నిడదవోలు : పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సీఐ ఎం. బాలకృష్ణ బుధవారం వెల్లడించారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
Published Wed, Oct 12 2016 11:38 PM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
నిడదవోలు : పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సీఐ ఎం. బాలకృష్ణ బుధవారం వెల్లడించారు. పట్టణానికి చెందిన షేక్ సత్తార్ చోరీలకు పాల్పడ్డాడు. అతనిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పట్టణంలో ఎస్వీఆర్కే డిగ్రీ కళాశాల సమీపంలో నిందితుడు గ్యాస్ బండను అమ్మడానికి యత్నిస్తుండగా, నిఘాపెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని శాంతినగర్, రామ్నగర్లలో ఇటీవల తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి అతను చోరీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. శాంతినగర్లో 2 ఇళ్ళల్లో రెండు ఎల్ఈడీలు, ఏడు గ్యాస్ బండలు, డీవీడీ ప్లేయర్, రెండు మిక్సీలు, 3 ఇత్తడి గిన్నెలు, ఒక రాగి చెంబును దొంగిలించినట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని సీఐ తెలిపారు.
Advertisement
Advertisement