ష్యంగా.. న్యూఢిల్లీకి చెందిన సైన్స్ ఫర్ ఈక్యూటీ ఎంపవర్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ (సీడ్) ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు ప్రారంభించింది. ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తుసామగ్రిలో కొన్నింటిని ప్లాస్టిక్ నుంచి దూరంచేసేందుకు చేతితో తయారీచేసే వస్తుసామగ్రిపై దృష్టిసారించింది. ఓ వైపు ప్లాస్టిక్ను నివారించేందుకు వెదురుపుల్లలతో తయారుచేసే వస్తుసామగ్రిని ప్రోత్సహించడం, మరో వైపు వాటిని తయారీచేసే కులవృత్తుల చేతిపనివారికి సాంకేతికత అందించి వారి జీవన నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేసుకుంది. దేశంలోని పలు ఐటీ కళాశాలల్లో చేతి వృత్తుల వారికి సాంకేతిక నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపట్టగా రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏడాది క్రితం ఒక ప్రాజెక్ట్ ప్రారంభించింది. వెదురుకర్రలు, పుల్లలతో తయారయ్యే వస్తుసామగ్రిని మరింత అందంగా తయారీచేసే విధానాన్ని చేతిపనివారికి నేర్పుతోంది. శిక్షణకు విశేష ఆదరణ జీఎంఆర్ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంకేతిక శిక్షణకు విశేష ఆదరణ కనిపిస్తోంది. ప్రస్తుతం రాజాం, సంతకవిటి, రేగిడి, జి.సిగడాం తదితర మండలాలకు చెందిన వెదురుపనివారు ఈ శిక్షణ వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. ఒక వ్యక్తికి 25 రోజులు శిక్షణ ఇస్తుండగా, శిక్షణ సమయంలో రోజుకు రూ. 200లు స్టైపెండ్ ఇస్తున్నారు. శిక్షణ బాగా సద్వినియోగం చేసుకున్నవారు సొంతంగా మెషీన్లు కొనుగోలుచేసేవిధంగా బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణను పూర్తిగా వెదురుపని తెలిసిన శిక్షకుల ద్వారా ఇప్పించడంతో పాటు శిక్షణలో మెలకువలు నేర్చుకుని, బాగా వస్తుసామగ్రి తయారు చేస్తున్నవారితో కూడా కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. సీడ్ ప్రాజెక్ట్లో బాగంగా తయారీచేస్తున్న వెదురు వస్తుసామగ్రి చాలా అందంగా, అపురూపంగా దర్శనమిస్తోంది. టీ, కాఫీ కప్పులు, ట్రేలు, సజ్జలు, ఫ్లవర్ బొకేలు, కూజాలు, దుస్తులు పెట్టే తొట్టెలు, చిన్నారుల ఊయల తొట్టెలు, పెన్నుల స్టాండ్లు, బట్టల స్టాండ్లు ఇలా వినూత్న వస్తుసామాగ్రి రూపొందుతోంది. ఇవన్నీ ప్లాస్టిక్ రహిత వస్తుసామగ్రి కావడంతో పాటు పర్యావరణ హితమైనవి. ఎటువంటి విద్యార్హత లేకున్నా వెదురుపనితెలిసి, 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్నవారు ఇక్కడికి శిక్షణకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. విడతల వారీగా.. జీఎంఆర్ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాల్లో భాగంగా చేతివృత్తుల వారికి సాంకేతికతను అందిస్తున్నాం. ఓ వైపు చేతివృత్తుల వారికి మెలకువలు నేర్పడంతో పాటు మరో వైపు ప్లాస్టిక్ వస్తుసామగ్రి వినియోగం తగ్గించడం లక్ష్యంగా ఈకార్యక్రమం జరుగుతోంది. ఒక బ్యాచ్కి 20 మంది వరకూ శిక్షణ ఇస్తున్నాం. విడతల వారీగా, వెదురుపనివారికి ఖాళీగా ఉన్న సమయంలో ఈ శిక్షణ ఇస్తున్నాం. – డాక్టర్ పీఎన్ఎల్ పావని, కో ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్ఐటీ చాలా మంచి ప్రాజెక్ట్ చేతివృత్తి చేసుకునేవారిలో నైపుణ్యం మెరుగుపరిచేందుకు, వారికి సాంకేతికత అందించేందుకు సీడ్ సాయంతో వెదురుపనిచేసే చేతివృత్తుల వారికి శిక్షణ శిబిరం ఏర్పాటుచేశాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని వెదురుపనివారికి అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. – డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ప్రాజెక్ట్ ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్ఐటీ, రాజాం -
విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ విస్తృత సమావేశం
-
Vizianagaram: భూముల రీసర్వేలో కొత్త అంకం ప్రారంభం
బొబ్బిలి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం కింద విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో కొత్త అంకానికి జిల్లా అధికార యంత్రాంగం తెరతీసింది. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెలాఖరులోగా భూహక్కు పత్రాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. పాస్ పుస్తకాలను ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ కేంద్రాలకు సరఫరా చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని రైతులకు అందజేయనుంది. సర్వే ఇలా... జిల్లాలో 983 గ్రామాల్లోని భూములను రీసర్వే చేయాల్సి ఉంది. తొలుత రామభద్రపురం మండలం మర్రి వలసలో సర్వే ప్రక్రియను పాలకులు ప్రారంభించారు. అధునాతన పరికరాలతో డ్రోన్ సర్వే చేపట్టి, తరువాత క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బంది హద్దులు నిర్ణయిస్తున్నారు. రైతుల సమక్షంలో వివాదాలు లేకుండా సర్వే పూర్తిచేస్తున్నారు. విస్తీర్ణంను పక్కాగా నిర్ధారిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి భూముల వివరాలను స్కానింగ్, కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు. 179 గ్రామాల్లో సర్వే పూర్తి... జిల్లాలోని 4.84 లక్షల చదరపు కిమీల పరిధిలో రీసర్వే చేయాల్సి ఉంది. నేటి వరకు సర్వే, రెవెన్యూ అధికారులు 179 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. అందులో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రీసర్వే పూర్తయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం తదితర డివిజన్లలో ఒక్కో డివిజన్లో ఐదేసి గ్రామాల చొప్పున ముందుగా జగనన్న భూ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు ఆయా డివిజన్లకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. వివాదాలకు తావులేకుండా... జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాల్లో క్యూర్ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారు. క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రైతు తమ భూముల సమస్త వివరాలనూ తెలుసుకోవచ్చు. భూ యజమాని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయి. రైతులు, యజమానులు ఎటువంటి ఆందోళన, సందేహాలకు గురికానవసరం లేదు. అన్ని వివరాలతో ఉన్న హక్కు పత్రాలను పొందేలా అధికారులు ఈ హక్కు పత్రాలను సిద్ధం చేశారు. విడతల వారీగా రైతులకు ఈ పత్రాలు అందజేయనున్నారు. పొరపాట్లు దొర్లితే మ్యుటేషన్కు అవకాశం.. అత్యధిక గ్రామాల్లో ఒకే సారి హద్దుల గుర్తింపు, విస్తీర్ణం, రీసర్వే ప్రాంతాలు ఒకే సారి చేపట్టడం వల్ల ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లితే దానిని మ్యుటేషన్ ద్వారా సరిదిద్దుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూముల రీ సర్వేలో 480 సర్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. త్వరలోనే పంపిణీ చేస్తాం రీసర్వేకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న గ్రామాల భూ హక్కు పత్రాలు ముద్రించి కార్యాలయానికి వచ్చాయి. అన్ని డివిజన్ కార్యాలయాలకూ ఈ హక్కు పత్రాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు తేదీ నిర్ణయిస్తే వాటిని రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – పి.శేషశైలజ, ఆర్డీఓ, బొబ్బిలి -
మహిళల పారిశ్రామిక అభ్యుదయం.. పరిశ్రమల స్థాపనకు ముందడుగు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంటికి దీపం ఇల్లాలు అనేది నానుడి. ఇప్పుడు ఇంటికే కాదు సమాజాభివృద్ధిలో మహిళలు కీలకమయ్యారు. ఏ రంగంలో అడుగుపెట్టినా నిరంతర కృషితో, ఒడుదొడుకులను ఎదుర్కొనే సామర్థ్యంతో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు పారిశ్రామికం రంగంలోనూ తామే కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా ఒంటిచేత్తే విజయాలను అందుకుంటున్నారు. సంక్షేమ పథకాల్లోనూ, రాజకీయ పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పారిశ్రామిక రంగంలోనూ అదే తరహాలో ప్రోత్సహిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు స్థలంతో పాటు రుణాల మంజూరుకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. పెట్టుబడిలో రాయితీలు కల్పిస్తోంది. సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తోంది. మరెక్కడా లేనివిధంగా కొత్తవలస మండలం రెల్లి వద్ద 159 ఎకరాల్లో మహిళలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అనేకమంది మహిళలు పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు అవుతున్నారు. పదిమందికీ ఉపాధి కల్పిస్తూ పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 37 భారీ, మెగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో 18,202 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో మహిళా భాగస్వామ్యం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో కొత్త పరిశ్రమలకు మార్గం సుగమమైంది. రూ.4,460 కోట్ల పెట్టుబడితో మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో అనుమతులు మంజూరు కావాల్సి ఉంది. అవి కార్యరూపంలోకి వస్తే 19,038 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరో 2,883 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో ఎక్కువ మంది మహిళలే. ఆ పరిశ్రమల ద్వారా ప్రస్తుతం 41,175 మందికి ఉపాధి లభిస్తోంది. జిల్లా కలెక్టర్గా ఎ.