నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు | Chess tourney from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు

Published Fri, Aug 26 2016 1:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు - Sakshi

నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు

వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో అండర్‌–17  రాష్ట్రస్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ప్రారంభించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి వెంకటరణమణయ్య తెలిపారు. గురువారం ఆయన అక్షర విద్యాలయంలో చెస్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల,బాలికల విభాగంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వారిని  కోల్‌కత్తాలోని అమిత్‌ విశ్వవిద్యాలయంలో సెప్టంబరు 9 నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై సుమన్, అక్షర విద్యాలయ డైరెక్టర్‌ హరగోపాల్, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement