కొనసాగిన క్యాంపస్ ఇంటర్వ్యూలు
Published Sat, Sep 3 2016 12:05 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్ఐటీ, ఐఎస్టీ విభాగాలకు చెందిన 620 మంది విద్యార్థులు అన్లైన్ పరీక్షల్లో పాల్గొన్నారని, శనివారం ఉదయం ఫలితాలు వెల్లడిస్తామని జేన్టీయూకే ప్లేస్మెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. అన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సెప్టెంబర్ 6,7,8 తేదీల్లో టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామన్నారు.
Advertisement
Advertisement