జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం
Published Wed, Nov 16 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
కర్నూలు (టౌన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభ వంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఔట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, వయోజన విద్య డిప్యూటీ డైరక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరక్టర్ భాస్కర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాట్లాడుతూ ఈ ఆటల పోటీలలో మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వారు శారీరక విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకి ల్ పోటీలను జెండాఊపి ప్రారంభించారు.
Advertisement
Advertisement