సూర్యకుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహికులకు ప్రత్యేకంగా జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా 2,370 వరకూ దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2,296 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. ఆయా లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను డీఐసీ అధికారులు అందిస్తున్నారు. కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో 70.41 ఎకరాలు, రామభద్రాపురం మండలం కొటక్కి గ్రామం వద్ద 187.08 ఎకరాలు, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలం జి.చోడవరం గ్రామంలో 155.92 ఎకరాల్లో కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసమే ప్రత్యేకంగా కొత్తవలస మండలంలోని రెల్లి గ్రామం సమీపంలో 159 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ 15 శాతం నుంచి 45 శాతం వరకూ ఇస్తోంది. భూమి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, భూమి తనఖాకు 100 శాతం రాయితీ కల్పిస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళలకు ఏపీఐఐసీ ప్లాట్లలో 50 శాతం రాయితీ ఇస్తోంది. వీటితోపాటు భూమి మార్పిడి చార్జీలు, విద్యుత్ వినియోగం, వడ్డీ రీయింబర్స్మెంట్పై రాయితీలు కల్పిస్తోంది. అమ్మకపు పన్ను, సీడ్ కాపిటల్పై 50 నుంచి శత శాతం రాయితీలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకంతో పరిశ్రమ పెట్టా... ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకుల్లో అదీ తక్కువ నీటి వినియోగంతో చేపల పెంపకాన్ని కువైట్లో చూశాను. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ (ఆర్ఏఎస్)లో నీటి పునర్వినియోగమవుతున్న తీరు నన్ను ఆకర్షించింది. అలాంటి పరిశ్రమను పెట్టాలనే ఆలోచనతో తమిళనాడులో శిక్షణ తీసుకున్నాను. జిల్లాకు వచ్చిన తర్వాత నా ప్రాజెక్టు రిపోర్టును చూసి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలాకుమారి, ఎస్బీఐ భోగాపురం శాఖ మేనేజర్ లక్ష్మి ఎంతో ప్రోత్సహించారు. గత ఏడాది నిర్వహించిన ఎస్బీఐ క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చేతుల మీదుగా రుణమంజూరు చెక్కును అందుకున్నాను. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు పీఎంఎంఎస్వై పథకంలో 60 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – కేవీ నాగమణి, ఆర్ఏఎస్ యూనిట్ యజమాని, పోలిపల్లి, భోగాపురం మండలం వంద మందికి ఉపాధి కల్పనే లక్ష్యం... మనం బతకడమే కాదు పదిమందిని బతికించడంలోనే ఆనందం ఉంది. స్వతహాగా పిండివంటల తయారీపై అభిలాష ఉండేది. బెలగాంలోని మా ఇంటిలోనే ఎనిమిదేళ్ల క్రితం వివిధ రకాల పిండివంటల తయారీని వ్యాపారాత్మకంగా ప్రారంభించాను. నలుగురికి ఉపాధి కల్పించాను. వినియోగదారుల ఆదరణ పెరగడంతో తయారీని పెంచాం. ప్రస్తుతం 45 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తున్నాను. ఫుడ్గార్డెన్ స్టాల్ ప్రారంభించిన తొలిరోజుల్లో కాస్త ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబెట్టాను. ఈ పరిశ్రమను మరింత విస్తరించి వంద మందికి ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం. – బి.కన్యాకుమారి, ఫుడ్గార్డెన్ యజమాని, పార్వతీపురం 18 మందికి ఉపాధి కల్పిస్తున్నా... వ్యాపార రంగంలో అడుగుపెట్టి పది మందికి ఉపాధి చూపించాలని తొలి నుంచి ఆలోచించేదాన్ని. 2012 సంవత్సరంలో రూ.75వేల పెట్టుబడితో టెక్ట్టైల్స్ వ్యాపారం ప్రారంభించాను. మూడేళ్లలో వచ్చిన లాభంతో గంట్యాడ మండలం నందాం గ్రామంలో 75 సెంట్ల స్థలం కొన్నాను. జిల్లాలో అత్యధికంగా పండే మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా కార్టూన్ బాక్స్లు అవసరం. వాటిని తయారుచేసేందుకు శ్రీసాయిసుధా కోరుగేటెడ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 2017లో పరిశ్రమను బ్యాంకు రుణం రూ.1.50 కోట్లతో ప్రారంభించాను. 2018 నుంచి ఉత్పత్తి మొదలైంది. రూ.40 లక్షల టర్నోవర్ వచ్చింది. తర్వాత సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఏటా కోటి రూపాయల టర్నోవర్ స్థాయికి చేరుకున్నాను. 18 మందికి సాంకేతిక అవగాహన కల్పించి ఉపాధి ఇస్తున్నాను. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్గానిక్ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నాను. – బి.సుధార్చన, పారిశ్రామికవేత్త, నందాం, గంట్యాడ మండలం -
విజయనగరం విశాల్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాదం
-
విజయనగరం : భక్తిశ్రద్ధలతో పైడితల్లి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
ఆకలి తీర్చుతున్న ఫుడ్ బ్యాంకులు
పారబోసిన ప్రతీ మెతుకుతో మరొకరి ఆకలి తీర్చవచ్చన్న మాట.. విజయనగరంలోని పాలకులు, అధికారులు, దాతల్లో ఓ కొత్త ఆలోచనను పుట్టించింది. ఫుడ్ బ్యాంకుల ఏర్పాటుకు నాంది పలికింది. ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా పేదలకు పట్టెడన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్ బ్యాంకులను సంప్రదిస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని, ఆహారాన్ని సమకూర్చుతున్నారు. పట్టణానికి వచ్చే అభాగ్యులు.. స్థానికంగా నివసించే పేదల ఆకలి తీర్చడంలో భాగస్వాములవుతున్నారు. అన్నదాన క్రతువును నిరంతరాయంగా కొనసాగించేందుకు తమవంతు సహకరిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2018 సంవత్సరం జూలై 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరంలో రెండు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రూ.5కు భోజనం పెట్టేవారు. మిగతా ఖర్చును ప్రభుత్వం నిర్వాహకులకు చెల్లించేది. అందుకే రోజూ తినేవారి సంఖ్య 125 నుంచి 150 వరకు ఉంటే... లెక్కల్లో మాత్రం 250 నుంచి 300 వరకు చూపించేవారనే ఆరోపణలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా ఉచితంగా అన్నంపెట్టే ఫుడ్ బ్యాంక్లు విజయనగరంలో నాలుగుచోట్ల విజయవంతంగా పనిచేస్తున్నాయి. కరోనా తర్వాత గత ఏడాది ఆగస్టు 13 నుంచి రోజూ కనీసం 400 మంది ఆకలి తీర్చుతున్నాయి. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహకారం అందిస్తున్నారు. సేవాభావంతో సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: దానాల్లో అన్నదానం గొప్పదనేది నానుడి. అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఓ యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి చొరవతో ప్రతిపాదించిన ఫుడ్బ్యాంకులపై కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. అలా ప్రయోగాత్మకంగా నాలుగు ప్రాంతాల్లో ఫుడ్బ్యాంకులు ఏర్పాటయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, కోట జంక్షన్, ఎన్సీఎస్ థియేటర్ రోడ్, పోలీస్ బ్యారక్స్ ప్రాంతాల్లో 2021, ఆగస్టు 13వ తేదీ నుంచి నిరాటంకంగా పేదల ఆకలిని తీర్చుతున్నాయి. ఆ ఫుడ్ బ్యాంకుల నిర్వహణకు వీలుగా ఒక్కోటి రూ.85వేల ఖర్చుతో షెడ్లను నిర్మించారు. దాతలు అందించే ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేశారు. ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.... నగరానికొచ్చే పేదలెవరైనా సరే ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేకుండా నాలుగు ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని అందిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను పలు స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నాయి. కోట కూడలి వద్ద గల ఫుడ్బ్యాంక్ను హోటల్ అసోసియేషన్, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఫుడ్బ్యాంక్ పంచముఖ ఆంజనేయస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎన్సీఎస్ థియేటర్ వద్ద గల ఫుడ్బ్యాంకును జిల్లా గౌరీ సేవా సంఘం, పోలీస్ బ్యారక్స్ వద్ద గల ఫుడ్బ్యాంకు కన్యకాపరమేశ్వరి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో సాగుతోంది. ఈ నాలుగు ఫుడ్బ్యాంకుల ద్వారా రోజూ కనీసం 400 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలు, వివా హ వార్షికోత్సవాలు ఇతరత్రా శుభకార్యాల సందర్భాల్లో అన్నదానం చేయాలనుకునేవారికి ఫుడ్బ్యాంకుల్లో అవకాశం కలి్పస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో తెరిచిన రెండు అన్నా క్యాంటీన్లు పేదలకు తిండి పెట్టే మాటేమోకానీ పలు అక్రమాలకు నెలవయ్యాయి. విజయనగరం మున్సిపల్ కార్యాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్ష ప్రాంతాల్లోని అన్నా క్యాంటీన్లలో రోజూ భోజనం తినే వారి సంఖ్య 125 నుంచి 150 వరకు ఉంటే... లెక్కల్లో మాత్రం 250 నుంచి 300 వరకు చూపించేవారనే అపవాదు మూటగట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అన్నా క్యాంటీన్ల పేరిట హడావుడి చేస్తున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరానికి ఏదో ఒక పనికోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చే పేదలకు ఉచితంగా ఆకలి తీర్చాలనేది ఫుడ్బ్యాంకుల లక్ష్యం. నాలుగు ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడం శుభ పరిణామం. – రెడ్డి శ్రీరాములునాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ -
విజయనగరం కోటలో అలజడి: ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది?
ఆ కోటలో రాజుగారికి తిరుగు లేదు. ఆ వూరిలో రాజుగారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కాని కొద్ది రోజులుగా రాజు మీద తిరుగుబాటు మొదలైంది. పార్టీలో పోరు ప్రారంభమైంది. అధినాయకత్వం రాజు వెంట... కార్యకర్తలు బీసీ నేత వెంటా నడుస్తున్నారు. ఇంతకీ ఆ రాజు ఎవరో..ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది? విజయనగరం కోటలో అలజడి రేగింది. గత ఎన్నికల వరకు విజయనగరం జిల్లాలో పూసపాటి వారి మాటకు ఎదురు లేదు. వారు చెప్పిందే చట్టం. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ రాజుగారి మాటే తెలుగుదేశం పార్టీలో వేదంగా కొనసాగుతోంది. 2014లో విజయనగరం అసెంబ్లీ సీటుకు టీడీపీ తరపున పోటీ చేసిన మీసాల గీత విజయం సాధించారు. ఆమె ఇటీవల రాజుగారికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. 2014లో అశోక్గజపతి రాజు లోక్సభకు పోటీ చేయగా... మీసాల గీత అసెంబ్లీకి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. గత ఎన్నికల్లో గీతకు సీటు ఇవ్వలేదు. లోక్సభకు అశోక్గజపతి, అసెంబ్లీకి ఆయన కుమార్తె పోటీ చేశారు. ఇద్దరు ఓడారు. వచ్చే ఎన్నికల్లో మీసాల గీత.. తనకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ను, బీసీల జనాభా సంఖ్యను ఆధారాలతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె అందించారు. అలాగే చూద్దాం అంటూ ఆమెకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తర్వాత అశోక్ చెప్పిన మాటే వింటున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అసలే జిల్లాలో పార్టీ వీక్గా ఉందంటే ఇదేం గొడవ అని తలలు పట్టుకుంటున్నారు. ఈ గొడవలన్నీ ఇలా ఉండగానే.. కోట బయట మీసాల గీత పార్టీ ఆఫీస్ పెట్టగా దాన్ని అశోక్ తొలగించారు. ఆపై తన దివాణంలోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో కూడా గీత మాట చెల్లలేదు. చంద్రబాబు గోడ మీద కూర్చుని వినోదం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఉన్న బీసీల జనాభాను కులాలవారీగా ఫ్లెక్సీల రూపంలో పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటయ్యాయి. రాజుగారి కోట బయట కూడా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవై వేల మంది ఉన్నారని.. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో వెలసిన ఫ్లెక్సీలు పట్టణంలో కలకలం రేపాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం ఎటాక్ ప్రారంభించింది. అయితే జిల్లాలో అశోక్గజపతి రాజు మాట కాదని చంద్రబాబు ఏమీ చేయలేరనే విషయం అందరికీ తెలుసు. 2014లో గెలిచినప్పటికీ తనకు 2019లో మెండి చేయి చూపిన టీడీపీ అధినాయకత్వం మీద మీసాల గీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. -
రైతుల సహకారంతోనే... పోలవరం కాలువ నిర్మాణం
లక్కవరపుకోట (కొత్తవలస, విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బి.సుదర్శనదొర కోరారు. మండలంలోని చీపురవలస గ్రామంలో భూములు కొల్పోతున్న రైతులతో అభిప్రాయ సేకరణ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కాలువ నిర్మాణానికి సహకరిస్తే 3లక్షల ఎకరాలకు సాగునీరు, 8 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. భూములు కొల్పోయే రైతులకు సంతృప్తికరమైన పరిహారం అందజేస్తామని ప్రకటించారు. చీపురవలసలో 95 ఎకరాల భూమి కాలువ నిర్మాణానికి అవసరమని పేర్కొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ కాలువ నిర్మాణం జరిగే ప్రాంతంలో పంట పొలాలకు దారి, సాగునీరు మాటేమిటని ప్రశ్నించారు. ఇక్కడ సెంటు భూమి లక్ష రూపాయలకు పైగా ధర పలుకుతోందని, ఆ మేరకు పరిహారం అందజేయాలని కోరారు. లేదంటే కాలువకు ఎంత భూమి కొల్పోతున్నామో అంతే భూమి వేరొక చోట ఇచ్చినా సమ్మతమేనని అభిప్రాయం తెలిపారు. ఈ మేరకు రైతు పోరాట సమితి నాయుకులు చల్లా జగన్, మద్దిల రమణ, గాడి అప్పారావు వినతిపత్రాన్ని అందజేశారు. రైతుల వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా నని సుదర్శనదొర తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం.హర్షవర్ధిని, పోలవరం ప్రాజెక్టు ఏఈలు సి.విజయలక్ష్మి, సర్పంచ్ మచ్ఛ ఎర్రా రామస్వామి, వైఎస్సార్ ïసీపీ నాయకులు లెంక రమన్నపాత్రుడు, రైతులు పాల్గొన్నారు. -
విజయనగరం జిల్లాలో టైగర్ టెన్షన్
-
రెండోసారి కెమెరాకు చిక్కిన రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు నెలల్లో రెండోసారి రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి) అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని పులిగొమ్మి గ్రామ శివారులోని తోటలో ఆదివారం ఆవును చంపేసింది. ఆ కళేబరం వద్ద అటవీశాఖ అధికారులు నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. మిగిలిన కళేబరాన్ని తీసుకెళ్లేందుకు సోమవారం రాత్రి ఆ ప్రాంతానికి పెద్దపులి వచ్చిన దృశ్యాలను కెమెరాలు చిత్రీకరించాయి. ఆ చిత్రాల విశ్లేషణ కోసం గుంటూరులోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్వో) శంబంగి వెంకటేష్ చెప్పారు. ప్రాథమిక పరిశీలన మేరకు అది మగ పులి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 4 నెలల కాలంలో కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ఆనవాళ్లు కనిపించిన పులి ఇదేనని ఒక అంచనాకు వచ్చారు. మరో ఆవు హతం... విజయనగరం జిల్లా బొబ్బిలి ఫారెస్టు రేంజ్ పరిధిలోని బొబ్బిలి–బాడంగి మండలం సరిహద్దులోని హరిజన పాల్తేరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి మరో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దాన్ని చంపేసి కళేబరాన్ని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లింది. మిగిలిన కళేబరాన్ని గురువారం ఉదయం గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆ ఆనవాళ్లను బట్టి ఉత్తర దిక్కుగా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి గ్రామాల వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. (క్లిక్: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్) -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
అమరాయవలసలో హైవేకు అడ్డంగా కంచె
మెంటాడ (విజయనగరం జిల్లా): విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం తమ నుంచి సేకరించిన నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ మెంటాడ మండలం అమరాయవలస వద్ద మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి కంచె నిర్మించింది. పరిహారం అందించే వరకు కంచె తొలగించేది లేదని హెచరీస్ యాజమాన్య ప్రతినిధులు స్థానిక విలేకరులకు తెలిపారు. రోడ్డు పనులు పూర్తవుతున్నా జాతీయ రహ దారి అధికారులు పరిహారం చెల్లించేందుకు చొరవ చూపడంలేదని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం హైవే అధికారులకు తెలియనట్టు సమాచారం. (క్లిక్: హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు) -
కొత్తవలస మండలంలో పులి సంచారం
-
సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!
‘‘కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’..అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ. పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. అప్పుడే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్ లెక్చరర్గా చేరాను. లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను. ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. పాఠాలు భోదిస్తూ... వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది. వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్ అవ్వరు. అలాగే క్లాస్కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు. పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్ను నేనేనట. గిన్నిస్బుక్ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు. మాది ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’. – బోణం గణేష్, సాక్షి, అమరావతి. ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, విజయనగరం. -
హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు
రాజాం(విజయనగరం జిల్లా): ఆ యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. రాణిస్తున్నది క్రికెట్లో. చిన్పప్పుడు నుంచి చదువులో ముందుండే కుర్రాడు.. తల్లిదండ్రులు అనుకున్నట్టే చిన్న వయస్సులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగకుండా ఊర్లోని పొలాలు, కల్లాల్లో ఆడిన క్రికెట్ ఆటపై మక్కువతో సాధన చేశాడు. శిక్షణలో రాటుదేలి హంగేరీ దేశ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆయనే.. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్. చదువులో దిట్ట.. భవానీ ప్రసాద్ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు వ్యవసాయదారులు. భవానీప్రసాద్ 1 నుంచి 7వ తరగతి వరకూ సిరిపురంలోని శివానంద హైస్కూల్లోను, 8 నుంచి 10 తరగతులను సింహాచలం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 490 మార్కులు సాధించాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురులకు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి వెయ్యికు 929 మార్కులు సాధించాడు. ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ను ఐటీ విభాగంలో పూర్తిచేశాడు. చివరి సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అక్కడ మూడేళ్లు పనిచేసిన అనంతరం టీసీఎస్లో టీమ్ లీడర్గా ఉన్నత ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాడు. కంపెనీ తరఫున హంగేరీ వెళ్లి స్థిరపడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాణిస్తూనే క్రికెట్పై దృష్టిసారించిన 30 ఏళ్ల భవానీ ప్రసాద్ ఆ దేశ జట్టులో చోటు సంపాదించాడు. బౌలర్గా రాణింపు.. చిన్నప్పుడు గ్రామంలో సరదాగా ఆడిన క్రికెట్.. భవానీ ప్రసాద్కు హంగేరీ దేశంలో విపరీతమైన క్రేజీ తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా హంగేరీ వెళ్లిన ఆయన అక్కడ బెంగుళూరుకు చెందిన సత్యదీప్అశ్వద్నారాయణ ఏర్పాటుచేసిన హంగేరీ కోబ్రా క్రికెట్ క్లబ్లో చేరాడు. ఆ దేశ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలనుంచి వచ్చి హంగేరీలో స్థిరపడినవారంతా ఆ క్లబ్లో చేరి ప్రతిభను చాటేవారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ల తరహాలో కోబ్రాక్లబ్ అక్కడ జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్లబ్లతో పోటీపడేది. ఆ పోటీల్లో 2018 నుంచి భవానీప్రసాద్ ఆడుతూ వచ్చాడు. చివరకు ఆ దేశ క్రికెట్ సెలక్షన్ కమిటీ భవానీ ప్రసాద్ను దేశ జట్టులోకి తీసుకుంది. 2021 నుంచి ఏడాది వ్యవధిలో హంగేరీ 11దేశాలతో ఆడిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. బల్గేరియాతో జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఓడిపోవాల్సిన తమ జట్టును గెలిపించాడు. దీంతో హంగేరీ టీంలో ఉత్తమ బౌలర్గా స్థానం దక్కించుకున్నాడు. జెర్సీ నంబర్–78తో ఆడుతున్న భవానీప్రసాద్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్తో ప్రత్యర్థులను హడలెత్తించడంలో దిట్ట. కుటుంబ నేపథ్యం.. భవానీ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికాగా, సోదరి స్వప్న, సోదరుడు అనీల్లు బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు ఏడాది వ్యవధిలో మరణించడం వీరిలో విషాదం నింపింది. హంగేరీకి అండగా... క్రికెట్ను ఇష్టపడనివారు, ప్రేమించనివారు ఉండరు. అందులో నేను కూడా ఒకడ్ని. చిన్నప్పుడు పిచ్చాపాటిగా క్రికెట్ ఆడేవాడిని. హంగేరీ వచ్చిన తరువాత కోచ్ సత్యదీప్అశ్వద్నారాయణ వద్ద శిక్షణ పొందాను. ప్రతిభను గుర్తించి క్లబ్ పెట్టారు. మాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హంగేరీ ఐసీసీ ర్యాంకులో 54వ స్థానంలో ఉంది. ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. మా తల్లిదండ్రులు ఆశయాలు మేరకు ఇతరులకు సాయం చేయడమే ముందున్న కర్తవ్యం. – అదపాక భవానీ ప్రసాద్, క్రీడాకారుడు -
Deputy Collector Datla Keerthi: సర్కారీ కొలువులు.. కీర్తికి సలాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ బాధ్యతల వరకూ విజయనగరంతో ఆమెకు విడదీయలేని అనుబంధం... ఇటీవల వెలువడిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తరాంధ్ర టాపర్గా నిలిచి విద్యల నగరానికి వన్నె తెచ్చారు. ఒకవైపు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే సబ్కలెక్టర్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకున్నారు. విసుగు లేకుండా 11 ఏళ్ల పాటు నిర్విరామ కృషితో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. మెటీరియల్ సౌలభ్యం అంతగా లేకపోయినా గ్రూప్–1 వంటి పోటీపరీక్షల్లో భావవ్యక్తీకరణకు మాతృభాష తెలుగు తనకు కలిసిసొచ్చిందని సగర్వంగా చెబుతున్నారు దాట్ల కీర్తి. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... టీచర్ల ఫ్యామిలీ మాది... మా స్వగ్రామం అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలంలోని రాజులనగరం. మా నాన్న దాట్ల జగన్నాథరాజు తొలుత ఎస్జీటీగా తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి పొంది రిటైర్డ్ అయ్యారు. అమ్మ నిర్మల కూడా టీచరే. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోడపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన తర్వాత చిన్న వయసులోనే టీచర్ను అయ్యాను. అలా టీచర్ల ఫ్యామిలీ మాది. కానీ మా తాతగారు కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవారు. ఆ సమయంలో గ్రామాల్లో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. అలా నాకు గ్రూప్–1 రాసి సబ్కలెక్టరు పోస్టు సాధించాలనే లక్ష్యం ఏర్పడింది. ప్రభుత్వ బడుల్లోనే చదువు... నాన్న చేయి పట్టుకొనే స్కూల్కు వెళ్లడంతో నా విద్యాభ్యాసం మొదలైంది. మా ఊరికి సమీపంలోనే ఉన్న వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో ఆయన టీచర్గా పనిచేసేటపుడు అక్కడే నన్నూ చదివించారు.ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ మాకవారిపాలెం జెడ్పీ హైసూ్కల్లో చది వాను. ఏడో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి పరీక్షలు ప్రైవేట్గా రాయించారు మా నాన్న. అలా 13 ఏళ్లకే 1997–98 బ్యాచ్లో పదో తరగతి పాస్ అయ్యాను. ఇంటర్ విద్య కోసం విజయనగరానికి... ఇంటరీ్మడియెట్ చదవడానికి తొలిసారిగా విజయనగరం వచ్చాను. శ్రీనివాస జూనియర్ కాలేజీలో బైపీసీ చదివాను. నిరీ్ణత వయసు కన్నా తక్కువ ఉండడంతో అప్పుడు ఎంసెట్ రాయడానికి నిబంధనలు అంగీకరించలేదు. బీఎస్సీ అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినా సెకండ్ ఇయర్ మళ్లీ విజయనగరం వచ్చేశాను. ఇక్కడి గాయత్రి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఆసెట్లో 3వ ర్యాంకు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీలో చేరాను. 2005లో గోల్డ్ మెడల్తో బయటకు వచ్చాను. అదే సంవత్సరం ఎడ్సెట్లో ర్యాంకు సాధించడం, 2005–06 బ్యాచ్లో బీఈడీ పూర్తి చేయడం కూడా జరిగిపోయాయి. 21 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. అధికారిగా శిక్షణ కూడా విజయనగరంలోనే... బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఎనిమిది నెలల శిక్షణ కోసం 2018లో విజయనగరం జిల్లాకే వచ్చాను. తర్వాత పోస్టింగ్ కూడా ఇక్కడికే రావడం నా అదృష్టం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా 2019 సంవత్సరంలో రెగ్యులర్ అయ్యాను. అప్పటి నుంచి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాను. ఉన్నతమైన జీవితానికి విద్య ఒక్కటే మార్గం. ప్రభుత్వం కలి్పంచిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలనేది నా సూచన. నాలుగేళ్ల ఎదురుచూపు ఫలించింది... గ్రూప్–1 నోటిఫికేషన్ 2018 సంవత్సరంలో మరోసారి వెలువడింది. ప్రిలిమ్స్ తర్వాత 2020 సంవత్సరంలో మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాల్లో 325 మంది విజేతల్లో నేనూ ఉన్నాను. వాల్యూషన్ మళ్లీ చేయడంతో వారిలో నాతో పాటు 123 మందికి మాత్రమే ఇంటర్వ్యూకు అవకాశం దక్కింది. తుది ఫలితాల్లో 9వ ర్యాంకు వచ్చింది. ఉత్తరాంధ్రలోనే టాపర్గా నిలిచాను. సబ్కలెక్టర్ అవ్వాలనే నా కల నెరవేరింది. లక్ష్యంపై గురి తప్పవద్దు... గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం... ఇవేవీ గ్రూప్–1 లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడానికి ఆటంకాలు కానేకావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యంపై గురి తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. ఈ క్రమంలో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా చేరడం మంచిది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావవ్యక్తీకరణ ప్రధానం గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో భావవ్యక్తీకరణ చాలా ప్రధానం. సిలబస్ను దృష్టిలో పెట్టుకొని దినపత్రికలను చదవాలి. అంశాల వారీగా క్లిప్పింగ్స్ ఉంచుకోవాలి. అయితే పరీక్షల్లో ఆ సమాచారాన్ని యథావిధిగా దించేయకూడదు. ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తూ మన విశ్లేషణ కూడా జోడించాలి. ఎగ్జామినర్ను ఇంప్రెస్ చేసేలా భావవ్యక్తీకరణ ఉండాలి. ఇందుకు మాతృభాష తెలుగు నాకు బాగా ఉపయోగపడింది. త్వరలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అయ్యేవారికి ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్తో పాటు స్వీయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.’’ సబ్కలెక్టర్ కావాలన్నదే లక్ష్యం... సబ్కలెక్టరు కావాలన్నదే లక్ష్యం. ముందు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని డీఎస్సీకి ప్రిపేరేషన్ ప్రారంభించాను. అదే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్తో వివాహం అయ్యింది. ఆయన ఐటీ రంగాన్ని వదిలేసి స్థిరాస్తి వ్యాపారంలోకి వచ్చేశారు. నేను 2009లో డీఎస్సీలో మూడో ర్యాంకుతో టీచర్ ఉద్యోగం పొందాను. అచ్యుతాపురం మండలంలోని గొర్లి ధర్మవరం యూపీ స్కూల్లో చేరడంతోనే హెడ్మాస్టర్గా పనిచేయాల్సి వచ్చింది. టీచర్గా కొనసాగుతూనే గ్రూప్–1 పరీక్షకు సిద్ధమయ్యాను. 2011లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. న్యాయవివాదాలతో ఫలితాలు వెలువడలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం 2016లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి పోస్టుకు ఎంపికయ్యాను. -
సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది..
నెల్లిమర్ల(విజయనగరం జిల్లా): బంగార్రాజా మజాకా.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు పడరాని పాట్లు పడుతున్నారు. ఈనెల 17న భోగాపురం విచ్చేసిన చంద్రబాబుతో పోలిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. టూర్ షెడ్యూల్లో లేనప్పటికీ బాబు కాన్వాయ్ను వెనక్కి మళ్లించి మరీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చదవండి: రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’ అయితే ఆవిష్కరణ అనంతరం బాబు వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ విగ్రహం అక్కడినుంచి మాయమైంది. సదరు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి, బంగార్రాజు తన కారు షెడ్డులో పెట్టేశారు. ఇదే విషయమై ఆ పార్టీ నియోజకవర్గ నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేవలం చంద్రబాబును ఆకర్షించడానికే ఆవిష్కరణ చేపట్టి, అనంతరం తొలగించారని గుసగుసలాడుకుంటున్నారు. బాబు కళ్లకే గంతలు కట్టిన ఘనుడు బంగార్రాజు అని ముక్కును వేలేసుకుంటున్నారు. -
అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. ఆజాదికా అమృత మహోత్సవ్లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్ మాస్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
ఆ ప్రచారం అవాస్తవం.. ‘అమ్మ ఒడి’పై మంత్రి బొత్స క్లారిటీ
సాక్షి, విజయనగరం: ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65 శాతానికి పెరిగిందన్నారు. చదవండి: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. అటెండెన్స్ ఆధారంగా లబ్ధి చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్కు పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. రూ.2 వేలు అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. -
రీసర్వేతో అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్
రామభద్రపురం: రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పకడ్బందీగా చేయడంతో విజయవంతమైందని కమిషనర్ ఆఫ్ సర్వే అస్టిస్టెంట్ డైరెక్టర్ బీఎల్ కుమార్ అన్నారు. రామభద్రపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించి సర్వే పూర్తి చేసిన మర్రివలసతో పాటు ప్రస్తుతం మిగిలిన గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. రీసర్వే పూర్తయిన మర్రివలసలో సర్వే అధికారులు సర్వే రాళ్లు ఎలా పాతారో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. 2023 నాటికి రీ సర్వే పూర్తి చేసి ఎలాంటి చిక్కులు లేకుండా భూములను రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన సర్వే ప్రకారం భూములు అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటి వాటికి చెక్పడుతుందన్నారు. రీ సర్వేలో సర్వే అధికారులకు రైతులు సహకరించాలని సూచించారు. రామభద్రపురం మండలం సర్వే అధికారులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని మండల సర్వేయర్ శ్రీనివాసరావు, గ్రామ సర్వేయర్లను అభినందించారు. అనంతరం రీసర్వే ఎలా జరిగింది? భూముల లెక్క తేలిందా? సర్వే అధికారులు పారదర్శకంగా సర్వే చేశారా? అని రైతు సూరెడ్డి చిన్నంనాయుడును అడిగి తెలుసుకున్నారు. దీనికి రైతు మాట్లాడుతూ గతంలో భూములు పాస్పుస్తకంలో నమోదు చేసుకునేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారమని, ప్రభుత్వం రీ సర్వే చేపట్టి భూములు ఎవరి వారికి నమోదయ్యేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ పరిశీలకులు బీబీవీవీ రాజు, బొబ్బిలి డివిజన్ సర్వేయర్ రవి శంకర్ పాల్గొన్నారు. -
సర్కారు వారి ఆరా
సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి సాలూ రు నియోజకవర్గంలోని సాలూరు పట్టణ పరిధిలోని 3వ వార్డు గుమడాం గ్రామానికి చెందిన నారాపాటి అప్పారావు తెలుగుదేశం పార్టీ అభిమాని. ఇంట్లో ఎన్టీఆర్ ఫొటోను కూడా పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈయన ఇంటికి వెళ్లగానే లేచి వచ్చి ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ పాలన చూశాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాం. ఎటువంటి ప్రలోభాలు, అడ్డంకులు లేకుండా మా ఇంట్లో వారికి అర్హత ఉన్న అన్ని పథకాలు, పింఛన్ అందుతున్నా యి. ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు. ఎన్టీఆర్ అభిమానినే అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలన చూసిన తరువాత నాకు ఆనందం కలిగిందంటూ తమకు అందుతున్న పథకాల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. గుమడాం గ్రామంలో నిర్వహించిన గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామస్తుల అందరి నుంచి ఇదే స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా సంక్షేమం పొందుతున్న ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జైజగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది. సంక్షేమమే లక్ష్యంగా పాలనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఆరా తీస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా జరుగుతోంది. గ్రామా ల్లోని ప్రతి ఇంట్లో సంక్షేమ పథక లబ్ధిదారులు ఉండ గా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి గడప ఎక్కుతుండడంతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీడీపీ అభిమానులు సైతం ప్రభుత్వానికి అభిమానులుగా మారి తాము పొందుతున్న లబ్ధిని తమ గడపకు వచ్చిన నాయకులకు వివరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సచివాల య వ్యవస్థ ద్వారా కల్పించిన ఉద్యోగాల్లో తమ పిల్లలు స్థిరపడిన విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుమడాంలో సందడి సందడిగా.. సాలూరు నియోజకవర్గం గుమడాం గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారకముందే స్వయాన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తమ గ్రామంలోకి వచ్చి తలుపుతడుతున్నారనగానే గ్రామం మొత్తం కదిలింది. డిప్యూటీ సీఎం తమ ఇంటికి వచ్చి కష్టసుఖాలు తెలుసుకోవ డం చాలా ఆనందంగా ఉందని అందరూ సంబరపడుతున్నారు. గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎంకు ప్రతి ఇంటి నుంచి ఆధారాభిమానాలతో పాటు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పక్కాగా పథకాలు అమలవతున్నాయని, ఎవరికి ఒక్క పైసా కూడా చెల్లించలేదని లబ్ధిదారులు ఆయనకు చెబుతుంటే ఆయన మనసంతా సంతోషంతో నిండిపోయింది. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడు తూ ఇంతటి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఘనమైన మెజార్టీ అందించాలని గ్రామస్తులను కోరారు. అక్కడక్కడ ఒకరిద్దరు టీడీపీ కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని, గొంతులు చించుకుని లేని పోని ఆరోపణ లు చేసినంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగవని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్మన్ పూల ఈశ్వరమ్మ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ పాచిపెంట నాయకులు పి.గౌరీశ్వరరావు, పాచిపెంట వీరన్నాయుడు, మండల కన్వీనర్ గొట్టాపు ముత్యాలనాయుడు, దండి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ తాడ్డి లక్ష్మి, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ కన్వీనర్ జరజాపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
సత్ఫలితాలిస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
పార్వతీపురం టౌన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. పేదరికంతో గర్భిణులు సరైన పైష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అదనపు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రెండేళ్ల కిందట వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. గర్భిణులకు గతంలో ఇచ్చే పప్పు, పాలు, గుడ్లకు అదనంగా మరో ఆరు రకాల పోషక పదార్థాలను అందించడంతో వారిలో రక్తహీనత తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తున్నారు. గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’ గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టలను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్గా లబ్ధిదారులకు ప్రతీనెలా సరఫరా చేస్తోంది. పిల్లల ఆరోగ్యం కోసం... ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలమృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది. మెనూ ఇది.. చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్ రైస్, పులిహోరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తున్నారు. మా బాబు బరువు పెరిగాడు.. మా బాబు చాలా తక్కువ బరువు ఉండేవాడు. మొదటి సంవత్సరం మా అబ్బాయి బరువు 8 కేజీ లు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, పాలు తదితర బలవర్ధక పదార్థాలతో ఏడాదిన్నర కాలంలో 11 కేజీలకు బరువు పెరగడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్య ఆహారం అందిస్తున్న ప్రభుత్వానికి మాలాంటి తల్లుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దివ్య, పాలకొండ మండలం, బుప్పూరు పౌష్టికాహారంతో ఆరోగ్యం గర్భిణిగా మూడో నెలనుంచి మాకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పథకం కింద పౌష్టికాహారం తీసుకుంటున్నా ను. ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతీనెల అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే వివిధ రకాల పోషకాహార వస్తువులను క్రమంతప్పకుండా తీసుకుంటున్నాను. – దీప్తి పండా, పార్వతీపురం పట్టణం జిల్లాలో 15,601 మందికి లబ్ధి జిల్లాలోని 15 మండలాల్లో ని గర్భిణులు, బాలింతలు 15,601 మందికి లబ్ధి చేకూరుతోంది. గర్భిణుల కు మూడోనెల నుంచి ప్రసవించేవరకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ పోషణ కిట్లతో పాటు ఐరన్ మాత్రలు తీసుకున్న వారిలో 9 శాతం ఉన్న హిమోగ్లోబిన్ 11 శాతాని కి పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం వల్ల పిల్లల్లో బరువు పెరగడమే కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారు. – వరహాలు, పీడీ ఐసీడీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా -
రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్ట
విజయనగరం: రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్టించారు. రుత్వికులు శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 4 నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారికి తప్పకుండ శిక్ష పడుతుందని తెలిపారు. నెలల్లోనే ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవునితో రాజకీయాలు చేయడం మానుకోవాలని, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని ఆధారాలతో నిరూపించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ ప్రతిష్ట జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమం జరిగిందని చెప్పారు. దీంట్లో రాజకీయ కోణం చూడకూడదని అన్నారు. భద్రాచలం సంప్రదాయాలతోనే రామతీర్థ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే శ్రీ రామనవమి రామతీర్థంలో రాష్ట్ర అధికారిక నవమి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరుతున్నామని చెప్పారు. -
దంపుడు బియ్యానికి c/o కొండబారిడి
దంపుడు బియ్యంలో పోషకాలు అధికం. ఆరోగ్యానికి మేలు. అందుకే మార్కెట్లో గిరాకీ ఉంది. నాణ్యమైన దంపుడు బియ్యం వినియోగించేందుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దీనినే ఓ మారుమూల గిరిజన గ్రామ మహిళలు ఆదాయవనరుగా మలచుకున్నారు. కొండ జక్కరతో సేంద్రియ పద్ధతిలో పండించే ధాన్యాన్ని ‘జట్టు’గా రోకళ్లతో దంచి బియ్యంగా మార్చుతున్నారు. కిలోల చొప్పున ప్యాక్చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. గ్రామాన్ని దంపుడు బియ్యానికి కేరాఫ్గా మార్చిన కొండబారిడి గిరిజన గ్రామ మహిళల విజయగాథకు ‘సాక్షి’ అక్షర రూపం. కురుపాం(పార్వతిపురం మాన్యం): కొండబారిడి.. కురుపాం మండలానికి మారుమూలన ఉన్న చిన్న గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగుచేస్తున్నారు. వరిని సైతం అదే దారిలో పండిస్తున్నారు. ధాన్యాన్ని మరపట్టించాలంటే కొండపైనుంచి కిందకు దించాలి. వ్యయప్రయాసలకోర్చాలి. అందుకే.. ఏ ఇంటిలో చూసినా ఏ రోజు తిండిగింజలను ఆ రోజు రోకళ్లతో దంచి బియ్యంగా మార్చడం మహిళల దినచర్య. మరోవైపు దంపుడు బియ్యంతో ఆరోగ్యం సిద్ధిస్తోంది. వీటికి మార్కెట్లో గిరాకీ ఉంది. దీనిని కొందరు మహిళలు గుర్తించారు. ఒక అడుగు ముందుకు వేశారు. ‘జట్టు’ సంస్థ సాయంతో 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని నిర్వహణలో అన్నపూర్ణ, శాంతి, ఏకలవ్య, శ్రీ కృష్ణ, శ్రీ భగవాన్, మిత్ర, సావిత్రి సంఘాలకు చెందిన మహిళలు భాగస్వాములయ్యారు. స్థానికంగా లభ్యమైన ధాన్యాన్ని దంచి దంపుడు బియ్యంగా మార్చుతున్నారు. కిలో ప్యాకెట్లుగా మార్చి తెలంగాణాలోని హైదరాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు బీఎంపీఎస్ ట్రావెల్స్లో సరఫరా చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం ఎగుమతి చేస్తున్నారు. కొండబారిడి గ్రామం శతశాతం సేంద్రియ వ్యవసాయ గ్రామంగా ఎంపిక కావడం, అక్కడ పండే ధాన్యాన్ని దంపుడు బియ్యంగా మార్చి విక్రయిస్తుండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దంపుడు బియ్యంతో బోలెడు ప్రయోజనాలు ► దంపుడు బియ్యంలో గోధుమ రంగులో ఉండే సెలీనియం పెద్ద పేగుకు కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ► దంపుడు బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థలో ఉండే కేన్సర్ కారకాల రసాయానాలను బయటకు పంపుతూ పెద్ద పేగుకు కేన్సర్ రాకుండా కాపాడుతుంది. ► గోధుమ రంగులో ఉండే పైటోన్యూట్రిన్స్ లిగ్నాట్ రొమ్ము కేన్సర్, గుండె జబ్బులను అడ్డుకునేందుకు సహాయ పడుతుంది. ► వయస్సు మళ్లిన మహిళలపై జరిగిన అధ్యయనంలో దంపుడు బియ్యం (ముడి బియ్యం) తినడం వల్ల ఎంట్రోలాక్ట్స్ స్థాయి పెరిగి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. గుండె జబ్బులు దరిచేరవు. ► దంపుడు బియ్యంలో పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేలా చూస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు. శరీర బరువు సాధారణంగా ఉంటుంది. ► ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం 21 శాతం వరకు దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తాయి. ► రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్తం గడ్డకట్టకుండా ఉపయోగ పడుతుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంది. ► గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్–2 డయాబెటీస్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఆదాయం బాగు.. ►2019లో ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా దంపుడు చేసిన 1000 కేజీల బియ్యంను కేజీ రూ.45 చొప్పున విక్రయించి రూ.45,000 వేలు ఆదాయం ఆర్జించారు. ►2020–21 సంవత్సరాల్లో 2000 కేజీల బియ్యంను రూ.50 చొప్పున విక్రయించగా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. మూడున్నర సంవత్సరాలుగా లక్షా 35వేల పెట్టుబడితో రూ.లక్ష ఆదాయం పొందినట్టు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. మార్కెట్లో గిరాకీకి తగ్గట్టుగా దంపుడు బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషకాలు మెండు ముడి బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పోలేట్ (పోలిక్ యాసిడ్), బి–విటమిన్లు శరీరానికి కొత్త కణాలను ఏర్పరచేందుకు సహాయపడతాయి. పుట్టకతో వచ్చే లోపాలు తగ్గుతాయి. బియ్యంలో అధికంగా ఉండే పీచుపదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. – ఎ. ప్రసన్నరాణి, కృషివిజ్ఞాన కేంద్రం, విస్తరణ విభాగ శాస్త్రవేత్త, రస్తాకుంటుబాయి, కురుపాం మండలం తెలిసిన వ్యాపారం.. బియ్యం దంచడం మాకు నిత్యకృత్యం. దంపుడు బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఏడు సంఘాల మహిళలం ఏకమయ్యాం. ప్రతిరోజూ ధాన్యాన్ని దంచుతూ బియ్యం తయారు చేస్తున్నాం. నాణ్యమైన బియ్యం కావడంతో డిమాండ్ పెరుగుతోంది. ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం కిలో రూ.65కు విక్రయిస్తున్నాం. – పత్తిక సుశీల, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, కొండబారడి, కురుపాం మండలం కొండబారిడి గ్రామంలో ఉన్న సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రం -
ఇంటర్యూలో సెలెక్ట్ అవలేదని యువతి అఘాయిత్యం
ప్రాణమంటే అలుసో? ప్రాణభయం లేకనో క్షణికావేశంలో కొంతమంది తప్పుడు నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడుతూ కుటుంబసభ్యులకు తీరని శోకం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వేర్వేరు కారణాలతో గురువారం నలుగురు ప్రాణాలు తీసుకుని కుటుంబసభ్యులను దుఃఖ సాగరంలో ముంచారు. ఆయా సంఘటనల వివరాలిలా ఉన్నాయి. ఉరివేసుకుని యువకుడు పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కొత్తవలసలో గల కొత్త పోలమ్మ కాలనీకి చెందిన రౌతు చరణ్ (21) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చరణ్ ఇంట్లో ఉరివేసుకుని ఉండడం గమనించిన అతని తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు తనిఖీ చేసి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. పురుగు మందు తాగి మరొకరు భోగాపురం రూరల్: మండలంలోని చేపలకంచేరు పంచాయతీ దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పూడి సూరిబాబు(30) కుటుంబ సమస్యలతో పురుగు మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూరిబాబు పురుగు మందు తాగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్యూలో సెలెక్ట్ అవలేదని యువతి.. విజయనగరం క్రైమ్: క్యాంపస్ ఇంటర్యూలో సెలెక్ట్ అవకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి సీ లింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరంలోని కేఎల్.పురంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తల్లిదండ్రుల వద్ద ఉంటూ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎస్.శ్రావణి (22)కి 11 నెలల కిందట నరేంద్ర తో వివాహమైంది. భర్తకు జాబ్లేకపోవడం, తనకు ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది. మృతురాలి తల్లి వెంకట జయలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థిని.. బొబ్బిలి: పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. తండ్రి చనిపోయిన ఆ బాలిక తాతగారింటి వద్ద ఉండి చదువుకుంటోంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా పదో తరగతి పరీక్షల సన్నద్ధతలో ఒత్తిడికి గురైందని, ఆరోగ్యం సరిగా లేదనే కారణాలు వినిపిస్తున్నాయి. స్థానికులు విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ విషయమై సీఐ ఎం నాగేశ్వర రావును వివరణ కోరగా ఎటువంటి సమాచారం లేదన్నారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మిర్యాల చంద్రయ్య ఇకలేరు.. పశువుల కాపరి నుంచి వైస్ చాన్సలర్ స్థాయికి..
సాక్షి, మన్యం పార్వతీపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పూర్వపు ఇన్చార్జి వైస్ చాన్సలర్, రూరల్ డెవలప్మెంట్ విశ్రాంత ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య (67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. పశువుల కాపరిగా ప్రస్థానం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్యది విజయనగరం జిల్లా. పాలేరు కుమారుడిగా జీవితం ప్రారంభించి బాల్యంలో అనేక కష్టాలు పడ్డారు. పశువుల కాపరిగా పనిచేశారు. వసతి గృహల్లో చదువుకుని ఆంధ్రావిశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మారి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. 2008లో జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలో పనిచేస్తున్న వారిలో 34 మంది ఏయూ మాతృ సంస్థకు వెళ్లిపోగా, ఐదుగురు మాత్రమే ఇక్కడ ఉండిపోయా రు. అందులో చంద్రయ్య ఒకరు. వర్సిటీలో విభాగా ధిపతిగా, ప్రిన్సిపాల్గా, చీఫ్ వార్డెన్గా అనేక బాధ్యతలు నిర్వహించారు. రెక్టార్ హోదాలో 2016 మే 14 నుంచి 2017 జూన్ 30 వరకు ఇన్చార్జి వైస్ చాన్సలర్గా వ్యవహరించారు. వీసీగా పనిచేస్తూనే రెగ్యులర్ గా తరగతులు బోధించేవారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించేవారు. సమయపాలన పక్కా.. చంద్రయ్య సమయ పాలన కచ్చితంగా పాటించేవారు. ఇన్చార్జ్ వీసీగా సమయంలో బోధకులు సమయపాలన పాటించకపోతే సహించేవారు కాదు. దీంతో బోధకు లు ఆయనపై తిరగబడ్డారు. మీరు వీసీనా.. వాచ్ మ్యానా..? అంటూ ప్రశించారు. తాను వర్సిటీకి వాచ్డాగ్ అంటూ సమాధానం ఇచ్చారు. సమయపాలన పాటించకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల ఉత్తమ ఉపాధ్యా య విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఈయన మృతి పట్ల ప్రస్తుత వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ఏ రాజేంద్రప్రసాద్, పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ప్రొఫెసర్ పీలా సుజాత సంతాపం తెలియజేశారు. -
వింత వ్యాధి కలకలం?
సాలూరు: మన్యంలో వింత వ్యాధి మళ్లీ విజృంభిస్తోందని గిరిజనుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 13న పాచిపెంట మండలంలోని కర్రివలస పంచాయతీ కంకణాపల్లి గ్రామంలో వింత వ్యాధితో మరణాలు సంభవించాయి. ఈ నెల రెండవ వారంలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాళ్లు, చేతులు, ముఖం పొంగి బాగా నీరసించిపోయారు. వెంటనే వారు పాచిపెంట పీహెచ్సీకి వెళ్లగా సాలూరు సీహెచ్సీకి రిఫర్ చేశారు. బాధితుల్లో గమ్మెల ప్రశాంత్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈనెల 13న మరణించాడు. సీహెచ్సీలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా సుమారు పదిమంది ఈ విధంగానే భాదపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో భయాందోళన వింత వ్యాధితో సంభవిస్తున్న మరణాలపై గిరిజనుల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. ఈ విథమైన మరణాలపై గతేడాది జనవరి19వ తేదీన మన్యంలో మరణ మృదంగం శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఐటీడీఏ పీఒ కూర్మనాథ్ స్పందించి గ్రామంలో పర్యటించి వైద్యసేవలు ముమ్మరం చేశారు. కానరాని వింతవ్యాధి లక్షణాలు అయితే మళ్లీ ఈ నెలలో ఆ తరహా వ్యాధి ప్రబలడంతో పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పీవీ లక్ష్మిని వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, గ్రామంలో రెండు రోజులుగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ అనారోగ్య లక్షణాలు తప్ప వింత వ్యాధి లక్షణాలు ఎవరికి లేనట్లు గుర్తించామన్నారు.త్వరలో అందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. తాగునీరు సమస్య కారణం కావచ్చన్న అనుమానంతో తాగునీటి పరీక్షలు నిర్వహించగా ఎటువంటి సమస్య లేదని గుర్తించినట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకట చినఅప్పలనాయుడు తెలిపారు. దీనిపై ఐటీడీఏ పీఓ కూర్మనా«థ్ వివరణ కోరగా, గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు. గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించినట్లు వైద్యాధికారులు చెప్పారని, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా సమీప ఒడిశా నుంచి వస్తున్న సారా మన్యంలో ఏరులై పారుతున్న నేపథ్యంలో సారా తాగడం ఈ విధమైన వ్యాధులకు కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, మన్యాల్లో సారా నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం
భోగాపురం: సాగరంలో జలసంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం లాగానే చేపలు గుడ్లు పెట్టే సమయం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేట నిషేధాజ్ఞలు జారీచేసింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా అదుకుంటుంది. గత ప్రభ్వుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సంవత్సరం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యభరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తుండడంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15,138 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లాలోని తీరప్రాంత మండలాలు పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్స్యకారులు ఉన్నారు. వారిలో 10 వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు నిరంతరం సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. రెండు మండలాల్లో 706 మోటార్ బోట్లు, 424 సంప్రదాయ బోట్లకు రిజిస్ట్రేషన్ అయింది. మత్స్యశాఖ అధికారులు మోటార్ బోట్లు, సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తున్న 2,335 మంది మత్స్యకారులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించారు. పారదర్శకంగా అమలు మత్స్యకారులకు మంజూరైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకే ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - నిర్మలాకుమారి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయనగరం మత్స్యకారులకు భరోసా వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అదుకునేందుకు మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు సాయం అందజేస్తోంది. జిల్లాలో 2,335 మందికి మత్స్యకార భరోసా అందనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - వాసుపల్లి రేయుడు, సర్పంచ్ ముక్కాం గ్రామం -
పర్యావరణ నేస్తాలు ఆలివ్ రిడ్లేలు
విజయనగరం పూల్బాగ్: ఆలివ్రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. తీరప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడ కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టి తీరం వెంబడి పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్ల మేర సముద్రతీరంలో 2014వ సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం 10 ఆలివ్రిడ్లే పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెంపకం ఎలా చేపడతారంటే? ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని ఆడ తాబేలు తీరానికి చేరుకుని గుడ్లు పెడుతుంది. వాటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలమో ముందుగా గుర్తిస్తారు. ఆప్రాంతంలో మిని హ్యాచరీలు ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో ఉంచిన గుడ్లనుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియకు ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లును సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 25మంది కాపలాదారులను నియమించారు. చంపినా, తిన్నా నేరమే తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. పర్యావరణ పరిరక్షణకు ఏం చేస్తాయంటే? తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు.సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు మత్స్య సంపద పెరుగుతుంది. ఇదీ ప్రత్యేకత ఆలివ్రిడ్లే సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్ల పొడవు, అరంగుళం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రంలోకి వెళ్తాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్రిడ్లేలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాం. తాబేళ్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో 1,69,509 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,38,738 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచిపెట్టాం. కాంపా బయోడైవర్సిటీ స్కీం ద్వారా వచ్చిన నిధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఎస్ వెంకటేష్, జిల్లా అటవీఅధికారి, విజయనగరం -
IPL 2022: ఇక్కడ బంతి బంతికో రేటు..!
విజయనగరం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–15 సీజన్ శనివారం మొదలైంది. బెట్టింగ్ రాయుళ్లు బంతికో రేటు కట్టి జూదమాడేందుకు సిద్ధమైపోయారు. ఫోర్లు, సిక్సర్ల హోరుతో స్కోర్ బోర్డు ఎలా పరుగులు పెడుతుందో... బెట్టింగ్ కూడా రూ.వందలు.. రూ.వేలు... రూ.లక్షలు.. దాటి రూ.కోట్లు కట్టేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. బెట్టింగ్లను నియంత్రిస్తామని పోలీస్ యంత్రాంగం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం బాహాటంగానే సాగిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసుల నమోదు తక్కువే.. గడిచిన ఏడేళ్లలో జిల్లాలో 6 కేసులు నమోదు కాగా, 40 మంది బెట్టింగ్ రాయళ్లను మాత్రమే అరెస్టు చేశారు. కంప్యూటర్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. 2016లో క్రికెట్ బెట్టింగ్లపై 3 కేసులు నమోదుచేసి 23 మందిని, 2017లో 2 కేసుల్లో 10 మందిని, 2018లో ఒక కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. రెండున్నర నెలల పాటు అదే హీటు.. ఐపీఎల్–15 సీజన్ దాదాపు రెండు నెలల పాటు సాగనుంది. ఈ సమయంలో బుకీలు బెట్టింగ్ నడిపే తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. టాస్ ఏ జట్టు గెలుస్తుందని బెట్టింగ్ కాస్తారు. ఆపై మొదటి ఓవర్లో బౌండరీ వెళుతుందా? లేదా ? వికెట్ పడే అవకాశం ఉందా? లేదా? పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తుంది? ప్రత్యర్థి జట్టు ఎన్ని వికెట్లు తీస్తుంది?... ఇలా పలు రకాలుగా బెట్టింగ్ వేస్తారు. ఇంకా కొందరు ప్రతి బంతికీ బెట్టింగ్ ఇస్తారు. ఓడిపోతే రూ.15వేలు పోతుంది. ఐపీఎల్ సీజన్లో జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మేర బెట్టింగ్లు సాగుతాయన్నది సమాచారం. ఫేవరెట్ జట్లపై అయితే బెట్టింగ్ మరోలా నిర్వహిస్తారు. ఉదాహరణకు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే... ఫేవరెట్! బెంగళూరుపై రూ. 10వేలు బెట్టింగ్ కాయాలంటే సబ్ బుకీలకు రూ. 13వేలు చెల్లించాలి. బెంగళూరు గెలిస్తే రూ.10 వేలు ఇస్తారు. ఓడిపోతే రూ.13వేలు పోయినట్లే!. జిల్లాలో బుకీల తిష్ట...! జిల్లాలో బుకీలు ఇప్పటికే తిష్టవేసినట్టు బోగట్టా. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సబ్బుకీలు, ఏజెంట్లను కమీషన్ ప్రాతిపదికన నియమించుకున్నారు. మ్యాచ్కు రెండు గంటల ముందు బెట్టింగ్ తీరును చెప్పేస్తారు. ఫేవరెట్ జట్టు, బెట్టింగ్ రేషియా నిర్థారిస్తారు. ఈ మేరకు బెట్టింగ్ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులిస్తారు. వీరు సబ్ బుకీలకు చేరుస్తారు. మ్యాచ్ ముగిసిన తరువాత బెట్టింగ్ డబ్బులు ఇచ్చేస్తారు. ఈ పందాల వల్ల ఏటా చాలా మంది నష్టపోతున్నారు. యువత, విద్యార్థులే టార్గెట్.. యువత, విద్యార్థులను ఉచ్చులో దించుతున్నారు. వేలాది మందిని బెట్టింగ్లో దించి రూ.కోట్లు దోచుకుంటున్నారు. కొందరు వ్యాపారులతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు కూడా డబ్బు ఆశతో బెట్టింగ్కు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఆన్లైన్లో ఉన్న కొన్ని యాప్ల ద్వారా కూడా బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. బెట్టింగ్ నిర్వహించేవారి వివరాలు స్థానిక పోలీసుల్లో కొందరికి తెలుసునని, వారితో ఉన్న సన్నిహిత సంబ«ంధాలతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పోలీస్ వర్గాలే బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. పోలీసుల ప్రత్యేక దృష్టి ఐపీఎల్ సీజన్లో సాగే బెట్టింగ్లపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పందెం ఎలా కాసినా పట్టుకునేందుకు సిద్ధమైంది. గతంలో బెట్టింగ్లు పెట్టిన వారి వివరాలను సేకరించి ప్రస్తుతం వారి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. యువత, విద్యార్థులు బుకీల మాయలో పడొద్దని హెచ్చరిస్తోంది. కేసులు నమోదైతే అంతే.. ►బెట్టింగ్ల్లో పట్టుబడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా ఉంటుంది. ►ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు పడక తప్పదు. ►ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎక్కడ బెట్టింగ్ జరిగినా వీరిపై నిఘా ఉంటుంది. ►బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ మరోసారి పట్టుబడితే కఠిన చర్యలుంటాయి బెట్టింగ్ల నియంత్రణకు ప్రత్యేక టీమ్.. ఐపీఎల్–15 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. బుకీలతో పాటు బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. బెట్టింగ్లు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరం. అనవసరంగా బెట్టింగ్ల పేరుతో డబ్బులు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎక్కడైనా బెట్టింగ్లు జరిగే సమాచారం అందించవచ్చు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. పాత నేరస్తులపై నిఘా పెట్టాం. – అనిల్కుమార్ పులిపాటి, ఏఎస్పీ, విజయనగరం -
సజీవ దహనం ఘటనలో కొత్త మలుపు.. ఆమెది హత్యే..
తెర్లాం(విజయనగరం జిల్లా): మండలంలోని రాజయ్యపేట గ్రామంలో ఈ ఏడాది జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు గాడి గౌరమ్మ సజీవదహనమైన సంగతి తెలిసిందే. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని అంతా భావించారు. గౌరమ్మను హత్యచేసి కాల్చేసినట్టు నిందితుడు ఒప్పుకోవడంతో అందరూ అవాక్కవుతున్నారు. తెర్లాం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొబ్బిలి రూరల్ సీఐ శోభన్బాబు, తెర్లాం ఎస్ఐ సురేంద్రనాయు కేసు వివరాలను వెల్లడించారు. చదవండి: లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి.. గాడి గౌరమ్మకు చేతబడి ఉందన్నది అనుమానం. నాలుగేళ్ల కిందట నిందితుడు రెడ్డి సింహాచలం, ఆయన భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడి చేసిందని, అందుకే అనారోగ్యానికి గురైనట్టు భావించారు. ఆమె చేతబడి చేయడం వల్లే గత ఏడాది అక్టోబర్ నెలలో తండ్రికూడా మరణించినట్టు సింహాచలం మనసులో బలంగా నాటుకుపోయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ముందురోజే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదగ్గర వేరే పని ఉందని గొడ్డలిని తీసుకున్నా డు. గౌరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా జనవరి 10 అర్ధరాత్రి ఇంటిలోకి వెళ్లి హతమర్చాడు. సీసాలో తీసుకెళ్లిన పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ప్రమా దంలో గౌరమ్మ సజీవదహనమైంది. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు సైతం కాలిపోయాయి. అందరూ విద్యుత్ షార్ట్సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు భావించారు. వృద్ధురాలిని హత్యచేసి పెట్రోల్పోసి కాల్చివేసినట్టు సింహాచలం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు. హత్య వెలుగుచూసిందిలా... ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్యపేటలో పాతినవలస కనకరాజు అనే వ్యక్తి పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో పశువులశాలలో ఉన్న ఎద్దు, ఆవు, దూడను విప్పేందుకు వెళ్లిన బాధితునికి రెడ్డి సింహాచలం తారసపడ్డాడు. అతనిపై అనుమానంతో స్థానిక పోలీసులకు కనకరాజు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శోభన్బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడు సింహాచలాన్ని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. కనకరాజు పశువుల శాలను ఎందుకు కాల్చావని తమదైన శైలిలో ప్రశ్నించారు. పశువుల శాలను కాల్చలేదని, జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన గాడిగౌరమ్మ అనే వృద్ధురాలిని మాత్రం తనే గొడ్డలితో నరికి చంపేశానని, అనంతరం పెట్రోల్ పోసి కాల్చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. పథకం ప్రకారమే హత్య చేశా... గాడి గౌరమ్మను పథకం ప్రకారంగానే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, పిల్లలను అత్తవారింటికి పంపించేశానని తెలిపాడు. నాలుగేళ్లుగా ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆ రోజుకు సమ యం అనుకూలించిందన్నాడు. హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి బొబ్బిలి కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. -
విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి చిన్నారులు మృతి
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలివలస వద్ద ఓ బైకును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
మీరు ముసలోళ్లు కాకూడదు.. బేబమ్మ డైలాగ్కు అభిమానుల కేరింతలు
సాక్షి, విజయనగరం రూరల్: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమై యువతను ఉర్రూతలూగించిన కన్నడ భామ కృతిశెట్టి శనివారం విజయనగరంలో సందడి చేశారు. గుంకలాం గ్రామంలో హైడ్ పార్కు వెంచర్ సంస్థ బ్రోచెర్ను ఆమె ఆవిష్కరించారు. వ్యాపారవేత్త పైడా కృష్ణ ప్రసాద్, మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తను నటించిన ఉప్పెన, శ్యామ్సింగరాయ్, బంగార్రాజు సినిమాలకు భారీ విజయాన్ని చేకూర్చిన అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. ‘మీరు ముసలోళ్లు కాకూడదు’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్కు అభిమానులు కేరింతలు కొట్టారు. వెంచర్ నిర్వాహకులు లక్ష రూపాయల చెక్కును మేయర్, డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా బ్రైట్ ఫ్యూచర్ సంస్థ ప్రతినిధులకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో హైడ్ పార్కు రియల్ ఎస్టేట్ యజమాని రవి, ఏఆర్ గ్రూప్ అధినేతలు టి.ఆదిరెడ్డి, ఎం.సోమిరెడ్డి, వి.సూర్యనారాయణ, అచ్చిరెడ్డి పాల్గొన్నారు.