అనంత టీడీపీలో మళ్లీ రచ్చ | Disputes between Anantapur Urban MLA Prabhakar Chowdary and JC.Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

అనంత టీడీపీలో మళ్లీ రచ్చ

Published Fri, Oct 23 2015 10:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

అనంత టీడీపీలో మళ్లీ రచ్చ - Sakshi

అనంత టీడీపీలో మళ్లీ రచ్చ

అనంతపురం : అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. అనంతపురం నగరంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ప్రారంభోత్సవంపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నెలరోజుల్లో గాంధీ విగ్రహ ప్రారంభోత్సవంపై ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి... ప్రభాకర్ చౌదరికి హుకుం జారీ చేశారు.ఓ వేళ ఆయన ఆలా చేయకుంటే తామే ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తామని జేసీ స్పష్టం చేశారు.

అయినా ప్రభాకర్ చౌదరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత ప్రభాకర్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన జేసీ బ్రదర్స్కి మధ్య అధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వర్గపోరు మరో సారి తారాస్థాయికి వెళ్లిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement