ఖమ్మం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి బైక్ పడిపోయిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు బైక్పై ఖమ్మం జిల్లా మణుగూరుకు సోమవారం వెళుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో దుగినేపల్లి సమీపంలోని వాగుపై ఉన్న బ్రడ్జిపైకి రాగా... బైక్ అదుపుతప్పి కిందకు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
Published Mon, May 23 2016 1:17 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement