పవన్‌కు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు | City Court Issues Notice To Pawan Kalyan Due To Comments On Tirumala Laddu | Sakshi
Sakshi News home page

పవన్‌కు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు

Oct 21 2024 4:46 PM | Updated on Oct 21 2024 5:42 PM

City Court Issues Notice To Pawan Kalyan Due To Comments On Tirumala Laddu

సాక్షి,హైదరాబాద్‌ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్‌ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్‌ రామారావు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్‌ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని పిటిషనర్‌ రామారావు కోరారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కూ, హోం ప్రిన్సిపల్‌ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  

సోషల్‌ మీడియాలో పవన్‌ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్‌ కోర్టు పవన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. 

పవన్ కళ్యాణ్ తిక్క కుదిరింది తిరుమల లడ్డుపై కోర్టు నోటీసులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement