prabhakar chowdary
-
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
-
బాబు ను భయపెట్టిన తెలుగు తమ్ముళ్లు
-
టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనట్లుగానే వ్యవహారం సాగుతోంది. అందుకే తెలుగు తమ్ముళ్ళలో నుంచి త్యాగయ్యలు బయటకు వస్తున్నారు. అనంతరపురం అర్బన్ నుంచి పవన్ కల్యాణ్ పోటీచేయాలని అక్కడి మాజీ ఎమ్మెల్యే కోరుతున్నారు. పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తానని ప్రభాకర చౌదరి ప్రకటించారు. ఈ మాజీ ఎమ్మెల్యే ప్రకటన వెనుక ఉన్న మర్మం ఏంటో చూద్దాం. త్యాగం వెనక అసలు కథ అనంతపురం మున్సిపల్ ఛైర్మన్గాను.. అర్బన్ ఎమ్మెల్యే గాను పనిచేసిన వైకుంఠం ప్రభాకర చౌదరి తన సీటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేస్తానంటున్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశంలో పెత్తనం చలాయించే జేసీ బ్రదర్స్ బారి నుంచి తన సీటును కాపాడుకునే లక్ష్యంగా ప్రభాకర చౌదరి ఈ ప్రకటన చేశారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ప్రభాకర్ చౌదరికి ఎప్పటినుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నపుడు ప్రతి విషయంలోనూ ప్రభాకర్ చౌదరి జేసీతో విభేదించారు. జేసీ బ్రదర్స్ కర్రపెత్తనాన్ని సహించేది లేదని పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి... ఇటీవల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ప్రభాకర్ చౌదరి వద్ద కీలక నేతలుగా ఉన్న వారందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు జేసీ. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇప్పించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరికి ధీటుగా జేసీ వర్గం కూడా అర్బన్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. వైకుంఠం.. బలహీనం ప్రస్తుతం అనంతపురం టీడీపీలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి బలహీన పడ్డారని ఆ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని పక్కనపెట్టి దివాకర్ రెడ్డి తనయుడికి టిక్కెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. తనకు కాకుండా ప్రత్యర్థి వర్గానికి ప్రాధాన్యత దక్కడం పై అసంతృప్తి గా ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి సరికొత్త ఎత్తుగడ వేశారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్-చంద్రబాబుల భేటీని తన పొలిటికల్ కెరీర్కు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ జరగగానే.. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని.. ఆయన కోసం నా సీటును త్యాగం చేస్తానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇలా చెప్పటం వల్ల పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలన్నది ప్రభాకర్ చౌదరి ఎత్తుగడ. ఎలాగూ అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయరు కనుక.. టిక్కెట్ తనకే దక్కుతుందని.. జేసీ దివాకర్ రెడ్డిపై పైచేయి సాధించవచ్చన్నది ప్రభాకర్ చౌదరి ఎత్తుగడ అని చెబుతున్నారు. తనకు కాకుండా జేసీ తనయుడికి అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించినా.. పవన్ కళ్యాణ్ సపోర్ట్తో తనకే టిక్కెట్ వచ్చేలా ప్రభాకర్ చౌదరి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీటు కాపాడుకోవడానికి టీడీపీలో ప్రతి ఒక్కరు బాగా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ కారిడార్: సీటు కాపాడుకునేందుకు ప్రభాకర్ చౌదరి ప్లాన్
-
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత
పెదపూడి/రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు (72) కరోనా బారిన పడి ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన, భార్య జగ్గయమ్మ 20 రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వారం రోజుల్లో జగ్గయమ్మకు కరోనా వైద్య పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు రావడంతో ఇంటికి వచ్చేశారు. భాస్కర రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్దాడ గ్రామానికి 1971 నుంచి 1981 వరకు ఏకగ్రీవ సర్పంచ్గా పని చేశారు. 1982లో సామర్లకోట సమితి అధ్యక్షునిగా పనిచేశారు. టీడీపీలో చేరి 1984లో జిల్లా పరిషత్ చైర్మన్గా, 1994 నుంచి 1999 వరకు, 1999 నుంచి 2004 వరకు పెద్దాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. 2013లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి 2014 డిసెంబర్లో మళ్లీ టీడీపీలో చేరారు. సీనియర్ నేతగా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి మృతి కార్మిక నేత, కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి (96) ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మృతి చెందారు. నూరు సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో 80 ఏళ్లు ప్రభాకర చౌదరి ఉద్యమనేతగా ఉన్నారు. 1952లో రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో కూడా గెలిచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏడు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం సాగించారు. ఆయన మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటని పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. చదవండి: కరోనా టెస్టుల్లో రికార్డు నిన్ను నమ్మం బాబూ.. -
ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘గత ప్రభుత్వ నిర్వాకంతో నగరంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. రూ.191 కోట్ల పైప్లైన్ పనులు సకాలంలో చేయించకపోవడంతో ప్రపంచ బ్యాంకు నిధులు వెనక్కు వెళ్లాయి. ఏపీఎండీపీ పైప్లైన్, అమృత్ స్కీం పనులు సాగక నగరం గుంతలమయం అవడానికి, ప్రజల కన్నీటి కష్టాలకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే ‘అనంత’ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రూ.15 కోట్లతో పైప్లైన్ పనులు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. రూ.4 కోట్లతో పైప్లైన్ కోసం తీసిన గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సర్వజనాస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రూ.250 కోట్లతో 700 పడకల సామర్థ్యంతో అదనపు భవనం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, ఈ విషయంలో ఎమ్మెల్యే అనంత కీలకంగా వ్యవహరించా రన్నారు. స్టాఫ్నర్సుల డిప్యుటేషన్పై సకా లంలో స్పందించి, తిరిగి వారు సర్వజనాస్పత్రికి వచ్చేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ప్రభాకర్చౌదరి.. ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాస్తామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. ఆపరేషన్ కోసం ఇతర ప్రాంతానికి వెళితే దాన్ని బూతద్దంలో చూడడం సరికాదన్నారు. త్వరలోనే ఆయన నగరానికి రానున్నారని, గత ప్రభుత్వం కంటే భిన్నంగా అభివృద్ధి చేసి చూపుతారన్నారు. -
చౌదరి గన్ మెన్ల దౌర్జన్యం
అనంతపురం రూరల్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గన్మెన్లు దౌర్జన్యాలకు తెరలేపారు. పేదలకిచ్చిన స్థలాలను ఎమ్మెల్యే పేరు చెప్పి బలవంతంగా అక్రమించుకుంటున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ హుకుం జారీ చేశారని ఎ.నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెందిన రామాంజినమ్మ, మాబున్నీలకు 2007లో ఇందిరమ్మ కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్నారు. 70 శాతం మేర ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అయినా బిల్లులు రాలేదు. దీంతో ఇంటి నిర్మాణ పనులు ఆపేసి బాడుగ ఇంట్లో జీవసం సాగిస్తున్నారు. ఇదే అదునుగా భావివంచిన ఎమ్మెల్యే గన్మెన్లు హరి, నబిరసూల్లు ఖాళీగా ఉన్న ఆ రెండు ఇళ్లను తమ అధీనంలోకి తీసుకొని నేల మట్టం చేశారు. స్థలాలను ఆక్రమించి పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం తమకు మంజూరు చేసిన స్థలంలో మీరు ఎలా ఇంటి నిర్మాణ పనులు చేపడతారని ప్రశ్నిస్తే ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మీ పేర్ల మీద ఉన్న పట్టాలను రద్దు చేయించాం. మీకు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోండం’టూ దౌరజ్జన్యం చేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యా రు. పనులకు వెళ్లి పొట్ట నింపుకునే బడుగు జీవులపై పెత్తనం చెలాయించడాన్ని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే గన్మెన్లు తమ పేర్ల పైన ఇంటి పట్టాలు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని తెలిసి, వారి సమీప బంధుల పేరిట పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. -
ఏం అభివృద్ధి చేశావయ్యా
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావయ్యా? రోడ్లు లేవు. కాలువల్లేవ్. గలీజు నీళ్లలతో తిరుగుతున్నామయ్యా అంటూ’ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరిని రంగమ్మ అనే వృద్ధురాలు నిలదీసింది. మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి, మేయర్ స్వరూప, కార్యకర్తలతో కలిసి 20వ డివిజన్ మిస్మమ్మ కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉండే మిసమ్మ కాలనీలో వృద్ధురాలు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. మేయర్, కార్యకర్తలు సైతం ఏమీ మాట్లాడలేకపోయారు. అభివృద్ధి ఏం చేయలేదో చెప్పాలని ఎమ్మెల్యే వృద్ధురాలిని ప్రశ్నించాడు. పింఛన్ ప్రతి నెలా రూ. 2వేలు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ వృద్ధురాలు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించింది. పింఛన్ ఎవరికి కావాలని, కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఎలాగన్నారు. వృద్ధురాలు.. అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడంతో ఎమ్మెల్యే, మేయర్ అక్కడి నుంచి జారుకున్నారు. -
‘అనంత’ టీడీపీలో భగ్గుమన్న సెగలు
సాక్షి, అనంతపురం : అనంతపురం అర్బన్ టీడీపీలో నిరసన సెగలు భగ్గుమన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. ప్రభాకర్ చౌదరిపై ప్రజా వ్యతిరేకత ఉన్న కారణంగా ఆయనను మార్చాలని టీడీపీ నేత మునిరత్నం డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ అన్ని వర్గాలు ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకిస్తున్నాయి. ఆయనకు సీటు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. నాకు సీటు ఇస్తామని స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభాకర్ చౌదరికి సీటు ఇస్తే సహకరించేది లేదు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయాన్ని సుజనా చౌదరికి, యనునమలకు స్పష్టంగా చెప్పాము అని పేర్కొన్నారు. బలిజలకు అన్యాయం జరుగుతోంది.. అనంతపురం టీడీపీ అర్బన్ సీటును బలిజలకు కేటాయించాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో బలిజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ అనంత అర్బన్ సీటును బలిజలకు ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. అనంతపురంలో జేసీ మాట కూడా చెల్లుబాటు కాలేదని ఆయన వర్గీయులు వాపోయారు. గుంతకల్, అనంతపురం టిక్కెట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తే ఓటమి తప్పదని జేసీ హెచ్చరించినా వారికే టికెట్లను కేటాయించి చంద్రబాబు ఆయనకు షాక్ ఇచ్చారు. ఆయనను నమ్ముకుని టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు కూడా భంగపాటు తప్పలేదు. మరోవైపు జేసీ సూచించినట్లుగా శింగనమల అసెంబ్లీ స్థానాన్ని బండారు శ్రావణికి కేటాయించడంతో...సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై యామినీ బాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని శ్రావణికి టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు.(అలా అయితే మాకు ఓటమే : జేసీ) -
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
-
సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత
-
సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెట్రోల్ పోసుకుని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, బలిజ కులస్తులు పెద్ద సంఖ్యలో సీఎం నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా బలిజలు సీఎం ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ప్రభాకర్ చౌదరికి సీటు ఇవ్వకూడదని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ చౌదరి స్థానంలో బలిజలకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ చౌదరి బలిజలని అణచివేస్తున్నాడని వారు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని నిలువరించి, అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభాకర్చౌదరికి బలిజల షాక్
అనంతపురం కల్చరల్: ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు హెచ్చరించారు. గురువారం సాయంత్రం బాలాజీ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తనకు మళ్లీ సీటొచ్చినట్లు ప్రచారం చేసుకోవడాన్ని బలిజ సంఘం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత నిరంకుశంగా ఉంటూ అందరూ వ్యతిరేకిస్తుంటే ఇంకా సీటొస్తుందని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే డాక్టర్ మునిరత్నం అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా బలంగా ఉన్న సామాజిక వర్గాన్ని విస్మరిస్తే గుణపాఠం చెప్పితీరుతామన్నారు. ఈసారి కచ్చితంగా బలిజ అభ్యర్ధిని ఎమ్మెల్యేగా చూస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకటరత్నం, ఘంటా సతీష్, లక్ష్మీనారాయణ, రామశేషయ్య, రాజేష్, దినేష్ పాల్గొన్నారు. -
బీకేకు అసమ్మతి సెగ
పెనుకొండ: టీడీపీలో అసమ్మతి సెగ తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులే ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దంటూ పెనుకొండకు చెందిన ముఖ్య నాయకులు కొందరు ఏకంగా సీఎం చంద్రబాబు వద్దే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడోరేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే పార్థసారథి సైతం టికెట్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి ముందే రాజధానికి చేరుకున్న పలువురు అసమ్మతినేతలు ఎమ్మెల్యే బీకేకు టికెట్ ఇవ్వరాదని పెద్దఎత్తున రచ్చచేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బీకే గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి, అవినీతి, అక్రమాలు, ఏకపక్ష ధోరణిపై భగ్గుమంటున్న పెనుకొండ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణస్వామి, పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూరి, సీనియర్ టీడీపీ నాయకులు జీవీపీ నాయుడు ఇతర నాయకులు టికెట్ విషయంలో అడ్డుపడినట్లు సమాచారం. సీఎంకు సన్నిహితంగా ఉన్న మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు, తదితర మంత్రులను సైతం కలిసిన నాయకులు ఎమ్మెల్యే బీకే వ్యవహారశైలిని వివరించినట్లు తెలిసింది. అయితే సకాలంలో నాయకులు సీఎం వద్దకు చేరే పరిస్థితి లేకపోవడంతో సీఎం ఏకపక్షంగా టికెట్ బీకేకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అసమ్మతి నేతల ద్వారా ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సీఎం మళ్లీ మాట్లాడదాం అంటూ దీనిపై మౌనం వహించినట్లు తెలిసింది. రగులుతున్న అసంతృప్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీకే తీరుపై సీనియర్లలో అసంతృప్తి రగులుతోంది. ఇప్పటికే అనేక మంది టీడీపీ ముఖ్యులు వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. సోమందేపల్లి పట్టణానికి చెందిన ఓ ప్రముఖ చేనేత నాయకుడికి సోమందేపల్లిలో ఎంతో పేరుంది. అలాంటి నాయకుడిని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరవర్గం తీవ్ర అవమానానికి గురిచేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆయన పార్టీలో ఉండటం కంటే బయటికి పోవడమేæ మేలనీ, అతన్ని పెద్దగా పట్టించుకోవద్దంటూ ఎమ్మెల్యే నుంచే ఆదేశాలు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అదే గ్రామంలో దివంగత జెడ్పీ చైర్మన్ బంధువు, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఉపసర్పంచ్ సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిగి, పెనుకొండ, రొద్దం, గోరంట్ల మండలాల్లో అసమ్మతి నేతలు.. ఎమ్మెల్యే నీడలా నడుస్తూ ఆయన ఓటమిని చూడాలని తహతహలాడుతున్నారు. ఇక తన సామాజిక వర్గమైన కురుబ కులస్తుల్లో సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విచారంలో ఎంపీ నిమ్మల బీకే. పార్థసారథికే సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఎంపీ నిమ్మల క్రిష్టప్ప తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ద్వేషం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన ఎంపీ కిష్టప్ప జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎలాగైనా పెనుకొండ టికెట్ను తనకుమారుడి, లేదా తనకైనా తెచ్చుకోవాలని భావించిన నిమ్మల ఆశలకు గండిపడటంతో దిక్కుతెలియని పరిస్థితిలో ఉన్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్ళు తాను ఎదుర్కొన్న అవమానాలపై ఎంపీ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఎమ్మెల్యే బీకే.పార్థసారథి గెలుపు కష్టసాధ్యమేనన్న ప్రచారం జరుగుతోంది. -
అనితను ఓడిస్తామని హెచ్చరిక..
-
తెగని పంచాయితీ!
ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. టిక్కెట్లు ఖరారు చేసేందుకు ‘అనంత’ టీడీపీ నేతలను అమరావతికి పిలిపించిన ఆ పార్టీ అధినేతచంద్రబాబు అభ్యర్థుల సంగతి ఎటూ తేల్చలేకపోయారు. ఆరు నియోజకవర్గాలకే అభ్యర్థులను ఖరారు చేసి, 8 స్థానాలను పెండింగ్లో ఉంచారు. వారం రోజులోపు అభ్యర్థులను ప్రకటిస్తానని, ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలని సూచించారు. చంద్ర బాబు ప్రకటనతో ఆయన బావమరిది బాలకృష్ణ మినహా తక్కిన 7 నియోజకవర్గాల్లోని సిట్టింగ్ల్లో గుబులు మొదలైంది. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడం, కొన్నిటికి మాత్రమే హామీ ఇచ్చి, తక్కిన స్థానాలను పెండింగ్లో ఉంచడంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆపార్టీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు కబురు పంపారు. దీంతో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన నేతలు బుధవారం ఉదయం 9 గంటలకే అమరావతిలో సీఎం నివాసం ఉంటున్న ఉండవల్లికి చేరుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మంత్రి జవహర్ సమక్షంలో ప్రత్యేకంగా టెంట్లు వేసి నియోజకవర్గాల వారీగా అభిప్రాయసేకరణ జరిపారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు! జిల్లాలోని 14 స్థానాల్లో హిందూపురం మినహా తక్కిన 13 స్థానాల్లో 7 స్థానాలకు మాత్రమే అభిప్రాయ సేకరణ జరిగింది. దీంతో అభిప్రాయసేకరణ జరగని 6 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్లే అని మంత్రులు సూచన ప్రాయంగా నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వీటిలో తాడిపత్రి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు జేసీ అస్మిత్రెడ్డి, పెనుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, రాప్తాడు నుంచి పరిటాల సునీత టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులకు బరిలోకి దిగనున్నట్లు తేల్చారు. వీరితోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారిక ప్రకటన చేయకపోయినా వీరే అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ఆయా నేతలతో పాటు కార్యకర్తలకు సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. పెండింగ్లో 8 స్థానాలు ప్రకటించిన 6 స్థానాలు మినహా అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో హిందూపురం మినహా తక్కిన 7 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొదట కళ్యాణదుర్గం సమీక్ష జరిగింది. ఇందులో అభిప్రాయసేకరణ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి వ్యతిరేకవర్గానికి చెందిన రామ్మోహన్చౌదరి, మల్లిఖార్జున, నారాయణ, రమేశ్తో పాటు పలువురు తీవ్రస్థాయిలో వ్యతిరేకంచారు. చౌదరి అయితే ఓడిపోతారని, అతన్ని మార్చాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కూడా వ్యతిరేకవర్గంపై మాటల దాడికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అక్కడంతా గందరగోళంగా మారింది. దీంతో ఎవరి అభిప్రాయాన్ని వారు కాగితాలపై రాసి ఇవ్వాలని కోరారు. ప్రభాకర్చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దు కళ్యాణదుర్గం టికెట్ విషయంలో జరిగిన రభసను దృష్టిలో ఉంచుకుని అనంతపురం నియోజకవర్గంపై అభిప్రాయ సేకరణ ప్రారంభం కాగానే... అభ్యర్థిత్వంపై ఎవరు ఏమీ మాట్లాడొద్దని, అభిప్రాయాలు కాగితాల్లో రాసివ్వాలని మంత్రి దేవినేని చెప్పారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులకు 63 మంది అక్కడకు వచ్చేందుకు అనుమతిచ్చారు. జకీవుల్లా, జయరాం వర్గీయులను 20 మందినే అనుమతించారు. దీంతో అభిప్రాయాన్ని చెప్పకుండా చౌదరి వ్యతిరేకవర్గం సభను బాయ్కాట్ చేసి బయటకు వచ్చేశారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని, నియోజకవర్గంలో పార్టీ బలహీనపడటంతో పాటు కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నేతలను కూడా ‘పల్లె’ నిర్లక్ష్యం చేశారని చంద్రమోహన్ అనే కార్యకర్త మాట్లాడారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి గన్మన్ చంద్రపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలంతా ‘పల్లె’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పుట్టపర్తి అభిప్రాయ సేకరణలోనూ గందరగోళం జరిగింది. తర్వాత శింగనమల, మడకశిర, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాలపై అభిప్రాయసేకరణ చేశారు. వీటితో పాటు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి సంగతి కూడా తేల్చలేదు. ఇక హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశానికి రాలేదు. హిందూపురం నుంచి బాలకృష్ణే బరిలో ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. పదిరోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటిస్తానన్న చంద్రబాబు అభిప్రాయ సేకరణ తర్వాత 14 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసగించారు. వారం, పదిరోజుల్లోపు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రకటిస్తానని చెప్పారు. ఎవరికి టిక్కెట్ వచ్చినా, రాకపోయినా అంతా పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. విభేదాలను పక్కనపెట్టాలని, వాటి సంగతి తాను చూసుకుంటానన్నారు. ఏదిఏమైనా బు«ధవారం సమావేశంతో గుంతకల్లు, శింగనమల స్థానాలకు కచ్చితంగా అభ్యర్థులు మారతారని స్పష్టమైంది. అనంతపురం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను మార్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా బుధవారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ గైర్హాజరయ్యారు. గుప్తా చేరికతో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్కు టిక్కెట్ దక్కదనే ప్రచారం సాగుతోంది. గుప్తాకు గుంతకల్లు టిక్కెట్ దాదాపు ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తనను కాదని గుప్తాకు టిక్కెట్ ఇస్తే పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని జితేంద్ర పార్టీ నేతలతో తే ల్చిచెప్పినట్లు తెలుస్తోంది. -
సిట్టింగ్లకు వ్యతిరేకంగా.. అసంతృప్తుల పోరు..
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఓ వైపు డేటా చోరీ ఆరోపణలు.. మరోవైపు సొంత పార్టీలో విభేదాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ అసంతృప్త నేతలు ఆందోళనకు దిగుతుండటంతో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందుకోసం అమరావతిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేతలు తమ అసంతృప్తిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా పాయకరావుపేట, అనంతపురంలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారు. అనితను ఓడిస్తామని హెచ్చరిక.. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అనిత అవినీతిపై నియోజకవర్గం నేతలు రెండు పేజీల లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను వారు చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనిత పాదయాత్రను అడ్డుకున్న నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనితకు ఎమ్మెల్యే సీటు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పాయకరావుపేట టీడీపీ సమీక్షా సమావేశంలో అనిత అవినీతిపై నిలదీయడానికి అసంతృప్త నేతలు సిద్దమవుతున్నారు. టీడీపీకి రాజీనామా యోచనలో మాజీ ఎంపీ.. సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంపురం ఎమ్మెల్యే టికెట్ తిరిగి ప్రభాకర్ చౌదరికి ఖరారు చేయడంతో స్థానిక టీడీపీ అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతి నుంచి అనంతపురం బయలుదేరిన సైఫుల్లా వర్గం నేతలు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. సైఫుల్లాతో పాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ నూరమ్ మహ్మద్, పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు, జకీవుల్లా, లక్ష్మీపతి, 15 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. -
‘ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దు.. ఇస్తే ఓడిస్తాం’
సాక్షి,అనంతపురం : అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై అసమ్మతి వర్గం భగ్గుమంది. నగర టీడీపీ మాజీ అధ్యక్షుడు జయరాం నాయుడు ఆధ్వర్యంలో అసమ్మతి నేతల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అసమ్మతి వర్గం ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. ప్రభాకర్ చౌదరి ఏకపక్ష వైఖరి వల్లే టీడీపీ సీనియర్ నేతలు నడిరోడ్డున పడ్డారని ఆరోపించారు. ఆయన ఇప్పటికే అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు, ఒక్కో కార్పోరేటర్ టికెట్ కోసం పది లక్షల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాగోతంపై త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే
-
జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఫైర్ అయ్యారు. తనపై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. అనంతపురం లలితా కళా పరిషత్లో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి జేసీ సిద్ధమవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంట్రాక్టర్గా పనులు చేసినంత మాత్రానా అన్నిహక్కులు వస్తాయా? అని ప్రశ్నించారు. పీస్ మెమొరియల్ హాల్కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెడితే జేసీ దివాకర్ రెడ్డికి ఎందుకంత కడుపు మంట? అని మండిపడ్డారు. తన ఓపికను పరీక్షించొద్దని జేసీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇక అనంతపురంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాంనగర్ బ్రిడ్జి విషయంలోనే ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం నెలకొంది. ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు జేసీ సిద్దమవుతున్నారని ప్రభాకర్ చౌదరి అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలోనే జేసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఈ ఇద్దరి నేతల మధ్య మాటల వార్ నడిచింది. -
‘జన్మభూమి’ లో టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం : జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. సమస్యలపై నిలదీసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త విజయభాస్కర్రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల ఏకపక్ష వైఖరిపై కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు శ్రీదేవి, విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు శ్రీదేవి, విజయభాస్కర్రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడి, దూషించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. 46వ డివిజన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయిన కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు జారుకున్నారు. శారదనగర్లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు చించివేశారు. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజా ఆదరణ పెరుగుతుందని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ నేతల అవినీతిపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. -
జేసీపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
-
‘నిరూపిస్తే నా తల నరుక్కుంటా’
సాక్షి, అనంతపురం: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు బయట పడుతున్నాయి. టీడపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎంపీ జేసీ దివారక్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జేసీకి వయస్సు మీద పడింది కానీ బుద్ధి రాలేదని అన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం అసలుకు లేవు, అందుకే నీ అమ్మా, అబ్బా అంటూ తిడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో దివాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఆధికారులను, మీడియాను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను తలుచుకుంటే జేసీ కంటే ఎక్కువ తిట్టగలను, కానీ సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. నిరుపిస్తే తల నరుక్కుంటా... జేసీ నీకు దమ్ము, దైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరుపిస్తే తల నరికేసుకుంటానని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎంపీ దివాకర్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డుపడుతున్నారని వాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, గన్ మెన్లు లేకుండా నేను తిరిగేందుకు నేను సిద్ధం మీరు సిద్ధామా అని సవాల్ చేశారు. నా సహనానికి ఓ హద్దు ఉంది, నా సహనాన్ని పరీక్షించొదని పరీక్షిస్తే ఖబడ్దారు అని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఆగడాలకు తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. జేసీ తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదని, దివాకర్ రెడ్డి వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని వాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జేసీ దౌర్జన్యాలను సహించేది లేదు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. మేమంతా కలసి జేసీని గెలిపిస్తే తాను మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఎంపీ జేసీ వల్ల టీడీపీకి చాలా సష్టం జరుగుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభివృద్ధికి వారిద్దరే ఆటంకం
అనంతపురం సెంట్రల్: ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి, మేయర్ స్వరూప వల్ల టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మండిపడ్డారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నాలుగేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అంతా అవినీతి, అక్రమాలేనని ధ్వజమెత్తారు. కోర్టురోడ్డులోని చారిత్రాత్మక భవనం పీస్ మెమోరియల్ హాల్ ఆధునికీకరణపై అనేక విమర్శలు వస్తున్నాయన్నారు. çపురాతన భవన స్థలాలను అద్దెకు ఇచ్చుకున్నారని, ఇందులో ఎవరెవరికీ ఎంత వాటాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆయన భారతం రాసినట్లు నాలుగు పేజీల లేఖ రాస్తూ వివరణ పంపారని వివరించారు. జాతీయ రహదారిలో ఓ నేత రెండు సెంట్ల స్థలం రాయించుకుని.. ఎనిమిది సెంట్లను అక్రమించుకున్నాడని ఆరోపించారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, త్వరలోనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. అనంతపురం నగర అభివృద్ధిని వారిద్దరూ అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధించాలని తాను తీవ్రంగా శ్రమించగా.. దీన్ని కూడా రాజకీయం చేసి అడ్డుకున్నారని బాధపడ్డారు. అందువల్లే మరువ వంకను గతేడాది పరిశుభ్రం చేసినా.. మళ్లీ యథావిధిగా ప్లాస్టిక్తో నిండిపోయిందన్నారు. అలాగే రోడ్ల వెడల్పు విషయంలో కొంతమంది నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకొని కోర్టును ఆశ్రయించేలా పురమాయించారన్నారు. అంత వెడల్పు అవసరమా అంటూ రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించకుండా అడ్డుపుల్ల వేయడానికి యత్నించారన్నారు. పేరుకు ‘అవే’ పేరుతో నీతులు చెబుతున్నారని... అవే లేదు.. ఏం లేదంటూ చిందులు తొక్కారు. ఇంటిపైన రాళ్లు పెట్టుకున్న నీచ సంస్కృతిని ఆయనదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదిరి తీరును తూర్పారబట్టారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. కనీసం మీడియానైనా బాధ్యతగా వీరి అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. ఇక జిల్లా పోలీసులకు చేవ లేకుండా పోతోందని ఎంపీ జేసీ అన్నారు. పోలీసుల తీరు వల్లే శాంతి భద్రతలు కాపాడటం ఇబ్బందిగా మారిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటూ నేరస్తులకు కూడా రాచమర్యాదలు చేస్తున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. -
సొంతపార్టీ నేతపై జేసీ సంచలన వాఖ్యలు
సాక్షి, అనంతపురం : వర్గ విభేదాలతో అనంతపురంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాకర్పై జేసీ బుధవారం సంచలన వాఖ్యలు చేశారు. అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్కియాలజీకి అప్పగించిన పీస్ మెమోరియల్ హాల్పై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేషన్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. -
రౌడీ కార్పొరేటర్!
వైద్యులను కనిపించే దేవుళ్లుగా కీర్తిస్తారు. అందునా మహిళా వైద్యురాలు విధి నిర్వహణలో ఉండగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ తన రౌడీయిజంతో కన్నీళ్లు పెట్టించారు. గౌరవనీయంగా ‘గారూ..’ అని సంబోధించడాన్ని కూడా తప్పుపట్టి కార్పొరేటర్ నటేష్ చౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడిన తీరుతో వైద్య సమాజం గుండెలవిసేలా రోదిస్తోంది. న్యాయం కోసం పోలీసు స్టేషన్ తలుపు తడితే.. రౌడీ కార్పొరేటర్కు రెడ్ కార్పెట్ పర్చడం విమర్శలకు తావిస్తోంది. ♦ గతేడాది జనవరి 2న అరవిందనగర్కు చెందిన ప్రకాష్గౌడ్ అనే మానసిక వికలాంగున్ని చితకబాదుతున్న కార్పొరేటర్లు నటేష్చౌదరి, సరిపూటి రమణ. పింఛన్ కోసం కమిషనర్ వాహనాన్ని అడ్డుకున్నందుకు కార్పొరేటర్లు నడిరోడ్డుపైనే చావబాదారు. బాధితుడు అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ♦ 2015 అక్టోబర్లో మేయర్ స్వరూప క్యాంపు కార్యాలయంలో ఉన్న కమిషనర్ ఉమామహేశ్వర్ పై పూడిక బిల్లు విషయంలో కార్పొరేటర్ నటేష్ చౌదరి రాడ్తో దాడి చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో మేయర్ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ఇంటి వద్దకు వచ్చి ఇలా చేయడమేంటని చీవాట్లు పెట్టారు. ఈ విషయమై కమిషనర్ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడగా రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోయారు. ♦ తాజాగా ఈ నెల 18న సర్వజనాస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లీశ్వరిని ‘‘ నీకు డాక్టర్ ఉద్యోగం ఇచ్చిన వాళ్లను చెప్పుతో కొట్టాలి.. నీ అంతు చూస్తా. ఎలా తిరుగుతావో. మా ప్రభుత్వంలో నీ ఆటలు సాగవు.’’ అని హెచ్చరించాడు. 30 మంది కార్యకర్తలతో కలసి వైద్యురాలిపై దాడికి యత్నించాడు. ఈ ఘటనతో వైద్యురాలు కన్నీటి పర్యంతమైంది. ♦ గతేడాది సెప్టెంబర్లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్(టీడీపీ)పై నటేష్ చౌదరి దాడి చేస్తున్న దృశ్యం ఇది. అగ్రవర్ణాల డివిజన్లకు పెద్దపీట వేసి, బీసీలను విస్మరిస్తున్నారని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఒక్కసారిగా నటేష్ చౌదరి కార్పొరేటర్ ఉమామహేశ్వర్పై చేయి చేసుకున్నాడు. అనంతపురం న్యూసిటీ: ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో ప్రజలతో పాటు అధికారులు కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, 37వ వార్డు కార్పొరేటర్ నటేష్చౌదరి(టీడీపీ) విధి నిర్వహణలోని మహిళా వైద్యురాలి పట్ల వ్యవహరించిన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో ఆమె కన్నీటి పర్యంతమైనా.. ఎమ్మెల్యే పరామర్శించకపోగా, కార్పొరేటర్కు మద్దతుగా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. తమ మాట వినకపోతే భౌతిక దాడులకు కూడా వెనుకాడేది లేదన్నట్లు నటేష్ చౌదరి తన చర్యలతో చెప్పకనే చెప్పారు. పైగా తమ ప్రభుత్వంలో మీ ఆటలు సాగబోవని ప్రభుత్వ వైద్యురాలిపై బెదిరింపులకు పాల్పడటం.. ఆసుపత్రిలో అలజడి సృష్టించడంతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు జీ హుజూర్ రోడ్డుపై గుంపుగా నిలబడితేనే తాట తీసే పోలీసులకు కార్పొరేటర్ నటేష్ అరాచకాలు కన్పించకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జీ హుజూర్ అంటూ కార్పొరేటర్కు పోలీసులు రెడ్కార్పెట్ పర్చడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 18న సర్వజనాస్పత్రిలో నటేష్దౌర్జన్యంపై 300 మంది వైద్యులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. బాధిత వైద్యురాలితో కలిసి వైద్య సంఘాలు టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్తో ఇంటికి పంపడం చూస్తే అధికార పార్టీ ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని పోలీసులు చెప్పకనే చెప్పారు. గతంలో పలు మర్డర్ కేసుల్లో అరెస్టు అయిన ఈ ‘రౌడీ’ కార్పొరేటర్ను కూర్చోపెట్టి బెయిల్ ఇచ్చి పంపడం పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం. -
జేసీతో విభేదాలు.. సీఎంను కలిసిన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బట్టబయలు కాగా, వివాదం మరింత ముదరకుండా చూసేందుకు పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఓ ఎమ్మెల్యేను పిలిపించి నేరుగా మాట్లాడి గొడవలుంటే సర్దుకుపోవాలని సర్దిచెప్పడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలెవరంటే ఒకరు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాగా, మరొకరు పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. గత కొంతకాలం నుంచి కొనసాగుతున్న వర్గపోరు నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమ్మన్నందుకే వచ్చి ఆయనను కలిసినట్లు తెలిపారు. జేసీ దివాకర్రెడ్డితో వివాదాలు ఉంటే సర్దుకుపోవాలని చంద్రబాబు తనకు సూచించినట్లు ప్రభాకర్ చౌదరి చెప్పారు. జేసీ దివాకర్రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే విభేదాలున్నాయని చంద్రబాబుకు వివరించగా.. ప్రజల కోసం మీ ఇద్దరూ కలిసి పనిచేయడంపై దృష్టిసారించాలని చెప్పారు. ఎంపీ జేసీనే తనపై సీఎంకు ఫిర్యాదు చేసి ఉంటారన్న ఆయన.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. 1996లో తాను మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు అనంతపురంలో రోడ్ల నిర్మాణ విషయంలో కొన్ని రాజకీయ విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ప్రభాకర్ చౌదరి అంగీకరించారు. పార్లమెంట్ సభ్యుడి (ఎంపీ)గా ఆయన పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అధికారం జేసీ దివాకర్రెడ్డికి ఉందన్నారు. అదే విధంగా తన నియోజకవర్గ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమేనని ఎమ్మెల్యే అన్నారు. -
చౌదరి..ఏమి చేస్తిరి!
అనంతపురం న్యూసిటీ: టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరంలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామనీ, అందువల్లే ‘అనంత‘ అభివృద్ధికే చిరునామాగా మారిందని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గొప్పలు చెబుతున్నారు. అంతేకాదు..ఇటీవలే అట్టహాసంగా ఓ కార్యక్రమం నిర్వహించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. కానీ ఆ స్థాయిలో నిధులు వెచ్చించింటే నగరం ఇంకా ఇలాగే ఉందేమిటబ్బా..అని జనం చర్చించుకుంటున్నారు. తాగునీరు లేక.. చెత్తతరలించక.. సంక్షేమ పథకాలు వర్తించక నగరజీవి అల్లాడిపోతున్నాడు. రోడ్డెక్కితే ట్రాఫిక్ సమస్య..రోగమొచ్చి ఆస్పత్రికి వెళ్తే సకాలంలో వైద్యం అందక సతమతమవుతున్నాడు. అనుచరుల దందా..! ప్రజలకు జవాబుదారీతనంగా,నీతి, నిజాయతీగా, భావితరాలకు ఆదర్శంగా తాము ఉంటున్నామని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గొప్పలు చెబుతుండగా.. ఆయన అనుచరులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడుగా పేరున్న కాపు ఫెడరేషన్ డైరెక్టర్ రాయల్ మురళీ.. తపోవనం సమీపంలోని 16 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి.. తన తల్లి పేరు మీద మార్చుకుని నిర్మాణం చేపడుతున్నాడు. దొంగ పట్టాలు సృష్టించారని తహసీల్దార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని అధికార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్న మాట వాస్తవం కాదా..? కమిషనర్లపై దాడులకు పాల్పడిన సంఘనలు నిజం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. టెం‘ఢర్’ : నగరంలో అభివృద్ధి పనులు చేయాలంటే కాంట్రాక్టర్లకు టెం‘ఢర్’ భయం పట్టుకుంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు సంబంధించి రూ. 30 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. కానీ పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. మొత్తం 160 అభివృద్ధి పనుల్లో 90 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పైప్లైన్ పనులు అస్తవ్యస్తం : ఏపీఎండీపీ పైప్లైన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కా ప్రణాళికతో పనులు చేయకపోతే భవిష్యత్ తరాలకు నీరు సక్రమంగా అందే పరిస్థితి ఉండదని నగరపాలక సంస్థ వర్గాలంటున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పైప్లైన్ కనెక్షన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మురుగు కాల్వలను ఆనుకుని నీటి పైప్లైన్ కనెక్షన్స్ వేస్తుండడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పైప్లైన్ పనులకు అధికార పార్టీ నేతలు డబ్బులు తీసుకున్నారని ‘జన్మభూమి– మా ఊరు’ సభలో టీడీపీ నేత జయరాం నాయుడే విమర్శించారు. ప్రజారోగ్యం గాలికి : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. సిబ్బంది కొరతతో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. 124 జీఓ అమలైతే 649 పోస్టులు మంజూరు అవుతాయని తెలిసీ.. స్పందించిన దాఖలాలు లేవు. ఇక ఆస్పత్రిలో ప్రతి పనికీ డబ్బులు చెల్లించాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మందుల కొరత పట్టిపీడిస్తోంది. పారిశుద్ధ్యానికి ప్రతి నెలా రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నా... పారిశుద్ధ్యం మెరుగుపర్చడం లేదు. దీనిపై ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు స్పందిస్తే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందుతాయని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. పెన్షన్ పరేషాన్ : టీడీపీ అధికారంలోకి రాగానే వేల మంది పింఛన్లు తొలగించిన నేతలు.. ఇప్పుడు వారందరినీ ఇళ్లవద్దకు తిప్పుకుంటున్నారు. ఈ నాలుగేళ్లలో నాలుగువేల పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చెబుతున్నా..ఇంకా మరో 7 వేల మంది లబ్ధిదారులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే నివాసంలోని కంప్యూటర్లో నమోదు చేస్తేనే పింఛన్ వస్తుందని జనం చెప్పుకుంటున్నారు. -
ప్రభాకర్ చౌదరిపై తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నియోజకవర్గంలోని అధికార పార్టీలో మరోసారి చిచ్చు రేగింది. పార్టీ ఆవిర్భావం రోజు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా వర్గీయులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. సైఫుల్లా నివాసంలో ఆయన తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీవుల్లా నేతృత్వంలో సమావేశమయ్యారు. సమావేశానికి పార్టీ నేతలు జయరాంనాయుడు, లక్ష్మీపతి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైవుద్దీన్, కార్పొరేటర్లు ఉమామహేశ్వర్, లాలెప్పతో పాటు మరికొందరు కార్పొరేటర్లకు సంబంధించిన కుటుంబసభ్యులు, కోఆప్షన్ సభ్యులు మున్వర్, కృష్ణ కుమార్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. వీరంతా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో శ్రమించిన కార్యకర్తలకు నాలుగేళ్ల అధికారంలో ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ‘పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీ చూసుకుంటుందని, తన కోసం పాటు పడినవారిని తాను చూసుకుంటాన’ని వ్యాఖ్యానిస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే కార్యకర్తల సంక్షేమంపై ఎమ్మెల్యేకు ఏమేరకు చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని జయరాంనాయుడు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన వారికి పదవులు కట్టబెట్టారని టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళీని ఉద్దేశించి మాట్లాడారు. ఏ రోజూ టీడీపీ జెండా మోయని గంపన్నకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టారన్నారు. ఎమ్మెల్యే తీరుతో మరో 20 ఏళ్లు పార్టీ గెలిచే పరిస్థితి లేదని అంతా అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లి, తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఆలోచిద్దామని జకీవుల్లా తెలిపినట్లు తెలిసింది. -
‘పవన్పై పోటీచేసి సత్తా చూపిస్తా’
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ చేతుల్లో ఉన్నారనే విషయాన్ని మూడు నెలల క్రితమే చెప్పానని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వామపక్షాలు జనసేనాని వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని గమనించలేకపోతున్నాయన్నారు. చంద్రబాబు తర్వాత తానే ప్రత్యామ్నాయామని పవన్ భావిస్తున్నారని, అందుకే లోకేష్పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మరో వైపు పవన్ కల్యాణ్ మీపైనే పోటీకి రాబోతున్నారంటూ ప్రభాకర్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అనంతపురం నుంచి పవన్ తనపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తానన్నారు. అంతేకాకుండా ఆయనపై పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. -
తాడిపత్రి పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే జేసీ వీరంగం!
అనంతపురం: తాడిపత్రి పోలీసు స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వీరంగం సృష్టించారు. తన అనుచరుడు శివనాయుడు విడుదల చేయాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని ఉద్దేశించి అనంతపురం మేయర్ స్వరూప బుధవారం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా విమర్శించినందుకు మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలకు జేసీ అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శివనాయుడిని అరెస్టు చేశారు. అయితే, తన అనుచరుడినే అరెస్టు చేస్తారా అంటూ ఎమ్మెల్యే జేసీ పోలీసు స్టేషన్లో వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపలను బెదిరించిన కేసులసో జేసీ వర్గీయుడు శివనాయుడిని అరెస్టుచేశామని, అయితే, స్టేషన్ బెయిల్ మీద ఆయనను విడుదల చేశామని తాడిపత్రి సీఐ మురళీకృష్ణ చెప్తున్నారు. ఈ వ్యవహారంలో తాడిపత్రి పోలీసులను జేసీ వర్గీయులు బండబూతులు తిట్టారు. -
ఎమ్మెల్యేను కలిసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఇంటి నివేశన స్థలాల కేటాయింపు కోసం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆదివారం స్థానిక ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విన్నవించారు. నగరంలో అనేక మంది విలేకరులు నివేశన స్థలాలు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. వీటిలో రాజకీయాలకతీతంగా పనిచేస్తున్న ప్రతి విలేకరికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విలేకరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో ప్రెస్క్లబ్లో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్నాయుడు, మార్కండేయులు, నగర కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ ఖాన్, కార్యదర్శి మైనుద్దీన్, ట్రెజరర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం టీడీపీలో వర్గపోరు
-
హత్యా రాజకీయాలకు ‘అనంత’ ఎమ్మెల్యే ప్రోత్సాహం
అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. భూదందాలకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో అవినీతికి ప్రభాకర్ చౌదరి కేంద్ర బిందువుగా మారారని గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం నగర పాలక సంస్థలో కమీషన్లదే రాజ్యమని అన్నారు. -
అనంతకు రింగు రోడ్డు : ప్రభాకర్ చౌదరి
అనంతపురం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం నగరానికి రింగు రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రింగు రోడ్డు కోసం తొలి విడతగా రూ.129 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థపై దష్టి పెట్టామని, త్వరలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. -
నాకు రక్తపు మరకలు అంటించొద్దు
♦ అరాచకాలు, సెటిల్మెంట్లకు వ్యతిరేకం ♦ పరోక్షంగా ‘పరిటాల’ వర్గాన్ని టార్గెట్ చేసిన చౌదరి అనంతపురం టౌన్ : అరాచకాలు, సెటిల్మెంట్లకు తాను వ్యతిరేకమని, అనవసరంగా రక్తపు మరకలు అంటించవద్దని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. రుద్రంపేట సమీపంలో రెండ్రోజుల క్రితం జరిగిన జంట హత్యలో తన ప్రమేయం ఉందని కొందరు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ సైనాన్ని పెంచి పోషించే సంస్కృతి తనది కాదన్నారు. ‘అవే’ సంస్థ స్థాపించి ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా సీమలో పోరాటం చేశానన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అజయ్ఘోష్ కాలనీలో కొంత మంది నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడి అందులో వచ్చిన గొడవల వల్లే ఈ హత్యలు జరిగాయన్నారు. హతులు గతంలో కొన్ని మర్డర్ కేసుల్లో ఉన్నారని, ఆ హత్యలు ఎవరి కోసం చేశారో.. ఎవరికి తగాదాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే అంతా అర్థమవుతుందన్నారు. హత్య జరిగిన రోజు కొందరు స్లిప్పులు రాయించి తనపై ఆరోపణలు వచ్చేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిలుక పలుకులు పలికించారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, అందులో తనకు సంబంధం ఉన్న వాళ్లు ఉంటే కఠినంగా శిక్షించాలని సూచించారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ప్రెస్మీట్ అంతా పరోక్షంగా మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ ఉండడం పట్ల విలేకరులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. ‘చిలుక పలుకుల’పై మీడియా ప్రశ్నలు వేయగా అది అందరికీ తెలిసిందేనని, సమయం వచ్చినప్పుడు రివీల్ అవుతానని చెప్పడం గమనార్హం. నిందితులు దొరికాక మరోసారి సవివరంగా ప్రెస్మీట్ పెడతానన్నారు. -
ఇంటికొచ్చి కొడతా..
♦ టీడీపీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య ముదిరిన విభేదాలు ♦ ఇంటికొచ్చి కొడతానని చౌదరిని హెచ్చరించిన జేసీపీఆర్ ♦ తనపై చేయి వేయాలంటే మరో జన్మ ఎత్తాలంటున్న చౌదరి ♦ ‘అనంత’లో ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్న ఇరువర్గాలు అధికార పార్టీ నేతల మధ్య వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. ఉప్పు నిప్పులా ఉన్న తాడిపత్రి, అనంతపురం ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్ చౌదరి మరోసారి మాటల యుద్ధానికి దిగారు. ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అనేలా పరస్పరం దూషించుకున్నారు. అనంతపురంలోని పాతూరు రోడ్డు విస్తరణ పనుల్లో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. బాధ్యత గల ప్రజాప్రతినిధులమని మరిచి నోరుజారుతున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి విభేదాలతో టీడీపీలో క్రమశిక్షణ ఎలా ఉందో మరోసారి స్పష్టమవుతోంది. (సాక్షిప్రతినిధి, అనంతపురం): ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్చౌదరి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రషీద్ను పార్టీలోకి చేర్చుకోవాలని చౌదరి లలితకళాపరిషత్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభాకర్రెడ్డి రంగంలోకి దిగి రషీద్ చేరికను అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య విభేదాలకు బీజం పడింది. తర్వాత పాతూరు రోడ్డు విస్తరణ పనుల్లో ఇద్దరూ రోడ్డెక్కారు. రోడ్డును విస్తరించాలని జేసీ బ్రదర్స్, విస్తరణ చేపడితే ప్రార్థన మందిరాలు తొలగించాల్సి వస్తుందని, ఇది కొందరి మనోభావాలను దెబ్బతీస్తుందని చౌదరి పర స్పరం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే జేసీ బ్రదర్స్ ‘అనంత’లో బలప్రదర్శనకు దిగారు. తాడిపత్రి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను పాతూరుకు రప్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్చౌదరిపై ఎంపీ జేసీదివాకర్రెడ్డి తనదైన శైలిలో దూషణలకు దిగారు. ఇరువర్గాలు కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం రోడ్డు విస్తరణ అంశాన్ని వాడుకుంటున్నాయని, విస్తరణపై ఇద్దరికీ చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎవరు అడ్డొచ్చినా విస్తరణ చేసి తీరతామని ప్రకటించిన జేసీ దివాకర్రెడ్డి ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ ప్రారంభోత్సవంలోనూ ఇదే తీరు బస్టాండ్ సమీపంలోని శాంతి నర్సింగ్ హోం నుంచి చెరువుకట్ట వరకూ 80 అడుగుల రోడ్డును గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు మంజూరు చేయించారు. 50 శాతం పనులు కూడా పూర్తి చేశారు. తక్కిన పనులు పూర్తికాకుండా, భూసేకరణ కొలిక్కి రాకుండానే మేయర్ స్వరూప, చౌదరి ‘ఎన్టీఆర్ మార్గ్’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీని ఆహ్వానించలేదు. 80 అడుగుల రోడ్డు పూర్తయ్యేందుకు అవసరమైన నిధులు తానే తెప్పించానని చెప్పకునే జేసీ ఈ ఘటనపై కూడా తీవ్రంగా స్పందించారు. ఇలా ‘అనంత’లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ ఇరువర్గాలు రాజకీయ ఆధిపత్యం కోసం వాడుకుంటున్నాయి. చివరకు టవర్క్లాక్ వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహం విషయంలోనూ రాజకీయ చిచ్చును రగిల్చాయి. విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని, అయినా నెలరోజుల్లో ఏర్పాటు చేసి తీరతామని జేసీపీఆర్ ప్రకటించారు. అయితే ఇంత వరకూ అతీగతీ లేదు. ఆర్యవైశ్యులకు సంబంధించిన కొత్తూరు అమ్మవారిశాల కల్యాణమండపాన్ని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. ఈ ఘటనకు మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి కారణమని నగరంలో తీవ్ర చర్చ సాగింది. దీనికి వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు చేసిన ర్యాలీ, కార్పొరేషన్ కార్యాలయ ముట్టడిలో జేసీ అనుచరుడు కోగటం విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనలో గాయపడిన కోగటంను పరామర్శించేందుకు వచ్చిన జేసీపీఆర్.. ‘నేను అనుకుంటే వాడి ఇంటికాడికి సక్కగా వచ్చి కొడతా’ అని ఎమ్మెల్యే చౌదరిని ఉద్దేశించి అన్నారు. దీనిపై చౌదరి కూడా అదే స్థాయిలో స్పందించారు. ‘నన్ను కొట్టాలంటే మరో జన్మ ఎత్తాల’ని అన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగడం సరికాదని, వీరి మధ్య విభేదాలతో ‘అనంత’ అభివృద్ధికి విఘాతం కలుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని ఆ పార్టీ నాయకులతో పాటు సీఎం చంద్రబాబు పదేపదే వ్యాఖ్యానిస్తుంటారని, ఎలాంటి క్రమశిక్షణ ఉందో జేపీఆర్, చౌదరిని చూస్తే స్పష్టమవుతోందని విమర్శిస్తున్నారు. -
'ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది'
అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము తెచ్చిన ప్రాజెక్ట్లను పూర్తి చేయలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు అనంతపురం నగరపాలక సంస్థ కేంద్ర బిందువుగా మారిందన్నారు. నగరపాలక సంస్థలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు గుర్నాథ్రెడ్డి సవాల్ విసిరారు. -
అనంతలో టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు
అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. రోడ్డు విస్తరణ విషయంపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఏర్పడ్డ వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. శనివారం నగరంలోని ఓల్డ్ టౌన్లో ప్రభాకర్ చౌదరి సమావేశం ఏర్పాటు చేయగా, జేసీ వర్గీయులు అక్కడికి వెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకుని జేసీ వర్గీయులను అడ్డుకున్నారు. గత కొంతకాలం ఎంపీ జేసీ, ప్రభాకర్ చౌదరి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇటీవల ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేస్తామని స్థానిక ఎంపీ జేసీ స్పష్టం చేయగా, ప్రస్తుతం అవసరం లేదని ప్రభాకర్ చౌదరి చెప్పారు. -
అనంతలో బయటపడ్డ టీడీపీ వర్గపోరు
-
అనంతలో మళ్లీ బయటపడ్డ టీడీపీ వర్గపోరు
అనంతపురం : అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు మరో బయటపడింది. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేస్తామని స్థానిక ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పషం చేశారు. అయితే అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే వి. ప్రభాకర్చౌదరి.... జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలో విభేదించారు. ప్రస్తుతం అనంతపురంలో రోడ్ల విస్తరణ అవసరం లేదని ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఆ క్రమంలో ఇరువురి నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. -
ఎమ్మెల్యేలు ప్రభాకర్ Vs ప్రభాకర్
-
ఎమ్మెల్యేలు ప్రభాకర్ Vs ప్రభాకర్
అనంతపురం: అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అనుచరులు.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై దాడి చేయనున్నట్టు వదంతులు రావడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే అనుచరులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. తన ఇంటి వద్ద బందోబస్తుగా ఉన్న పోలీసులు వెనక్కి వెళ్లిపోవాలని ప్రభాకర్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఎవరికీ తాను భయపడేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యాలను ఎదుర్కొంటామని చెప్పారు. అనంతపురం నగరంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరి మధ్య మాటలయుద్దం మొదలైంది. జేసీ ఇటీవల మాట్లాడుతూ.. గాంధీ విగ్రహం ఏర్పాటుకు నెలరోజులు గడువు ఇస్తున్నామని, ఈలోపు ప్రభాకర్ చౌదరి ప్రారంభించకుంటే తామే ఆ పని చేస్తామని సవాల్ విసిరారు. అయితే గాంధీ విగ్రహం సిద్ధమైంది కానీ... ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతో ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టిందని జేసీ ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం అనంతపురంలో మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటానని ప్రభాకర్ చౌదరి హాడావుడి చేస్తున్నాడు... కనీసం 2 వేల మొక్కలు కూడా నాటలేదిని ఆరోపించారు. ఓ వేళ లక్ష మొక్కలు నాటినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ విసిరారు. -
ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టింది
-
అనంత టీడీపీలో మళ్లీ రచ్చ
-
ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టింది
అనంతపురం : అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టిందని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం అనంతపురంలో మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటానని ప్రభాకర్ చౌదరి హాడావుడి చేస్తున్నాడు... కనీసం 2 వేల మొక్కలు కూడా నాటలేదిని ఆరోపించారు. ఓ వేళ లక్ష మొక్కలు నాటినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ విసిరారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. గాంధీ విగ్రహం సిద్ధమైంది కానీ... విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ నుంచి ఎలాంటి అనుమతులు లేదన్నారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతో ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు లేవని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. అనంతపురం నగరంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో వారిద్దరి మధ్య మాటలయుద్దం మొదలైంది. ఆ క్రమంలో శుక్రవారం గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ అందుకు నెలరోజులు గడువు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చౌదరికి... జేసీ సవాల్ విసిరారు. లేకుంటే తామే ఆ పని చేస్తామని చెప్పారు. ఆ క్రమంలో ప్రభాకర్ చౌదరిపై విధంగా స్పందించారు. -
అనంత టీడీపీలో మళ్లీ రచ్చ
అనంతపురం : అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. అనంతపురం నగరంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ప్రారంభోత్సవంపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నెలరోజుల్లో గాంధీ విగ్రహ ప్రారంభోత్సవంపై ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి... ప్రభాకర్ చౌదరికి హుకుం జారీ చేశారు.ఓ వేళ ఆయన ఆలా చేయకుంటే తామే ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తామని జేసీ స్పష్టం చేశారు. అయినా ప్రభాకర్ చౌదరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత ప్రభాకర్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన జేసీ బ్రదర్స్కి మధ్య అధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వర్గపోరు మరో సారి తారాస్థాయికి వెళ్లిందని సమాచారం. -
శాంతిభద్రతలే ధ్యేయంగా గవర్నర్ ప్రసంగం..
-
శాంతిభద్రతలే ధ్యేయంగా గవర్నర్ ప్రసంగం..
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలే ధ్యేయంగా గవర్నర్ ప్రసంగం ఉందని అనంతపురం టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ...చంద్రబాబు నేతృత్వంలో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేశారన్నారు. చిత్తశుద్దితో, ఓ విజన్తో వెళ్లే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. -
టీడీపీలో పదవుల చిచ్చు
సాక్షిప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో పదవుల చిచ్చు రగులుతోంది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడిన నేతలను విస్మరించి, ఇతర పార్టీల నుంచి వలసొచ్చిన వారికి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అందలం ఎక్కించడంపై సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేయస్సు కంటే వర్గ ప్రయోజనాలే ముఖ్యమనేలా వ్యవహరిస్తూ తన అనునాయులకు మాత్రమే పదవులు దక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శాప్ డెరైక్టర్గా ఇటీవల షకిల్ షఫీని నియమించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అండతోనే షకిల్ షఫీకి శాప్ డెరైక్టర్ పదవి దక్కిందనేది బహిరంగ రహస్యం. అయితే గత పదేళ్లలో టీడీపీ ఉన్నతి కోసం ఏరోజూ షకిల్షఫీ పనిచేయలేదని, టీడీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2004లో కేఎం సైఫుల్లా తనయుడు రహంతుల్లాకు అనంతపురం టీడీపీ టిక్కెట్టును పార్టీ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, తమ్ముడు అయిన రహంతుల్లాను కాదని, ఇండిపెండెంట్గా బరిలో దిగిన ప్రభాకర్చౌదరికి మద్దతుగా షకిల్షఫీ పని చేశారు. 2009, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పదేళ్లలో పార్టీకి వ్యతిరేకంగా కొందరు పని చేసినా పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీకోసం పాటు పడిన తమకు కాకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన షకిల్షఫీకి పదవి ఇవ్వడంపై భగ్గమంటున్నారు. ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ షకిల్షఫీకి టీడీపీలో సభ్యత్వం కూడా లేదని, ఇలాంటి వారికి పద వులు ఎలా కట్టబెడతార’ని ప్రశ్నిస్తున్నారు. టౌన్ బ్యాంకు అధ్యక్ష పీఠంపై మురళిని కూర్చోబెట్టే యత్నం టౌన్బ్యాంక్ అధ్యక్షునిగా కొనసాగుతున్న గౌతమ్ను ఇటీవల ప్రభుత్వం బర్త్ఫ్ ్రచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టే ఇతన్ని బర్త్ఫ్ ్రచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ కార్పొరేటర్ మురళీని టౌన్బ్యాంక్ అధ్యక్షునిగా నియమించేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి యత్నిస్తున్నారు. దీనికోసం రాజధానిలో పంచాయతీ పెట్టారు. మురళీతో పాటు ఎమ్మెల్యే కూడా రాజధానికి చేరుకున్నారు. మురళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇన్నాళ్లూ టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలస వచ్చారు. ఈ క్రమంలో మురళీకి టౌన్బ్యాంక్ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఆలోచించడంపై కూడా సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న టీడీపీ కార్యకర్తలా కాకుండా ప్రభాకర్ చౌదరి అనుచరుడిగానే ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని, ఇలాంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టారని, అది సరే! అనుకుంటే షకిల్షఫీ..ఆ తర్వాత మురళీ...ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యే చెప్పినవారికి, ఆయన వర్గీయులే పదవులు దక్కడంపై సీనియర్లు ఆక్షేపిస్తున్నారు. కాగా 2004, 2009లో కూడా టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన ప్రభాకర్ చౌ దరిని ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేనే చేశారని, నామినేటెడ్ పోస్టులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి దక్కడంలో ఆశ్చర్యం ఏముందని ఓ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ‘సాక్షి’తో అన్నారు. అయితే ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉన్నా, జిల్లాలో ఇద్దరు మంత్రులు, సీనియర్ నేతలు ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం దారుణమంటున్నారు. అధికారం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని, మరో దారి చూసుకుంటామని కొందరు నేతలు ‘సాక్షి’తో అన్నారు. -
‘అనంత' నేషనల్ పార్క్ పిక్నిక్ స్పాట్ కావాలి
అనంతపురం సిటీ: ‘అనంత'లో సువిశాల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్కు పిక్నిక్ స్పాట్గా మారాలని పలువురు ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. నేషనల్ పార్కులో ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి నేతృత్వంలో కొనసాగుతున్న శ్రమదానంలో భాగంగా ఆదివారం 8వ రోజు ఎమ్మెల్యేలు పార్థసార థి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, విప్ యామినీబాల శ్రమదానం చేశారు. పారలు చేతబట్టి పలు మొక్కల చుట్టూ పాదులు చేశారు. పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1996లో ప్రభాకర్చౌదరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేషనల్ పార్కు ఏర్పాటు శ్రమదానంలో భాగమేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ‘జన్మభూమి-మా ఊరు’లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రమదానానికి పిలుపునివ్వడం హర్షణీయమన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన నేషనల్ పార్కుకు పూర్వ వైభవం రానుందని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో దశల వారీగా అభివృద్ధి పర్చి శిల్పారామాన్ని నిర్మించి ‘అనంత’ పర్యాటక కేంద్రం’గా దీన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. డిప్యూటీ మేయర్ గంపన్న, టీడీపీ నాయకులు ఆదినారాయణ, లింగంనాయుడు, రవి, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు. -
మా అనుమతి లేకుండా చేరతారా?
మంట పెట్టిన వారికే సెగ తాకితే ఎలా ఉంటుందో జేసీ సోదరులకు తెలిసొచ్చినట్టుంది. తాము పాటించిన ధర్మాన్నే మరొకరు పాటిస్తే సహించలేకపోతున్నారు. తాము చెప్పింతే నీతి. తాము చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తామే వలస పక్షుల మన్న సంగతి మర్చిపోయి 'దూకుడు' నేతలను అడ్డుకుంటున్నారు. 'మా అనుమతి లేకుండా ఎవరూ పార్టీలో చేరకూడదు' అన్నట్టుగా హుంకరిస్తున్నారు. అనేక ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పదవులు వెలగబెట్టిన జేసీ సోదరులు ఎన్నికలకు ముందు టీడీపీలోకి దూకారు. కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలి తమ దారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా వారే విధంగా వ్యవహరించారనేది అందరూ చూశారు. ఎన్నికల పోరు ముగిసిన తర్వాత కూడా వారు అదే పంథాలో ముందుకెళుతున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వీరంగమాడారు. తాము వలస నేతలమన్న సంగతి మర్చిపోయి 'జంప్ జిలానీ'లను అడ్డుకున్నారు. టీడీపీలో చేరాలనుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూం బాబా ఆశలకు గండికొట్టారు. కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పరా, వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని హెచ్చరించారు. తమ నాయకుడు వీరంగమాడుతుంటే అనుచరులు చూస్తూ ఊరుకుంటారా. తమకు అలవాటైన విద్య ప్రదర్శించారు. కుర్చీలు విసిరేసి ఫ్లెక్సీలు చించేసి, తమకు తెలీకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ నిష్ర్కమించారు. జేసీ వీరంగంతో టీడీపీలో ముందునుంచి నాయకులు అవాక్కయ్యారు. ఇప్పుడే ఇలావుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ తలలు పట్టుకున్నారు. -
'మంత్రి పదవి వద్దు... నిధులిస్తే చాలు'
అనంతపురం: తనకు మంత్రి పదవి వద్దని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే చాలని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు హామీలు నెరవేర్చడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో పాటు ఈ నెల 8న 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి స్పందించారు. మంత్రి పదవులకు విన్పిస్తున్న 15 మందిలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం