games
-
చలో మైదాన్
‘మావాడు ఇంట్లో సెల్ఫోన్కు బానిసయ్యాడు. ఏమాత్రం శారీరక శ్రమ లేక బరువు కూడా బాగా పెరిగాడు. ముందు మావాడి ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఆ తర్వాత ఆట నేర్పించండి. అప్పుడైనా సెల్ఫోన్కు దూరంగా ఉంటాడు.’ ఇటీవల హిట్కొట్టిన ఓ సినీ హీరో కుమారుడి పరిస్థితిపై క్రీడా కోచ్కు బాలుడి తల్లి చేసిన వినతి ఇది.హైదరాబాద్లో ఓ చార్ట్టర్డ్ అకౌంటెంట్ తన కుమారుడిని క్రికెట్కు అంకితం చేశారు. డ్రైవర్తో పాటు కారు, అన్ని వసతులు సమకూర్చారు. స్కూల్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడా కుర్రాడు ఏజ్ గ్రూప్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అండర్–19 జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా ఎదిగాడు.నేటి ఆధునిక జీవనశైలి కారణంగా శారీరక శ్రమకు దూరం కావడంతోపాటు సెల్ఫోన్ వ్యసనానికి బానిసలవుతున్న పిల్లలను గాడినపెట్టేందుకు ఇటీవల కాలంలో తల్లిదండ్రులు వారిని క్రీడల వైపు మళ్లిస్తున్నారు. శారీరక, మానసిక వికాసం కోసం వారిని మైదానాల బాట పట్టిస్తున్నారు. అల్లరి మాని్పంచేందుకు కొందరు.. ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసేందుకు మరికొందరు, క్రీడలనే కెరీర్గా మలుచుకొనేలా చూసేందుకు ఇంకొందరు తమ పిల్లలను స్పోర్ట్స్ క్లబ్లకు తీసుకెళ్తున్నారు. సంపన్నులతోపాటు మధ్యతరగతి, కొందరు కిందిస్థాయి ఉద్యోగులు, చిరు వ్యాపారులు సైతం పిల్లలను ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో చేరుస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెరగడంతో పిల్లలను ఏదో ఒక క్రీడలో శిక్షణ ఇప్పించాలనే కోరిక తల్లిదండ్రుల్లో కలుగుతోంది. దీంతో మూడేళ్ల నుంచి మైదానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోజువారీ శిక్షణ కోసం గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలు, పట్టణాలకు వస్తున్న వారూ ఉంటున్నారు.చదువును నిర్లక్ష్యం చేయకుండానే.. పిల్లలకు నచ్చిన క్రీడలో ప్రవేశం కల్పించి వారు అందులో రాణిస్తుంటే భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. హైదరాబాద్ వంటి చోట్ల భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే పిల్లల కెరీర్ కోసం వర్క్ ఫ్రమ్ హోం చేస్తూనో లేదా ఒకరు జాబ్ వదిలేయడమో చేస్తున్న ఉదాహరణలు కూడా ఉంటున్నాయి. పిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకుండానే క్రీడల్లో వారు పాల్గొనేలా చూసుకుంటున్నారు. ఒకవేళ ఏదో ఒకటి తేల్చుకోవాల్సి వస్తే క్రీడల వైపే మొగ్గుచూపుతున్న వారూ ఉన్నారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో క్రీడా కోటా ఉండటమే దీనికి కారణం. క్రీడల్లో సత్తాచాటి సర్టీఫికెట్ సాధిస్తే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్తోపాటు అన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల్లో 0.5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉంది.వెంటనే అద్భుతాలు ఆశించొద్దు.. జట్టు క్రీడాంశాల్లో విజయం దక్కాలంటే సమష్టి ప్రదర్శన కీలకం. అందుకని తల్లిదండ్రులు వ్యక్తిగత క్రీడాంశాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందరి దృష్టిలో పడేందుకు, ఆటతీరు బేరీజు వేసుకొని మెరుగుపర్చుకొనేందుకు వ్యక్తిగత క్రీడాంశాలైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఏ రంగంలోనైనా లక్ష్య సాధనకు సరైన కార్యాచరణ రూపొందించుకోవడం.. పక్కా ప్రణాళికతో అమలు పరచడం ముఖ్యం. క్రీడలూ దీనికి మినహాయింపు కాదు. పిల్లలు వెంటనే అద్భుతాలు చేయాలని ఆశించకుండా కావాల్సినంత సమయం ఇవ్వాలి. ⇒ ప్రతిరోజూ సగటున పిల్లలు 5–7 గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. క్రీడల ద్వారా ఈ స్క్రీన్ టైమ్ను తగ్గిస్తే పిల్లల్లో దృష్టి సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గి మనోవికాసం మెరుగుఅవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.⇒ నాన్ డిజిటల్ గేమ్స్ ఆడేవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి.⇒ క్రీడలు ఆడే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, పట్టుదల ఏర్పడతాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుంది.⇒ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు..⇒ఆటలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. వ్యక్తిగా ఎదిగేందుకు దోహదపడతాయి.‘మావాడు ఇంట్లో సెల్ఫోన్కు బానిసయ్యాడు. ఏమాత్రం శారీరక శ్రమ లేక బరువు కూడా బాగా పెరిగాడు. ముందు మావాడి ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఆ తర్వాత ఆట నేర్పించండి. అప్పుడైనా సెల్ఫోన్కు దూరంగా ఉంటాడు.’ ఇటీవల హిట్కొట్టిన ఓ సినీ హీరో కుమారుడి పరిస్థితిపై క్రీడా కోచ్కు బాలుడి తల్లి చేసిన వినతి ఇది.ఆటలు.. అంకెలు⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం పిల్లలకు కనీసం రోజుకు 60 నిమిషాల శారీరక శ్రమ (ఫిజికల్ యాక్టివిటీ) తప్పనిసరి.⇒ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారత్లో 90% పిల్లలు సిఫార్సు చేసిన శారీరక వ్యాయామాన్ని పాటించట్లేదు.⇒ ఆస్ట్రేలియా జనాభాలో 71.8%, జపాన్లో 60.3% స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఇండియాలో వీరు 6% మాత్రమే.బుమ్రా స్టయిల్.. హార్దిక్ ఆటిట్యూడ్ కొందరు పిల్లలపై భారత జాతీయ క్రీడాకారుల ప్రభావం చాలా ఉంటోంది. క్రికెట్ అకాడమీల్లో పదేళ్ల వయసు పిల్లలు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్రీ్పత్ బుమ్రా డిఫరెంట్ బౌలింగ్ స్టయిల్ను ప్రాక్టీస్ చేస్తున్నారు. మరికొందరు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్ను ఫాలో అవుతున్నారు. మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘శభాష్ మిథు’వంటి సినిమాలు చూసి స్ఫూర్తి పొంది గ్రౌండ్కు వెళ్తున్న బాలికలూ ఉండడం గమనార్హం. మరికొందరు అమ్మాయిలైతే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆరాధిస్తున్నారు. మైదానాల్లో పెరిగిన పిల్లల సంఖ్య ⇒ హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఓ ప్రైవేటు క్రికెట్ కోచింగ్ సెంటర్లో రెండేళ్ల కిందటి వరకు 20 మంది పిల్లలు కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు వారి సంఖ్య 80కి పెరిగింది.⇒ మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్లో దాదాపు 200 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ సెంటర్లోనే 35 మంది ఉన్నారు. 30 నుంచి 40 మంది కరాటే మాస్టర్లు వందలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 200మంది దాక చిన్నారులు తైక్వాండో శిక్షణ పొందుతున్నారు.⇒ నల్లగొండ అవుట్డోర్ స్టేడియంలో హాకీ, క్రికెట్లో ప్రత్యేక శిక్షణకు వందల మంది వెళ్తున్నారు.⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్, క్రికెట్, యోగా, స్విమ్మింగ్ శిక్షణ కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.సెల్ఫోన్ నుంచి చెస్ వైపు.. మంచిర్యాల పట్టణానికి చెందిన అరుకల వేణుగోపాల్, కీర్తన దంపతులు తమ పిల్లలు అక్షయ (14), జశ్విత్(12)లు సెల్ఫోన్, టీవీ చూడడం తగ్గించేందుకు చెస్ నేర్పించడం మొదలుపెట్టారు. రెండేళ్లుగా చదరంగంలో ప్రావీణ్యం సంపాదించారు. రాష్ట్రస్థాయి టోరీ్నలో ఆడుతున్నారు. చదువులోనూ రాణిస్తున్నారు.ఒకే సెంటర్లో 30 మంది అమ్మాయిలు సంగారెడ్డిలోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో 85 మంది శిక్షణ పొందుతుంటే వీరిలో 30 మంది అమ్మాయిలు గ్రామీణ ప్రాంతాలవారే కావడం గమనార్హం. పరిసర గ్రామాలకు చెందిన వీరు నిత్యం 20 కి.మీ. ప్రయాణించి కోచింగ్ తీసుకుంటున్నారు.ఆటో డ్రైవరే అయినా.. ఆటలను వదల్లేదు మహబూబ్నగర్కు చెందిన ఈ బాలిక పేరు సాయి వైష్ణవి. అథ్లెటిక్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఆమె అన్న మూడేళ్ల క్రితం స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో సత్తాచాటి హైదరాబాద్ శివార్లలోని హకీంపేట స్కూల్లో ప్రవేశం పొందాడు. 8వ తరగతి చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. తండ్రి రాములు ఆటో డ్రైవర్. సాయి వైష్ణవి తండ్రి రాములు మూడుసార్లు ఆర్మీ, నాలుగుసార్లు పోలీస్ ఉద్యోగ పరీక్షలకు వెళ్లి ఉత్తీర్ణత కాలేకపోయాడు. దీంతో పిల్లలను క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేర్చాలనే లక్ష్యంతో శిక్షణ ఇప్పిస్తున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో సాయి వైష్ణవి ఎంపికయ్యేలా రోజూ స్టేడియానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నాడు.శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు నా కూతురు యోధ రెండో తరగతి చదువుతోంది. భర్త బాలునాయక్ సూర్యాపేట రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన నిత్యం బిజీగా ఉంటారు. పిల్లలు ఇంటి నుంచి వచ్చాక సెల్ఫోన్లు చూసేందుకే మక్కువ చూపుతున్నారు. ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో రాణించేలా చేయాలని భావించా. తనకు ఏది ఇష్టమో అడిగితే క్రికెట్ అని చెప్పింది. దీంతో కోచింగ్ ఇప్పిస్తున్నా. – రోజా, విద్యార్థిని తల్లి, సూర్యాపేటఅమ్మ ప్రోత్సాహంతో.. జీవితంలో ఎదగాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నది మా అమ్మ ఆకాంక్ష. ఆమె ప్రోత్సాహంతో రెండేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నా. పది వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాకు ఏర్పడింది. – ఇ.ప్రణీష, హనుమకొండఅమ్మాయి బలంగా ఎదిగేలా.. రెండేళ్లుగా మా అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పిస్తున్నా. లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తూనే పాపను ఉదయం, సాయంత్రం ట్రైనింగ్ క్లాసులకు తీసుకెళ్తున్నా. శారీరక, మానసిక దృఢత్వంతోపాటు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. – అనిత, అధ్యాపకురాలు, హనుమకొండపిల్లల్ని అథ్లెటిక్స్లో చేర్పించి..డోర్నకల్కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు మాలోతు రామ్కుమార్, రైల్వే ఉద్యోగి రోజా దంపతులకు ఇద్దరు పిల్లలు కీర్తన (మూడో తరగతి), దామోదర్ (నాలుగో తరగతి). కరోనా వేళ ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లల చేతికి సెల్ఫోన్లు ఇవ్వాల్సి రావడంతో ఇతర విషయాలపై వారికి ఆసక్తి పెరిగింది. దీంతో కీర్తనను అథ్లెటిక్స్లో చేరి్పంచారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఇక రిలయన్స్ గేమ్స్.. బ్లాస్ట్ ఈస్పోర్ట్స్తో జేవీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఈస్పోర్ట్స్ బిజినెస్ నిర్వహించేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. సొంత అనుబంధ సంస్థ రైజ్ వరల్డ్వైడ్ ద్వారా బ్లాస్ట్ ఈస్పోర్ట్స్తో ఇందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా జేవీకి తెరతీయనుంది.రిలయన్స్, బ్లాస్ట్ జత కట్టడం(జేవీ) ద్వారా దేశీయంగా అత్యున్నత ఐపీలను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో రెండు సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అభిమానులు, క్రీడాకారులు, బ్రాండ్ల కోసం బ్లాస్ట్కున్న గ్లోబల్ ఐపీలను సైతం దేశీయంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశాయి.బ్లాస్ట్ ఏపీఎస్(డెన్మార్క్) ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టోర్నమెంట్ నిర్వాహక సంస్థలలో ఒకటికాగా.. గేమ్ పబ్లిషింగ్ గ్లోబల్ దిగ్గజాలు ఎపిక్ గేమ్స్, వాల్వ్, రియట్ గేమ్స్, క్రాఫ్టన్, యూబిసాఫ్ట్ తదితరాలతో కలసి పనిచేస్తోంది. తద్వారా గ్లోబల్ ఈస్పోర్ట్స్ ప్రాపరీ్టలను ఆవిష్కరిస్తోంది. -
లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విజయం
-
ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్
ప్రపంచీకరణతో మన దేశానికి ఏస్థాయిలో మేలు జరిగిందో అదే స్థాయిలో కీడూ జరుగుతోంది. ఇప్పటి వరకూ పాశ్చాత్యదేశాలను మాత్రమే పట్టి పీడిస్తూ వచ్చిన అధిక బరువు, ఊబకాయం(Obesity) లాంటి సమస్య అభివృద్ధి చెందుతున్న భారత్కు సైతం తలనొప్పిగా మారింది. ప్రధానంగా చిన్నారులలో అధిక బరువు, ఊబకాయాలు... ఫ్యాటీ లివర్ (Fatty Liver) వ్యాధికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనూహ్యంగా మార్పులకు లోనుకావటం, ఆడుకునే అవకాశం లేకపోవడం పిల్లల ఈ స్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఆటలకు దూరమవుతున్న చిన్నారులు టీవీలకు, సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. బాల్యంలో ఓ ప్రధాన భాగమైన సంప్రదాయ (కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల, కర్రాబిళ్ళా, బెచ్చాలు, గోళీలాంటి) ఆటలకు సైతం నోచుకోలేక పోతున్నారు. విద్యారంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గి ప్రైవేటు భాగస్వామ్యం రాను రాను పెరిగిపోవడంతో ఆటలు అటకెక్కాయి. చదువే ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉన్నంతకాలం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో క్రీడలకు తగిన సదు పాయాలు ఉండేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలకు సువిశాలమైన ఆటస్థలాలతో పాటు తగిన సంఖ్యలో వ్యాయామ ఉపాధ్యాయులు సైతం ఉండటం ఒకప్పుడు సాధారణ విషయమైతే ఇప్పుడు అసాధారణ విషయంగా మారిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలోసింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్ బెడ్ రూమ్ కళాశాలలు మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా సదుపాయాలు, మైదానాలు మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఆటలంటే ఏమిటో తెలియకుండా అమూల్యమైన తమ బాల్యాన్నీ, విద్యార్థి దశనూ ముగించడాన్ని మించిన విషాదం (Tragedy) మరొకటి లేదు.చదవండి: ఇరాన్ బీచ్లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియోపాఠశాల దశ నుంచే ఆటలకు, క్రీడాసంస్కృతికి దూరమైన చిన్నారులు ఆ తరువాతి కాలంలో శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన దేశంలో ఈమధ్య కాలంలో నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం ఆటపాటలకు దూరమైన చిన్నారులు అధిక బరు వుతో పాటు ఫ్యాటీ లివర్ (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్) వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. పిల్లలు బాల్యంలో ఆటలకు దూరం కావడం అంటే శారీరకంగా, మానసికంగా ఎదుగు దలకు దూరంకావటమేనని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం దేశ జనాభాలో 60 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటుంటే... అందులో 30 శాతం మంది ఊబకాయం సమస్యతో నానాపాట్లు పడుతున్నారు. బాలల్లో 40 శాతం మంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి సైతం హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో బాల్యంలో ఆటలూ అంతే ముఖ్యమని తల్లిదండ్రులూ... ఆరోగ్యవంతమైన, ఆహ్లాదభరితమైన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత తమపైనే ఉందని పాలకులూ, పాఠశాలల యాజమాన్యాలు గ్రహించిన రోజే బాల్యం అమూల్యంగా, అపు రూపంగా మిగిలిపోగలుగుతుంది.– కృష్ణారావు చొప్పరపుసీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ -
Rohit Sharma: పెను తుపాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే
-
స్టార్ క్రికెటర్ల భార్యలకు బీసీసీఐ బిగ్ షాక్
-
క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు ...!
-
IPL 2025: IPL కప్ మనదేనా?
-
హ్యాండ్బాల్..డిఫెండర్స్..
క్రికెట్.. ఫుట్బాల్.. బ్యాడ్మింటన్.. ఈ సరసన హ్యాండ్బాల్కూ ఎనలేని ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇక్కడి కోచ్లు నిరి్వరామంగా కృషి చేస్తున్నారు. క్రీడలపై ఉన్న ప్రీతితో నేటి తరం వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చిన్ననాటి నుంచే బీజాలు వేస్తున్నారు. ఇందు కోసం స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తూ హ్యాండ్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. వారే సనత్నగర్ కార్మిక సంక్షేమ మైదానం కేంద్రంగా దశాబ్దాల కాలంగా హ్యాండ్బాల్ శిక్షణ ఇస్తున్న అసోసియేషన్ సభ్యులు. – సనత్నగర్ సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ హ్యాండ్బాల్ క్రీడలో ఎందరో ఆణిముత్యాలను అందించింది. పారిశ్రామికవాడగా కార్మికుల ఆవాసంగా ఉన్న సనత్నగర్లో పలువురు హ్యాండ్బాల్ ఆటలో ఆసక్తి చూపిస్తున్న క్రమంలో 1975లో స్థానిక ఎస్ఆర్టీ కాలనీలోని కార్మిక సంక్షేమ సంఘం భవనం ఆవరణలో ప్రత్యేక క్రీడా శిబిరం నిర్వహించారు. అలా మొదలైన శిబిరం క్రీడాకారుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వారిలో సనత్నగర్ మాజీ కార్పొరేటర్ అయూబ్ఖాన్, మక్సూద్, జగన్నాథం, సుబోద్ విల్సన్, ప్రబోద్ విల్సన్, డాక్టర్ నగేశ్, విద్య, ఏఎస్ మునవర్, పీవీ నాగార్జున, ధన్రాజ్ తదితరులు హ్యాండ్బాల్ క్రీడాకారులుగా వెలుగులోకి వచ్చినవారే. అలాగే సనత్నగర్కు చెందిన ఎంఏ అజీజ్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న ఘనతను దక్కించుకున్నారు. మరో క్రీడాకారుడు బాసిత్ ఆసియా క్రీడల ప్రొబబుల్స్లో స్థానం కైవసం చేసుకున్నాడు. వీరంతా వృత్తిపరంగా వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ హ్యాండ్బాల్ క్రీడపై అభిమానాన్ని విడవలేదు. ఇక్కడే శిక్షణ తీసుకుని కోచ్లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. నిరంతర శిక్షణనిస్తూ.. జాతీయ స్థాయిలో రాణించిన ఆనాటి మేటి క్రీడాకారులంతా సంఘటితమై 1980లో అప్పటి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత మేడ్చెల్ జిల్లా) హ్యాండ్బాల్ అసోసియేషన్ (రిజిస్టర్డ్ నెంబర్: 1859)ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల మంది హ్యాండ్బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దారు. ఎక్కడ ఏ పోటీ జరిగినా జిల్లా నుంచి పాల్గొనే టీమ్ను సన్నద్ధం చేసేది ఈ అసోసియేషనే సభ్యులే. ఇక్కడ శిక్షణ పొందేవారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక అవుతున్నారు. అండర్–12, అండర్–16, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు. మొదట స్కూల్ లెవల్ క్యాంపులు నిర్వహించి హ్యాండ్బాల్ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తారు. ఆ తరువాత వారిలో నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి క్రీడలో మెళకువలు నేర్పిస్తారు. ఆ తరువాత వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తగిన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. వారే కోచ్లుగా, ఇక్కడి గ్రౌండ్లోనే శిక్షణ పొందిన వారే కోచ్లుగా వ్యవహరిస్తూ ఉచిత శిక్షణ అందిస్తుండడం గమనార్హం. స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించిన వారు ఎందరో.. జనరల్ కోటాలో సీటు రానివారికి హ్యాండ్బాల్ క్రీడే ఆపన్నహస్తంగా మారుతోంది. ఈ క్రీడలో గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడినవారు పదుల సంఖ్యలో స్పోర్ట్స్ కోటాలో సులభంగా సీట్లు సాధించడం గమనార్హం. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
వయసుకే వృద్ధాప్యం.. !
వయసుకే వృద్ధాప్యం..మనసుకు మాత్రం కాదు.. అన్నట్లు హుషారైన వాతావరణం అక్కడి వారి సొంతం. ఆట ఏదైనా సై అంటూ రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రతిభను చాటుతుంటారు హైదరాబాద్ సనత్నగర్లోని మోడల్కాలనీ సీనియర్ సిటిజన్స్. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ అంతా ఒకచోట చేరి సందడిగా గడుపుతున్నారు. అలాంటి హుషారైన వేదికకు అసోసియేషన్ కార్యాలయం.. సీనియర్ సిటిజన్స్ ఆనందానికి నెలవైంది. వయస్సు మీద పడింది కదా.. అని ఏదో మూలన కూర్చోవడం ఒకప్పటి మాట. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ఆటలతో అదరగొట్టేస్తున్నారు. కేరమ్స్, చెస్ వంటి ఆటలతో మానసికోల్లాసం పొందడమే కాకుండా థ్రెడ్మిల్పై సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చాలా కుటుంబాల్లో తమవారంతా కార్యాలయాలకో, పిల్లలు స్కూళ్లకో, కళాశాలలకో వెళ్లిపోతుండగా.. సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఎవరికి ఇష్టమైన గేమ్లో వారు ఆడుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. రెండు వేల పుస్తకాలతో.. ఆడుకునేవారు ఆడుకుంటుంటే.. మరికొందరు ఇక్కడి లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ విజ్ఞాన సముపార్జన చేస్తుంటారు. సాహిత్యం, ఆధ్యాతి్మకం, హిస్టరీ.. ఇలా దాదాపు నాలుగు వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. కాలనీవాసులు ఇంటికీ తీసుకెవెళ్లేందుకు కూడా అనుమతిస్తారు. అలాగే దినపత్రికలు, మ్యాగజైన్స్ చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. ప్రతిరోజూ ఇక్కడికి నాలుగు రకాల పత్రికలతో పాటు వివిధ రకాల వీక్లీ మ్యాగజైన్స్ వస్తుంటాయి. వాటిని చదువుతూ ప్రపంచ విశేషాలను తెలపడమే కాదు.. ఇంటికెళ్లి తమ వారితో పంచుకుంటుంటారు. ఆటల పోటీల్లో.. జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 1 (సీనియర్ సిటిజన్స్ డే) సందర్భంగా ఆసరా కమిటీ సహకారంతో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని సీనియర్ సిటిజన్స్ పలు క్రీడాంశాల్లో పోటీ పడుతుంటారు. కేరంబోర్డు, చదరంగం, బ్రిస్క్ వాకింగ్, టగ్ ఆఫ్ వార్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేస్తారు. ఏడు పదులు దాటిన వయోధికులకు మోడల్కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతియేటా సన్మానిస్తూ ఎప్పటికప్పుడు వారిలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. భవిష్యత్తు తరాలకు సీనియర్ సిటిజన్స్కు ఏవిధమైన గౌరవం, ఆప్యాయత చూపించాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుండడం విశేషం. ఆత్మాభిమానంతో బతకాలి.. ఏ సమాజంలో వృద్ధులు తల ఎత్తుకుని ఆత్మాభిమానంతో మనుగడ సాగిస్తారో ఆ సమాజమే నాగిరిక సమాజం. ఆ సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ముందంజవేసి భావితరాలకు కరదీపికగా నిలుస్తుంది. ఇది ఒక భావన, ఆకాంక్ష, స్వప్నం. దీనిని సాకారం చేసుకోవాలంటే కలలో నుంచి ఇలలోకి రావాలి. నేటి సమాజంలోని వృద్ధుల స్థితిగతులను సామాజిక, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. – జేఎస్టీ శాయి, ప్రధాన కార్యదర్శి, మోడల్కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ -
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
టీమిండియాకు కొత్త తలనొప్పి..!
-
ఫ్యాన్స్కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
-
ఆంతా వాళ్లే చేశారంట..! క్రికెటర్ల తండ్రుల ఆవేదన
-
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
Vinod Kambli: కాంబ్లీకి ఏమైంది..?
-
అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా ఫోన్లలో పాత గేమ్స్ అన్నీ కనుమరుగయ్యాయి. ఇందులో ఒకటి.. ఒకప్పుడు అందరికీ ఇష్టమైన 'స్నేక్ గేమ్'. నోకియా ఫోన్ ఉపయోగించిన ఎవరికైనా ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. 4జీ, 5జీ ఫోన్లు రానప్పుడు ఎంతోమంది ఫేవరేట్ గేమ్ కూడా ఇదే. ఆ గేమ్ మళ్ళీ వచ్చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బ్రిటీష్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్.. ఐకానిక్ స్నేక్ గేమ్ను నథింగ్ హోమ్ స్క్రీన్ విడ్జెట్గా తీసుకొచ్చింది. దీనిని నథింగ్ కొత్త కమ్యూనిటీ విడ్జెట్ల యాప్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ లేటెస్ట్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్తో సహా ప్రతి నథింగ్ హ్యాండ్సెట్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.నిజానికి ఈ స్నేక్ గేమ్ను మొట్టమొదట నథింగ్ యూజర్ రాహుల్ జనార్ధనన్ ఒక కాన్సెప్ట్గా ప్రారభించారు. దీనితో పాటు మరో తొమ్మిది కాన్సెప్ట్లను రూపొందించి.. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. జనార్దనన్ కాన్సెప్ట్లు కంపెనీ దృష్టిని ఆకర్షించింది. దీంతో రూపొందించడానికి నథింగ్స్ సాఫ్ట్వేర్ బృందం కమ్యూనిటీ డెవలపర్తో భాగమయ్యారు.ఈ స్నేక్ గేమ్ 26 సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పామును కంట్రోల్ చేయడానికి నోకియా ఫోన్లో బటన్స్ ఉండేవి. ఇప్పుడు ఫోన్లలో బటన్స్ లేవు, కాబట్టి పాము కదలికను కంట్రోల్ చేయడానికి డైరెక్షనల్ వైపు టచ్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చూడటానికి విడ్జెట్పై రెండుసార్లు నొక్కాలి.Snake just got a reboot. Head to Google Playstore to get involved. pic.twitter.com/9MVKM1yKBc— Nothing (@nothing) December 4, 2024 -
ఖేలో ఇండియా గేమ్స్కు వేదికగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్రెడ్డికి హామీ ఇచ్చారు.రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది. హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు.గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, సరూర్నగర్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్లో సైక్లింగ్ వెల్డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్లో ఫుట్ బాల్ గ్రౌండ్తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ గుర్తుచేశారు.క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితరాలను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు.కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి.. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. -
Virat Kohli: చరిత్ర సృష్టించిన చి విరాట్ కోహ్లి..
-
గేమింగ్ ప్రియులకు శుభవార్త: హైదరాబాద్లో జాతీయ సదస్సు
ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ) తన 16వ యానివెర్సరీ ఎడిషన్ నవంబర్ 13 నుంచి 15వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరగనుంది. దక్షిణాసియాలో అతిపెద్ద పురాతనమైన ఈ సదస్సుకు 5,000 మంది ఆహ్వానితులు, 250 కంటే ఎక్కువ మంది వక్తలు పాల్గొంటారు.సుమారు 150 సెషన్లలో జరిగే ఈ సదస్సులో గేమింగ్ సెక్టార్కు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చు. గేమింగ్ ఇండస్ట్రీలో దిగ్గజం 'జోర్డాన్ వీస్మాన్' వంటి ప్రముఖులు ముఖ్య వక్తలుగా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ఈయన ఆర్పీజీ ఇండస్ట్రీలోని దీర్ఘకాల ఫ్రాంచైజీలైన బాటిల్టెక్, మెచ్వారియర్, షాడోరన్ సృష్టికర్తగా పేరుగడించారు.ఈ ఏడాది జరగనున్న ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ).. గతంలో కంటే కూడా భారీగా ఉండనుంది. ఇందులో లేటెస్ట్ గేమ్స్, టెక్నాలజీని ప్రదర్శించే 100 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఉండనున్నాయి. అవార్డ్స్ నైట్, ఇండీ ఇనిషియేటివ్, పాలసీ రౌండ్ టేబుల్లు, వర్క్షాప్ కూడా ఈ ఈవెంట్లో కనిపించనున్నాయి.ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది ప్రత్యేకంగా ఇన్వెస్టర్-పబ్లిషర్ కనెక్ట్ సెషన్కు ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది వందమంది పెట్టుబడిదారులు దీనికి హాజరుకానున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతాయి. గత సంవత్సరం ఈ సదస్సు 70 కంటే ఎక్కువ డెవలపర్లు, పెట్టుబడిదారులతో 1,800 సమావేశాలను నిర్వహించింది.ఈ సంవత్సరం ఐడీజీసీ కార్యక్రమంలో 'ఇంటర్నేషనల్ గేమ్ అవార్డ్’లను కూడా అందించనున్నారు. ఇందులో పది రెగ్యులర్ అవార్డ్స్, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గేమింగ్ మార్కెట్కు మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ భారత్లో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమకు ఐడీజీసీ సరైన వేదిక. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తును రూపొందించడానికి, సహకరించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి.. పరిశ్రమలోనో ప్రముఖులను, డెవలపర్లతో పాటు ఆవిష్కర్తలను ఒకచోటకు చెరచడానికి సహకరిస్తోంది. -
DSP నిఖిత్ జరీన్.. హైదరాబాద్ లో సరైన ట్రైనింగ్ సెంటర్ లేదు
-
జావెలిన్ దిగిందా లేదా!
మొహమ్మద్ అబ్దుల్ హాది ఏమీ చేతకాని, ఏ పనీ చేయలేని బతుకూ ఒక బతుకేనా? దీనికంటే ఆత్మహత్య నయమంటూ, మరుగుజ్జు అంటూ హేళన చేసిన వాళ్లంతా ఇప్పుడు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కారణం.. పారిస్ పారాలింపిక్స్లో అతను జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని అందుకోవడమే! ఆ క్రీడాకారుడు 23 ఏళ్ల నవదీప్ సింగ్. విజయానంతరం ఆ జావెలిన్ త్రోయర్ భారత్ తిరిగి వచ్చాక, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అతనితో సరదాగా మాట్లాడిన తీరు చూస్తే.. నవదీప్ తన ఆటతో ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించాడో అర్థమవుతుంది. పారాలింపిక్స్లో అతను సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఆత్మన్యూనతాభావంతో బతికే ఎంతోమంది నేర్చుకోవాల్సిన పాఠం. ఆ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. హరియాణాలోని పానిపట్ సమీపంలో బువానా లాఖు నవదీప్ సొంత ఊరు. తండ్రి దల్వీర్ సింగ్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి. జన్యుపరమైన లోపాలతో పుట్టడం వల్ల నవదీప్ వయసుకు తగ్గట్టు ఎదగలేకపోయాడు. పిల్లాడికి రెండేళ్లు వస్తేగానీ పరిస్థితి తీవ్రత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అప్పుడు కొడుకు చికిత్స కోసం వాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఊర్లో అతను మరుగుజ్జు నవదీప్గా స్థిరపడిపోయాడు. దాంతో బాల్యం నుంచే అతను అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా, ఇంట్లోనే ఉండిపోసాగాడు. ‘కొన్నిసార్లు మాతో కూడా మాట్లాడకుండా గదికి గడియ పెట్టుకుని, ఏడుస్తూ ఉండిపోయేవాడ’ని అతని పెద్దన్న మన్దీప్ గుర్తు చేసుకుంటాడు. కొడుకును సాధారణ స్థితికి తెచ్చేందుకు నవదీప్ తండ్రి తనకు సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. నవదీప్ చదువుకునేందుకు మంచి మంచి పుస్తకాలను తెచ్చివ్వడంతో పాటు, ఇతర అంశాలపై అతను దృష్టి సారించేలా చేశాడు. రాష్ట్రపతి అవార్డుతో..నవదీప్ని ఒంటరితనం నుంచి బయటపడేసేవి ఆటలే అని భావించారంతా! దాంతో ఇంట్లోవాళ్లు అతణ్ణి ఆటల వైపు ప్రోత్సహించారు. నవదీప్ తండ్రికి రెజ్లింగ్లో స్థానిక పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నవదీప్ కూడా ముందుగా రెజ్లింగ్లోనే సాధన చేశాడు. అయితే అక్కడా అతనికి తన ఆరోగ్యం కొంత సమస్యగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెజ్లింగ్ సాధ్యం కాదని అర్థమవడంతో దానిని వదిలేశాడు. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్పోర్ట్స్పై మరింత ఆసక్తి పెరిగింది. పీఈటీ ప్రోత్సాహంతో అతను అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. అందులో అందరితో పోటీపడుతూ సాధించిన విజయాలు నవదీప్కు గ్రామంలో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని క్రీడా ప్రతిభ హరియాణాను దాటింది. వైకల్యాన్ని అధిగమించి పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. 12 ఏళ్ల వయసులో అతను కేంద్ర ప్రభుత్వం అందించే ‘రాష్ట్రీయ బాల్పురస్కార్’ అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తన మరుగుజ్జుతనాన్ని మరచిపోయేలా చేసింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యేక శిక్షణతో ..బాల్పురస్కార్ అవార్డు తర్వాత క్రీడలపై పూర్తిగా దృష్టి సారించవచ్చని నవదీప్కు నమ్మకం కలిగింది. మరికొంత కాలం అథ్లెటిక్స్పై మరింత సాధన చేసి ఆటలో పదును పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయోభిలాషులందరూ అండగా నిలవడంతో పెద్దస్థాయిలో శిక్షణ కోసం, నవదీప్ తన 16వ ఏట ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కోచ్ నావల్ సింగ్ వద్ద అథ్లెటిక్స్లో కోచింగ్, ప్రాక్టీస్ సాగింది. నవదీప్కి ఇంకా తోడుగా ఉండటం వల్ల అతను పైకి రాలేడని, అతను స్వతంత్రంగా ఉండే ఏర్పాట్లు చేయాలని పెద్దన్న మన్దీప్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో తండ్రి ఎల్ఐసీ పాలసీ ద్వారా అప్పు చేసి మరీ కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొడుకు ఒలింపిక్ విజయానికి కొన్ని నెలల ముందే ఆయన కన్నుమూశాడు. కొడుకు గెలుపును చూడలేకపోయాడు. కఠోర సాధనతో..ఢిల్లీలో శిక్షణ పొందే క్రమంలో అథ్లెటిక్స్లో ఏదైనా ఒక ఈవెంట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అప్పుడే హరియాణాకే చెందిన నీరజ్ చోప్రా.. అండర్–20 వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించడం నవదీప్ను ఆకర్షించింది. దాంతో తనూ జావెలిన్ త్రో వైపు మొగ్గు చూపాడు. అక్కడి జావెలిన్ కోచ్ విపిన్ కసానా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నా కెరీర్లో నేను ఎంతో మందికి శిక్షణనిచ్చాను. కానీ ఇంత తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్లెవరూ నా వద్దకు రాలేదు. దాంతో నవదీప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 2.2 మీటర్ల పొడవు ఉన్న జావెలిన్ను పట్టుకోవడం మొదలు భుజాలపై భారం ఉంచి విసిరే వరకు అంతా భిన్నమే. జావెలిన్ను విసిరే కోణాల్లో కూడా మార్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏం చేసినా అతని పట్టుదల ముందు అన్నీ చిన్నవిగా అనిపించాయి. కఠోర సాధనకు నవదీప్ ఏ దశలోనూ వెనుకాడలేదు’ అని విపిన్ చెప్పారు. ఒలింపిక్ పతకాన్ని ముద్దాడి..నవదీప్ కష్టానికి ప్రతిఫలం కొద్దిరోజులకే దక్కింది. 17 ఏళ్ల వయసులో ఆసియా యూత్ పారా గేమ్స్లో స్వర్ణంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచిన అతను ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం సాధించి ఒలింపిక్స్పై ఆశలు రేపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జావెలిన్ త్రో ఎఫ్ 41 విభాగంలో (తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్ల కేటగిరీ) స్వర్ణం గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నట్లే ఈసారి కూడా తన ఊర్లో అందరికీ ఆ పతకాన్ని చూపించి గర్వంగా నిలబడ్డాడు. -
ట్రామ్ పోలిన్ పిల్లలాటతో ఫిట్గా..
కొన్నిపార్కుల్లోనూ, మాల్స్లోనూ పిల్లలకోసం కేటాయించిన వలయాకారపు ట్రామ్ పోలిన్లు చూసే ఉంటారు. ‘మనమూ అలా గెంతితే ఎంత బాగుంటుంది’ అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ, శరీరం సహకరించదేమోనని సందేహిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం గెంతుతూ సరదాగా వ్యాయామం చేసే ట్రాంపోలిన్ వాక్ అందుబాటులోకి వచ్చింది.పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని ఫిట్నెస్ కేంద్రాలు వినోదానికి– వ్యాయామాలకు మధ్య ఉన్న విభజన రేఖను తొలగిస్తూ ఈ ట్రామ్ పోలిన్ పరికరాలను పరిచయం చేస్తున్నాయి. జిమ్లో రొటీన్గా వ్యాయామాలు చేయడం బోర్ అనిపిస్తే, ఈ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.అనేక ప్రయోజనాలు...⇒ ట్రామ్ పోలిన్పై గెంతడం వల్ల గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేంత ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రామ్ పోలిన్ వర్కౌట్లు హృదయనాళాల పనితీరును బాగుచేయడంతోపాటు ఒత్తిడిని త్వరగా నివారిస్తాయి. ⇒ ‘ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది’అని ఢిల్లీకి చెందిన జుంబా శిక్షకుడు, ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ కోచ్ ఆరుషి పస్రిజా తెలియజేస్తున్నారు.⇒ ట్రామ్ పోలిన్ మృదువైన ఉపరితలం రన్నింగ్ లేదా ఇతర భారీ వ్యాయామాలతోపోలిస్తే కీళ్లపై భారాన్ని తగ్గిస్తుందని వైద్యులు గమనించారు, ఇది తేలికపాటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రామ్ పోలిన్ వ్యాయామాలు ఎముక ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, సమతుల్యతకు సహకరిస్తాయి. ⇒ కదలికలు బాగా ఉండటం వల్ల త్వరగా కేలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గుతారు. హృదయ స్పందన రేటు పెరగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.⇒ ‘జంపింగ్ ఎముక సాంద్రతను ప్రేరేపిస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది‘ అని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యుగల్ తెలియజేశారు.మొదట్లోనే జంపింగ్లు వద్దు...ట్రామ్ పోలిన్ వర్కౌట్లలో స్క్వాట్ జంప్లు, జంపింగ్ జాక్స్, టక్ జంప్లు వంటి కఠినమైన కదలికలు కూడా ఉంటాయి. కానీ అదంతాప్రారంభ దశలో కాదు. పూర్తి శరీర వ్యాయామాలుగా మార్చడానికి వర్కౌట్స్, యోగా వంటి అనుకూలమైన వ్యాయామాలతో కలపాలి. ఈ వ్యాయామాలు చేయడానికి రెసిస్టెన్ ్స బ్యాండ్లను కూడా ఉపయోగించవచ్చు.ప్రమాదం.. నివారణఫిట్నెస్లో ట్రామ్ పోలిన్ను చేర్చాలనే ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు. అయితే గాయాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. నేలపైన సరిగా సెట్ కాకపోతే ట్రామ్ పోలిన్ పడిపోవడం,పాదాలు బెణకడం, గాయాలకు దారితీయడం వంటివి. అందుకని నిపుణుల సూచనలు తీసుకొని, వీటి కొనుగోలులోనూ, ఉపయోగించడంలోనూ మెలకువలు తెలుసుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్పై ఉన్నప్పుడు ముందుగా మోకాళ్లను వంచి, శరీర బ్యాలెన్స్ చూసుకోవాలి. ⇒పరధ్యానంగా ఉండకూడదు. ట్రామ్ పోలిన్ పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టీని గట్టిగా పట్టుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మంచి గ్రిప్ సాక్స్ లేదా షూ ధరించాలి. ⇒ నెమ్మదిగాప్రారంభించి, క్రమంగా తీవ్రతను పెంచాలి. ⇒ వారానికి 2–3 సార్లు చేసి, శరీర అనుకూలతను బట్టి వ్యవధిని పెంచుకోవచ్చు. సమస్యలు ఉంటే.. ఆస్టియోపొరోసిస్, కీళ్లనొప్పులు, వెన్ను లేదా మోకాలి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్యాయామాలను చేయకూడదు. గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందుగా తమ వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా కింద పడిపోయే వ్యక్తులు కూడా ఆలోచించాలి. వృద్ధులయితే తప్పకుండా ఇతరుల సాయం తీసుకోవాలి.డెస్క్ ఉద్యోగులకు మరింత ప్రయోజనండెస్క్ జాబ్లు చేసేవారికి ట్రాఅందరికీ ధన్యవాదాలు డెస్క్ జాబ్లు చేసేవారికి ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అద్భుతమైనది. ఈ వ్యాయామం వల్ల కడుపు, దిగువ శరీర కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం ట్రామ్ పోలిన్ వర్కౌట్ సెష¯న్లను నిర్వహించడం ప్రారంభించాయి. అయితే, పిల్లల పార్కుల్లో చూసే వాటికి పెద్దవారి ఫిట్నెస్ ట్రామ్ పోలిన్ భిన్నంగా ఉంటుంది. ఇంట్లోనే పెద్దవాళ్లు ఉపయోగించే ట్రామ్ పోన్లు సాధారణంగా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. ఇవి క్రీడా పరికరాలు దొరికే చోట, ఆన్లైన్ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అయితే, బరువును మోయగలిగే దృఢమైన ట్రామ్ పోన్లను ఎంచుకోవాలి. అదేవిధంగా ఫిట్నెస్ నిపుణుల సూచనలు ΄ాటించాలి. ఇందుకు ఆ¯న్లైన్ ట్రైనర్స్ సాయం కూడా తీసుకోవచ్చు. – ఆరుషి, ఫిట్నెస్ ట్రైనర్ -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
ధోని కంటే రోహిత్ చాలా బెస్ట్...
-
ఆ రోజులే బాగుండేవి..
-
భారత్లో మహిళల క్రీడా అభివృద్దికి యూఎస్ కృషి..
క్రీడల్లో భారత మహిళల భాగస్వామ్యాన్ని, లీడర్ షిప్ స్కిల్స్ ను పెంచేందుకు యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్ఎ) ముందడుగు వేసింది. ఈ క్రమంలో యూఎస్ రాయబార కార్యలయం, కాన్సులేట్లు గేమ్ ఛేంజర్స్ అల్టిమేట్ ఫ్రిస్బీ అనే ప్రాజెక్ట్ ను లాంఛ్ చేశారు. అల్టిమేట్ ఫ్రిస్బీ గేమ్ ద్వారా లింగ సమానత్వం, మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని యూఎస్ ఎంబసీ భావిస్తోంది. తొలుత ఈ కార్యక్రమం భారత్లోని ముఖ్య నగరాలు ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, చెన్నైలలో ఆగస్టు 19 నుండి 24 వరకు జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 26 నుండి 31 వరకు ముంబైలో ఈ గేమ్ ఛేంజర్స్ పోగ్రాంను నిర్వహించనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 100 మంది మహిళా కోచ్లను తాయారు చేయడమే ఈ ప్రాజెక్ట్ అంతిమ లక్ష్యం. ఈ కార్యకమాన్ని నగరాల్లోని పలు విద్యా సంస్థలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లలో నిర్వహించనున్నారు. కోచ్ డెవలప్మెంట్ వర్క్షాప్లు, జెండర్ ఈక్విటీ క్లాస్లతో ఈ పోగ్రాం ప్రారంభం కానుంది. ఆ తర్వాత అల్టిమేట్ ఫ్రిస్బీ గేమ్కు సంబంధించిన సెషన్స్లో సదరు మహిళలు పాల్గోనున్నారు. కాగా అల్టిమేట్ ఫ్రిస్బీ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ. కాగా ఈ గేమ్లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి పాల్గోనవచ్చు -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనున్న వినేష్ ఫోగట్
-
2025 ఐపీఎల్ లో ధోని ఆడుతాడా..?
-
శభాష్ వినేష్.. ఓడినా నువ్వే బంగారం
-
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
రామ్ చరణ్తో పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్లో అరుదైన దృశ్యం!
పారిస్ ఒలింపిక్స్లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. గేమ్స్ ప్రారంభానికి ముందే పారిస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు బయలుదేరి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిరంజీవి, సురేఖ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా పారిస్ వీధుల్లో రామ్ చరణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. అనుకోకుండా రామ్ చరణ్, సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చెర్రీ పెట్ డాగ్ రైమ్ గురించి సింధు ఆరాతీస్తూ కనిపించింది. ఎక్కడికెళ్లినా రైమ్ను తీసుకెళ్తారా? అంటూ రామ్ చరణ్ అడిగింది. సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాగా.. పీవీ సింధు ఇవాళ తన తొలి విజయాన్ని నమోదు చేసింది. View this post on Instagram A post shared by Rhyme Konidela (@alwaysrhyme) -
నటాషాను మరిచిపోలేకపోతున్నాడా..?
-
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్ల్యాండ్లో జరగనున్న పోటీల్లో షాట్పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్నగర్లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్పుట్, డిస్కస్త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్బాయ్లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్గా నా పేరు రికార్డయింది. -
ఆన్లైన్ గేమర్స్ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ..
సాక్షి, సిటీబ్యూరో: భారత్లో ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024’(బీజీఐఎస్) గ్రాండ్ ఫినాలేకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా గ్రాండ్ ఫినాలే ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది.దేశంలోనే అతిపెద్దదైన ఈ రాయల్ ఎస్పోర్ట్స్ ఇండియా సిరీస్ టోర్నమెంట్లో రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందించడం విశేషం. దేశంలోని యువ ఆటగాళ్లతో కూడిన చివరి 16 అగ్రశ్రేణి జట్లు చాంపియన్షిప్ టైటిల్ను దక్కించుకోవడానికి ఆన్లైన్ రౌండ్లలో పోటీ పడనున్నారు. గేమింగ్ ఔత్సాహికులు ఈ సీరీస్ను ప్రత్యక్షంగానే కాకుండా క్రాఫ్టన్ ఇండియా ఈ–స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: టీనేజర్ల రక్షణ కోసం.. సరికొత్తగా స్నాప్చాట్! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
-
నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సా(షా)మి
-
వైఎస్సార్ హెల్త్ క్లినిక్ అండ్ వెల్నెస్ భవనాలను ప్రారంభించిన రోజా
-
భారత్ క్రికెట్ లో సచిన్ దాస్ పేరు ట్రెండింగ్
-
ఆడుదాం ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్..!
-
నాలుగేళ్ల క్రితం మ్యాచ్ కు ఇప్పుడు ఇంత క్రేజా..?
-
విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు. ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
మహ్మద్ షమీకి అర్జున అవార్డు
-
డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా
న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్పీ ఇండియా నిర్వహించిన గేమర్స్ ల్యాండ్స్కేప్ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ►గేమ్లను సీరియస్గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ►2022తో పోలిస్తే 2023లో గేమింగ్పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్ గేమర్లు (గేమింగ్ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు. ►67 శాతం మంది మొబైల్ ఫోన్ కంటే కంప్యూటర్లోనే గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►స్పాన్సర్షిప్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ►గేమింగ్ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు. ►అదే సమయంలో గేమింగ్ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ►గేమింగ్ కెరీర్లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది. ‘‘భారత్ ప్రపంచంలో టాప్–3 పీసీ (కంప్యూటర్) గేమింగ్ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్పీ ఇండియా మార్కెట్ ఎండీ ఇప్సితాదాస్ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి పేర్కొన్నారు. -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్లో మొత్తం డిజిటల్ గేమ్లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు
-
విశాఖలో 25 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: రానున్న నాలుగైదు నెలల్లోనే విశాఖలో 25 ఎకరాల్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించుకునేందుకు అనువుగా ఇంటిగ్రేటేడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు విశాఖలో తగిన స్థలం కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్) జరగనున్న నేపథ్యంలో ఏసీఏ ఆధ్వర్యంలో విశాఖ బీచ్రోడ్లో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం చెంత ఈ పరుగును సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మన ఏపీఎల్ మన ఆంధ్రా’ పేరిట ఏపీఎల్ రెండో సీజన్ బ్రాండింగ్లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు 3కే రన్ నిర్వహించినట్లు చెప్పారు. ఏపీఎల్లో ప్రతిభ చూపిన క్రికెటర్లు ఐపీఎల్కు ఆడే అవకాశం ఉందన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ , ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, మేయర్, కలెక్టర్ పాల్గొన్నారు. చదవండి టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో చిన్నారులకు 2 గంటల వరకే అనుమతి.. -
5కే,10కే రన్ చేసేటప్పుడు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు
-
టీవీకి సరిగ్గా సరిపోయే ఆట!
ఫుట్బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ. నొవాక్ జొకోవిచ్ మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్లో నొవాక్ జొకోవిచ్ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు. టెన్నిస్లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం. కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. టెన్నిస్లా ఫుట్బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్బాల్, క్రికెట్లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు. టెన్నిస్లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు. అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను. వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్. 1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్షిప్ పాయింట్లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం! 1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్కు మూడు చాంపియన్ షిప్ పాయింట్లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది. ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది. ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్ను కూడా కోరుకుంటాడు. అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆటల పోటీలతో ఉద్యమం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డిమాండ్ల సాధనకు రాజకీయ పార్టీలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త మండలాల కోసం ఉద్యమిస్తున్న ఆయా పార్టీలు, సంఘాలు ధర్నాలు, ర్యాలీలతో లాభం లేదని గ్రహించి వినూత్న పద్ధతిలో ప్రయత్నిస్తున్నాయి. ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్తో పాటు కొమరారం, బోడు కేంద్రంగా నూతన మండలాల ఏర్పాటుకోసం వామపక్షాలు, ఇతర పార్టీలు ఏళ్ల ఉద్యమిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ పద్ధతుల్లోనే సంతకాల సేకరణ, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు చేపట్టాయి. అయితే ఇందులో రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు అవుతున్నారు తప్పితే ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేదని నేతలు గ్రహించారు. దీంతో పార్టీలు.. ప్రజలను కూడా భాగం చేసేందుకు సరికొత్త ఎత్తుగడ కింద ఆటల పోటీలను ఆయుధంగా ఎంచుకున్నాయి. ఈ క్రమంలో పురుషులకు వాలీబాల్ పోటీలు, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించాయి. గతంలో కూడా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగినా.. అవి ఏదైనా జాతీయ పండుగలను పురస్కరించుకుని లేదా ఆయా పార్టీలకు చెందిన నేతల స్మారకార్థం జరిగేవి. కానీ తొలిసారిగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆటల పోటీలు నిర్వహించడం విశేషం. 2016 నుంచి డిమాండ్లు.. 2016 అక్టోబర్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన సందర్భంగా ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్తో పాటు కొమరారం మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ను రాజకీయ పక్షాలు భుజానికి ఎత్తుకున్నాయి. సుమారు మూడు నెలల పాటు వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనలు, నిరసనలు నిర్వహించాయి. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయితే, ఈ డిమాండ్లపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది తప్పితే ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత కాలంలో ఏజెన్సీ ప్రాంతమైన టేకులపల్లి మండలాన్ని విభజించి బోడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు అంశం కూడా తెరపైకి వచ్చింది. మలి దశలో ఉద్యమం తీరుతెన్నులు ఈ ఏడాది జనవరిలో ఇల్లెందు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం, సంతకాల సేకరణ, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నెలపాటు ప్రజాపంథా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. మార్చి 4 నుంచి 12 వరకు ఇల్లెందు మండలం మర్రిగూడెం నుంచి ఇల్లెందు వరకు 32 కిలోమీటర్లు సీపీఐ (ఎంఎల్) – న్యూడెమొక్రసీ ఆధ్వర్యాన పాదయాత్ర చేపట్టారు. మార్చి 28, 29వ తేదీల్లో పురుషులకు మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈనెల 1, 2వ తేదీల్లో ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్టీ పోటీలు ఏర్పాటు చేశారు. -
భయాన్ని పోగొట్టి.. ఆడుతూ.. పాడుతూ.. లెక్కలు
మ్యాథ్స్ అంటే స్టూడెంట్స్కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆట, పాటలతో మ్యాథ్స్ నేర్పిస్తుంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల టీచర్ రూపారాణి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, లెక్కలు అంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే! మ్యాథ్స్ అంటే కొందరి విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. అదే గేమ్స్ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో లెక్కలపై మక్కువ చూపే విధంగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది. ఫలితం ఇప్పుడా టీచర్ దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్న పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్జీబ్రాలు, కొలతలు, వేగాలు అన్ని మంచినీళ్ల ప్రాయంగా అర్ధమవసాగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ఇప్పుడు వీరు కార్పొరేట్కు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. రూపారాణి ఇటీవల కేరళ రాష్ట్రం త్రిశూర్లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబర్చి, టీచర్ కేటగిరిలో ప్రత్యేక బహుమతిని సాధించారు. చార్పత్తర్తో.. విద్యార్థులు ఆడుకునే చార్ పత్తర్ ఆటతో గ్రాఫింగ్ పాయింట్లు ఎలా పెట్టవచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్లో నాలుగు సమాన బాక్స్లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్ పాయింటింగ్ నేర్పిస్తున్నారు. డయల్ యువర్ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయవచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను చేయడం, ఎలక్ట్రికల్ లైట్స్తో ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్.. ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. పాటలతో ఎక్కాలు బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్ డిజిటిల్స్ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు. నాన్న స్పూర్తితోనే! మా నాన్న రాజమౌళి ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. టూర్లకు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలను తీసుకువచ్చి, వాటి ద్వారా విద్యా బోధన చేశారు. దీంతో విద్యార్థులూ చదువు పట్ల మక్కువ చూపించేవారు. అలా నాన్న స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకుని ఆలోచించాను. విద్యార్థులకు ఆటల ద్వారా మ్యాథ్స్ను బోధిస్తున్నారు. మానాన్న స్పూర్తితోనే విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మాథ్స్ చెప్పుతున్నాను. దీంతో విద్యార్థుల పాస్ పర్సంటెజ్ బాగా పెరుగుతుంది. సిరసనగండ్ల జెడ్పీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉన్న నేను ఇటీవల డిప్యూటేషన్ పై మూట్రాజ్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడా ఇదే పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాను. – పెందోట రూపారాణి జాతీయ స్థాయిలో ప్రతిభ విద్యార్థులకు ఆటలతో మ్యాథ్స్ బోధించే విధానాన్ని జాయ్ ఫూల్ లెర్నింగ్ మ్యాథ్స్ బై గేమ్స్ యూజింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పేరుతో ఎగ్జిబిట్లను రూపొందించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చారు. కేరళ రాష్ట్రం త్రిశూల్లో జరిగిన జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. విశ్వేశ్వరయ్య ఇండ్రస్టియల్ టెక్నాలజీ మ్యూజియం తరుపున ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: సతీష్ కుమార్ -
మేడిన్ ఇండియా బొమ్మల హవా
చెన్నై: లెగో, బార్బీ లాంటి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయంగా మన ఆటలు, బొమ్మలు, ఆట వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. బొంగరాలు, విక్రమ్ బేతాళ్ పజిళ్లు, ఇతరత్రా దేశీ థీమ్స్తో తయారవుతున్న ఆటవస్తువులపై పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. టాయ్స్ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరి చేయడంతో కొన్ని రకాల బొమ్మలను దిగుమతి చేసుకోవడం కొంత తగ్గింది. అదే సమయంలో దేశీ టాయ్స్ తయారీ సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాయి. మార్కెట్ లీడర్లయిన ఫన్స్కూల్, హాస్బ్రో, షుమీ లాంటి సంస్థలు ఆట వస్తువులు, గేమ్స్ను రూపొందిస్తున్నాయి. జన్మాష్టమి మొదలుకుని రామాయణం వరకు వివిధ దేశీ థీమ్స్ కలెక్షన్లను కూడా తయారుచేస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సమయం కూడా అర్థవంతంగా ఉండాలనే ఆలోచనా ధోరణి కొత్త తరం పేరెంట్స్లో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి హాట్ కేకులుగా అమ్ముడవుతున్నాయి. సంప్రదాయ భారతీయ గేమ్స్కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే లభిస్తోందని ఫన్స్కూల్ వర్గాలు తెలిపాయి. దీంతో తాము బొంగరాలు, గిల్లీడండా (బిళ్లంగోడు) లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, ఆటల్లాంటివి తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తి సాధారణంగానే తల్లిదండ్రుల్లో ఉంటుందని, ఇది కూడా దేశీ గేమ్స్ ఆదరణ పొందడానికి కారణమవుతోందని హాస్బ్రో ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ బొమ్మలు, గేమ్స్ మొదలైనవి పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, దీనితో స్థానికంగా కొనుగోళ్లు, తయారీకి కూడా ఊతం లభిస్తోందని వివరించాయి. తాము మోనోపలీ ఆటను తమిళంలో కూడా అందుబాటులోకి తెచ్చామని, దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని పేర్కొన్నాయి. అటు జన్మాష్టమి కలెక్షన్ ఆవిష్కరించిన ఆటవస్తువుల కంపెనీ షుమీ కొత్తగా దీపావళి కలెక్షన్ను కూడా ప్రవేశపెడుతోంది. 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే.. దేశీ టాయ్స్ మార్కెట్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే ఉంటోంది. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 5 శాతం మేర వృద్ధి చెందుతుంటే మన మార్కెట్ మాత్రం 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో మార్కెట్ పరిమాణం 2–3 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా భారత్లో దేశీ ఆటవస్తువులు, బొమ్మలు, గేమ్స్కు డిమాండ్ ఉన్నప్పటికీ తయారీ సంస్థలు ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాయని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శరద్ కపూర్ తెలిపారు. -
ప్లేస్టోర్లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్జీ) అభిప్రాయపడింది. -
భారత్లో యాప్స్, గేమ్స్కి పెరిగిపోతున్న క్రేజ్!
న్యూఢిల్లీ: దేశీ యాప్స్, గేమ్స్కి డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే స్టోర్లో 2019తో పోలిస్తే 2021లో యాక్టివ్ నెలవారీ యూజర్ల సంఖ్య 200 శాతం పెరిగింది. గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ ఆదిత్య స్వామి ఒక బ్లాగ్పోస్ట్లో ఈ విషయాలు వెల్లడించారు. గూగుల్ ప్లేలో వినియోగదారులు చేసే వ్యయాలు 2019తో పోలిస్తే 2021లో 80 శాతం పెరిగినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా విద్య, చెల్లింపులు, వైద్యం, వినోదం, గేమింగ్ వంటి విభాగాల్లోని యాప్ల వినియోగం గణనీయంగా వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అలాగే గేమింగ్కు కూడా ఆదరణ పెరిగిందన్నారు. లూడో కింగ్ వంటి గేమ్స్ తొలిసారిగా 50 కోట్ల పైచిలుకు డౌన్లోడ్స్ నమోదు చేసుకున్నాయని స్వామి వివరించారు. ‘గూగుల్ ప్లేలో భారతీయ యాప్లు, గేమ్ల విషయంలో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2019తో పోలిస్తే 2021లో 200 శాతం, చేసే వ్యయాలు 80 శాతం పెరిగాయి. అలాగే దేశీ యాప్లు, గేమ్లపై విదేశాల్లోని యూజర్లు వెచ్చించే సమయం 150 శాతం పెరిగింది‘ అని స్వామి వివరించారు. భారత్లో యూనికార్న్లుగా ఆవిర్భవించిన కంపెనీల్లో ఎక్కువ భాగం వాటా ఈ తరహా యాప్ సంస్థలదేనని ఆయన పేర్కొన్నారు. గూగుల్ ప్లే భారత్లో వివిధ కేటగిరీల్లో అద్భుతమైన యాప్ల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడి డెవలపర్లు, స్టార్టప్ల వ్యవస్థ ఎంతగానో తోడ్పడిందని స్వామి వివరించారు. -
ఆన్లైన్ గేమ్స్పై కేంద్రం జీఎస్టీ బాదుడు! ఎంతంటే!
ఎస్. ఊహించినట్లుగానే జరిగింది. కొద్ది సేపటి క్రితమే కేంద్ర మంత్రుల బృందం ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో,రేస్ కోర్స్లపై 28శాతం జీఎస్టీ విధించేలా సిఫార్స్ చేసినట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీనిపై త్వరలో మంత్రుల బృందం నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అయితే కేంద్ర మంత్రుల సిఫార్స్లపై స్కిల్గేమింగ్ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ రేటునే కొనసాగించాలని డిమాండ్ చేసింది. ప్రతిపాదిత 28 శాతం పన్ను పరిధిలోకి మారిస్తే 2.2 బిలియన్ డాలర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అధిక పన్ను పరిధిలోకి చేర్చడం వల్ల పరిశ్రమ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ, భారత పన్ను చట్టం పరిధిలోకి రాని వాటిని ప్రోత్సహించినట్టు అవుతుందని గేమ్స్ 24ఇంటూ7 సీఈవో త్రివిక్రమ్ తంపి పేర్కొన్నారు. ‘‘ఇది ముప్పేట ప్రభావాన్ని చూపిస్తుంది. పరిశ్రమ నష్టపోతుంది. ప్రభుత్వం పన్ను ఆదాయం రూపంలో నష్టపోతుంది. విశ్వసనీయత లేని ఆపరేటర్ల చేతుల్లో పడి ఆటగాళ్లు నష్టపోతారు’’అని తంపి అభిప్రాయపడ్డారు. 400 సంస్థలతో 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకు 18 శాతం జీఎస్టీనే కొనసాగించాలని ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ల సమాఖ్య ఇప్పటికే అధికారులకు వినతిపత్రాన్ని కూడా సమర్పించింది. ఈస్పోర్ట్స్, ఫాంటసీ గేమ్స్, రమ్మీ, పోకర్, చెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ స్కిల్ గేమ్ల కిందకు వస్తాయి. ఈ తరహా ఆటలు ఉచితంగా లేదంటే ప్లాట్ఫామ్ ఫీజుల రూపంలో నడుస్తుంటాయి. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ స్కిల్ గేమింగ్ సేవలను 18 శాతం నుంచి 28 శాతం జీఎస్టీ శ్లాబులోకి మార్చాలన్న ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి👉ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి -
భారతీయులు ఈ గేమ్ను తెగ ఆడేస్తున్నారు
భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచికర్ తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్ హబ్తో కలిసి గూగుల్ .. యాప్స్కేల్ అకాడమీ క్లాస్ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు. యాప్స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. చదవండి: ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!! -
రమ్మీ విస్ఫోటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందటే నిషేధం విధించిన ఆన్లైన్ రమ్మీ మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్రంలో నిషేధం ఉన్నా ముంబై ఆన్లైన్ రమ్మీ మాఫియా కొత్త యాప్లను తాజాగా రాష్ట్రంలోకి వదిలింది. నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తోంది. దీంతో లక్షలాది మంది యువత వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఆడుతూ రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఫేక్ లొకేషన్తో జూదరులు ఆట ఆడగా.. ఇప్పుడు నేరుగానే పేకాట ఆడేలా యాప్లను మాఫియా తీసుకొచ్చింది. గేమింగ్ యాక్ట్ను సవరిస్తూ, ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేస్తూ చట్టం తీసుకొచ్చినా బరితెగించి యాప్లు వదిలిన రమ్మీ మాఫియాపై ప్రభుత్వ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా.. ముంబైకి చెందిన ప్రముఖ రమ్మీ సంస్థ డ్యాష్ రమ్మీ, రమ్ రమ్మీ, రోజ్ రమ్మీ యాప్లను రూపొం దించింది. డబ్బు లేకపోతే రమ్మీ ఆడి గెలుచు కోవచ్చని, సులభంగా సంపాదించు కోవచ్చని యూట్యూబ్, ఫేస్బుక్ తదితర మా«ధ్యమాల్లో ప్రకటనలిచ్చింది. గతంలో ఆన్లైన్ రమ్మీ యాప్లను ఇన్స్టాల్ చేసుకున్నా రాష్ట్రం లొకేషన్ ఉండటం వల్ల ఆడేందుకు అనుమతి వచ్చేది కాదు. దీంతో ఫేక్ లొకేషన్ యాప్లను ఇన్స్టాల్ చేసుకొని నకిలీ లొకేషన్తో రమ్మీ ఆడేవారు. అయితే ఈ 3 యాప్స్లో ఇలాంటి ఆప్షన్ లేదు. ఈ–మెయిల్, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని నేరుగా గేమ్లోకి వెళ్లేలా అవకాశం కల్పించారు. డబ్బులు జమ చేసి ఆడాలి ♦ ఓసారి రిజిస్టర్ అయ్యాక పేకాట ఆడేందుకు డబ్బులు జమ చేసుకోవాలి. ఇందుకోసం యూపీఐ (ఫోన్ ఫే, గూగుల్ పే) ద్వారా రూ.50 నుంచి 10వేల వరకు యాడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు. ♦ డబ్బు జమయ్యాక పాయింట్ రమ్మీ, పూల్ రమ్మీ, డీల్స్ అని మూడు రకాల పేకాట ఆప్షన్ వస్తుంది. వాటిలో ఎంపిక చేసుకొని డబ్బులు పెట్టి ఆడాలి. ♦ డబ్బులు వస్తే విత్డ్రా చేసుకునే అవకాశముంది. ఇందుకు యాప్లో ప్రొఫైల్, కేవైసీ, అడ్రస్ ఫ్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్, పాస్పోర్టు, ఓటర్ ఐడీ, బ్యాంకు వివరాల్లాంటివి అప్లోడ్ చేశాక ప్రొఫైల్ అప్లోడ్ సక్సెస్ ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాతే డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశముంది. బ్యాంకు లేదా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోవాలని యాప్ సూచిస్తుంది. ♦ డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్.. పలు రాష్ట్రాల్లో బ్యాన్ ఉం దని యాప్లో పేర్కొంటున్నారు. అయినా ఆడేలా ఆప్షన్ కల్పించడం వివాదాస్పదమవుతోంది. బరితెగించినట్టా.. లేక డీల్ సెటిలైందా? ఆన్లైన్ రమ్మీ దందా చేస్తున్న మాఫియా గతంలో అనుమతి ఉన్న రాష్ట్రాల లొకేషన్స్తోనే గేమ్లోకి అనుమతించేవి. ఇప్పుడు కొత్త యాప్స్ను రాష్ట్రం లోకి వదలడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 6 నెలల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ ఆన్లైన్ రమ్మీ సంస్థ, ఆన్లైన్ రమ్మీకి చెందిన కీలక సూత్రధారి.. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీకి సడలింపులు లేదా దొంగచాటున అనుమతి ఇచ్చేలా ఓ నేతతో రూ.70 కోట్లకు డీల్ చేసుకు న్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించినా ఇప్పుడు ఈ ఆన్లైన్ రమ్మీ పగడ విప్పడంతో వెనుకున్నది ఎవరని చర్చ జరుగుతోంది. మొదట్లో వచ్చాయి.. తర్వాత పోయాయి జనవరి 14న ఆన్లైన్ రమ్మీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా. అడ్రస్తో సహా అన్ని సబ్మిట్ చేసి గేమ్ ఆడాను. ఇప్పుడూ ఆడుతున్నా. రెండ్రోజుల కిందట రూ.3 వేలు వచ్చాయి. డబ్బులు వస్తున్నాయని ఆడుతుంటే రూ.3 వేలతో పాటు మరో రూ.2 వేలు కూడా పోయాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఓ 50 మంది వరకు ఆడుతున్నాం. – వెంకటేశ్, హైదరాబాద్ అప్పుడు ఫేక్ లొకేషన్తో ఆడా.. గతంలో ఆన్లైన్ రమ్మీ రాష్ట్రంలో ఆడేందుకు ఫేక్ లొకేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు డ్యాష్ రమ్మీలో ఆ ఇబ్బంది లేదు. కానీ ఆధార్ కార్డు, బ్యాంకు ఇతర వివరాలు అడగడం భయంగా ఉంది. డబ్బును విత్డ్రా సమయంలో రాష్ట్రంలో బ్యాన్ ఉందంటూనే ఇక్కడి లొకేషన్లోనే యాప్ ఓపెన్ అవడం ఆశ్చర్యం. – శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్ -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
నెట్ఫ్లిక్స్లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా?
న్యూఢిల్లీ: ఓవర్ ద టాప్ మీడియా సేవల్లో ఉన్న నెట్ఫ్లిక్స్ మొబైల్ గేమ్స్ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఆన్డ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్ పీసీ యూజర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ముందుగా అయిదు గేమ్స్ను కంపెనీ పరిచయం చేసింది. యూజర్లు నెట్ఫ్లిక్స్ చందాదారులైతే చాలు. ఎటువంటి ప్రకటనలు, అదనపు రుసుం, ఖర్చులు లేవని కంపెనీ తెలిపింది. చాలా భాషల్లో ఈ గేమ్స్ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. పిల్లల ప్రొఫైల్స్కు ఇవి అందుబాటులో ఉండవని వివరించింది. గేమ్స్ ఇవే ది స్ట్రేంజర్ థింగ్స్:1984 (బోనస్ ఎక్స్పీ) స్ట్రేంజర్థింగ్స్ 3: ది గేమ్ (బోనస్ ఎక్స్పీ) షూటింగ్ హూప్స్ (ఫ్రోస్టీ పాప్) కార్డ్ బ్లాస్ట్ ( అమ్యూజో అండ్ రోగ్ గేమ్) టీటర్ అప్ (ఫ్రోస్టీ పాప్) గేమ్స్ ఆడాలంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై పని చేసే డివైజ్లో అకౌంట్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ నెట్ఫ్లిక్స్ గేమ్ ఆప్షన్ని ఎంచుకోవాలి. వెంటనే గేమ్స్ హోం పేజీలోకి వెళ్తుంది. అక్కడ నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు. ఒకవేళ మీ డివైజ్లో నెట్ఫ్లిక్స్ గేమ్ ఆప్షన్ కనిపించని పక్షంలో.. కొంత కాలం ఎదురు చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్ క్రమంగా ఈ సేవలను విస్తరింపచేస్తోంది. ఈ గేమ్స్ పిల్లలకు కాదు గేమ్స్ అందుబాటులో ఉన్న చందాదారులు ఒకేసారి మల్టీపుల్ డివైజ్లో గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే ఈ గేమ్స్ కిడ్స్ విభాగంలో అందుబాటులో ఉండవు. వీటిని నెట్ఫ్లిక్స్ అడల్ట్ కేటగిరీలోనే ఉంచింది. మరింతంగా భవిష్యత్తులో గేమ్స్ విభాగాన్ని మరింతగా విస్తరించాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్, వెబ్సిరీస్, డాక్యుడ్రామాల తరహాలోనే గేమ్స్ని కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఉన్న గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. చదవండి:నెట్ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..! -
అట్ల తద్ది ప్రత్యేకం: వయసులో ఉన్న ఆడపిల్లలూ ... ఆడుకుందామా...!
ఆటల నోము అట్లతద్ది.. ఆడపిల్లలు నోచే తద్ది అంటూ పవిత్రబంధం సినిమాలో కథానాయికగా వేసిన వాణిశ్రీ వేడుకగా పాడుతుంది. తెలుగు వారి జీవితాలలో అట్లతద్దికి అంత ప్రాధాన్యత ఉంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు ఆట పట్టిస్తారు. ఎవ్వరూ ఎవరితోనూ గొడవపడరు. ఆట పట్టించటాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. తెల్లవారుజామునే పిల్లలంతా పొరపచ్చాలు, హెచ్చుతగ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐకమత్యానికి ఈ పండుగ ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా ఈ పండుగలో అనేక కోణాలున్నాయి... ఆడపిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. పూర్వం అందరూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇంట్లో చేసే ప్రతి పనిలోనే వ్యాయామమే. చెరువుకు వెళ్లి బిందెడు నీళ్లు తేవటం, పెరట్లో బావిలో నీళ్లు తోడటం, పప్పులు రుబ్బడం, రవ్వ విసరటం, అప్పడాలు ఒత్తడం... ఏ పని చేసినా పనితో పాటు శరీర ఆరోగ్యానికి కావలసిన వ్యాయామం ఉండేది. దానితో పాటు మనసును కూడా కుదుటపరుస్తుంది. నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారికి ఆటవిడుపు కూడా ఉండాలి. అట్లతద్ది ఆడపిల్లలకు ఆటవిడుపు. ముందు రోజే గోరింటారు పెట్టుకోవాలి. తెల్లవారు జామున సూర్యుని కంటె ముందే నిద్ర లేచి, ముందురోజు రాత్రి అమ్మ వండిన అన్నాన్ని చద్దన్నంగా తినటం ఎంతో సరదా. నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, తాంబూలం... అన్నీ కడుపు నిండా తిని, ఆహారం అరిగేవరకు ఉయ్యాల ఊగి, ఆటలు ఆడి, బారెడు పొద్దెక్కిన తరవాత ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేయటం... ఇదీ ఈ పండుగ విధానం. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! ఇక్కడితో ఆగదు... అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం. మరి తెల్లవారుజామున ఆడే ఆటల్లో ఒక కలివిడితనం ఉంటుంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం... ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ. ఉయ్యాలో ఉయ్యాల... ఊరు చివర చెరువు గట్టున ఉన్న పెద్దపెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసి, ఒకరిని ఒకరు ఊపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసుకునే ప్రకృతి పండుగ. ఏ చెట్టు కొమ్మ ఎంత గట్టిగా ఉందో చూసుకోవటం ప్రధానం. జీవితం అనే ఉయ్యాల దృఢంగా ఉండాలంటే ఆధారం గట్టిగా ఉండాలనే అంతరార్థం చెబుతుంది ఈ పండుగ. నిత్యజీవితంలో ఆటుపోట్లు వస్తాయి. మనసు డోలాయమానంగా అయిపోతుంటుంది. ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిపోతాం, ఒకసారి నేల మీదకు పడిపోతాం. అదే ఉయ్యాల అంతరార్థం. పండుగల పరమార్థం వెనకపడిపోవటంతో, అందులోని సామాజిక కోణం మరుగున పడిపోయి, అనవసరమైన చాదస్తాలు మాత్రం మిగిలిపోతున్నాయి. చదవండి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్కి వెళ్లాల్సిన పనేలేదు! వయసులో ఉన్న ఆడపిల్లలు ఆటలు ఆడాలి... నలుగురితో కలిసిమెలిసి ఆడుతుంటే, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించటం నేర్చుకోవాలి. యుక్త వయసు నుంచి ఆలోచనలలో మార్పు వస్తుంది. మంచి మార్గం వైపు కాని, చెడు తోవలోకి కాని వెళ్లే వయసు ఇదే. స్నేహితులతో ఆడుకుంటూ ఉండటం వల్ల, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకునే అవకాశం కలిగించే పండుగ. అంతేనా యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా అనారోగ్యాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి అనువుగా ఏర్పడిన పండుగలు ఇవి. శరీరం బాగా అలసిపోయే వరకు ఆడుకుంటూ, తోటివారితో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని అందంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన విధంగా పండుగలు మార్గం చూపుతాయి. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ పీట కింద పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లార లేచి రండోయ్... ఎంతో అందమైన పాట ఆశ్వీయుజం వెనుకబడి, కార్తికం వస్తోందంటే చలి ముదురుతుంది. ఆ చలికి ముడుచుకుని పడుకుంటే కుదరదు. చలికి సవాలుగా నిద్ర లేచి చలిని పరుగులు పెట్టించాలి. అందుకే పిల్లలంతా తెల్లవారు జామునే లేచి ఆడుకోవాలని చెప్పే పండుగ ఇది. కడుపు నిండుగా అట్లు తినాలి. మినుములు, బియ్యంతో కలిపి చేసిన అట్లు తింటే ఒళ్లు ఇనుములా తయారవుతుంది. ప్రకృతి సిద్ధంగా ఆడపిల్లల శరీరంలో కలిగే మార్పులకి ఇది చాలా అవసరం. ముద్ద పప్పు తినాలి. పిడికెడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా వండుకుని తినాలి. మనం ఈ పాటను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. అందుకే అట్లతద్దిని అందరూ జరుపుకునేందుకు వీలుగా నోము కింద ఏర్పాటుచేశారు. నోముగా చేసుకునేవారు ఉదయాన్నే కార్యక్రమం పూర్తయ్యాక, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, చందమామను చూశాకే భోజనం చేస్తారు. నోము అంటే మొక్కుబడిగా కాకుండా, త్రికరణశుద్ధిగా ఆచరించాలి. చాదస్తాలకు దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండేలా ఈ పండుగను జరుపుకోవాలని చెబుతుంది మన సంప్రదాయం. ఇదే అట్లతద్దిలోని అంతరార్థం. - వైజయంతి పురాణపండ చదవండి: Pollution In China: ఏటా 7 లక్షల 50 వేల మంది మృతి అందుకేనట! ప్రమాదం అంచున.. చైనా..! -
ఎయిర్టెల్ మరో రికార్డు.. అదేంటంటే!
ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ మరో రికార్డు సాధించింది. భారత దేశంలో 5జీ టెక్నాలజీ సహాయంతో మొట్ట మొదటి క్లౌడ్ గేమింగ్ సెషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్(డీఓటీ) కేటాయించిన స్పెక్ట్రమ్ 5జీ ట్రయల్స్ లో భాగంగా మనేసర్(గుర్గావ్)లో ఈ ప్రదర్శన నిర్వహించారు. గేమర్లు డెమో కోసం వన్ ప్లస్ 9ఆర్ మొబైల్ ఉపయోగించారు. ముఖ్యంగా, ఎయిర్టెల్ సీటీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 5జీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. "వచ్చే ఏడాది మొదట్లో 5జీ రావచ్చు" అని ఆయన అన్నారు. ఎయిర్టెల్ నిర్వహించిన 5జీ క్లౌడ్ గేమింగ్ సమావేశంలో భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ గేమర్లు మోర్టల్(నమన్ మాథుర్), మాంబా(సల్మాన్ అహ్మద్)లు పాల్గొన్నారు. "ఈ స్మార్ట్ ఫోన్లో హై ఎండ్ పీసీ, కన్సోల్ క్వాలిటీ గేమింగ్ ఆడిన అనుభవం కలిగింది. 5జీ నిజంగా భారతదేశంలో ఆన్ లైన్ గేమింగ్ ను అన్ లాక్ చేస్తుందని" అని గేమర్స్ అన్నారు. వీరు గేమ్ ఆడే సమయంలో 3500 మెగాహెర్ట్జ్ అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ కు కనెక్ట్ అయినట్లు సంస్థ తెలిపింది. గేమింగ్ ప్రియులు హై ఎండ్ గేమ్స్ ఆడాలంటే ఖరీదైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ క్లౌడ్ గేమింగ్ ద్వారా రియల్ టైమ్ లో గేమ్స్ స్ట్రీమ్ చేయవచ్చు.(చదవండి: అదే జరిగితే ఇంటర్నెట్ బంద్!) "భారతదేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. రోజు రోజుకి 5జీ విక్రయాలు పెరిగిపోతున్నాయి. మొబైల్ గేమింగ్ $2.4 బిలియన్ మార్కెట్ గా అభివృద్ధి చెందనుంది. దేశంలో ఆన్ లైన్ గేమర్లు సంఖ్య 2022 నాటికి 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది" అని ఎయిర్టెల్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ ఈ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియాతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో లైవ్గా 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. -
2016 ఒలింపిక్స్లో చానుకి ఏమైంది? తల్లి భావోద్వేగం
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో బంగారం పతకం దక్కకపోయినా..బంగారం లాంటి తన బిడ్డ మీరాబాయ్ విజయాన్ని చూసి ఆమెతల్లి భావేద్వేగానికి లోనయ్యారు. తమ కష్టం ఫలిచిందంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ సందర్బంగా ఇంతటి అద్భుతాన్ని సాధించేందుకు మీరాబాయి పడిన శ్రమను, కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తల్లి సైఖోమ్ ఒంగ్బీ టోంబి లీమా ఆమెకు తను బహుమతిగా ఇచ్చిన చెవిరంగులపై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు మెడల్ సాధించిన ఘనత మణిపూర్కు చెందిన మీరాబాయి చాను సొంతం. టీవీలో చాను చెవిపోగులు చూశాను, (రియో) ఒలింపిక్స్కు ముందు తానే వాటిని 2016లో ఆమెకు ఇచ్చానంటూ చాను తల్లి చెప్పారు. అవి అదృష్టం..విజయాన్ని తీసుకొచ్చాయంటూ ఆమె మురిసిపోయారు. తను చెవి రింగులను చూసినప్పుడల్లా చానులో పట్టుదల మరింత పెరిగిందని తల్లి ఉద్వేగంతో చెప్పారు. చాను పతకాన్ని సాధించడంతో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పుకొచ్చారు. ఈ ఒలింపిక్స్లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్పిందనీ, కనీసం ఏదో ఒక పతకంతో వస్తానని చాను చెప్పిందని వెల్లడించారు. ఒలింపిక్ రింగ్స్ లా కనిపించే వీటి వివరాలను పరిశాలిస్తే.. 2016 రియో ఒలిపింక్స్..సందర్బంగా చానూకు చెవిదిద్దుల తయారీకోసం తల్లి తన దగ్గర ఉన్న చిన్నా చితకా బంగారాన్ని మొత్తం అమ్మేసారట. 2016 రియో ఒలింపిక్స్లో చాను ఆశలు ఆవిరి 2016 రియో ఒలింపిక్స్లో 192 కిలోల విభాగంలో 190 కిలోల బరువును ఎత్తి తన గురువు కుంజారాణి దేవి రికార్డును బద్దలు కొట్టారు. కానీ క్లీన్ అండ్ జెర్క్లో బరువు ఎత్తుతున్న సమయంలో పట్టు కోల్పోయింది. 21ఏళ్ల మీరాబాయి చాను సరిగ్గా 22వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు 2016లొ క్లీన్ అండ్ జెర్క్లో ఆమె చేసిన మూడు ప్రయత్నాలు విఫలమైనాయి. దీంతో పతకం కలలు కల్లలై పోయాయి. ఫలితంగా తీవ్ర డిపప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇందుకు ఆమె మానసిక వైద్యులను కూడా సంప్రదించారు. కట్ చేస్తే.. అయిదేళ్ల తరువాత అటు తన కలను, ఇండియా కలను నెరవేర్చారు. చాను ఇంట్లో సంబరాలు కోచింగ్ కారణంగా చాలా తక్కువగా ఇంటికి వస్తుందని అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకున్నామని చాను బంధువు అరోషిని చెప్పారు. గేమ్కు వీడియో కాల్ చేసి, అందరికీ నమస్కరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందని చెప్పారు. చాను సాధించిన అపూర్వ విజయంతో రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్పోక్ కాచింగ్ గ్రామంలోని చాను ఇల్లు సంబరాలతో నిండిపోయింది. కరోనా కారణంగా కొంతవరకు కర్ఫ్యూ ఉన్నప్పటికీ శుక్రవారం నుంచే ఆమె ఇంటి వద్ద సందడి మొదలైంది. చానుకు ఆరుగురు తోబుట్టువులు. ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. కోచ్ కుంజారాణీ దేవి స్పందన ఇంఫాల్లో జన్మించిన చాను మరో మణిపురి వెయిట్లిఫ్టర్ కుంజారాని దేవి స్ఫూర్తితోనే వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకున్నారు. కుంజారాణీ దేవి చాలా గొప్ప క్రీడాకారిణి అని చాను ఒక సందర్భంలో చెప్పారు. చిన్నప్పటినుంచి ఆమె గురించి పుస్తకాల్లో, పేపర్లో చదివాను.. అందుకే నేను భారీ బరువులు ఎత్తి ప్రపంచానికి చూపాలనుకున్నాను అని చాను గతంలో తెలిపారు. తాజా చాను విజయంపై కుంజారాణి స్పందించారు. 2011లో జూనియర్ జాతీయ శిబిరానికి వచ్చినప్పుడు ఆమెను మొదటిసారి చూశాను. ఆమెలో చాలా ప్రతిభ, సంకల్ప బలం చాలా ఉన్నాయి. మిగతా అథ్లెట్లతో పోలిస్తే మీరా చాలా టాలెంటెడ్. కోచ్లు చెప్పే ప్రతిదాన్ని అనుసరిస్తూ తెలివిగా ఆడేదని, అదే ఆమెను ఒలింపిక్స్లో పతకం సాధించేలా చేసిందని 2015 వరకు చానుకు కోచ్గా ఉన్న కుంజరాణి దేవి అన్నారు. ఒలింపియన్ కావాలనుకుంటే లేదా పతకం సాధించాలన్నా. లేదా అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వంటి అవార్డులు గెలుచుకోవాలనుకుంటే, కష్టపడి పనిచేయాలని చెప్పానని శనివారం తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఆమెలోని చిన్న లోపాలను తీర్చడానికి మాత్రమే తాను సహాయపడ్డానని తెలిపారు.2016 ఒత్తిడినుంచి బైటపడి 2017లో తిరిగి బౌన్స్ బ్యాక్ అయిందన్నారు. అయితే 2018నుండి మిరాబాయితో మాట్లాడలేక పోయినా.. ఆమె విజయాలను గమనిస్తున్నాననీ, ఈ రోజు తన స్టూడెంట్ మొత్తం భారతదేశం గర్వపడేలా చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
టోక్యో ఒలింపిక్స్ 2021
-
ఒలింపిక్స్లో కరోనా వివాదం
-
ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం)/శ్రీకాకుళం రూరల్: కోవిడ్ కేర్ సెంటర్లో కోవిడ్ బాధితులకు చికిత్సలో అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఆటలను అస్త్రంగా వాడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురంలోని కోవిడ్ కేర్ సెంటర్లో సుమారు 50 మంది బాధితులు ఉన్నారు. మొన్నటివరకు వీరిలో చాలామంది వ్యాధి వచ్చిందన్న మనోవేదనతో కుమిలిపోయేవారు. ఆహారం కూడా సరిగా తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కోవిడ్ కేర్ ప్రత్యేక అధికారి, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు బాధితుల్లో ఎలాగైనా మనోధైర్యాన్ని నింపాలనుకున్నారు. వారి మనస్సును ఆటల మీదకు మళ్లించగలిగితే వ్యాధి ఉందన్న భావన మనస్సులో నుంచి పోతుందని, దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. వెంటనే తన ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకున్నారు. బాధితులు ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వైకుంఠపాళి, దాయాలు, తదితర ఆట వస్తువులను సమకూర్చారు. మూడు పూటల భోజనం అనంతరం బాధితులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆడుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో నాలుగు రోజుల నుంచి బాధితులు ఆటల్లో నిమగ్నమైపోయారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఆటలు సత్ఫలితాలనిస్తున్నాయని, గతంలో కంటే బాధితులు ఉత్సాహంగా ఉంటున్నారని, వారి ఆరోగ్యం కూడా వేగంగా మెరుగుపడుతోందని ప్రత్యేకాధికారిశ్రీనివాసరావు తెలిపారు. బుర్రకథ.. యోగా.. కోవిడ్ రోగులకు స్వాంతన కలిగించేందుకు శ్రీకాకుళం జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పాత్రునివలస టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్లో గురువారం బుర్రకథ ప్రదర్శన నిర్వహించారు. రోగుల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలిగించేందుకు వినోదభరిత కార్యక్రమాలతోపాటు ఉదయం పూట యోగా నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి రవికుమార్ తెలిపారు. చదవండి: కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు భారతి సిమెంట్ వితరణ -
సెల్ఫోన్లో గేమ్స్: తల్లిదండ్రులు మందలించారని..
నెల్లూరు రూరల్: సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుందని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని నరుకూరు సెంటర్లో ఆదివారం జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నరుకూరు సెంటర్లో నివాసం ఉంటున్న యదపర్తి మల్లికార్జున్, శైలజ దంపతుల కుమార్తె సుష్మశ్రీ (16) 8వ తరగతి వరకు చదువుకుని ఏడాది నుంచి ఇంటి వద్దనే ఉంటుంది. కొంత కాలంగా సుష్మ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లిదండ్రులు మందలిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లి శైలజ గమనించి సెల్ఫోన్ తీసుకుని మందలించింది. అదే సెంటర్లో వీరు టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తల్లి టిఫిన్ సెంటర్కు వెళ్లిన ఆనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని వంట గదికి ఉన్న ఇనుప రాడ్లకు తన చున్నీతో ఉరేసుకుంది. పక్కింటి వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సుష్మను కిందకు దింపి నగరంలోని చింతారెడ్డిపాళెంలో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. విషాదం: మృత్యువులోనూ సహచర్యం.. -
గేమింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్పంక్ 2077 గేమ్ డిసెంబర్ 10 విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ గేమ్ విడుదల అనేది మీరు నివసించే ప్రాంతం, మీరు ఆడే ప్లాట్ఫామ్ బట్టి మార్పు ఉంటుంది. ఇంతక ముందు తెలిపిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఊహించిన దాని కంటే ముందే ఆడవచ్చు. ఈ గేమ్ అన్ని దేశాల కంటే ముందు లాస్ ఏంజెల్స్ లో డిసెంబర్ 9 సాయంత్రం గంటలకు విడుదల అవ్వగా. చివరగా న్యూజిలాండ్ రాజదాని వెల్లింగ్టన్ లో డిసెంబర్ 10 మధ్యాహ్నం 1కి విడుదల అవుతుంది. వచ్చే వారం విడుదల అయ్యే సైబర్పంక్ 2077 మీ పిసిలో డిసెంబర్ 7 నుండి ఆటను ప్రీలోడ్ చేసుకోవచ్చు. ప్రీలోడ్లు జీఓజిలో 12పీఎం వద్ద మరియు ఎపిక్ గేమ్స్ స్టోర్లో 5పీఎం వద్ద ప్రారంభమవుతాయి. ఎక్స్ బాక్స్ వన్, ఎక్స్ బాక్స్ సిరీస్ కన్సోల్లలో ఇప్పటికే ఆటను ప్రీలోడ్ చేయవచ్చు. ప్లేస్టేషన్ 4 మరియు ప్లేస్టేషన్ 5లలో ప్రీలోడ్లు “విడుదల తేదీకి రెండు రోజుల ముందు” ప్రారంభమవుతాయి. (చదవండి: గూగుల్ మాప్స్లో సరికొత్త ఫీచర్) విడుడలకు సిద్ధంగా ఉన్న సైబర్పంక్ 2077 గేమ్ ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ గేమ్ మన దేశంలో కూడా మరింత ఆసక్తి రేపుతోంది. గేమింగ్ లవర్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సైబర్పంక్ 2077 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన పిసి గేమ్గా నిలిచింది అని అంచనా. సైబర్పంక్ 2077 ఇప్పటికే జీవితకాల అమ్మకాలలో విట్చర్ 3 గేమ్ ను దాటిందని డెవలపర్ ఇంతకుముందే ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు, విట్చర్ 3 చాలా ప్రజాదరణ పొందిన గేమ్. భారతదేశంలో ఇంతకుముందు పిసి గేమింగ్ అనేది అత్యంత ఖరీదైన భావించేవారు. "సైబర్పంక్ 2077 భారతదేశంలో అని కన్సోల్ వెర్షన్ల కంటే పిసి గేమ్ ని ఆరు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ అమ్ముతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న బహుళ రిటైలర్లు" తెలిపారని సంస్థ పేర్కొంది. కన్సోల్ వెర్షన్లతో పోల్చితే రిటైల్ ధర తక్కువగా ఉండటంతో పాటు డెస్క్టాప్ పిసిలకు డిమాండ్ పెరగడం ఈ పిసి గేమ్ సేల్ స్పైక్కు కారణమని నిపుణుడు అల్వానీ పేర్కొన్నారు. -
‘రిమూవ్ చైనా యాప్స్’కు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్వేర్ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన చైనా యాప్స్ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్ను వన్ టచ్ యాప్ల్యాబ్స్ రూపొందించింది. -
రకుల్ చిన్నప్పటి ఆటలు చూశారా?
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ రద్దవ్వడంతో సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనూహ్యంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా అప్పడప్పుడు సోషల్ మీడియాలో వారు రోజు ఇంట్లో చేస్తున్న పనులు అదేవిధంగా ఈ కరోనా సమయంలో కచ్చితంగా పాటించాల్సినవి అభిమానులకు సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉండే హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ ఈ లాక్డౌన్ సమయంలో చేసిన యోగా వీడియోలు, ఇంట్లో సరదాగా చేసిన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన తమ్ముడు అమన్తో కలిసి చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియోను షేర్ చేసింది. తన చిన్నప్పుడు ఆడుకున్న అందమైన ఆటలన్నింటిని సోదరుడితో కలిసి ఇంట్లోనే ఆడింది రకుల్.‘ఇలాంటి సమయం మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్తుంది’అంటూ కామెంట్ కూడా జతచేసింది. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram #quarantinediaries with @amanpreetoffl ❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on May 2, 2020 at 12:28am PDT చదవండి: ‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం లేదు ‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’ -
కరోనా వ్యాక్సిన్ వచ్చాకే... మైదానాలకు వస్తాం!
న్యూయార్క్: లీగ్లు, ఆటలు ప్రస్తుతానికైతే కోవిడ్ –19 వల్ల జరగట్లేదు. ఒకవేళ త్వరలో ఆటలు మొదలైనా కూడా ప్రేక్షకులు కరువయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని చెప్పారు. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు కాబట్టి ఆటలకు హాజరు కాబోమని చెప్పారు. 12 శాతం ప్రజలు మాత్రం ఆటలు చూసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ గ్యాలరీలో సామాజిక దూరం పాటిస్తేనే వెళ్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు సిద్ధమేనన్నారు. స్టిల్మన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిధిలో షార్కీ ఇన్స్టిట్యూట్ ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించగా... ఇందులో పాల్గొన్న అమెరికన్లు మాత్రం ఇంతకుముందులా ఆటల కోసం ఎగబడి మైదానాలకెళ్లి చూడాలనుకోవడం లేదని... టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
గురి కుదిరింది
‘నేషనల్స్లో గోల్డ్ మెడల్ నా లక్ష్యం’ అన్నాడు ఈశ్వరాదిత్య. ‘ఒలింపిక్స్లో ఇండియాని రిప్రెజెంట్ చేయడమే నా కల’ అన్నాడు బిందుసాయి. ఈ హైదరాబాద్ అన్నదమ్ముల్లో... అన్న పిస్టల్తో టార్గెట్కి గురి పెడితే.. తమ్ముడు రైఫిల్ ఎక్కుపెడతాడు. ఈ పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంటే... పేరెంట్స్ వాళ్లకోసం నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ‘అంకిత భావం ఉంటే స్పోర్ట్స్ పర్సన్స్ తయారు కావడం కష్టమేమీ కాదు’ అంటున్నారు తల్లి శిల్ప. ‘‘బండ్లగూడలోని డాన్బాస్కో స్కూల్లో పెద్దబాబు నైన్త్, చిన్నవాడు సెవెన్త్ చదువు తున్నారు. పిల్లల్ని ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచాలనేది నా కోరిక. వాళ్లకు ఇష్టమైన ఆటల్లోనే ట్రైనింగ్ ఇప్పించాం. మొదట్లో ఇద్దరికీ కరాటే నేర్పించాం. బ్లాక్ బెల్ట్ లెవెల్కి చేరిన తర్వాత స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, షటిల్లో ట్రైనింగ్ ఇప్పించాం. చిన్నప్పుడు ఇద్దరూ ఎన్ని గన్లు కొనిపించుకున్నారో లెక్క చెప్పలేను కూడా. అయినా సరే... దానిని పిల్లల ఇంటరెస్ట్ గేమ్ అని అప్పుడు డిసైడ్ చేయలేం. కనీసం పదేళ్లు నిండిన తర్వాత వాళ్లు చూపించే ఆసక్తే అసలైనది. ఆ వయసులో షూటింగ్ మీద ఆసక్తి కనబరిచారు. గగన్నారంగ్ అకాడమీలో చేర్చాం. కానీ కొనసాగించడం కుదరలేదు. ఇంటికి వచ్చి నేర్పించడానికి ఒక కోచ్ ఉప్పల్ నుంచి వచ్చేవారు. రెగ్యులర్గా మేముండే బండ్లగూడ వరకు రావడం అతడికి కష్టం కావడంతో కంటిన్యూ కాలేకపోయారాయన. దాంతో ఆయన నేర్పించిన మెళకువలతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయిస్తూ కొత్త కోచ్ల కోసం ప్రయత్నించాను. ఈ క్రమంలో షూటింగ్ మీదున్న పుస్తకాలు చదివాను, వీడియోలు చూశాను. నాకు సబ్జెక్టు మీద పట్టు వచ్చేసింది. మా పిల్లలు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో గమనించి, వాళ్లకు వీడియోలో ఆ పార్ట్ వరకు బాగా అబ్జర్వ్ చేయమని చెప్పేదాన్ని. గచ్చిబౌలిలో ఎక్స్పర్ట్ కోచ్ దగ్గర చేర్చే వరకు పిల్లలకు నేను బ్రిడ్జి కోచ్నయ్యాను. పెద్దవాడు ఈశ్వరాదిత్య పిస్టల్ షూటింగ్ను కంటిన్యూ చేశాడు. చిన్నవాడు బిందు సాయి మాత్రం రైఫిల్ షూటింగ్కి మారతానన్నాడు. సాయికి రైఫిల్ షూటింగ్ కోసం ధరించే డ్రస్ మీదనే మోజెక్కువ’’ అన్నారు శిల్ప నవ్వుతూ. ‘‘పిల్లలిద్దరూ స్టేల్ లెవెల్ దాటి జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ గత ఏడాది త్రివేండ్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ఈశ్వరాదిత్యకి 522 స్కోర్ వచ్చింది. రానున్న డిసెంబర్లో జరిగే పోటీలకు ప్రిపేరవుతున్నాడు. భోపాల్లో ఈ ఏడాది జరిగిన ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ స్థాయి పోటీల్లో పెద్ద బాబు 359 స్కోర్, బిన్న బాబు 369 స్కోర్ చేశారు. స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఉన్న పిల్లలు ప్రత్యేకమైన డైట్ చార్ట్ ఫాలో కావాలి. అలాగే కాంపిటీషన్లకు వెళ్లడానికి వారం ముందు నుంచి బయటి ఫుడ్ను ముట్టుకోకూడదు’’ అని చెప్పారు శిల్ప. కాంపిటీషన్ల కోసం ఒక్కోసారి వారం రోజుల పాటు స్కూల్ మిస్సవుతారు. అప్పుడు వేరే స్టూడెంట్స్ నోట్స్ని జిరాక్స్ చేయించేవారు శిల్ప. ఆమె చెప్పినట్లు క్రీడాకారులను తీర్చిదిద్దడం శ్రమతో కూడిన పనే కానీ అసాధ్యం కాదని, ప్రతి విజేతా నిరూపిస్తూనే ఉన్నారు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి తల్లి త్యాగమే గొప్పది పిల్లల ప్రాక్టీస్కి అవసరమైన డబ్బు సర్దుబాటు చేయడం వరకే నా బాధ్యత. పిల్లల కోసం శిల్ప కొన్నేళ్లపాటు వెకేషన్ లేకుండా తనను తాను త్యాగం చేసుకుంది. వేసవి సెలవుల్లో ఉదయం ఎనిమిది గంటలకే పిల్లలిద్దరినీ రెడీ చేసి, వంట చేసి, రోజు మొత్తానికి అవసరమైన ఫుడ్ సర్దుకుని తను రెడీ అయిపోయేది. ముగ్గురినీ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రాక్టీస్కి వదిలి నేను ఆఫీస్కి వెళ్లేవాడిని. సాయంత్రం నాలుగున్నర వరకు పిల్లలు ప్రాక్టీస్ చేసేవాళ్లు. అప్పుడు ఇంటికి వస్తే మళ్లీ ఇంటి పనులు. రాత్రి వరకు తనకు ఖాళీ ఉండేది కాదు. పైగా ఇది ఖర్చుతో కూడిన ప్రాక్టీస్. నాకు ఇబ్బందేమీ లేదని చెప్తున్నా సరే... ఇంటీరియర్ వర్క్ను కొద్దికాలం పోస్ట్పోన్ చేద్దాం. ఇప్పుడున్న వసతులు చాలనేది. – యుగేంద్ర కుమార్ గుంటూరి రోజూ ప్రాక్టీస్ చేయాల్సిందే షూటింగ్ ప్రాక్టీస్ రోజూ చేయాల్సిందే. వెకేషన్కు వెళ్లినప్పుడు నాలుగు రోజులు గ్యాప్ వస్తే ఐదో రోజు పిస్టల్, రైఫిల్ పట్టుకున్నప్పుడు చేయి వణుకుతుంది. అందుకే కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు కూడా హోటల్ రూమ్లో అయినా సరే గంట– రెండు గంటల పాటు హోల్డింగ్ ప్రాక్టీస్ చేయాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటానికి రోజూ సూర్యనమస్కారాలు, గుంజిళ్లు, మెడిటేషన్ చేయాలి. వెపన్ కంట్రోల్ కోసం డంబుల్స్తో ప్రాక్టీస్ చేయాలి. షూటింగ్ ప్రాక్టీస్లో పిల్లల్లో వచ్చే పరిణతిని నేను దగ్గరగా గమనించగలిగాను. లక్ష్యం మీద ఎక్కువ సమయం దృష్టి పెట్టినప్పుడు చూపు చెదురుతుంది. అలాంటప్పుడు ఆందోళన చెందకుండా పక్కన కూర్చుని మామూలైన తర్వాత మళ్లీ ఎక్కుపెట్టడం వంటివి అలవడ్డాయి. ఈ ఆటలో ఎవరికి వారే ప్రత్యర్థి. తమతో తామే పోటీ పడాలన్నమాట. ఇది గుడ్ షాట్, ఇది బ్యాడ్ షాట్ అనేది ఉండదు. ప్రతి షాట్ నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఈ ఆటతో పిల్లల్లో స్థితప్రజ్ఞత వస్తుంది. – శిల్ప -
ఆరోగ్యంతో ఆడుకోకండి.. ఆరోగ్యం కోసం ఆడండి
ఆధునికత పెరిగిన తర్వాత జనాలు ఆటలకు దూరమవుతున్నారు. ఆటలాడే వయసులోని పిల్లలను మోయలేని చదువుల భారం కుంగదీస్తోంది. క్రీడా మైదానాలు లేని ఇరుకిరుకు పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల కొందరు బాల్యంలోనే స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇంకొందరు రోగనిరోధక శక్తి నశించి, తరచు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆటలు ఆడే వారికన్నా టీవీల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్లు, టెన్నిస్ మ్యాచ్లు, ఫుట్బాల్ మ్యాచ్లు చూసే జనాలే ఎక్కువవుతున్నారు. ఆటలు ఆడితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది గాని, కుదిరితే స్టేడియంలో, కుదరకుంటే ఇంట్లోనే టీవీల్లో క్రీడల మ్యాచ్లు చూసినంత మాత్రాన ఆరోగ్యానికి ఒరిగేదేమీ ఉండదు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల గురించి ఒక సింహావలోకనం... ఆటలాడటం మనుషుల సహజ లక్షణం. పాకే వయసు నుంచే పిల్లలు ఆటల వైపు మొగ్గు చూపుతారు. బుడి బుడి అడుగులు వేసే వయసులో చేతికందిన వస్తువులతో తోచిన రీతిలో ఆటలాడతారు. ఆ వయసులోనే వారికి ప్రమాదాలకు తావులేని ఆటబొమ్మలను ఇవ్వాలి. సమవయస్కులైన పిల్లలు కూడా జత చేరితే పిల్లలు మరింత ఉత్సాహంగా ఆటలాడతారు. కాస్త ఊహ తెలిసిన వయసు వచ్చాక వీధుల్లోకి వెళ్లి ఆరుబయట స్నేహితులతో ఆటలాడేందుకు ఇష్టపడతారు. ఆటల వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఆటల్లోని సహజ వ్యాయామం వల్ల శరీరం తీరుగా ఎదుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. బృందంతో కలసి పనిచేయడం, బృందానికి నాయకత్వం వహించడం, బృందం గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజసిద్ధంగానే పరిణతిని పెంచుతాయి. చరిత్రపూర్వయుగం నుంచే ఆటలు... చరిత్రపూర్వయుగంలోని ఆదిమానవులు సైతం ఆటలాడేవారు. పాతరాతి యుగంలోనే అప్పటి మానవులు ఆటలాడేవారు. నాటి మానవులు ఆటలాడిన ఆనవాళ్లు ఫ్రాన్స్లోని లాస్కాక్స్ గుహల్లో లభించాయి. ఆ గుహల్లోని రాతి గోడలపై అప్పటి మనుషులు పరుగు పందేల్లో పాల్గొంటున్నట్లుగా, కుస్తీలు పడుతున్నట్లుగా ఉన్న చిత్రాలు ఆదిమానవుల క్రీడాస్ఫూర్తికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. రాతిగోడలపై ఉన్న ఆ చిత్రాలు కనీసం 15,800 ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కొత్తరాతి యుగం నాటికి మనుషులు మరిన్ని కొత్త క్రీడలను కనిపెట్టారు. ఈతకొట్టడం, ధనుర్బాణాలను తయారు చేసి, గురితప్పకుండా బాణాలను కొట్టడం వంటి క్రీడలకు సంబంధించిన గుహా చిత్రాలు జపాన్లో లభించాయి. అవి పదివేల ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తల అంచనా. మానవుల మేధస్సు వికసించి, నెమ్మదిగా నాగరికతలు ఏర్పడిన కాలంలో మరికొన్ని క్రీడలను మనుషులు కనుగొన్నారు. ప్రాచీన సుమేరియన్, ఈజిప్టు, గ్రీకు, రోమన్, సింధులోయ నాగరికతల కాలంలో మనుషులు ఉత్సాహభరితంగా క్రీడా వినోదాన్ని ఆస్వాదించినట్లుగా అనేక ఆనవాళ్లు దొరికాయి. నాగరికతల వికాసంలో క్రీడలు సుమేరియన్ల కాలంలో కుస్తీలు, బాక్సింగ్, గాలాలతో చేపలు పట్టడం వంటి క్రీడలు ఉండేవి. ఈజిప్టు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, చేపలు పట్టడం, లాంగ్ జంప్, ఈత, విలువిద్య వంటి క్రీడలు ఉండేవి. గ్రీకు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, విలువిద్యలతో పాటు బల్లేలు విసరడం, బరువైన చక్రాలు విసరడం, రథాల పందేలు వంటి క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతలు వికసించిన తొలినాళ్లలో ప్రపంచంలో పలుచోట్ల రకరకాల క్రీడలు అభివృద్ధి చెందాయి. ప్రాచీన రోమ్, మెసొపొటేమియా, చైనా, ఐర్లాండ్, స్కాట్లాండ్ తదితర ప్రాంతాల్లో క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతల్లో నాటి మనుషులు ఆడిన క్రీడల్లో కొన్ని నేటికీ ఉనికిలో ఉన్నాయి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలోని ఒలింపియా పట్టణంలో క్రీస్తుపూర్వం 776లోనే తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడల పోటీలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు ప్రారంభమైన కొన్నాళ్లకు ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఇస్త్మియాన్, నెమియాన్, పైథియాన్ క్రీడల పోటీలు కూడా జరిగేవి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. పైథియాన్ క్రీడల పోటీలు కూడా నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. ఒలింపిక్స్ జరిగిన రెండేళ్లకు పైథియాన్ క్రీడల పోటీలు జరిగేవి. ఇస్త్మియాన్, నెమియాన్ పోటీలు రెండేళ్లకు ఒకసారి జరిగేవి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఈ నాలుగు క్రీడల పోటీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండేవి. మధ్యయుగాల నాటికి మరిన్ని క్రీడలు కొత్తగా వచ్చి చేరాయి. గుర్రపు పందేలు, ఫుట్బాల్ తరహా క్రీడలు మధ్యయుగాల నాటివే. ప్రాచీన భారతదేశంలో క్రీడలు ప్రాచీన భారతదేశంలోనూ క్రీడలు ఉండేవి. వేదకాలంలోనే భారత భూభాగంలో జనాలు క్రీడలు ఆడేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ‘‘కర్తవ్యం నా కుడి చెయ్యి... విజయఫలం నా ఎడమచెయ్యి’’ అనే అర్థంతో కూడిన అధర్వణవేద మంత్రం నాటి భారతీయుల క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కుస్తీ (మల్లయుద్ధం), బాక్సింగ్ (ముష్టియుద్ధం) వంటి క్రీడలు పురాణకాలంలోనే ఉండేవి. రామాయణ, మహాభారతాల్లో ఈ యుద్ధక్రీడల ప్రస్తావన కనిపిస్తుంది. కంసుడి ఆస్థానంలోని చాణూర ముష్టికులనే మల్లయోధులను కృష్ణబలరాములు మట్టి కరిపించిన పురాణగాథ అందరికీ తెలిసినదే. రథాల పోటీలు, గుర్రపు స్వారీ పోటీలు, విలువిద్య, ఈత, పోలో వంటి క్రీడలతో పాటు మల్లయుద్ధం, ముష్టియుద్ధం, బరువులను ఎత్తడం (వెయిట్ లిఫ్టింగ్), కత్తియుద్ధం (ఫెన్సింగ్), గదాయుద్ధం, బల్లేలను గురిచూసి విసరడం (జావెలిన్ త్రో), కరాటేకు మూలంగా భావిస్తున్న కలరి వంటి యుద్ధ క్రీడలకు కూడా ప్రాచీన భారతదేశంలో విశేష ఆదరణ ఉండేది. బౌద్ధం ద్వారా కలరి యుద్ధక్రీడ క్రీస్తుశకం ఐదో శతాబ్దినాటికి చైనా, జపాన్ వంటి తూర్పుదేశాలకు వ్యాపించి, తర్వాతి కాలంలో ఆధునిక కరాటేగా రూపుదిద్దుకుందని కొందరు క్రీడాచరిత్రకారులు అభిప్రాయపడతారు. బౌద్ధాన్ని బోధించిన గౌతమబుద్ధుడు స్వయంగా మేటి విలుకాడు. ఆయనకు సుత్తి వంటి బరువైన వస్తువులను దూరంగా విసరడంలోనూ నైపుణ్యం ఉండేది. నేటికీ వీధుల్లో పిల్లలు ఆడుకునే గిల్లీదండా, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు ప్రాచీనకాలం నాటివే. మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాచీన భారతీయులు క్రీడలకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చేవారు. సింధులోయ నాగరికత నాటి ప్రజలు బల్లెం, ధనుర్బాణాలు, గద, చక్రం, కత్తి, బాకు, గొడ్డలి వంటి ఆయుధాలను ఉపయోగించేవారు. వాటితో యుద్ధక్రీడలూ ఆడేవారు. ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన హ్యుయాన్ త్సాంగ్, పాహియాన్లు తమ రచనల్లో నాటి భారతీయులు ఆడుకునే రకరకాల క్రీడలను గురించి వివరించారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు పరుగు పందేలు, కుస్తీ పోటీలు, బంతులతో ఆడే రకరకాల ఆటలు, ఈత, బరువులెత్తడం వంటి క్రీడలతో ఉల్లాసం పొందేవారని వారు రాశారు. పన్నెండో శతాబ్దికి చెందిన సోమేశ్వరుడు తన ‘మనోల్లాస’ గ్రంథంలో భారశ్రమ (వెయిట్లిఫ్టింగ్), భ్రమణశ్రమ (పరుగు), మల్లస్తంభ (రెజ్లింగ్), ధనుర్వినోద (విలువిద్య) సహా నాటి జనాలు ఆడుకునే రకరకాల క్రీడలను విపులంగా వివరించాడు. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించుకున్న పోర్చుగీసు రాయబారి డోమింగో పేస్ ఇక్కడి క్రీడలను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా మల్లయోధుడని, గుర్రపుస్వారీలోను, కత్తియుద్ధంలోను ఆయనకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని డోమింగో పేస్ తన రచనల్లో రాశారు. మొఘల్ చక్రవర్తుల హయాంలో కూడా భారతదేశంలో క్రీడలకు విశేషమైన ఆదరణ ఉండేది. ఆగ్రా కోట, ఢిల్లీలోని ఎర్రకోట మొఘల్ల హయాంలో క్రీడాపోటీలకు ప్రధాన వేదికలుగా ఉండేవి. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో విరివిగా హనుమాన్ ఆలయాలను స్థాపించి, ఆ ఆలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా వ్యాయామశాలల ద్వారా యువకులను క్రీడల వైపు, వ్యాయామం వైపు ప్రోత్సహించాడు. స్వాతంత్య్రపూర్వం నాటి ప్రముఖుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప క్రీడాకారుడు, క్రీడాభిమాని కూడా. ఆయనకు ఫుట్బాల్, ఫెన్సింగ్, బాక్సింగ్, ఈత, మల్లయుద్ధం వంటి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. ఒకసారి వివేకానంద ‘భగవద్గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడటం ద్వారా స్వర్గానికి త్వరగా చేరువకాగలం’ అని చెప్పిన మాటలు ఆయన క్రీడాభినివేశానికి అద్దం పడతాయి. బ్రిటిష్కాలంలో ఆధునిక క్రీడలు బ్రిటిష్కాలంలో భారతదేశంలోకి ఆధునిక పాశ్చాత్య క్రీడలు అడుగుపెట్టాయి. బ్రిటిష్వారు భారత్కు వచ్చేనాటికి ఇక్కడ బాగా ఆదరణ పొందిన క్రీడలను వారు కూడా నేర్చుకున్నారు. బ్రిటిష్వారు ఇక్కడకు వచ్చేనాటికి పుణే ప్రాంతంలో ‘పూనా’ అనే ఆట ఆడేవారు. బ్రిటిషర్లు దీనికే కొద్దిపాటి మార్పులు చేసి, ఆధునిక బ్యాడ్మింటన్గా ప్రపంచానికి పరిచయం చేశారు. భారతదేశంలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. బ్రిటిష్ నావికులు 1721లో కాంబే తీరంలో ఆడటం ద్వారా క్రికెట్ను భారతీయులకు పరిచయం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వకాలంలో నాటి సంపన్నులు క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. పోలో ఆటను అంతకుముందు రకరకాలుగా ఆడేవారు. గుర్రాలపైనే కాకుండా, ఏనుగుల పైనుంచి కూడా ఆడేవారు. అయితే, ఇప్పటి నిబంధనలతో ఆధునిక పోలో క్రీడ పంతొమ్మిదో శతాబ్దిలో మణిపూర్లో రూపుదిద్దుకుంది. తర్వాత ఇది యూరోప్, ఉత్తర అమెరికాలకు వ్యాపించింది. భారత్లో తొలి ఫుట్బాల్ క్లబ్ 1889లో ప్రారంభమైంది. అప్పట్లో భారతీయులు ఈ క్రీడలో కొంత వెనుకబడి ఉండేవారు. దీనిపై బ్రిటిషర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. దీనిని సవాలుగా తీసుకున్న బెంగాలీ యువత పట్టుదలతో సాధన చేసి, 1911లో బ్రిటిష్ జట్టుతో తలపడినప్పుడు ఫైనల్స్లో ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్నే గెలుపు వరించింది. భారత క్రీడాకారులు 1920 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఒలింపిక్స్లో భారత్ 28 పతకాలను దక్కించుకోగలిగింది. 1928–1980 మధ్యకాలంలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తొమ్మిది బంగారు పతకాలను దక్కించుకోగా, వాటిలో ఎనిమిది పతకాలు మన హాకీ జట్టు గెలుచుకున్నవే కావడం విశేషం. హాకీని మన జాతీయ క్రీడగా చాలామంది పొరబడతారు గాని, భారత్ ఇంతవరకు ఏ క్రీడనూ జాతీయక్రీడగా ప్రకటించలేదు. ఈ సంగతిని సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్వయంగా స్పష్టం చేసింది. అయితే, హాకీ వల్లనే ఒలింపిక్స్లో భారత్ అత్యధిక బంగారు పతకాలు సాధించిందన్నది మాత్రం వాస్తవం. 1928, 1932, 1936 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టకు సారథ్యం వహించి, పతకాల పంట పండించిన నాటి మన హాకీజట్టు కెప్టెన్ ధ్యాన్చంద్ గౌరవార్ధంగానే ఆయన పుట్టిన రోజును ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. 1928 నాటి ఒలింపిక్స్ పోటీల్లో ధ్యాన్చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఏకంగా 178 గోల్స్ సాధించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఆ పోటీల్లో మరే జట్టు కూడా భారత జట్టుకు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టు అంతర్జాతీయ పోటీల్లో ఇదే దూకుడును కొనసాగించింది. కాలక్రమేణా క్రికెట్కు జనాదరణ పెరగడంతో హాకీకి ప్రోత్సాహం కరువైంది. భారత హాకీ జట్టు 1980లో చివరిసారిగా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించింది. అది జరిగిన మూడేళ్లకు 1983లో కపిల్దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి దేశంలో క్రికెట్కు విపరీతంగా జనాదరణ పెరిగింది. అంతకుముందు సంపన్నవర్గాలకే పరిమితమైన క్రికెట్ గల్లీలకు వ్యాపించింది. దేశంలోని ఏ క్రీడాకారుడికీ దక్కని గౌరవం ‘భారతరత్న’ అవార్డు క్రికెట్ క్రీడాకారుడైన సచిన్ టెండూల్కర్కు దక్కింది. భారత క్రీడాకారులు పరుగుపందేలు, బ్యాడ్మింటన్, విలువిద్య వంటి క్రీడల్లో సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, క్రికెటర్లకు దక్కుతున్న ప్రోత్సాహం, ఆదరణ మిగిలిన క్రీడాకారులకు దక్కడంలేదు. క్రీడల గురించి కొన్ని విశేషాలు ► మనకైతే జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదుగాని, మన పొరుగు దేశమైన భూటాన్ విలువిద్యను జాతీయక్రీడగా గుర్తించి, ఆ క్రీడను ప్రోత్సహిస్తోంది. ► క్రీడారంగంలో అతి తేలికపాటి, గౌరవనీయమైన పదవి ఒకటి ఉంది. గాలిపటాల క్రీడ (కైట్ సర్ఫింగ్) కోసం సృష్టించిన ఈ పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనల్లా గాలిపటాలు ఎగరవేయడానికి గాలి అనుకూలంగా ఉందో లేదో చెప్పడమే. ఈ పదవిలో ఉన్న వ్యక్తిని ‘విండ్ డమ్మీ’ అంటారు. ‘గినీపిగ్’ అని కూడా ముద్దుగా పిలుస్తారు. ► సాధారణంగా క్రీడల్లో మహిళలు, పురుషులు ఒకే జట్టులో సమాన సంఖ్యలో ఉండటం కనిపించదు. ‘కోర్ఫ్బాల్’ క్రీడలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ‘కోర్ఫ్బాల్’ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు ఉంటారు. తప్పనిసరిగా సమాన సంఖ్యలో పురుషులు, మహిళలతో కలిసిన జట్టును ఏర్పాటు చేయడమే ‘కోర్ఫ్బాల్’ ప్రత్యేకత. ► టెన్నిస్లో ఒకప్పుడు కోర్టు బ్యాక్గ్రౌండ్ను బట్టి తెలుపు లేదా నలుపు రంగు బంతులను మాత్రమే వాడారు. అయితే, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) 1972లో తొలిసారిగా పసుపు రంగు బంతులను ప్రవేశపెట్టింది. కలర్ టీవీ తెరలపై కొట్టొచ్చినట్టు కనిపించాలనే ఉద్దేశంతోనే ఐటీఎఫ్ నిపుణులు పసుపు రంగును ఎంపిక చేసుకున్నారు. ► కండలను పెంచుకోవడానికి చాలామంది జిమ్లకు వెళుతుంటారు గాని, చాలామందికి వాటి చరిత్ర తెలీదు. తొలిసారిగా ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం తొమ్మిదో శతాబ్దిలో జిమ్నాసియమ్లు ఏర్పాటయ్యాయి. వాటిలో వ్యాయామం కోసం వెళ్లేవారు దుస్తులన్నీ తీసేసి పూర్తి నగ్నంగా వ్యాయామాలు చేసేవారు. ఒకవైపు వ్యాయామాలు కొనసాగుతుంటే మరోవైపు ఒక బృందం వాద్యసంగీతం వినిపించేది. ► ‘స్పోర్ట్స్మన్ ఆఫ్ ది ఇయర్’గా రెండుసార్లు ‘టైమ్స్’ మ్యాగజైన్ కవర్పైకెక్కిన ఘనత దక్కించుకున్న ఏకైక క్రీడాకారుడు గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్. ‘టైమ్స్’ మ్యాగజైన్ 2000 ఆగస్టు సంచికలో ఒకసారి, ఈ ఏడాది ఆగస్టు సంచికలో ఒకసారి కవర్ పేజీకెక్కాడాయన. క్రీడల్లో మనది ఇంకా కొంత వెనుకబాటే... క్రీడారంగంలో భారత్ ఇంకా కొంత వెనుకబాటలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అగ్రగాములుగా నిలుస్తున్న దేశాల జాబితాలో భారత్ ఇంకా తొలి పదిస్థానాల్లో చోటు పొందలేదు. నాలుగేళ్లకు ఒకసారి వెలువడే ఈ జాబితా గత ఏడాది విడుదలైంది. ఇందులో భారత్ కేవలం 37వ స్థానంలో నిలిచింది. క్రీడల్లో టాప్–10 దేశాలు ఇవే... 1. అమెరికా 2. ఫ్రాన్స్ 3. యునైటెడ్ కింగ్డమ్ 4. స్పెయిన్ 5. ఆస్ట్రేలియా 6. జర్మనీ 7. రష్యా 8. బ్రెజిల్ 9. జపాన్ 10. కెనడా క్రీడలతోనే ఆరోగ్యం క్రీడలతోనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. చిన్నారులు ఆడుకునేటప్పుడు వారిని ఆటల నుంచి నివారించడం చాలామంది పెద్దలు చేసే పొరపాటు. ఆటల వల్ల పిల్లలు చదువులను నిర్లక్ష్యం చేస్తారని, ఆటల వల్ల పిల్లలు దుందుడుకుగా మారిపోతారని చాలామంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి ఆటల వల్లనే పిల్లలు మరింత చురుకుగా తయారవుతారు. కాసేపు ఆటలాడుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత చదువుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తోటిపిల్లలతో కలసి ఆడుకోవడం వల్ల నలుగురితో ఎలా మెసలుకోవాలో తెలుసుకోగలుగుతారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారు. క్రీడల వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రీడల వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనాలేమిటంటే... స్థూలకాయం రాదు తరచు క్రీడలు ఆడటం వల్ల స్థూలకాయం రాదు. ఒంట్లోని కొవ్వు కరిగి శరీరం తీరుగా తయారవుతుంది. చురుకుదనం పుంజుకుంటుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మానసిక ఆరోగ్యం క్రీడలు శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిపుణులు చెబుతుండటం విశేషం. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక సంయమనం, ప్రతికూల పరిస్థితులను స్థిమితంగా ఎదుర్కోగల శక్తి ఏర్పడతాయని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి. గుండెకు ఆరోగ్యం క్రీడలు ఆడేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. క్రీడల వల్ల గుండె ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటుంది. క్రీడలు గుండె కండరాల దారుఢ్యానికి దోహదపడతాయి. క్రీడల వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు గుండె నుంచి సక్రమంగా రక్త సరఫరా జరుగుతుంది. క్రీడాకారుల్లో గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు చాలా అరుదు. అదుపులో రక్తపోటు క్రీడలు ఆడటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కేవలం ఆహార నియమాలను పాటించడం వల్ల రక్తపోటును నియంత్రించడం దుస్సాధ్యం. ఆహార నియమాలతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చని బ్రిటన్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ నిపుణులు సూచిస్తున్నారు. క్రీడల వల్ల రక్తపోటును అదుపులో ఉండటమే కాకుండా, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. మెరుగైన రక్తసరఫరా క్రీడల వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా శరీరంలోని ప్రతి జీవకణానికీ తగినంతగా ఆక్సిజన్ అందుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. క్రీడలు ఆడేవారికి వెన్నునొప్పి, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు బాధించే అవకాశాలు తక్కువ. ఈ కారణం వల్లనే క్రీడలు ఆడేవారిలో చాలాకాలం వరకు కండరాలు పట్టు సడలకుండా బిగువుగా ఉండటంతో పాటు వార్ధక్య లక్షణాలు త్వరగా కనిపించకుండా ఉంటాయి. మెరుగైన రోగనిరోధక శక్తి క్రీడలు ఆడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. క్రీడల్లో పాల్గొనే వారికి బాగా చెమట పట్టి, శరీరంలోని మాలిన్యాలు త్వరగా బయటకు పోతాయి. వేగంగా పరుగులు తీయడం, ఆటలాడటం వల్ల శరీరం ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, త్వరగా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది. సానుకూల దృక్పథం క్రీడలు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాలను నిర్దేశించుకుని, ఒకరకమైన స్పష్టతతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడం, క్రమశిక్షణ వంటి సానుకూల లక్షణాలు క్రీడల వల్ల అలవడతాయని ‘జర్నల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్స్’ ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపింది. – పన్యాల జగన్నాథదాసు -
పబ్జీగేమ్ వద్దంటేనే ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి..
సోమాజిగూడ: వాస్తవికానికి దూరంగా.. ఇంటర్నెట్ గేమింగ్కు దగ్గరగా యువతరం వెళ్తున్నట్లు మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు సైతం ఇంటర్నెట్ గేమింగ్కు అలవాటు పడుతున్నారు. అందుకు బాధ్యత వహించాల్సింది కూడా తల్లితండ్రులే అంటున్నారు వైద్య నిపుణులు. 10 సంవత్సరాల క్రితం ఇటు వంటి వ్యాధులతో తమ వద్దకు వచ్చిన వారు లేరని, అసలు తాము చదివిన చదువుకు ఇప్పుడొస్తోన్న వ్యాధులకు అసలు పొంతన ఉండటం లేదంటున్నారు. నగరాల్లోని పిల్లల తల్లితండ్రులు క్షణం తీరిక లేని జీవితాలు గడుపుతున్నారు. చిన్నారి మారాం చేస్తే ఆడుకో అంటూ సెల్ఫోన్లను చేతికి అందిస్తున్నారు. సెల్ ఫోనే ప్రపంచంగా వారికి తల్లితండ్రులే అలవాటు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు మరో ధ్యాస ఉండటంలేదు. వారు యుక్త వయసుకు వచ్చినా... మదిలో అవే ఆలోచనలు మెదలడంతో ఎప్పుడూ ఫోన్లతో గడపం, చాటింగ్ చేయడం, ఇంటర్నెట్ గేమింగ్.. అదే ప్రపంచంగా వారు భావిస్తున్నారని నిమ్స్ ఆసుపత్రిలోని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ జి.పద్మజ అభిప్రాయం వ్యక్తంచేశారు. పబ్జీగేమ్... పబ్జీగేమ్ వద్దంటేనే పిల్ల్లలు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి వచ్చారంటే అందులో తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉందంటున్నారు మానిసిక వైద్య నిపుణులు. అపార్ట్మెంట్ కల్చర్కు అలవాటుపడిన నగరవాసులు పిల్లల్ని స్కూలుకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. డబ్బాల్లాంటి ఇరుకు గదుల్లో చదువు సాగుతూ వాస్తవిక పరిస్థితులకు పిల్లలను దూరం చేస్తున్నారు. చదువు, మార్కులు తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు నేర్పాలనే విషయాన్నే మరిచిపోతున్నారు. ఇయర్ ఫోన్ మాట్లాడుతూ రైలు ఢీకొని మృతి నగరంలోని ఎమ్మెస్ మక్తాలో నివసించే ఓ యువతి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాకింగ్కు వెళ్లింది. నడక పూర్తి అయిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటాల్సి ఉంది. పట్టాలు దాటే సమయంలో అటుగా వచ్చే రైలును ఆమె గుర్తించలేదు. వెనుక నుంచి వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. నడిచినా.. ప్రయాణం చేసినా.. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్కనున్నవారిని కనీసం గమనించడంలేదు. కాస్త ఆగి అటు.. ఇటు.. చూసినా ఆమె ప్రాణాలు దక్కేవి. రైలు పట్టాలు వద్ద సెల్ఫీ.. ప్రస్తుతం సెల్ఫీ అన్నది అందరికీ పట్టిన పెద్ద జాడ్యంలా మారింది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ యువకుడు రైలు పట్టాల సమీపంలో నడిచే రైలుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. దీనినే సెల్ఫీ టేకింగ్ ఎడిక్షన్ డిజార్డర్ అంటారని వైద్యులు చెబుతున్నారు. పులితో సెల్ఫీ.. పులితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో లైకుల కోసం ఎగబడిన ఓ యువకుడు ఆపులికి ఆహారంగా మారిన ఘటన అందరికీ తెలిసిందే. ఇలా ంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నా.. వారిలో మార్పు రాకపోగా... ఇంకా పెడదారి పడుతున్నారు. దీనికి కారణం ఇంటర్నెట్.. పిల్లల గేమ్స్పై దృష్టిపెట్టాలి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యాధులు అధికం అతున్నాయి. ఇంటర్నెట్ విస్తరించిన అనంతరం మంచితోపాటు చెడూ పెరిగింది. మంచిని వదిలి యువతరం చెడును ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహ భావంగా ఉండాలి. వారు ఎంచుకున్న మార్గం.. అనుసరిస్తున్న పద్ధతులను సున్నితంగా వివరించాలి. ఈ గేమ్స్ అన్నీ కల్పితమని, వాస్తవిక క్రీడలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిచయం చేయాలి. సూళ్లలో అధ్యాపకులు విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వాలి. పాఠశాల నుంచి వచ్చిన బిడ్డ ఏమిచేస్తున్నాడు.. అనే విషయాన్ని తెలుసుకోవాలి. – డాక్టర్ పద్మజ -
కుదురులేని వాడు క్యూబ్లో ఒదిగాడు
అమెరికాలో జాతీయ స్థాయిరూబిక్ క్యూబ్ పోటీల్లో విజేతగా నిలిచినపాలడుగు హర్ష హైదరాబాద్ వచ్చి,తన లాంటి పిల్లలకు రూబిక్ క్యూబ్ గేమ్మీద ఆసక్తి పెంచేందుకు ఓ ప్రత్యేకఈవెంట్ ఏర్పాటు చేశాడు. అతడి హైపర్యాక్టివ్నెస్కి తండ్రి కనిపెట్టిన రూబిక్ గేమ్ పరిష్కారమే... అమెరికాలో ఏ తెలుగు కుర్రాడికీ దక్కని ఘనతను హర్షకు సాధ్యం చేసింది! ఒకప్పుడు పిల్లలు చురుకుగా ఉండడం లేదనేదే ఎక్కువగా పెద్దవాళ్ల ఫిర్యాదుగా ఉండేది. అయితే ఇప్పుడు ‘మా వాడు హైపర్ యాక్టివ్ అండీ. ఏం చేయాలో తెలియడం లేదు’’ అనే పేరెంట్స్ కోకొల్లలు. కారణాలేవైనా గాని.. దీనికి రూబిక్ క్యూబ్ గేమ్ను ఒక మంచి పరిష్కారం అని కనుగొన్నారు అమెరికాలో ఉంటున్న పాలడుగు శ్రీకాంత్. ఈ గేమ్లో రాణిస్తున్న తమ కుమారుడు హర్ష ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇటీవల ఆయన క్యూబ్ గేమ్ మీద రోజు మొత్తం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా హర్షతో ముచ్చటించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. హైపర్ టూ... సూపర్ ‘‘మాది ఆంధ్రప్రదేశ్. (తండ్రి కాకినాడ, తల్లి విశాఖపట్టణం) చిన్నప్పుడు తన పదేళ్ల వయసులో నాన్న క్యూబ్ గేమ్ ట్రై చేశారట. కొంత కాలం దాని మీద ఇష్టంతో ఆడి తర్వాత వదిలేశారు. చిన్నప్పటి నుంచీ నేను హైపర్యాక్టివ్గా ఉండేవాడిని. దేనిపై సరిగా ఫోకస్ ఉండేది కాదు. నాలో ఫోకస్ పెంచడానికి ఏ గేమ్ సరిగా ఉపయోగపడుతుందా అని నాన్న ఆలోచించి, చిన్నప్పుడే నాకు క్యూబ్ కొనిచ్చారు. మొదట్లో నేను అంత ఆసక్తి చూపలేదు. కొన్ని రోజులు ఆడి వదిలేశా. అయితే అనుకోకుండా నా ఫ్రెండ్ కూడా ఇదే ఆట మొదలుపెట్టగానే ఇద్దరం పోటా పోటీగా ఆడడం, అలా అలా కాంపిటీషన్స్కి కూడా వెళ్లడం, గెలవడం మొదలైంది. రెండేళ్ల క్రితం ఆగస్ట్ 27న మిషిగన్ క్యూబింగ్ క్లబ్ నిర్వహించిన పోటీలో గెలిచాను, ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ ర్యాంక్, వరల్డ్ వైడ్గా 6వ ర్యాంక్ సాధించాను. చదువు మెరుగయింది ఒక క్యూబ్స్ సాల్వ్ చేయాలంటే వందల అల్గోరిథెమ్స్ అవసరం. దీని వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్, ఫింగర్స్ మూవ్మెంట్స్ వల్ల నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ గేమ్ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల నా చురుకుదనం క్రమబద్ధం అయింది. ఏకాగ్రత పెరిగింది. కళ్లు, మైండ్, చేతులు అన్నింటి సమన్వయం వచ్చింది. ఫైనల్గా దీని వల్ల స్టడీస్లో కూడా బాగా బెటర్ అయ్యా. సాధారణ ఆటగాడి నుంచి ఛాంపియన్ కావాలంటే.. విపరీతమైన ఏకాగ్రత కావాలి. మీకు తెలుసా? ఇందులో ప్రావీణ్యం సంపాదించిన ఆటగాళ్లు ఆటలోకి దిగి ఒక్కసారి క్యూబ్ని చూశాక దాన్ని అచ్చం అలాగే మైండ్లో ప్రింట్ చేసుకుంటారు. ఆ తర్వాత చేతుల్లో ఉన్న క్యూబ్ కనిపించదు. మైండ్ గేమ్ మాత్రమే ఉంటుంది. చేతుల్లో క్యూబ్ కనిపిస్తే ఆడలేం. దీనిని బ్లైండ్ కిడ్స్ ఇంకా బాగా ఆడగలగడానికి కారణం వాళ్లకి ఫోకస్ మరింత బాగా ఉండడమే. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనేది నా లక్ష్యం. పిల్లలకు ఆసక్తి కల్పించాలి అమెరికాలో దేశవ్యాప్తంగా ఈ గేమ్కు సంబంధించి నెలకు 50 వరకూ జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరుగుతుంటాయి. మనకు చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం మరింత తక్కువ. ఇది విద్యార్ధి దశలోని పిల్లలకు బాగా ఉపయుక్తమైంది. అందుకే దీన్ని వీలున్నంతగా ప్రమోట్ చేయాలని ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ, పోటీల ఈవెంట్స్ ద్వారా వచ్చిన విరాళాలు, ఫీజులు రూపంలో సేకరించిన నిధులు పూర్తిగా కేన్సర్ వ్యాధి బాధిత చిన్నారుల కోసం కృషి చేసే ల్యుకేమియా అండ్ లింఫోమా సొసైటీకి అందిస్తున్నాం’’ అని తెలిపారు హర్ష. – ఎస్.సత్యబాబు -
బ్లూవేల్ పోయె పబ్జి వచ్చె
నగరంలోని విద్యారణ్యపురకు చెందిన ఒక అబ్బాయి తరగతిలో ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేవాడు. కానీ ఇటీవల తరచూ స్కూల్కు వెళ్లడం లేదు. మార్కులు తగ్గిపోయాయి. తల్లిదండ్రులతోనూ మాట్లాడడం లేదు. నిరంతరం మొబైల్లో, కంప్యూటర్లో పబ్జి గేమ్ ఆడడమే. మరో 15 ఏళ్ల అబ్బాయి రాత్రి 2–3 గంటలవరకు పబ్జి ఆడడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యంగా స్కూల్కు వెళుతున్నాడు. గంటల తరబడి మొబైల్లో పబ్జి గేమ్ ఆడుతూ ప్రపంచాన్ని మరచిపోతున్నాడు. గత్యంతరం లేని తల్లిదండ్రులు నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాక్షి బెంగళూరు/ యశవంతపుర: ప్రాణాంతక బ్లూ వేల్ గేమ్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో పబ్జి అనే కొత్త గేమ్ వచ్చిపడింది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బాలలు, కుర్రకారు ఈ ఆటకు బానిసలుగా మారారు. తిండితిప్పలు వదిలేసి మరీఈ గేమ్కు అంటుకుపోతూ మానసికంగా దెబ్బతింటున్నారు. విద్యార్థులు విపరీతంగా ఆడడం వల్ల నిద్రలేమీ, స్కూల్కు గైర్హాజరు, హింసాత్మక ప్రవృత్తి పెరగడం వంటి మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ దూసుకుపోతోంది. మూడునెలల్లో 120 కేసులు ఈ కొత్త ఆన్లైన్ గేమ్కు బానిసలవుతున్న వారిలో బెంగళూరు ప్రముఖ స్థానం ఉంది. పబ్జి గేమ్ వ ల్ల మానసకి రుగ్మతలకు గురై ఇటీవల చాలా మం ది నిమ్హాన్స్కు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. గడిచిన మూడు నెలల నుంచి ఇప్పటివరకు నిమ్హాన్స్లోని సర్వీసెస్ ఫర్ హెల్తీ యూ జ్ ఆఫ్ టెక్నాలజీ (షట్)కు 120 కేసులు వచ్చినట్లు తెలిపారు. చాలా మంది ఈ గేమ్ ఆడిన తర్వాత జీవితంపై ఆసక్తి లేకపోవడం, నిద్ర లేమీ, చదువులో వెనుకబడిపోవడం తదితర మానసిక సమస్యలకు చికిత్స కోసం వస్తున్నారని పేర్కొన్నారు. జీవితాన్ని కోల్పోతున్నారు ‘దేశంలో 8 నెలల క్రితం ఈ గేమ్ యాప్ ప్రారంభించారు. తొలి మూడు నెలల్లో నెలకు మూడు లేదా ఐదు కేసులు మాత్రమే వస్తుండేవి. కానీ ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి కేసుల సంఖ్య పెరగడం గమనించాం. ఇప్పుడు నెలకు సగటున 40 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయి. ఈ గేమ్ ప్రతిఒక్కరి జీవితాన్ని కబళిస్తోంది. రోజుకు 8 నుంచి 10 గంటలు ఆడడం వల్ల జీవితంలో అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. గేమ్కు అలవాటైన పిల్లలను ఫోన్కు దూరం చేస్తే చాలా కోపంగా, హింసాత్మకంగా మారిపోతున్నారు. తల్లిదండ్రులతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆస్పత్రికి వస్తున్న రోగులు తమ తల్లిదండ్రుల మీదే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి గేమ్స్ బారినపడకుండా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అసహజ వైఖరి, ప్రవర్తన కనిపిస్తే వెంటనే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలి’ – డాక్టర్ మనోజ్ శర్మ, శ్రీధర్, సైకియాట్రిస్టులు యుద్ధం చెయ్యడం, చంపడమే ఈ గేమ్ ఇది ఒక యుద్ధానికి సంబంధించిన గేమ్. 100 మందితో ఈ గేమ్ ప్రారంభమవుతుంది. విమానం నుంచి 100 మంది ఒక ద్వీపంలోకి దిగుతారు. యుద్ధ రంగంలోకి అడుగిడి భారీ తుపాకులు, ఆయుధాలతో గేమ్లో ఉన్న ప్రత్యర్థులను చంపుకుంటూ వెళుతుంటారు. బైకులు, కార్లు, బోట్లు ఉపయోగించుకుని ద్వీపంలో తిరుగుతూ దాడులు చేస్తారు. అలా చంపుకుంటూ వెళ్లి చివరికి ఆ నూరు మందిలో ప్రాణాలతో మిగిలే వారే విజేతలుగా నిలుస్తారు. -
ఘనంగా ముగిసిన 'లాటా' మిని ఒలింపిక్స్
లాస్ ఏంజెల్స్ : అమెరికాలో లాస్ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్(లాటా) నిర్వహించిన మినీ ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2016 ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యాష్లీ జాన్సన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, ట్రోపీలను అందజేశారు. స్థానిక కళాకారులు శ్రీమాన్ కొమరగిరి, రమ్య పుచ్చలు తమ ఆటాపాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. ఎనిమిది క్రీడా పోటీల్లో ఆరు చోట్ల లీగ్ మ్యాచ్లు, ప్రతీ ఆటకూ ఫైనల్స్తో కలిపి 6 వారాలపాటూ ఈ పోటీలను నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ దాదాపు 1100 మంది క్రీడాకారులు ఈ మినీ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఓ తెలుగు సంస్థ ఇంత పెద్ద క్రీడాపోటీలను నిర్వహించడం అమెరికాలో ఇదే తొలిసారి అని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు తెలిపారు. మే 26న మొదలైన ఈ క్రీడాపోటీలు జూలై 1న క్రికెట్ ఫైనల్స్తో ముగిశాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నికాయిట్, చెస్, క్యారంస్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడలను ఇర్వైన్, ఈస్ట్ వెల్, వాలెన్సియా, టోరెంస్, సైప్రస్, బర్ బ్యాంకు, బ్యుయనా పార్క్, ఆర్కేడియా నగరాల్లో నిర్వహించారు. 145 మంది లాటా కార్యకర్తలు ఈ పోటీలను పర్యవేక్షించారు. యాష్లీ జాన్సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆటల్లో, చదువుల్లో, జీవితంలో అయినా చిన్న చిన్న లక్ష్యాలని సాధించడం ద్వారా ఎంత పెద్ద లక్ష్యం అయినా ఛేదించవచ్చు అని తాను ఒలింపిక్స్లో బంగారు పథకం ఎలా సాధించారో వివరించారు. మినీ ఒలింపిక్స్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కృతజ్ఞలు తెలిపారు. అతి తక్కువ ఫీజుతో ఆగష్టు 4, 5 తేదీల్లో స్క్రమ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు కోసం latausa.org వెబ్సైట్ను సందర్శంచాలని కోరారు. -
ఆటలూ ముఖ్యమే..
మెదక్జోన్ : చదువుతో పాటు ఆటలూ ముఖ్యమేనని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మెదక్ పట్టణంలో ఒక కిలో మీటర్ పరుగు పోటీలను జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఆయన పరుగు పందెం పోటీలను జెండాఊపి ప్రారంభించారు. ఈ పరుగు స్థానిక గుల్షన్క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ పరుగులో కలెక్టర్తోపాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు, పీఈటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ పిల్లలు చదువుతోపాటు క్రీడలకు సమ యం కేటాయించాలన్నారు. ప్రతిరోజు తను వ్యాయమం చేయనిదే విధులకు హాజరుకానని తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ నుంచి స్టేడియంను, అ«థ్లెటిక్ సెంటర్ను తరలించకుండా తగుచర్యలు తీసుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులు కలెక్టర్ కోరారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ రాష్ట్ర క్రీడల అధి కారి దినకర్బాబుతో మాట్లాడి ఇక్కడే ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఒలింపిక్ డే రన్–2018 కమిటీ కన్వీనర్ పీడి ఆర్.నాగరాజు మాట్లాడుతూ ఈ రన్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రన్ ద్వారా క్రీడల పట్ల అందరికి అవగాహన కల్పించడంతోపాటు క్రీడలపై ఉన్న అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కన్వీనర్, పీఈటీల బృందం జిల్లా కలెక్టర్కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ వెంకటరమణ, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎస్.నాగరాజు, శ్రీనివాస్రావు, సెక్టోరియల్ అధికారి మధుమోహన్, డీవైఎస్ఓ రమేశ్బాబు, పలువురు అధికారులు పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్రెడ్డి, మహిపాల్, రాజేందర్, నరేశ్, జమాల్, గోపాల్గౌడ్, రమేష్, సత్యం, కిరణ్, రూపెందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదమరిస్తే..అపాయమే!
‘పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. అయితే పులితోనే కాదు ఏ జంతువుతో అయినా సెల్ఫీలు, ఆటలు ప్రమాదమే. మచ్చిక చేసుకున్నవైనా, శిక్షణలోనివి అయినా.. క్రూర జంతువుల దగ్గర అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కాస్తంత పరధ్యానంగా ఉన్నా, సెల్ఫీల పేరుతో వాటితో ఆటలాడ్డానికి ప్రయత్నించినా అంతే సంగతులు. ఒక్కోసారి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి వాటికి నిదర్శనంగా నిలిచే కొన్ని సంఘటనలివీ.. సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు.. ఇది రెండేళ్ల కిందట మన హైదరాబాద్లోనే జరిగింది. బిహార్కు చెందిన ఓ వ్యక్తి(35) నెహ్రూ జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు. అక్కడ సింహాలున్న ఎన్క్లోజర్ ప్రాంతంలోకి హఠాత్తుగా దూకాడు. అప్పటికే పీకల దాకా తాగేసి ఉన్న ఆ వ్యక్తి సమీపంలోని సింహాలను చూస్తూ షేక్హ్యాండ్ ఇచ్చేందుకన్నట్లు చేయి చాపాడు. గమనించిన జూ నిర్వాహకులు వెంటనే సింహాల దృష్టిని మరల్చి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రక్షించారు. చిన్నారి తలను దొరకబుచ్చుకుంది సౌదీ అరే బియాలోని జెడ్డా లో జరిగింది ఈ సంఘటన. జెడ్డా స్ప్రింగ్ ఫెస్టివల్లో భాగంగా పదేళ్ల లోపు చిన్నారులు కొంత మంది ఓ జూ లోకి వెళ్లారు. అక్కడ శిక్షకుడి పర్యవేక్షణలోని ఓ సింహం(ఆరు నెలల వయస్సు) చుట్టూ మూగారు. సరదాగా దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఉన్నట్లుండి ఆ సింహం పిల్ల ఓ చిన్నారిపై దాడికి దిగింది. ఆ చిన్నారి తలను నోట కరుచుకుంది. దీంతో భయపడిన మిగిలిన పిల్లలు దూరం జరిగారు. శిక్షకుడు అతికష్టమ్మీద ఆ చిన్నారిని సింహం పిల్ల నుంచి విడిపించగలిగాడు. ఈ ఘటనలో చిన్నారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ తలకు అక్కడక్కడా కుట్లు పడ్డాయి. ఎన్క్లోజర్లో దూకి బలయ్యాడు.. మన దేశ రాజధాని ఢిల్లీలో 2014లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక్కడి నేషనల్ జులాజికల్ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ఇరవయ్యేళ్ల యువకుడు హఠాత్తుగా పులుల ఎన్క్లోజర్లో దూకాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న ఓ తెల్లపులి కంట పడ్డాడు. ఆ పులి ఓ పదిహేను నిమిషాలు అతనిపై దాడికి దిగలేదు. ఈ లోపు మిగిలిన సందర్శకులు దాన్ని బెదరగొట్టడానికి, దాని దృష్టిని మరల్చడానికీ రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసర డం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అది హఠాత్తుగా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి పంజాతో దాడి చేసి చంపి లాక్కెళ్లింది. పులి దాడికి దిగుతుండగా ఆ యువకుడు నమస్కరిస్తూ ప్రాధేయపడిన వీడియో అప్పట్లో సామా జిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. జూ యజమానిపై దాడి.. ఇది రెండు వారాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ జూ నిర్వాహకుడు(85).. సందర్శకులకు జూ చూపిస్తుండగా సింహాల ఎన్క్లోజర్లో దుర్వాసన రావడం గమనించాడు. వెంటనే పరధ్యానంగా లోపలికి వెళ్లాడు. సమీపంలోనే ఓ సింహం ఉండడం గమనించి గేటు వైపు పరిగెత్తబోయాడు. ఈ లోపలే అతన్ని దొరకబుచ్చుకున్న సింహం..పంజాతో దాడికి దిగి లోపలికి లాక్కెళ్లింది. ఇంతలో సందర్శకుల్లో ఎవరో తుపాకీతో సింహాన్ని కాల్చడంతో ఆ జూ నిర్వాహకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీసుకోవాల్సిన జాగ్రతలు: జూ, అడవుల సందర్శనకు వెళ్లినపుడు అక్కడి సిబ్బంది చెప్పే సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లడం, వాటితో సెల్ఫీలు దిగాలనుకోవడం ప్రమాదకరం. అడవి జంతువులను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. సింహాలు, పులులు లాంటి క్రూర జంతువులు ఉన్న ఎన్క్లోజర్స్లోకి వెళ్లకూడదు. జంతువులకు చేత్తో ఆహారపదార్థాలు తినిపించేందుకు ప్రయత్నించకూడదు. జంతువులను భయపెట్టేలా శబ్దాలు చేయకూడదు. పాటలు పెట్టకూడదు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలి వెళ్లకూడదు. -
'గుర్తుకొస్తున్నాయి'... : ఎమ్మెల్యే
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : చిన్నప్పుడు ఆడిన గోలీల ఆటను ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ గుర్తు చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ రైతు బజార్ పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అక్క డే గోలీలు ఆడుకుంటున్న చిన్నారులను చూసిన ఆయన పరిశీలిస్తుండగా.. వారు మీరు కూడా ఆడతారా అంటూ అడిగారు. దీంతో ఎమ్మెల్యే వారి వద్ద నుంచి గోలీ తీసుకుని కాసేపు సరదాగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇలాంటి ఆటలకు ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తరం ఇండోర్ గేమ్స్, కంప్యూటర్లకే పరిమిత మవుతున్నారని తెలిపారు. అయితే, వేసవి సెలవుల సందర్భంగా పిల్లల విషయమై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ సూచించారు. -
గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్పై మాల్వేర్ అటాక్
శాన్ఫ్రాన్సిస్కో : గూగుల్ ప్లే స్టోర్లోని గేమ్స్పై పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ అటాక్ చేసింది. ఈ అటాక్ బారితో దాదాపు 60 గేమ్స్ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తొలగించిన గేమ్స్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునేవే ఉన్నాయి. పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్పై అటాక్ చేసినట్టు ఇజ్రాయిల్కు చెందిన సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గుర్తించింది. ఫేక్ సెక్యురిటీ సాఫ్ట్వేర్ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవడం కోసం అడ్వర్టైజ్మెంట్లు డిజైన్ చేసినట్టు రీసెర్చర్లు రిపోర్టు చేశారు. గేమ్స్ యాప్లో పోర్నో యాడ్స్ ద్వారా ఈ మాల్వేర్ అటాక్ చేస్తుందని, ఒకవేళ వీటిని క్లిక్ చేస్తే, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఈ మాల్వేర్పై అలర్ట్ అయిన గూగుల్, వెంటనే తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ను తొలగించింది. ప్లే స్టోర్ నుంచి తాము ఈ యాప్స్ను తొలగించామని, డెవలపర్ల అకౌంట్ను డిసేబుల్ చేశామని గూగుల్ తెలిపింది. వీటిని ఇన్స్టాల్ చేసుకునే వారికి తాము గట్టి హెచ్చరిక జారీచేస్తున్నామని పేర్కొంది. యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు చెక్ పాయింట్స్ చేసిన ఈ పనిని తాము అభినందిస్తున్నామని తెలిపింది. అయితే ఈ మాల్వేర్ ప్రభావానికి యూజర్ల డివైజ్లు ప్రభావితం కాలేదని చెప్పింది. మాల్వేర్ ప్రభావానికి గురైన యాప్స్ను మూడు నుంచి ఏడు మిలియన్ సార్లు డౌన్లోడ్ అయ్యాయి. వాటిలో ఫైవ్ నైట్స్ సర్వైవల్ క్రాఫ్ట్, మెక్వీన్ కారు రేసింగ్ గేమ్ ఉన్నాయి. -
నేమ్స్తో గేమ్స్
ఆటల్లో గాట్లు, కట్లు ఉండనే ఉంటాయి. ఆటల్లో కాకుండా కూడా ఉంటాయిగా!! అదే చిత్రం. గేమ్స్లో వచ్చేవాటికి, గేమ్స్లో రానివాటికి కూడా గేమ్స్ నేమ్స్ పెట్టారు. ఆసక్తికరమైన ఆ జబ్బుల పేర్లు... మనకు ఎవరికైనా అలాంటివి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఈ నేమ్స్, గేమ్స్! గోల్ఫర్స్ ఎల్బో: దీనిపేరు ‘గోల్ఫర్స్ ఎల్బో’ అయినప్పటికీ గోల్ఫ్ ఆడనివారిలోనూ ఈ సమస్య రావచ్చు. టెన్నిస్ ఆడేవారిలోనూ, క్రికెట్లో బేస్బాల్ ఆటలో బౌలింగ్ చేసేవారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. అందుకే కొన్నిసార్లు దీన్ని ‘పిచ్చర్స్ ఎల్బో’ అని కూడా పిలుస్తారు. ఈ సమస్యలో మోచేతి ప్రాంతంలో నొప్పితో పాటు మంట, వాపు (ఇన్ఫ్లమేషన్) కూడా కనిపించవచ్చు. వైద్య పరిభాషలో దీన్ని ‘మీడియల్ ఎపికాండిలైటిస్’ అంటారు. వాహనం నడిపే కారణాలతో మాటిమాటికీ పిడికిలి బిగించి పనిచేయడం, చేతిని ఊపుతూ పనిచేయాల్సి రావడం వల్ల టెండన్ దెబ్బతిని కూడా ఈ సమస్య రావచ్చు. స్క్రూడ్రైవర్లు వాడటం, సుత్తితో కొట్టడం, పెయింటింగ్ చేసేవారిలోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. మన గోల్ఫర్స్ ఎల్బోను టెన్నిస్ ఎల్బో తాలుకు కజిన్గా పేర్కొనవచ్చు. అయితే దీనికి ‘టెన్నిస్ ఎల్బో’ అంతటి ప్రాచుర్యం లేదు. ఈ రెండూ మోచేతిలోని టెండన్ల ఇన్ఫెక్షన్ సమస్యతో వచ్చేవే. తేడా అల్లా... టెన్నిస్ ఎల్బోలో మోచేతి వెలుపలి (అంటే బయటివైపు) టెండన్లతో సమస్య వస్తుంది. అదే గోల్ఫర్స్ ఎల్బోలో లోపలివైపు టెండన్లతో వస్తుంది. తగినంత విశ్రాంతి, ఐస్ అద్దడం, కాస్త చేతులు పైకి ఉంచి పడుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది. అవసరాన్ని బట్టి నొప్పి నివారణ మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. కొంతమందిలో స్టెరాయిడ్స్ కూడా అవసరమే అయినా అవి డాక్టర్ విచక్షణ మేరకు వాడాలి. టెన్నిస్ ఎల్బో: ‘టెన్నిస్ ఎల్బో’ టెన్నిస్ ఆడేవారితో పాటు చేతితో చాలా ఎక్కువగా పనిచేసేవారిలో ఎక్కువ. వైద్య పరిభాషలో దీన్ని లాటరల్ ఎపికాండిలైటిస్ అంటారు. చెట్లు కొట్టడం వంటివి చేస్తూ ఉండటం, కార్పెంటరీ, మాంసం కొడుతుండే వారిలోనూ ఈ సమస్య వస్తుంటుంది. ఒక్కోసారి గట్టిగా షేక్హ్యాండ్ ఇవ్వడం వల్ల కూడా టెన్నిస్ ఎల్బో రావచ్చు. (అందుకే విపరీతంగా, గట్టిగా ఊపుతూ షేక్హ్యాండ్ ఇవ్వడం అంత సరికాదు). కొన్ని రకాల వ్యాయామాలు, నొప్పి నివారణ మందులతో దీన్ని నయం చేయవచ్చు. జంపర్స్ నీ : మోకాలిచిప్పకు సంబంధించి తీవ్రమైన నొప్పి వచ్చే పరిస్థితి ఇది. వైద్యపరిభాషలో దీన్ని పటెల్లార్ టెండనైటిస్ అంటారు. సాధారణంగా అథ్లెట్లు ఎదుర్కొనే వేదనల్లో ఇది ఒకటి. తరచూ దుముకుతూ ఉండే సమయంలో ఈ టెండన్ మీద చాలా ఎక్కువ బరువు పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. బాస్కెట్బాల్, వాలీబాల్, హైజంప్, లాంగ్ జంప్లో ఎగిరి గెంతినప్పుడు కాలిమీద పడ్డ బరువు కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. గట్టి నేల (హార్డర్ సర్ఫేస్) మీద స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేవారిలో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువే. రన్నర్స్ నీ : కేవలం పరుగులు పెట్టే క్రీడాకారులకే గాక... మోకాళ్లను చాలా ఎక్కువగా వంచే పనుల్లో ఉండేవారికీ ఇది వచ్చే అవకాశం ఉంది. వాకింగ్, బైక్లు నడపడం, గెంతడం వంటివి చేసేవారిలోనూ ఇది కనిపించవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ‘పటెల్లోఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఇది నిర్దిష్టంగా ఏదైనా గాయం కావడం వల్ల కాకుండా మోకాలి దగ్గర నొప్పితో కనిపిస్తుంది. షిన్ స్ప్లింట్ : మోకాలి కింది భాగం నుంచి పాదం మొదలయ్యే వరకు ఉండే భాగాన్ని షిన్ అంటారు. ఏదైనా కారణాల వల్ల ఆ భాగంలో వాపు, ఒక్కోసారి వెంట్రుకవాసి అంతటి పగులు (హెయిల్లైన్ ఫ్రాక్చర్), వెన్నెముక కింది భాగం బలహీనంగా ఉండటం వంటి అనేక అంశాల వల్ల ఈ భాగంలో నొప్పి వస్తుంది. దీన్నే షిన్ స్పి›్లంట్ అంటారు. రన్నింగ్ చేసే క్రీడాకారుల్లో ఇది చాలా సాధారణమైన సమస్య. ఒక్కోసారి తీవ్రమైన వ్యాయామం చేసేవారిలోనూ ఇది కనిపించవచ్చు. విపరీతంగా నృత్యం చేసే డాన్సర్లలోనూ ఈ సమస్య వస్తుంటుంది. గేమ్కీపర్స్ థంబ్ (స్కీయర్స్ థంబ్ ) : మన బొటనవేలిని మిగతా వేళ్లతో కలిపి ఉండే మృదువైన కణజాలం దెబ్బతినడం వల్ల వచ్చే సమస్యను స్కీయర్స్ థంబ్ అని అంటారు. అంటే లిగమెంట్స్ అని పిలిచే అక్కడి మృదుకణజాలం గాయపడటం వల్ల ఈ సమస్య వస్తుందన్న మాట. సాధారణం స్కీయింగ్ చేసేవారిలో స్కీయింగ్రాడ్ పట్టుకున్నప్పుడు బొటనవేలు గాయపడటం వల్ల ఈ సమస్య రావచ్చు. అయితే ఆటల్లో గానీ లేదా ఇతరత్రా గానీ బొటనవేలికి బలమైన గాయం తగిలి, అది మిగతా వేళ్ల నుంచి దూరం జరిగేలా బలమైన విఘాతం కలిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. సాధారణంగా ఆటోమొబైల్ యాక్సిడెంట్స్లో ఇలా బొటనవేలికి దెబ్బతగిలే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు క్రీడాకారుడి పేరు ఉన్నప్పటికీ ఈ కింద పేర్కొన్నది ఫంగల్ ఇన్ఫెక్షన్తో వచ్చే సమస్య. అథ్లెట్స్ ఫుట్ : ఇది ఒకరకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని వైద్య పరిభాషలో టీనియా పెడిస్ అంటారు. ఇది పాదంలోని బొటనవేలు... ఇతర వేళ్ల మధ్య రావచ్చు. చేతి వేళ్లకూ సోకవచ్చు. అయితే తరచూ కాలివేళ్ల మధ్యే కనిపిస్తుంటుంది. ఇది ఏమంత తీవ్రమైన జబ్బు కాదు. అయితే తగ్గడానికి మొరాయిస్తుంది. అంత తేలిగ్గా తగ్గక బాధపెడుతూ ఉంటుంది. డయాబెటిస్ లేదా తక్కువ వ్యాధి నిరోధకశక్తి ఉన్నవారిలో ఇది మరింత బాధిస్తుంది. ఇటీవల మన క్రీడాకారిణులు సానియా, సైనా నెహ్వాల్, సింధూల సక్సెస్లతో ఆటల పట్ల ఆసక్తి, గ్రౌండ్కు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆరోగ్యానికి ఆటలు ఎంత సురక్షితంగా ఆడుకోవడమూ అంతే అవసరం. జాగ్రత్తలు– చికిత్స ఇక్కడ పేర్కొన్న దాదాపు అన్ని సమస్యలకు మొదట తగినంత విశ్రాంతి, ఐసు ముక్కలతో అద్దడం, అవసరాన్ని బట్టి ఎలాస్టిక్ బ్యాండేజ్తో తగిన సపోర్టు ఇవ్వడం, ఫిజియోథెరపీ లాంటి వ్యాయాయ ప్రక్రియల్ని అనుసరించడం వంటివాటితో ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడాలి. చాలా అరుదుగానే కొన్ని సమస్యలకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. క్రీడల పేరు కలిగి ఉన్న మానసిక సమస్యలు ఫీమేల్ అథ్లెట్స్ ట్రెయిడ్ : ఇది ఒక ‘ఈటింగ్ డిజార్డర్’. తాము మరింత సన్నగా ఉంటే రన్నింగ్ వంటి క్రీడల్లో ఇంకా బాగా చురుగ్గా రాణించగలమనే అభిప్రాయంతో కొందరు క్రీడాకారులు తాము తీసుకుంటున్న భోజనం, పోషకాలతో కూడిన ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తారు. దాని వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని భావించి లేనిపోని అనర్థాలు తెచ్చుకుంటారు. ఇలా రన్నింగ్ క్రీడాకారుణులు మాత్రమే కాకుండా ఇదే పని కొంతమంది టీన్స్లో ఉన్న యువతులూ చేస్తారు. అయితే సాధారణంగా ఇది క్రీడాకారిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే ఈ పేరు. ఇలా సరిగా తినకపోవడం, అదేపనిగా వ్యాయామాన్ని మాత్రం కొనసాగించడం ఫలితంగా వారు ఒక తిండికి సంబంధించిన ఒక రుగ్మత (ఈటింగ్ డిజార్డర్)ను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిపేరే ఫీమేల్ అథ్లెట్ ట్రెయిడ్. అనొరెక్సియా అథ్లెటికా : దీన్ని ‘హైపర్ జిమ్నాషియా’ అని కూడా అంటారు. ఇది కూడా ఒక రకమైన ఈటింగ్ డిజార్డర్. తమ ఫిగర్ మీద చాలా ఎక్కువగా శ్రద్ధ పెడుతూ, చాలా తక్కువగా తింటూ, చాలా ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల తాము ఫిట్గా ఉంటామన్న భావనతో అతిగా వ్యాయామం చేసే రుగ్మత ఇది. ఈ రుగ్మత ఉన్నవారు తమకు ఆహారం మీద, వ్యాయామం మీద ఉన్నంత నియంత్రణ జీవితంలోని మిగతా అంశాల మీద లేదని భావిస్తుంటారు. అయితే వాస్తవానికి, విచిత్రంగా వారికి తమ వ్యాయామం, ఆహారం మీదే నియంత్రణ ఉండదు. ఒకసారి ఈ భావన మొదలైన తర్వాత వారు అదేపనిగా వ్యాయామం చేస్తూ, (ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే భావనతో) అదేపనిగా తింటూ ఉంటారు. ఇది బయటపడలేని ఒక వ్యసనంగా మారు తుంది. మానసిక వ్యాధిగా పరిణమించే ఇది ఒక పట్టాన తగ్గదు. సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్, అవసరాన్ని బట్టి బిహేవియరల్ థెరపీ వంటి ప్రక్రియలతో ఈ మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. – డాక్టర్ ప్రవీణ్రావు, సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చైనా ఫోన్లు వాడితే.. కళ్లు పోతాయ్..!?
చైనా ఫోన్లు వాడిదే ప్రమాదమా? చైనా మొబైల్ ఫోన్లలో రేడియేషన్ అధికంగా ఉంటుందా? టచ్ స్క్రీన్లు.. కంటిచూపును దెబ్బతీస్తాయా? చౌక ధరకు అధిక ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు వాడితే.. ఆరోగ్యానికి ప్రమాదమా? చైనా ఫోన్లు వాడితే రెటీనా దెబ్బంతింటుందనే వాదనలు.. వార్తలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి.. ఇవి నిజమేనా? ఇటువంటి వివరాలను తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి. చైనా స్మార్ట్ ఫోన్లు దాదాపు దేశాన్ని ముంచేస్తున్నాయి. పదిమందిలో ఆరుగురి చేతుల్లో కనిపించేవి చైనా ఫోన్లే. తక్కువ ధరతో మ్యాగ్జిమమ్ ఫీచర్లతో వినియోగదారులను ఈ ఫోన్లు కట్టిపడేశాయి. ఈ ఫోన్లను అధికంగా వాడితే ఆరోగ్యానికి, కంటికి ప్రమాదమనే సంకేతాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చైనా ఫోన్లవల్ల మన దేశంలో చాలా కాలంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయినా మనవాళ్లు వాటిని వినియోగిస్తూనేఉన్నారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్లో 21 ఏళ్ల అమ్మాయి.. 24 గంటల పాటు మొబైల్ ఫొన్లో గేమ్స్ అడుతూ.. కంటి చూపును కోల్పోయింది. ఈ విషయంలో ఇప్పుడు చైనాలో హాట్టాపిక్గా మారింది. సుదీర్ఘ సమయంపాటు ఆన్లైన్ గేమ్ అయిన ’హానర్ ఆఫ్ కింగ్స్‘ గేమ్ను అమ్మాయి ఆడుతూనే ఉంది. ఆట ఆడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె. కుడి కన్ను పూర్తిగా మసకబారింది. చూపు కోల్పోయిన కంటిని వైద్యులు పరీక్షలు జరిపి ఆశ్చర్యకర విషయాన్ని తెలిపారు. ఇటువంటి వ్యాధిని రెటినల్ ఆర్టెరీ అక్లూషన్ (ఆర్ఏఓ)గా పిలుస్తారని చెప్పారు. ఇటువంటి వ్యాధి సాధారణంగా వయసు మళ్లిన వారికి వస్తుందని.. ఇంత చిన్న వయసులో రావడం అరుదని అన్నారు. ఈ అమ్మాయికి చాలా సమయం స్క్రీన్కేసి చూడడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చైనాలో ’హానర్ ఆఫ్ కింగ్స్‘ గేమ్కు ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. ఇటువంటి గేమ్స్ ఆడే సమయంలో స్క్రీన్ నుంచి తక్కువ రేడియేషన్ వచ్చే ఫోన్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
మృత్యుపాశాలుగా మారుతున్న గేమ్స్
-
సాధనతోనే క్రీడాకారులకు భవిష్యత్
ఆదిలాబాద్కల్చరల్: సాధనతోనే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో క్రీడాపాఠశాల అకాడెమికి ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన క్రీడాకారులు 34మంది హాజరు కాగా వయస్సు కారణంగా 15మందిని అనర్హులుగా గుర్తించి 15మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు సాధనతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. క్రీడాకారులు కష్టపడితే భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. క్రీడా పాఠశాలల్లో చేరితే అన్ని రకాలుగా సౌకర్యాలుంటాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రేపు ఆర్యూ కళాశాల వార్షికోత్సవం
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీ కాలేజీ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. గుండెపోటుతో సోమవారం మరణించిన విద్యార్థి శ్రీనివాస్కు మంగళవారం నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రామ్ప్రసాద్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సునిత, రామ్ప్రసాద్, జయప్రతాప్, డీన్ సంజీవరావు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన
కొత్తూరు (తాడేపల్లి రూరల్) : అంతరించిపోతున్న కోలాట ప్రదర్శనను వెలుగులోకి తేవాలని తాడేపల్లి మహిళలు మూడు నెలల పాటు తర్ఫీదు పొంది ఆదివారం రాత్రి తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్లో ప్రదర్శన ఇచ్చారు. తణుకుకు చెందిన పంపన త్రిమూర్తులు అనే కోలాట గురువు తాడేపల్లికి చెందిన శ్రీ పద్మావతి కోలాట భజన మండలి పేరుతో మహిళలకు కోలాటంలో తర్ఫీదు ఇచ్చారు. మొదటిసారిగా తాడేపల్లి కొత్తూరులో కోలాటం ప్రదర్శించిన ఈ బృందం దేవుడి సన్నిధిలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు మహిళలు తెలిపారు. -
క్రీడామైదానంలోకి సేద్య విజ్ఞానగణం
వ్యవసాయ శాస్త్రవేత్తలు,అధ్యాపకుల పోటీలు ప్రారంభం రాజమహేంద్రవరంలో మూడు రోజుల నిర్వహణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : నిత్యం వ్యవసాయ రంగంపై పరిశోధనలు, విద్యార్థులకు బోధనలతో నిమగ్నమయ్యే వారంతా క్రీడామైదానంలో కాలుపెట్టారు. ఆచార్య ఎ¯ŒSజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ కళాశాల అ«ధ్యాపకులు, శాస్త్రవేత్తల రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు స్థానిక వ్యవసాయ కళాశాల (ఎస్కేవీటీ కళాశాల క్రీడా మైదానం) వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల జరిగే పోటీలను విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ ప్రారంభించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అ«ధ్యాపకులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మంది పైగా హాజరయ్యారు. తొలిరోజు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, రాత, ప్రసంగ పరీక్ష పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం ముగింపు సభలో బహుమతులు అందజేయనున్నారు. -
నంద్యాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
- ఫిభ్రవరి 1 నుంచి 4 వరకు నిర్వహణ నంద్యాల వ్యవసాయం: స్థానిక మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జిల్లా స్థాయి బాలుర క్రీడా పోటీలు ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు నర్వహిస్తున్నట్లు గ్రూప్–1 అధికారి నాగస్వరం నరసింహులు, డిప్యూటీ ఈఓ సుమతిలు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన ఫిక్సర్స్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. జిల్లా స్థాయి పోటీల్లో 1800మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది.. 17 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సెంట్రల్ జోన్ చైర్మన్ ఎస్.అసదుల్లా మాట్లాడుతూ.. ఈ పోటీలు జూనియర్, సీనియర్ విద్యార్థులు హాజరవుతారన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు నాగస్వారం నరసంహులు సహకారంతో మెమొంటోలను అందజేస్తారన్నారు. మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం హెచ్ఎం అసదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
యువోత్సాహం
పోటాపోటీగా యువమహోత్సవ్ క్రీడలు కర్నూలు(హాస్పిటల్): యువమహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం సిల్వర్జూబ్లీ కళాశాలలో ఆటల పోటీలు హోరాహోరీగా జరిగాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువమహోత్సవ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఖో–ఖో, కబడ్డీ, షటిల్ బ్యాట్మింటన్, చెస్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను సెట్కూరు సీఈవో మస్తాన్వలీ ప్రారంభించారు. విజేతలకు ఆదివారం సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, సిల్వర్జూబ్లీ, కేవీఆర్, వాసవి, పీసీరెడ్డి, సెయింట్ జోసఫ్, హజీరా డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు వీరే... –క్యారమ్స్(గర్ల్స్)–1.వాసవి మహిళా కళాశాల, 2. వాసవి మహిళా కళాశాల, 3. సిల్వర్జూబ్లీ కళాశాల –క్యారమ్స్(బాయ్స్)–1. చైతన్య శ్రీనివాస్,సిల్వర్జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 2. సాయి కృష్ణ శంకరాస్ డిగ్రీ కళాశాల, 3. బాబూరావు, సిల్వర్జూబ్లీ కళాశాల –కబడ్డి(ఉమెన్స్)–1. సిల్వర్జూబ్లీ డిగ్రీ కళాశాల, 2. కేవీఆర్ కళాశాల, 3. వాసవి కళాశాల –ఖోఖో(ఉమెన్)–1. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. సిల్వర్జూబ్లీ కళాశాల, 3. ఆర్సీ రెడ్డి కాలేజి –వాలీబాల్ (ఉమెన్)–1. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. సిల్వర్జూబ్లీ కళాశాల –చెస్ (గర్ల్స్)–1. తస్నీమ్, కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. అనూషా, సిల్వర్జూబ్లీ కళాశాల, 3. మనీషా, సిల్వర్జూబ్లీ కళాశాల –చెస్(బాయ్స్)–1. రామ్ప్రదీప్, రాయలసీమ యూనివర్శిటి, 2. భాస్కర్, కర్నూలు, 3. వెంకటనాయుడు, కర్నూలు –టేబుల్ టెన్నిస్(బాయ్స్)–1. సీహెచ్ బాబురావు, సిల్వర్జూబ్లీ కళాశాల, 2. శ్రీకాంత్రెడ్డి, సిల్వర్జూబ్లీ కళాశాల –షటిల్ బాట్మింటన్(బాయ్స్)–1. విజయదుర్గ డిగ్రీ కళాశాల, 2. నారాయణ జూనియర్ కళాశాల, 3. విజయదుర్గ డిగ్రీ కళాశాల –టగ్ ఆఫ్ వార్–1. సిల్వర్జూబ్లీ కళాశాల, 2. కేవీఆర్ డిగ్రీ కళాశాల, 3. వాసవి డిగ్రీ కళాశాల -
అమరావతిలో జాతీయక్రీడల నిర్వహణకు సిద్ధం
రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప అమలాపురం రూరల్ :జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. బుధవారం ఎస్కేబీఆర్ కాలేజీలో జరిగిన నన్నయ్య యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ విభాగాల్లో పోటీల ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అన్ని కళాశాలల యాజమాన్యాలూ క్రీడాపోటీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు మండల స్థాయిలో స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఎస్కేబీఆర్లో వ్యవసాయ, హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎస్కేబీఆర్ కాలేజీ టీం చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. విజేతలు ఫిబ్రవరి 25న చండీగఢ్లో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయవెంకటలక్ష్మి, కళాశాల పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి సుబ్బరాజు, జె.వి.జె.ఆర్.భాను, ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన షటిల్ టోర్నమెంట్ పోటీలు
కవిటం (పోడూరు) : స్థానిక శ్రీ చైతన్య షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్రి వెంకటరెడ్డి ప్లే గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గుంటూరి పెద్దిరాజు అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాలని సూచించారు. తణుకుకు చెందిన ప్రముఖ వైద్యుడు కర్రి శ్రీనివాసుల రెడ్డితో కలిసి విజేతలకు నగదు బహుమతులు అందించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి బ్రదర్స్, పడాల సత్యనారాయణరెడ్డి, చైతన్య షటిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్, అప్పారావు జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్ విజేతగా నిలిచాడు. నాన్ మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో గుడివాడకు చెందిన రాము, ప్రతాప్ జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో వీరవాసరానికి చెందిన శ్రీరామ్ రన్నర్గా నిలిచాడు. బాలికల డబుల్స్ విభాగంలో కవిటంకు చెందిన సాయికుమారి, భావిక జోడి విజేతగా, ఆశా, మౌనిక జోడి రన్నర్గా నిలిచారు. ఉత్తమ ప్రతిభా పాటవ ఆటగాడిగా పాలకొల్లుకు చెందిన ఉదయకిరణ్ బహుమతి అందుకున్నాడు. -
జెడ్పీ చైర్మన్ అంటే లెక్క లేదా?
- స్పోర్ట్స్ మీట్ నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోండి - డీఈఓను కోరిన చైర్మన్ మల్లెల రాజశేఖర్ కర్నూలు(అర్బన్): నందవరం మండల కేంద్రంలో 28 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ఆహ్వాన పత్రికల్లో తన పేరును విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. ఈ నెల 30వ తేదిన ' సాక్షి ' దినపత్రికలో ప్రచురితమైన ' జెడ్పీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో చైర్మన్కు దక్కని గౌరవం ' అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కార్యాలయ పని నిమిత్తం తన వద్దకు వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డికి తనకు అందిన ఆహ్వాన పత్రికను చూపిస్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పీ వైస్ చైర్మన్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకుల పేర్లను ఆహ్వాన పత్రికలో ముద్రించి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై డీఈఓ మాట్లాడుతూ అక్కడ స్కూల్ ప్రధానోపాధ్యాయుడే ఇన్చార్జీ ఎంఈఓగా వ్యవహరిస్తున్నారని, ఎందుకు ఇలా జరిగిందో విచారిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ డీఈఓనుకోరారు. -
14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : నరసాపురంలోని రుస్తుంబాద గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి మహిళల, పురుషుల కబడ్డీ ఇన్విటేషన్ కప్ పోటీలు వచ్చే జనవరి 14 నుంచి 18 వరకూ ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్టు పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. శనివారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీలకు రుస్తుంబాదలోని స్టేడియంను సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 పురుషుల జట్లు 20, 15 మహిళల జట్లు పోటీలకు హాజరవుతాయన్నారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి రూ. లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతిగా రూ.50 వేలు, నాలుగో బహుమతిగా రూ.25 వేలు అందిస్తామన్నారు. గెలుపొందిన మహిళా జట్లకు కూడా ప్రైజ్మనీ ఉంటుందన్నారు. మొత్తం రూ. 5 లక్షలు ప్రైజ్మనీగా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆలిండియా కబడ్డీ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి వి.వీర్లెంకయ్య, జిల్లా కార్యదర్శి కె.రంగారావు మాట్లాడుతూ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలకు పరిశీలకులను మరికొద్ది రోజుల్లో ఆలిండియా కబడ్డీ అసోసియేష¯ŒS నియమిస్తుందని చెప్పారు. సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొత్తపల్లి నాని, కొప్పనీడి శివాజీ, చినిమిల్లి మమ్ము, యాదంరెడ్డి మహేష్ పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
లింగపాలెం : క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర యోగా, క్రీడల సమన్వయకర్త పేరం రవీంద్రనాథ్ తెలిపారు. లింగపాలెం మండలం శింగగూడెంలో గురువారం ప్రారంభమైన చింతలపూడి జోనల్స్థాయి బాలికల క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో 175 వికాస కేంద్రాలకు గాను నేటికి 70 నియోజకవర్గాల్లో వీటిని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రాంతీయ క్రీడా అకాడమీలను రాష్ట్రంలో «మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్రీడా నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. గతంలో క్రీడలకు నిధులటూ ఉండేవికాదన్నారు. నేడు క్రీడల అభివృద్ధికి ప్రతి హైస్కూల్కు ఆర్ఎంఎస్ నిధుల కింద రూ.10 వేలు, సర్వశిక్ష అభియాన్ నిధుల కింద రూ.5 వేలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వ్యాయామంపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా కెనడా సహకారంతో ఏపీలో కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ 820 విద్యార్థులకు ఒక పీఈటీ ఉంటే.. ఇకపై 400 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండేలా త్వరలో నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల మంది పీఈటీలు ఉన్నారని మరో 3 వేల పోస్టులు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక పీడీ పోస్టు ఉండేదన్నారు. రెండు రోజులక్రితం 1,200 మంది పీఈటీలకు పదోన్నతి కల్పించి పీడీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రతి హైస్కూల్లో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి పరిచేందుకు ఉపాధి హామీ పథకంలో రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల వ్యాయమ బాధ్యతలు గతంలో పీఈటీలకు మాత్రమే ఉండేదని, నేడు పాఠశాల హెచ్ఎంలకు కూడా బాధ్యత కల్పించామన్నారు. ప్రతి విద్యార్థికి 6 రకాల క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆధార్ కార్డు నెంబర్తో అన్లైన్ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన క్రీడాకారులకు పరీక్షల్లో 6 శాతం మార్కులు కలుపుతామన్నారు. అంతేకాకుండా ఈ క్రీడాకారులకు స్కాలషిప్ ఇవ్వనున్నట్టు రవీంద్ర వివరించారు. -
అట్టహాసంగా బాలికల క్రీడా పోటీలు ప్రారంభం
14 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 60 మంది క్రీడాకారుణులు హాజరు కర్నూలు(టౌన్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల జిల్లా స్థాయి బాలికల క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బి. తాండ్రపాడులోని పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ఆ కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. తరా్వత జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కâ¶ళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారుణులతో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 14 కళాశాలల నుంచి 60 మంది క్రీడాకారుణులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి ప్రిని్సపాల్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు డాక్టర్ ప్రసాద్, ఫిజికల్ డైరక్టర్ మార్గరెట్ పాల్గొన్నారు. మొదటి రోజు విజేతల వివరాలు: మొదటి రోజు మంగళవారం నిర్వహించిన వాలీబాల్, ఖోఖో పోటీల్లో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విన్నర్, కర్నూలు పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రన్నర్ స్థానాల్లో నిలిచాయి. టెన్నికాయిట్ సింగిల్స్, షటిల్ సింగిల్స్లో కర్నూలు పాలిటెక్నిక్ కళాశాల ఫైనల్కు చేరుకుంది. -
ముగిసిన ఎక్సైజ్ క్రీడా పోటీలు
కర్నూలు (టౌన్): జిల్లా స్థాయి ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగిశాయి. మొదటిరోజు ఔట్డోర్ స్టేడియంలో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. రెండో రోజు సోమవారం ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు కొనసాగాయి. ఇండోర్ స్టేడియంలో వివిధ క్రీడాంశాల్లో ఉద్యోగుల మధ్య టెన్నికాయిట్, బాల్బాడ్మింటన్, షటిల్ బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ముగింపు క్రీడల నుద్దేశించి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులు జనవరి నెల 6, 7, 8 తేదీల్లో గుంటూరు జిల్లా అమరావతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
దేవరపల్లి : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని అంతర జిల్లాల ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం దేవరపల్లిలో ప్రారంభమయ్యాయి. స్థానిక భూపతిరాజు విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి. తొలుత ఈ పోటీలను రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ప్రారంభించారు. విద్యా సంస్థల చైర్మ¯ŒS డి.సువర్ణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మంది అభిమానులు కలిగిన ఆట పుట్బాల్ అని అన్నారు. క్రీడలకు నన్నయ యూనివర్సిటీ ఇస్తున్న ప్రాధాన్యం రెండు తెలుగు రాష్టాల్లో ఏ యూనివర్సిటీ ఇవ్వడంలేదన్నారు. జాతీయస్థాయిలో 600 యూనివర్సిటీల మధ్య నిర్వహించిన బాల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో నన్నయ యూనివర్సిటీకి ద్వితీయస్థానం లభించిందన్నారు. బాడీ బిల్డింగ్లోనూ ద్వితీయస్థానం లభించినట్టు చెప్పారు. 450 కళాశాలలు యూనివర్శిటీ పరిధిలో ఉన్నాయని, 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా మాట్లాడారు. సర్పంచ్ సుంకర యామినీ, జెడ్పీటీసీ కె.సుధారాణి, రాప్ట్ర క్రీడల అధికారి పేరం రవీంద్రనాథ్, ఏఎంసీ ఛైర్మ¯ŒS ముళ్లపూడి వెంకట్రావు, మానవత సంస్థ జిల్లా నాయకుడు పరిమి వెంకటేశ్వరరావు, కళాశాల పీడీ కె.వి.డి.వి.ప్రసాద్, ప్రిన్సిపాల్ వి. ఆనందరావు, హెచ్ఎం పి.వీర్రాజు, యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఒలింపిక్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల విజేతలు వీరే
భీమవరం టౌన్ : ఆదికవి నన్నయ యూనివర్శిటీ అంతర కళాశాలల మహిళల కబడ్డీ పోటీల్లో గోపన్నపాలెం వ్యాయామ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. భీమవరం కేజీఆర్ఎల్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. రెండో స్థానంలో ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల, మూడో స్థానంలో తణుకు ఎస్కెఆస్ఎడీ మహిళా కళాశాల, నాలుగో స్థానంలో పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కేఎస్ రాజు కళాశాల జట్లు నిలిచాయి. ఉభయ గోదావరి జిల్లాలోని 10 కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహుమతులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాడెంట్ మెంటే రామ్మనోహర్, పీజీ కోర్సుల డైరక్టర్ డాక్టర్ మెంటే లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ మెంటే రాణి రత్నకుమారి అందచేశారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, పీడీ టి.నర్సింహమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మెంటే త్రినాథ్, డాక్టర్ కె.గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఖేలో ఇండియా పోటీలు
– జిల్లా క్రీడల అభివృద్ధి ఇన్చార్జ్ అ«ధికారి మల్లి ఖార్జున కర్నూలు (టౌన్): జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో ఖేలో ఇండియా పేరుతో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి ఇన్చార్జ్ మల్లిఖార్జున వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2008 లో పంచాయతీ యువక్రీడ ఖేల్ అభియాన్, తర్వాత రాజీవ్ ఖేల్ అభియాన్ పేర్లతో కేంద్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వహించిందన్నారు. ఇప్పుడు ఖేలో ఇండియా పేరుతో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు 14, 17 ఏళ్ల వయస్సు ఉన్న క్రీడాకారులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పోటీల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టీమ్లుగా ఫుట్బాల్, కబడ్డీ, కోకో, వాలీబాల్, హాకీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజక వర్గ స్థాయిలో ఈనెల 19 నుంచి 23 వరకు, జిల్లా స్థాయిల్లో ఈనెల 28 నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 29 న కబడ్డీ (బాలురు), 30 న కబడ్డీ (బాలికలు), డిసెంబర్ 1 న ఖోఖో (బాలురు), 2 వ తేదీ ఖోఖో (బాలికలు), 3 వ తేదీ ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, 5 వ తేదీ ఆర్చరీ, హాకీ, బాక్సింగ్, రాష్ట్రస్థాయి పోటీలు 12 నుంచి14 వ తేదీ వరకు విజయవాడలోని మైలారం మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి క్రీడాపోటీలు నేటితో ముగియనున్నాయి. కాగా క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మండల స్థాయికి రూ. 30 వేలు, నియోజకవర్గ స్థాయికి రూ. 40 వేలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. -
ఖేల్ ఇండియా షెడ్యూల్ విడుదల
ఏలూరు రూరల్ : క్రీడాకారుల్లో నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఖేల్ ఇండియా ఆటల పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నోడల్ అధికారి ఎంహెచ్ షరీఫ్ అన్నారు. మంగళవారం ఏలూరు బిశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్ పూల్ ఆవరణలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఖేల్ ఇండియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ క్రీడాకారులే కాకుండా ఆటలు తిలకించే పిల్లలు సైతం స్ఫూర్తి పొంది ఆటలు సాధన చేసేలా పోటీలు నిర్వహించాలన్నారు. 14, 17 ఏళ్ల విభాగంలో నిర్వహించే ఈ పోటీలను విజయవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు పీఈటీలు ఏజేసీకి వివరించారు. డీఈవో ద్వారా ఆదేశాలు జారీ చేసేలా చర్యల తీసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలకు మంజూరైన నిధులు ఎంపీడీవోలు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం విజేతలకు ప్రకటించిన నగదు బహుమతులు నేటికీ అందలేదని పలువురు వాపోయారు. దీనిపై స్పందించిన షరీఫ్ అక్రమాలకు పాల్పడే వారిపై కలెక్టర్ సీరియస్గా వ్యవహరిస్తారని హెచ్చరించారు. డీఎస్డీవో ఎస్ఏ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో మండలస్థాయి చేపట్టాలన్నారు. ఇందులో 3 క్రీడాంశాలు, 2 వ్యక్తిగత అంశాలు ఉండాలన్నారు. దీనికి ముందు ప్రతి గ్రామంలో పోటీలు నిర్వహించి ఒక్కొక్క గ్రామం నుంచి 15 బాలురు, 15 మంది బాలికలను మండల స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం ఒక్కొక్క మండలానికి రూ.30 వేల మంజూరు చేశామన్నారు. మండలంలో ప్రతిభ చాటిన 120 బాలురు, 120 మంది బాలికలను నియోజకవర్గ స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. అలాగే 25, 26న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలన్నారు. 10 క్రీడాంశాల్లో(ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, తైక్వాండ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్)జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. 31–12–2016 నాటికి 14, 17 ఏళ్లు నిండని వారే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ సమావేశంలో సాయ్ సెంటర్ ఇన్ చార్జి కె.కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం
కర్నూలు (టౌన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభ వంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఔట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, వయోజన విద్య డిప్యూటీ డైరక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరక్టర్ భాస్కర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాట్లాడుతూ ఈ ఆటల పోటీలలో మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వారు శారీరక విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకి ల్ పోటీలను జెండాఊపి ప్రారంభించారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లాజట్ల ఎంపిక
రాజోలు : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ (కత్తిసాము) పోటీలకు అండర్–19 క్రీడాకారుల ఎంపిక సోమవారం ముగిసింది. రాజోలులోని యూత్క్లబ్ ఆవరణలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీలను సీనియర్ న్యాయవా ది కె.పి.ఆర్.నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముదునూరి అక్కిరాజు, సభ్యులు పుట్టా రామకృష్ణ, సిహెచ్.జి.వి.ఎస్.ప్రసాద్ల ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు మంగళ, బుధవారాల్లో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థా యి పోటీల్లో పాల్గొంటారు. బాలికల విభాగంలో అడబాల రాఘవి, కొ క్కిరగడ్డ చాందిని శ్రీ పూర్ణిమ, సయ్యద్ నజ్రీన్, కోన రేనా ఏవాంజిల్, యడ్ల సోనీలయ, తాడి మనోజ్ఞ, కొడవటి రుక్మిణి సాయి దుర్గ, కొక్కిరగడ్డ శరణ్య ఎంపిక కాగా, బాలుర విభాగంలో కోట హేమంత్, మంద అవినాష్, కె.స్వామియోగేంద్ర, మామిడిశెట్టి బాల వెంకట లక్ష్మినరసింహసాయి, వి.మసే¯ŒSరాజు, కొడవటి రాజగోపాల్నాయుడు, గురుజుల గణేష్, కోన సామ్యూల్రాజు, చెల్లింగి రవీంద్ర ఎంపికయ్యారు. పీఈటీలు కె.నాగరాజు, బళ్ల శ్రీను, ఎం.శ్రీధర్, పి.రామకృష్ణ పర్యవేక్షించారు. -
ముచ్చటగా మూడోస్థానం
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగి శాయి. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని ప్రకాశం, ద్వితీయస్థానాన్ని విశాఖపట్నం జట్లు సాధించాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా జట్లు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానం కృష్ణా జిల్లా, తృతీయ స్థానాలను పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం టీములు గెలుచుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. జాతీయస్థాయికి ఎంపికైన బాలుర జట్టు ఇదే.. ప్రకాశం జిల్లాకు చెందిన కె.అనిల్, పి.విశ్వనాథన్, పి.బాల సామిరెడ్డి, విశాఖపట్నం నుంచి పి.నరేష్, టి.తలుపులు, ఎల్.సురేష్ (విజయనగరం), రమేష్ (పశ్చిమ గోదావరి), మునిశేఖర్(చిత్తూరు), అబ్బాస్ అలీ(కృష్ణా జిల్లా), కె.చరణ్(కడప), హేమ సుందర్(గుంటూరు), రామాంజనేయులు(అనంతపురం). బాలికల జట్టు విజయనగరం నుంచి బి.శిరీషా, బి.శాంతమ్మ, కృష్ణా నుంచి కె.కుమారి, పి.నవ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జి.రాజీ, వి.ప్రభావతి, పి.చక్ర అనూష(తూర్పుగోదావరి), జి.పార్వతి(కడప), పి.వినీత(అనంతపురం), పి.అనూష(విశాఖపట్నం), కె.సుజాత(గుంటూరు), సీహెచ్ ప్రియాంక(నెల్లూరు). -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
కల్లూరు: స్తానిక డీఎస్ఏ స్విమ్మింగ్పూల్లో 62వ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను శనివారం.. ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భఃగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల నుంచి నగరంలో నిర్వహిస్తున్న పోటీల్లో వెయ్యి మంది బాలబాలికలు వివిధ క్రీడాంశాలలో పాల్గొనడం హర్షణీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడాలన్నారు. క్రీడాకారుల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తామన్నారు. అంతకుముందు అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో విజేతలైన చిన్నబాబు (వెస్ట్గోదావరి), మోహిద్దీన్ (కృష్ణా), రాజేషకుమార్ (నెల్లూరు), జ్యోతి (వైజాగ్), రమ్య (శ్రీకాకుళం), రజియా (కర్నూలు)లకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు భాస్కర్రెడ్డి, షాజహాన్, నిర్వహక కార్యదర్శి ఎల్. చలపతి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, రామాంజనేయులు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా‘కుసుమ’ం
–ప్రోత్సాహం ఉంటే ఒలింపిక్స్కు వీరవాసరం : గ్రామీణ ప్రాంతం నుంచి అథ్లెటిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైంది రావాడ కుసుమ. వీరవాసరం గ్రామానికి చెందిన కుసుమ పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పాల్గొన్న ప్రతీ పోటీలోను పతకాలను చేతబడుతుంది. 2009 ఆగస్ట్ 16న అథ్లెటిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఇంటిర్మిడియట్ మొదటి సంవత్సరం చదువుతూ క్రీడల్లోనూ రాణిస్తుంది. లాంగ్జంప్, హార్డిల్స్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ మేటి క్రీడాకారిణిగా గుర్తింపుతెచ్చుకుంటుంది. తల్లి ప్రోత్సాహంతో ఎలక్ట్రిషియన్గా పనిచేసే కుసుమ తండ్రి రావాడ అప్పారావు ఐదేళ్ల్ల క్రితం అనారోగ్యంతో మతి చెందాడు. కుసుమ అప్పుడు 7వ తరగతి చదువుతోంది. తల్లి దుర్గా ఆదిలక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తె, కుమారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచుతోంది. సాధించిన పతకాలు క్రీడాకారిణిగా రావాడ కుసుమ ఎన్నో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి 100కు పైగా పతకాలను సొంతం చేసుకుంది. 2013లో శ్రీకాకుళంలో జరిగిన 59వ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను, 2015లో కాకినాడలో జరిగిన 27వ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను, 2016లో కోజికోడ్ (కేరళ)లో జరిగిన 61వ జాతీయ స్కూల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో రజత పతకం సాధించింది. ఇవే కాకుండా వికారాబాద్, రంగారెడ్డి, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఇంటర్ డ్రిస్టిక్ట్స్ స్కూల్ గేమ్స్ పోటీల్లో లాంగ్జంప్, 100 మీటర్ల హార్డీల్స్లో ఎన్నో పతకాలు, ప్రశంసా పత్రాలను అందుకుంది. –ఒలింపిక్స్లో పతకం నా లక్ష్యం ఒలింపిక్స్లో పతకం సాధించడమే నా లక్ష్యం. అథ్లెటిక్స్ కోచ్ ఆదిత్యవర్మ పర్యవేక్షణలో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. నా తల్లి దుర్గాఆదిలక్ష్మి నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ప్రోత్సాహం ఉంటే ఇంకా రాణించి దేశానికి ఒలింపిక్స్లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. –ప్రోత్సాహం ఉంటే మరింత రాణిస్తుంది నా కుమార్తె కుసుమకు ప్రోత్సాహం ఉంటే క్రీడల్లో మరింత రాణిస్తుంది. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగించే నాబోటి వాళ్లు మెరుగైన శిక్షణ ఇప్పించడం ఆర్థికంగా కష్టతరం. ప్రస్తుతం స్పోర్ట్స్ స్కూల్లో చదువుతుంది. ఇంటిర్మీడియట్ అనంతరం డిగ్రీ చదువును బయటే చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నాపై పెనుభారం పడుతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. -
దివ్యాంగులకు ఆటల పోటీలు
గుంటూరు స్పోర్ట్స్ : రోటోఫెస్ట్ అధ్వర్యంలో గురువారం స్వర్ణభారతి నగర్లోని దాక్షిణ్య సంస్థలోని శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులకు పరుగుపందెం, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్, షాట్పుట్, లెమన్ ఇన్ స్పూన్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలను దాక్షిణ్య సంస్థల డైరెక్టర్ టి.వి.రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిమ్నాస్టిక్ పోటీలను రోటరీ డైరెక్టర్ నంబూరు సుబ్బారావు ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టి.వి.రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు వెలకట్టలేనివని చెప్పారు. విజేతలకు ఈ నెల 25న బహుమతి ప్రదానం చేస్తామని రొటేరియన్ అంకమ్మరావు తెలిపారు. -
రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు ప్రారంభం
బనగానపల్లె రూరల్: స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం క్రీడామైదానంలో మూడో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, జూనియర్ బాలుర సైకిల్ పోలో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్ పోలో సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నారు. స్పోర్ట్స్ కోటాను సక్రమంగా అమలు చేసి క్రీడాకారులను ప్రోత్సాహించాలని సూచించారు. నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో పోటీలు తమ పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకునే అవకాశం లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధర్శించిన సాంస్కృతిక కార్యక్రమలు అలరించాయి. మొదటి రోజు పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు 2–0 గోల్స్తో కర్నూలు జట్టు పై విజయం సాధించి. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. సైకిల్ పోలో జిల్లా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎ.వి.రామ సుబ్రమణ్యం, కమిటీ కార్యదర్శి రామాంజనేయులు, స్కూల్ డైరెక్టర్ రవితేజారెడ్డి, హెచ్ఎం కమల్తేజారెడ్డి, ఎంఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
అండర్–19 జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 స్విమ్మింగ్,బాల్బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక సోమవారం నిర్వహించినట్లు స్కూ ల్గేమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, లక్ష్మినారాయణ తెలిపారు. కొత్తూరు బాలుర పాఠశాలలో బాల్బ్యాడ్మింటన్ , రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలకు జిల్లాలోని జూనియర్ కళాశాలల బాల, బాలికలు హాజరయ్యారన్నారు. బాల్బ్యాడ్మింటన్ జటు ్టతూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొం టుందన్నారు. -
రాష్ట్ర స్థాయి విద్యాసదస్సు, కబడ్డీ పోటీల బ్రోచర్ల ఆవిష్కరణ
పెద్దాపురం : ఈనెల 15న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి విద్యాసదస్సు, వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోటలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల బ్రోచర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు. సామర్లకోట ఎన్బీఎస్ఆర్ క్లబ్, జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 13 జిల్లాల నుండి వచ్చే క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. తెలుగు ఉపా«ధ్యాయ సంఘం ఆ««దl్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ–ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.జయరామ్ మంత్రి రాజప్పకు వివరించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.మురళి, ఉపాధ్యాయ సంఘం జిల్లా కన్వీనర్ ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాటలతో చదివించాలి
విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు ఉపాధ్యాయులకు టీఆర్ఎస్ నేత దేవేందర్రెడ్డి సూచన రామాయంపేట: విద్యార్థులకు అర్థమయ్యేలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కోనాపూర్ సింగిల్ విండో చైర్మన్ దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాఠశాలను విద్యాపరంగా మెరుగుపర్చడానికి తాను స్వయంగా ముగ్గురు వలంటీర్లను ఏర్పాటు చేసి వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆటపాటల మధ్య చదువు చెప్పాలని సూచించారు. ఎంఈఓ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో వికలాంగ విద్యార్థులకు చదువు చెప్పించడానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించినట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సుననీల్ మాట్లాడుతూ.. తమకు విద్యార్థుల తల్లిదండ్రులనుంచి పూర్తిస్థాయిలో సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకునేలా వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఉపాధ్యాయులు గంగ, బాలకిషన్, విద్యార్థుల తల్లిదండ్రులు సత్తవ్వ, నర్సింలు తదితరులు మాట్లాడారు. అనంతరం దేవేందర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు సుధాకర్రెడ్డి, మన్నె జలంధర్, అంజాగౌడ్, దుబ్బ రాజం తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఫోన్... ఆటవస్తువు కూడా!
స్మార్ట్ఫోన్లు వచ్చాక, వాటిలో ఒక్కో సౌకర్యం ఒక్కొక్కరికి నచ్చుతోంది. కానీ, స్మార్ట్ఫోన్లలో ఉండే ఆటలాడుకొనే వసతి మాత్రం చాలామందికి నచ్చే విషయం. కాస్తంత ఖాళీగా ఉండి, విసుగు అనిపిస్తే చాలు - ఫోన్ తీసుకొని, ఆటలు ఆడుకొనేవారు చాలామంది. పిల్లలకు వినోదం కోసం ఈ మధ్య స్మార్ట్ఫోన్లు ఇచ్చి గేమ్స్ తెరిచి ఇవ్వడం పెద్దలకు అలవాటుగా మారింది. మరి, ఇంతకీ స్మార్ట్ఫోన్లలో గేమ్స్ ఎక్కువగా ఆడేది ఎవరనుకుంటున్నారు? సాధారణంగా ఎవరమైనా సరే ‘ఏముంది! పిల్లలే!’ అని జవాబిస్తాం. కానీ, అసలు నిజం వేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లను గేమ్స్ కోసం ఎక్కువగా వినియోగిస్తున్నది - ఆడవాళ్ళట! ఈ సంగతి తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచం నలుమూలల్లోని 12 దేశాల్లో ఫేస్బుక్ వాళ్ళు సర్వే చేసి మరీ, ఈ సంగతి బయటపెట్టారు. ఇలా ఫోన్లను గేమ్స్కి వాడుతున్నవాళ్ళలో 47 శాతం మంది స్త్రీలే అట! ఫేస్బుక్కు చెందిన డేటా ఎనాలసిస్ టీమ్ ‘ఫేస్బుక్ ఐ.క్యు’ వాళ్ళు ఒక మార్కెట్ టీమ్ ద్వారా ఈ సర్వే చేయించారు. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం, ఆసియాలలో పద్ధెనిమిదేళ్ళ పైబడిన వాళ్ళలో ఈ సర్వే చేశారు. గమ్మత్తేమిటంటే, స్మార్ట్ఫోన్లు వాడేవారిలో 71 శాతం మంది దాన్ని గేమింగ్ డివైజ్గా వాడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. -
క్రీడా పోరుకు సై
జాతీయ క్రీడోత్సవ పోటీలకు రంగం సిద్ధం నేటి నుంచి మూడు రోజులపాటు క్రీడా పోటీలు వేదిక... కోడిరామ్మూర్తి స్టేడియం అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకున్న శాప్ శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడోత్సవ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 29న హాకీ మాంత్రికుడు, మేజర్ థ్యాన్చంద్ జయంతిని పురష్కరించుకుని శనివారం నుంచి మూడు రోజుల పాటు కోడిరామ్మూర్తి స్టేడియంలో జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఒలింపిక్, పీఈటీ సంఘ సహకారంతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పోటీలు సాగుతాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అథ్లెటిక్స్ పోటీలతో క్రీడలు ప్రారంభంకానున్నాయి. పోటీల్లో పాఠశాలస్థాయి బాలబాలికలకు, ఓపెన్లో విభాగంలో అన్ని వయస్కులవారికి పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అథ్లెటిక్స్లో 100, 800 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, షాట్ఫుట్, 400 మీటర్ల రిలే పరుగు పందాల్లో పోటీలు నిర్వహిస్తారు. 28న హాకీ పోటీలు నిర్వహిస్తారు. జూనియర్ విభాగంలో బాల బాలికలకు మాత్రమే నిర్వహించనున్నారు. 29న శ్రీకాకుళంలో జాతీయ క్రీడా రన్ను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ రన్ను శ్రీకాకుళం పాతబస్టాండ్ వద్ద గల పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగుతుందని క్రీడాధికారులు తెలిపారు. క్రీడోత్సవ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు 29న సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిధులు అరకొరే.. క్రీడాపోటీల నిర్వహణ, సామియానా, బహుమతులు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు సత్కారాలు, వగైరా ఖర్చులకు భారీగానే నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్)మాత్రం కేవలం రూ.20 వేలు నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులతో ఘనంగా పోటీలు నిర్వహించి, క్రీడాకారులను సత్కరించిన వీడియోలు, ఫొటోలు కూడా పంపించాలని శాప్ సూచించడంపై క్రీడాధికారులు మండిపడుతున్నారు. అనవసర ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసే సర్కారు క్రీడాపోటీలకు మాత్రం కనీస నిధులు కేటాయించకపోవడాన్ని క్రీడా విశ్లేషకులు తప్పుబడుతున్నారు. -
న్యాయవాదులకు ఇండోర్గేమ్స్
కోరుట్ల : పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గణతంత్య్ర దినోత్సవం కోసం న్యాయవాదులకు ఇండోర్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. న్యాయవాదులు క్యారం బోర్డు పోటీల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు బోయిని సత్యనారాయణ, బైరి విజయ్, కట్కం రాజేశ్, బద్ది నర్సయ్య, చెన్న విశ్వనాథం, బీమనాతి రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు
కమలాపూర్: కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న మండల స్థాయి ఆటల పోటీలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో విద్యార్థులు క్రీడా నైఫుణ్యాన్ని చాటుకున్నారు. పోటీలకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శిరుమల్ల వెంకటనారాయణ, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఈటల సమ్మన్న, ఏబీసీ కార్పొరేషన్ వెటరన్ కెమెరామెన్ జగన్నాథ్శర్మ, న్యూఢిల్లీ ఇగ్నో రిటైర్డ్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజశేఖరన్ పిళ్లై, డాక్టర్ దాసి సాంబయ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను వీక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు రాంరెడ్డి, పవన్, పీఈటీలు రాజేందర్, రవీందర్, వనజ, పుష్పలత, గీత, రవీందర్, నాగరాజు, వెంకటేశ్, విశ్రాంత పీఈటీ వెంకటేశం పాల్గొన్నారు. -
ఆటపాటలతో కూడిన విద్యతో విజ్ఞానం
శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చక్రవర్తి తాళ్లరేవు : చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యను అందించడంవల్ల మంచి విజ్ఞానం సమకూరుతుందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కె.చక్రవర్తి అన్నారు. గాడిమొగలో రూ.10 లక్షలతో ఆధునికీకరించిన ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ, గ్రామీణ చిన్నారులకు ఆదర్శ అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన అందించడం అభినందనీయమన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి రూతూలియానో మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం మంచి పరిణామమని అన్నారు. గాడిమొగ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహిళా శిశు సంజీవని మిషన్ కన్వీనర్, కలెక్టర్ సతీమణి శ్రీదేవి ఆదర్శ అంగన్వాడీ కేంద్రాల్లోని పలు విభాగాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎంపీపీ టి.అనంతలక్ష్మి, జెడ్పీటీసీ పి.రామలక్ష్మి, సర్పంచ్ కె.సూర్యాకాంతం, ఎంపీడీఓ చినబాబు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లాస్థాయి 33వ సబ్జూనియ ర్స్ బాలికల ఎంపిక పోటీలను నిర్వహించా రు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారిణిలు హాజరైనట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన పి.అర్చన, డి.స్వప్న, పి.నవ్య, ఎం.వెన్నెల లు (జెడ్పీఎస్ఎస్ నందిగామ), ఇ.మేఘన. జి.శిరీ ష (జెడ్పీఎస్ఎస్ తిమ్మంపేట), శిరీష (జెడ్పీఎస్ఎస్ ధర్మసాగర్), బి.సాయిసృజన(ఓరుగల్లు హైస్కూల్), ఎంపికయ్యారు. అలాగే ఎ.అమూల్య(జెడ్పీఎస్ఎస్ లక్నెపల్లి), ఎం.వర్ష (గ్రీన్వుడ్ హైస్కూల్), స్పందన(జెడ్పీఎస్ఎస్ పైడిపెల్లి), టి.అనూష(జెడ్పీఎస్ఎస్ ఆకునూరు) ఎం.సాత్విక ఏంజిల్(ఆక్స్ఫర్డ్ హై స్కూల్), బిసుప్రియ( జెడ్పీఎస్ఎస్ ఆకూనూరు), ఎ ఐశ్వర్య(ఎస్ఆర్ డిజీ స్కూల్), డి రవళి(ఓరుగల్లుహైస్కూల్)లు ఎంపికైనట్లు తె లిపారు. వీరు ఈ నెల 6,7,8 తేదీల్లో జేఎన్ఎస్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పో టీల్లో పాల్గొంటారని పవన్కుమార్ తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి హ్యాండ్బాల్ ఎంపికలు
కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ స్టేడియంలో సబ్జూనియర్ బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ముగిశాయి. ఈ ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా గుల్లకోట, రామడుగు, గోపాల్రావుపేట, చింతకుంట, రామడుగు, బెజ్జంకి, ధర్మపురి, గర్రెపల్లి నుంచి దాదాపు 80 మంది క్రీడాకారిణిలు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఆగష్టు 6 నుంచి 8 వరకు హన్మకొండలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. పీఈటీలు జిట్టబోయిన శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జట్టు ఇదే.. జి.రోషిణి, ఎండీ సనా, మౌనిక, బి.స్వర్ణలత, ఎ.రాజేశ్వరీ, చేతన, వి.నాగ, అనూష, రవళి, కల్పన, బి.లావణ్య, నాగజ్యోతి, స్టాండ్బైగా కె.రవళి, అంజలి సంఘమిత్ర, అఖిల, రమాదేవి. -
ఆడుతు..పాడుతు
ఆకట్టుకుంటున్న ప్లేస్కూల్స్ ఆసక్తిచూపుతున్న తల్లిదండ్రులు బుడిబుడి నడకలతో పాఠశాలకు సప్తగిరికాలనీ : పోటీ ప్రపంచంతో మరింత పోటీ పడేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. తమ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని మూడేళ్ల ప్రాయంలోపే ప్లేస్కూల్స్ బాట పట్టిస్తున్నారు. తల్లిదండ్రుల అభీష్టాలను గమనించిన స్కూల్స్ వివిధ రకాల ఆటవస్తువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న చిన్నారులకు నిద్రవస్తే జోల పాట సైతం పాడుతున్నారు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భారీగా పెరిగాయి. ఒక్క కరీంనగర్లోనే సుమారు 50కి పైగా ప్లేస్కూల్స్ ఉండగా, జిల్లా వ్యాప్తంగా 200కు పైగానే ఉండడం విశేషం. పాఠశాలలో పేరు నమోదు చేసేందుకు గతంలో కనీసం ఐదేళ్లు నిండేలా చూసేవారు. ప్రస్తుతం ప్లే, క్రస్, ప్రీప్రైమరీ పాఠశాలల రాకతో నర్సరీ, ఎల్కేజీ, యుకేజీలో ఆ ఐదేళ్ల పరిమితి కాస్త రెండున్నర, మూడేళ్లకు తగ్గింది. మూడేళ్లు కూడా నిండకముందే చిన్నారులను ప్లేస్కూల్స్లో చేర్పిస్తున్నారు. విద్యార్థులకు మొదటగా పాఠశాల వాతావరణాన్ని అలావాటు చేస్తారు. రోజు స్కూల్కు మారాం చేయకుండా వచ్చేలా తయారు చేస్తారు. ఇంటి కంటే పాఠశాలే నయం అనేలా విద్యార్థులు మారేలా చేస్తారు. ఆటపాటలలో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు. టాయ్ స్కూటర్, టాయ్బోట్, జారుడు బండ, బాల్గేమ్స్, ఆపిల్ ట్రీ, ఆల్ఫాబెట్, మినీ స్విమ్మింగ్ఫూల్, సాండ్జోన్, బెడ్స్ వంటివి పిల్లలను ఆడుకునేందుకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎల్సీడీ, ప్రొజెక్టర్ల ద్వారా కార్టూన్ల ద్వారా వినోదం అందిస్తారు. ఫీజులు సైతం అంతే మొత్తంలో ప్లే స్కూల్స్ అంటే చిన్న పిల్లలవే కదా అంటే పొరపాటు. హైయ్యర్ క్లాస్లకు ఉన్నంత ఫీజులు వసూలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలు తేవాల్సి ఉండడంతో ఫీజు సైతం అదే రేంజ్లో ఉంటుంది. ఒక్కో ఆట పరికరాన్ని తీసుకొంటే లక్షల్లో ఉంటున్నాయి. పాఠశాలలో సౌకర్యాలను బట్టి నెలకు రూ.1200 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఏడాదికి సుమారు రూ.15 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. చిన్న వయస్సులోనే పంపించాలి – సీహెచ్.స్వాతి ప్రస్తుత కాలంలో విద్యకు చాలా ప్రాధాన్యత పెరిగింది. పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. వీటన్నింటిని తట్టుకోవాలంటే చిన్న వయస్సులోనే బడికి పంపించాలి. ఆట వస్తువులు ఉంటుండడంతో త్వరగా రెడీ అవుతున్నారు. పాఠాలు కూడా ప్లే మెథడ్లో చెప్పేలా ఉండాలి. రోజు వెళ్తున్న – సన్విత నేను డెయిలీ స్కూల్కు వెళ్తున్న. అక్కడ చాలా సేపు ఆడుకోవచ్చు. ఇంకా టీచర్లు పాఠాలు ఆటలాడుకుంటూ చెబుతున్నారు. ఆటవస్తువులు చాలా ఉన్నాయి. స్లైడింగ్ బార్, హార్స్, వీల్, ఎన్నో ఉన్నాయి. మేం అందరం రోజుకు రెండు పీరియడ్లు ఆడుకుంటున్నం. పిల్లల అభిరుచికి అనుగుణంగా నేటి కాలంలో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. పిల్లలను ఎంత త్వరగా బడిలో చేర్పిస్తే బాగుండు అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు.మరి పడి వయస్సులో స్కూల్కు రావాలంటే కష్టమే. అందుకే వారి కోసం పాఠశాలలో అధునాతన ఆట పరికరాలు ఏర్పాటు చేస్తున్నాం. రోజుకు ఒక గంట సేపు అందులో ఆడుకుంటే వారికి స్కూల్కు రావాలనే తపన కలుగుతుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, సాధనస్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ -
ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం అండ
రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జ్యోతినగర్ :తెలంగాణ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు అండగా ఉంటుందని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవాసమితి ఆవరణలోని సామాజిక భవనంలో ఆశ సమ్మేళనం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ హాజరై మాట్లాడారు. ప్రతీ పనికి ఆశ కార్యకర్తల సేవలు అవసరమన్నారు. మదర్ థెరిసాలా సేవలు చేస్తున్న ఆశ∙కార్యకర్తలను ప్రభుత్వం విస్మరించదని పేర్కొన్నారు. అనంతరం ఆశ కార్యకర్తలకు రోల్ప్లే, ఉపన్యాసం, గ్రూప్ డిస్కర్షన్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, నడిపెల్లి అభిశేక్రావు, క్లస్టర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, డాక్టర్లు రాణి, తిరుపతి, సిస్టర్ భారతి, ఆశ∙కార్యకర్తలు పాల్గొన్నారు. విజేతలు వీరే.. హెల్త్ టాక్ పోటీలో అర్బన్లో ప్రథమ స్థానంలో యం.రాజేశ్వరి(విఠల్నగర్), ద్వితీయ స్థానంలో టి.రాజేశ్వరి(పరశురాంనగర్), తృతీయ స్థానంలో శ్రీమతి(భరత్నగర్), రూరల్లో ప్రథమ స్థానంలో ఆర్.మణెమ్మ(తక్కళ్లపల్లె), ద్వితీయ స్థానంలో మంజుల (లింగాపూర్), తృతీయ స్థానంలో వి.లక్ష్మి(పొట్యాల), రోల్ప్లే పోటీలో అర్బన్ ప్రథమ స్థానంలో కె.లక్ష్మి టీం, ద్వితీయ స్థానంలో నాగేశ్వరి బృందం, తృతీయ బహుమతి పుష్పలత గ్రూప్ గెలుచుకున్నాయి. రూరల్లో ప్రథమ స్థానంలో మంజుల, ద్వితీయ స్థానంలో ఆర్.మణెమ్మ, తృతీయ స్థానంలో వాణిశ్రీ జట్లు విజయం సాధించాయని నిర్వాహకులు వివరించారు. -
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
భీమారం(మేడిపెల్లి) : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎస్సై రవి, మన్నెగూడెం ట్రాన్స్కో ఏఈ రాజశేఖర్ అన్నారు. భీమారంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండలస్థాయి కబడ్డీ పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో 20జట్లు హాజరయ్యాయి. దేహదారుఢ్యానికి ్రMీ డలు తప్పనిసరన్నారు. ఆదరణ కోల్పోతున్న కబడ్డీని యవకులు మరిచిపోకుండా మండలస్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పీఈటీలు మోహన్, కిశోర్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమారం యువకులు చెక్కపెల్లి సంజీవ్, స్వామిరెడ్డి, రంజిత్, అవినాష్, శేఖర్, శ్రీధర్, నాయకులు ప్రశాంత్, ఉత్కం శంకర్, పల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల జీవితాలతో సర్కారు చెలగాటం
జీఓ నంబర్ 271ని రద్దు చేయాలి రెతుల రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ భూ యాజమాన్య హక్కులకు చేటని ఆందోళన అమలాపురం రూరల్ : ‘భూమి మీద యాజమాన్య హక్కులను కాలరాసే జీఓ: 271ని నిలుపుదల చేయాలి. పట్టాదారు పాస్పుస్తకాలు, టైటిల్ డీడ్ల విధానం కొనసాగించి, 1బి రికార్డుల్లో తప్పులు సవరించాకే అమలు చేయాలి’ అని అఖిలపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈదరపల్లి జనహిత కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జీఓ :271పై జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో అధికార టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలతోపాటు బీకేఎస్, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, అఖిలభారత రైతు కూలీ సంఘం, పలు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలను, టైటిల్ డీడ్ విధానాన్ని రద్దు చేసి, కొత్తగా ఇచ్చిన జీఓ :271 ప్రకారం వెబ్ల్యాండ్లో ఉంచిన 1బి ఆధారంగా మాత్రమే భూమిహక్కుల బదలాయింపు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ముక్తకంఠంతో చెప్పారు. వెబ్ల్యాండ్ రికార్డుల్లో రైతుల పేర్లు, సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని, దీని వల్ల బ్యాంకు రుణాలతోపాటు తనఖాల్లో ఇబ్బందుల పాలవుతారని అన్నారు. కొత్త భూ వివాదాలకు ఆస్కారం.. నీటి వినియోగదారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్రెడ్డి మాట్లాడుతూ వెబ్ల్యాండ్ ఆధారంగా రిజిస్ట్రేషను చేస్తే భూమి యజమానికి తెలియకుండా అమ్మకాలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్ల్యాండ్లో ఉన్న తప్పులను ఆధారాలతో సహా చూపించారు. బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెల్లాపు సూర్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ఈ జీఓల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం జరుగుతుందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా పోరాడాలి.. వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పార్టీలకు అతీతంగా ఈ సమస్యలపై పోరాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వి.నాయుడు మాట్లాడుతూ శాంతి యుతంగా సమావేశాలు పెట్టుకుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. పీసీసీ సభ్యుడు కల్వకొలను తాతాజీ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసమే రోజుకో జీఓ తెచ్చిందన్నారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి భూ రికార్డులు సర్వే చేశాకే 1బి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల వెంకటానందం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, మాజీ అధ్యక్షుడు రంబాల బోసు, రైతు సంఘం ప్రతిని ధులు అడ్డాల గోపాలకృష్ణ, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, వివిధ పార్టీలకు చెందిన పెయ్యిల శ్యామ్ప్రసాద్, చెల్లుబోయిన కేశవశెట్టి, చిక్కం బాలయ్య, పత్తి దత్తుడు పాల్గొన్నారు. -
విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేత
చెన్నూర్ : పట్టణంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలకు సీఐ సతీశ్కుమార్ వాలీబాల్ కిట్టును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థినిలు విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినిలకు ఎలాంటి క్రీడా సామగ్రి అవసరం ఉన్నా తమ వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎసై ్స చందర్, ఎంపీడీవో మల్లేశం, ఎంఈవో రాధాకృష్ణమూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, పీఈటీ అనిత పాల్గొన్నారు. -
ఆటల పోటీల పేరుతో ఘరానా మోసం
యాదగిరిగుట్ట: ఆటల పోటీలు నిర్వహించి, పతకాలు, ప్రోత్సాహకాలు అందజేస్తామంటూ మోసానికి పాల్పడిన ఘటన ఇది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో శనివారం వెలుగుచూసింది. నల్లగొండ జిల్లాకు చెందిన సుదర్శన్గౌడ్, వరంగల్కు చెందిన రాము ‘స్టూడెంట్ ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. తమ సంస్థ క్రీడాకారులకు పోటీలు నిర్వహించి నైపుణ్యాన్ని వెలికి తీస్తుందని చెప్పుకున్నారు. ఈ మేరకు నాలుగు జిల్లాలకు చెందిన 600 మంది నుంచి రూ.800, రూ.1,200 చొప్పున వసూలు చేశారు. జూలై 9వ తేదీన యాదగిరిగుట్టలో పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారందరికీ సమాచారం అందించారు. ఈ మేరకు ఆటగాళ్లంతా శనివారం గుట్టకు చేరుకున్నారు. అయితే, గుట్ట పట్టణంలో ఆటల పోటీల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పాతగుట్టకు వెళ్లే రోడ్డులో పొలాలు, ఖాళీ స్థలాల్లో పోటీలు ప్రారంభించారు. క్రికెట్కు స్టంపులను కూడా ఇవ్వలేదు. స్టంపులకు బదులు రాళ్లు ఉంచారు. అలాగే, కొన్ని పోటీలను మమ అనిపించారు. అయితే, నిర్వాహకులిద్దరూ సాయంత్రం గొడవకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. దీంతో నిర్వహించిన పోటీల్లో విజేతలకు మెడల్స్ లేవు.. పతకాలు లేవు. ఈ పరిణామంతో బిక్కమొహం వేసిన ఆటగాళ్లు ఉండాలో వెళ్లాలో తెలియక పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని పోలీసులకు వివరించాలని నిర్ణయించుకున్నారు. -
ఆటలు.. వికాసానికి బాటలు
కేరెంటింగ్ ‘‘హోమ్ వర్క్ ఎందుకు చెయ్యలేదు? చెయ్యి చాచు’’ అంటూ బెత్తంతో అవతలి వారి చేతిలో దెబ్బ వేసే బుల్లి టీచర్లనో, ఇయర్ ఫోన్లో, ఉత్తుత్తి స్టెతస్కోపో చేత పుచ్చుకుని, అవతలి వారి గుండెను పరీక్షించే చిన్నారి డాక్టర్లనో, డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగ్ చేసే చిన్నారి కథానాయకుడినో చూస్తే భలే ముచ్చటేస్తుంది కదూ! అలాగే ఉత్తుత్తి గిన్నెల్లో ఉట్టుట్టి పప్పు, కూర, పులుసు, స్వీట్లు వండి, ఉట్టుట్టి కంచాల్లో కొసరి కొసరి వడ్డన చేసే చిన్నారి తల్లుల్ని చూసినా కడుపు నిండిపోతుంది. ఇంకా బస్ కండక్టర్లా టికెట్లు చించి ఇచ్చే ఆటను కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు. అప్పట్లో చిన్నారులే పెళ్లి పెద్దలుగా మారి, బొమ్మల పెళ్ళిళ్లు చేసేవారు. పిల్లలు ఆడుకునే ఇటువంటి ఆటలనే రోల్ ప్లేయింగ్ గేమ్స్ అంటారు. ఇలా రోల్ ప్లే గేమ్స్ ఆడుకుంటూ పెరిగే పిల్లల్లో పెద్దయ్యాక నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయని, ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల వారిలో మేధోవికాసం కనిపిస్తుందని పిల్లల మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఊహాకల్పన విద్యకన్నా, విజ్ఞానం కన్నా గొప్పది. విద్యకు, విజ్ఞానానికి ఎల్లలు ఉంటాయేమో కానీ, తలపులకు తలుపులు ఉండవు. ఊహలు రెక్కలు కట్టుకుని ప్రపంచమంతా పర్యటిస్తాయి. చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుతూ పెరిగిన పిల్లలు పెద్దయ్యాక మంచి ప్రతిభావంతులవుతారట. సమాజంలో తొందరగా కలిసిపోతారట. ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకంంటారట! సమష్టిగా చేసే పనుల్లో మంచి పాత్ర పోషించగలరట. ఇవన్నీ ఉట్టుట్టికే గొప్పకోసం చెప్పుకుంటున్న మాటలు కావు.. బాలల వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మనస్తత్వ నిపుణుడు గ్రాన్విల్లే స్టాన్లీ హాల్ అనేక పరిశోధనల అనంతరం వెలిబుచ్చిన అభిప్రాయాలే సుమీ! రోల్ ప్లే గేమ్... సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే దొంగా పోలీసాట లేదా అమ్మా నాన్నా ఆట అని చెప్పుకోవచ్చు. డ్రాయింగ్ మాస్టర్లుగా, హీరోలుగా, విలన్లుగా... డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా.. ఇలా వారు ఆడే ఆటలను బట్టి వారిలో మానసిక వికాసం ఉంటుందట. అందుకే పెద్దవాళ్లు తమ పిల్లలు విడియోగేమ్సో, సెల్ఫోన్లో స్కోరింగ్ గేమ్సో ఆడుతుంటే చూసి మురిసిపోవద్దు. చక్కగా రోల్ ప్లే గేమ్ ఆడేందుకు ప్రోత్సహించండి. ఏ సూపర్ మార్కెట్కో, పోలీస్ స్టేషన్కో, డాక్టర్ దగ్గరకో వెళ్లినప్పుడు వారు అక్కడి వాతావరణాన్ని, మనుషులను నిశితంగా గమనించి, ఇంటికొచ్చిన తర్వాత తమ తోటిపిల్లలతో వారిలాగే ఆటలు ఆడటం మొదలు పెడతారు. అటువంటప్పుడు వారిని కసురుకోకుండా, దూరంగా ఉండి గమనిస్తూ ఉండండి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాలి. అదేవిధంగా చిన్నారులను ఏ సూపర్ మార్కెట్కో, షాపింగ్ మాల్స్కో తీసుకె ళుతుంటారు కదా.. ఇంటి కి వచ్చాక వారిని అక్కడ ఏమేమి గమనించారో చెప్పమనండి. చేతికి కాగితం, కలం ఇచ్చి వారు గమనించిన వాటి జాబితా రాయమనండి. ఉత్సాహంగా ముందుకొస్తారు. ‘‘రోల్ ప్లే గేమ్స్ వల్ల పిల్లల్లో సంభాషణా చాతుర్యం పెరుగుతుంది. భాషాపరమైన అభివృద్ధి కలుగుతుంది. భిన్న సంస్కృతులకు త్వరగా అలవడతారు. అవతలివారు చెప్పే దాని మీద దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. తమ భావాలను చక్కగా వ్యక్తం చేయగలుగుతారు’’ అని బాలల మనస్తత్వ శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మనం వారి మాటలను చెవిన వేసుకుందాం. మన పిల్లలను ఆ ఆటలు ఆడేలా ప్రోత్సహిద్దాం. -
ఆటలాడుతూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
* వరంగల్ జిల్లాలో ఒకరు.. * ఖమ్మం జిల్లాలో మరొకరు జూలూరుపాడు/కొత్తగూడ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ఆటలాడుతూ శనివారం ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెంకు చెందిన భూక్యా భద్రాచలం(13), వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన విజయ్కుమార్(14)లు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెనికి చెందిన భూక్యా హరి, కళావతిల ఏకైక కుమారుడు భూక్యా భద్రాచలం జూలూరుపాడు మండలం సాధన పబ్లిక్ స్కూల్ ఏడో తరగతి చదువుతున్నాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం సహచర విద్యార్థులతో ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే భద్రాచలం చనిపోయాడు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, అందుకు వారు బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన గుమ్మడి వీరస్వామి, వెంకటమ్మ దంపతుల రెండో కుమారుడు విజయ్కుమార్(14) ఇదే మండలం బత్తులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడుతూ ఆయాసానికి గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే విజయ్కుమార్ చనిపోయాడు. గుండెపోటుతో విద్యార్థి మృతి ఇబ్రహీంపట్నం: పాఠశాలలో ప్రార్థన చేస్తుండగా ఓ విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందిన విషాద సంఘటన ఇది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడకు చెందిన యెంపల్ల తిరుమల్రెడ్డి, మంజుల దంపతుల పెద్దకొడుకు త్రిష్ రెడ్డి(10) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన త్రిష్ రెడ్డి స్కూల్లో ప్రార్థన చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో త్రిష్ రెడ్డి మృతిచెందాడు. ఈ ఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కాగా, మూడేళ్ల క్రితం బాలుడి తండ్రి తిరుమల్రెడ్డి కూడా గుండెపోటుతోనే మృతి చెందాడు. ఇపుడు త్రిష్రెడ్డి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెల కొంది. ఉన్న కొడుకూ గుండెపోటుతో మృతి చెందడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. -
ఆడుతూ..పాడుతూ..
ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచే గేమ్స్ పొదుపు చేసే విధానం, పెట్టుబడులు పెట్టే తీరు కాలంతో పాటు మారిపోయాయి. కానీ ఇప్పటికీ చాలా మందికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి అంతగా తెలియదు. నిజానికి ఆర్థిక విషయాలపై ఎంత పట్టు ఉంటే, అందిపుచ్చుకోగలిగే అవకాశాలపైనా అంత అవగాహన ఉంటుంది. కానీ, వీటి గురించి తెలుసుకునే దగ్గరే వస్తుంది చిక్కంతా. డబ్బు మాట బాగానే ఉన్నప్పటికీ..దానితో ముడిపడి ఉండే విషయాలు కాస్త సంక్లిష్టంగా కనిపించడం వల్ల బోరింగ్గా అనిపిస్తుంటాయి. దీంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ అమలు చేయాలని ఉన్నా సరైన సమాచారం, అవగాహన లేక ఆ వైపుగా దృష్టి పెట్టడానికి బద్ధకించడం జరుగుతుంటుంది. ఇలా బోర్ కొట్టించకుండా ఆడుతూ, పాడుతూ ఆర్థిక విషయాలను నేర్పించే గేమ్స్ ప్రస్తుతం చాలా మటుకు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్ను బేస్ చేసుకుని ఆడే గేమ్ ఒకటైతే.. ఫుట్బాల్ ఆధారంగా ఆర్థిక మెలకువలు నేర్పేది మరొకటి. ఈ తరహా ఫైనాన్స్ గేమ్స్లో కొన్ని మీకోసం.. ది గ్రేట్ పిగ్గీ బ్యాంక్ అడ్వెంచర్ ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాధాన్యం గురించి నేర్పే గేమ్. మొబైల్ ఫోన్లలోనూ లభించే ఈ ఉచిత ఆన్లైన్ మినీ-గేమ్ను వాల్ట్ డిస్నీ ఇమాజినీరింగ్తో కలిసి టి రోవీ ప్రైస్ సంస్థ రూపొందించింది. ప్రధానంగా అమెరికాలో ఇన్వెస్టర్ల కోసమే దీన్ని తయారుచేసినప్పటికీ.. ఏ దేశం వారికైనా అనువుగా ఉండేలా ఇందులో పలు అంశాలను పొందుపర్చింది. ఒకవైపు ఆడుతూనే మరోవైపు నేర్చుకునేలా ఈ గేమ్ ఉంటుంది. లక్ష్యాలు పెట్టుకోవడం, పొదుపు చేయడం, జాగ్రత్తగా వ్యయాలు చేయడం, ద్రవ్యోల్బణం, అసెట్ కేటాయింపులు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ తదితర అంశాలను ఇది నేర్పుతుంది. ప్రాక్టికల్ మనీ స్కిల్స్ పిల్లలు మనీ గురించి తెలుసుకునేందుకు ఈ వెబ్సైట్లో బోలెడన్ని గేమ్స్తో పాటు ఉపయోగకరమైన సమాచారం కూడా ఉంటుంది. ఫ్రాడ్ సీన్ ఇన్వెస్టిగేటర్ మిస్టరీలను ఛేదించడం ఇష్టపడేవారి కోసం ఈ గేమ్ రూపొందించడం జరిగింది. ఇందులో ఆర్థిక మోసాలను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ ఆర్థిక అంశాల గురించి కూడా ప్లేయర్ నేర్చుకోవచ్చు. ఫండ్టేస్టిక్ కప్ క్రికెట్ స్ఫూర్తితో రూపొందించిన ఈ గేమ్.. క్విజ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్న ఒక్కో బాల్లాంటిది. ఈ గేమ్లో ప్రతి ఓవర్లో 10 బాల్స్ ..అంటే ప్రశ్నలు ఉంటాయి. వీటికి సరిగ్గా జవాబులు చెప్పగలిగితే తదుపరి రౌండుకు వెళ్లొచ్చు. గేమ్ ఫర్ మనీ జపాక్డాట్కామ్ వెబ్సైట్లో ఈ గేమ్ ఉంటుంది. భారతీయ ఇన్వెస్టర్లను దృష్టి లో పెట్టుకుని దీన్ని తయారు చేశారు. ఇందులో ప్లేయర్కి వర్చువల్ నగదు లభిస్తుంది. దాన్ని మ్యూచువల్ ఫండ్స్, బీమా, రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి వివిధ పెట్టుబడి సాధనాలకు కేటాయించాలి. పాచికలు వేస్తూ లక్ష్యం దిశగా గళ్లను దాటుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు, ప్లేయర్ ఆగిన గడిలో స్టాక్మార్కెట్ పెరిగిందనో, పడిందనో వస్తే దానికి తగ్గట్లే పోర్ట్ఫోలియో కూడా మారుతుంది. మైండ్ బ్లోన్ లైఫ్ మనీ మేనేజ్మెంట్ నైపుణ్యాలకు పదును పెడుతుంది ఈ మొబైల్ గేమ్. ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంచుతుంది. ఫైనాన్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆర్థిక అంశాల నిర్వహణలో పలు కోణాలను ఈ వెబ్సైట్ ఆవిష్కరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్, మొబైల్ గేమ్స్ ఇందులో చాలా ఉన్నాయి. -
వాహ్గిరి
-
కేన్సర్ క్రీనీడల్లో క్రీడారంగం
ఫుట్బాల్, క్రికెట్లలోకి డబ్బు రంగ ప్రవేశం చేయడంతో ఆ రెండు క్రీడలూ రోగగ్రస్తమై పోయాయి. బెట్టింగ్ వంటి పరిశ్రమలు భారీగా బలిసిపోయాయి. కొన్ని చోట్ల అవి చట్టబద్ధమయ్యాయి. చట్టాలు వాస్తవికతకంటే వెనుకబడి ఉన్న చోట గోప్యంగా మారాయి. ఆట తీరులోని స్వల్ప మార్పులకు సైతం అంతంత డబ్బు అందుతుంటే గిరాకీ సరఫరాను ఊరిస్తుంది. తిను, తినిపించు అనే వ్యవస్థ దిగువన ఉన్నవారి సంగతి చూసుకుంటుంది. ఒక క్రీడ విశ్వసనీయతను కోల్పోయిందీ అంటే ఇక దానికి అర్థమే లేకుండా పోతుంది. 20వ శతాబ్దంలో చాలా కాలంపాటు, టికెట్టు దొరకాలేగానీ చూడాల్సిన ఆటంటే పుట్బాలే. ఇక రేడియో ఉందీ అంటే వినాల్సిన ఆట క్రికెట్టే. భారత దేశం హాకీ అనే మూడో మార్గాన్ని నెలకొల్పగలిగేదే. కానీ మొదట్లో హఠా త్తుగా ఆ ఆటకు పట్టిన మహా వైభోగం తదుపరి తుస్సుమని పోయింది. అందుకు కారణాలేమిటనే విషయమై పండితులే ఆసక్తి కనబరచడం లేదు. కాబట్టి ప్రజలకూ అది అంతుబట్టనిదిగానే మిగిలింది. కాలం, క్రికెట్తో పోలి స్తే ఫుట్బాల్ వైపే నిలిచిన సమయమూ ఉండేది. ఫుట్బాల్ తక్కువ సమ యం పట్టే క్రీడ. ఆ క్లుప్తతే ఆటకు అనిశ్చితినెరుగని నెమ్మదికి హామీనిచ్చింది. ఆర్కిటిక్ చల్లదనమో లేదా ఎడారి వేడి వంటి విపరీత పరిస్థితులైతే తప్ప వాతావరణం ఆ ఆటను చెడగొట్టలేదు. క్రికెట్, రష్యన్ నవలలాగా అంతులే నట్టుండేది. ఓ చిరు జల్లు సైతం ఆటకు అంతరాయం కలిగించగలిగేంత అని శ్చితమైనదిగా ఉండేది. దురదృష్టకరమైన ఆ పాత రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ వారం రోజులపాటూ సాగేది. ఐదు రోజుల మధ్య ఒక రోజు ప్రాక్టీస్ కోసం. ఆ రోజున క్లబ్వాలా క్రికెటర్లు బార్లలో, పానప్రియులు కాని క్రికెట ర్లు దర్శనీయ స్థలాల సందర్శనలో ప్రాక్టీస్ చేసేవారు. ఆరోజుల్లో క్రికెట్ ఉద్యోగస్తులకు ఆచరణ సాధ్యమైన పోటీగా ఉండేది కాదు. జీవితంలో పైకి రావాలనుకునే తాపత్రయం ఉన్న వారెవరికెవరికైనా గానీ క్రికెట్ సూచించదగినదిగా ఉండేది కాదు. కాబట్టే అమెరికన్లు దాన్ని వెర్రి మొర్రిదిగా కొట్టిపారేశారు. ఉద్యోగాలు చేసుకునే దానికి పూర్వ దశలోని యువతే ఎక్కువగా క్రికెట్కు ప్రేక్షకులు. ఇక కులీన వర్గాలకు ఉద్యోగానం తరం కబుర్లు చెప్పుకోడానికి, వాదులాడటానికి అవకాశాన్ని అందించేది. క్రికెట్, ఫుట్బాల్ వర్గ ప్రాతిపదికపై విడిపోయి ఉండేవారు. సర్వ సమ్మతమైన సత్యాలు చాలా వాటిలాగే అది కూడా పాక్షికంగా తప్పు. ఫుట్బాల్ ఆగ్రహావేశంతో కూడిన తెగ స్వభావం కలిగినది. కాబట్టే మన దేశంలో అది కూడా పలు వర్గాలను తప్పుకుని పోయింది. కొన్ని వర్గాలనే ఆవరించి ఉండిపోయింది. కలకత్తాకు చెందిన సంప్రదాయక ఫుట్బాల్ జట్లైన మోహన్ బగాన్, తూర్పు బెంగాల్, మొహమ్మదన్ స్పోర్టింగ్లు జాతిపరంగా పశ్చిమ బెంగాలీలు, తూర్పు బెంగాలీలు, ముస్లింలవి. తెగ వర్గాన్ని తనలో విలీనం చేసుకుంటుంది. న్యాయవాదులు, వంటవాళ్లు భుజా లురాసుకుంటూ సాగుతారు. ఆవేశకావేశాలు మరీ తీవ్రంగా ఉంటాయి. ఏ ‘బారీ మ్యాచ్’కు ముందు రోజైనా, ఆట తర్వాత గంటల తరబడీ సాగే మ్యాచ్ కు ముందటి, తర్వాతి శవపరీక్ష నివేదికలు బెంగాల్లోని పదుల వేల టీ దుకాణాలను పోషించేవి. అదే ఇంగ్లండ్లోనైతే చర్చా ప్రవాహమూ, డబ్బూ కూడా పబ్బులకు చేరేది. భౌగోళికత, విధేయత అనే సమాంతర విశ్వాన్ని అందించింది. తరచూ ఆ విధేయత ఇటు నుంచి అటు మొగ్గుతుండేది. అయినా అదేమీ ఆవేశాలను తగ్గించేది కాదు. జనసమూహం ఒక పతాకం కోసం తపిస్తున్నారంటే ఇక ఆ కేంద్ర బిందువు ఏదైనా అందుకు పనికి వచ్చేదే అవుతుంది. ప్రజాపునాదిని పలు రెట్లు విస్తరింపజేసే మొట్టమొదటి ముఖ్య గుణకం 1960లనాటి ట్రాన్సిస్టర్ల విప్లవం. ఇక టెలివిజన్ విప్లవం దాన్ని చెక్కుచెదరనిదిగా మార్చే సింది. మార్కెట్టున్న చోట మార్కెటింగూ ఉంటుంది. వ్యాపార ప్రకటలున్న చోట డబ్బుంటుంది. డబ్బున్న చోట వృద్ధి, ప్రలోభం ఉంటాయి. ప్రలోభం ఉన్న చోట దాన్ని నిరోధించలేని వారూ ఉంటారు. సంపద అవసరాలను సంతృప్తిపరచి, విలాసాల పట్ల వ్యామోహాన్ని తీర్చి దురాశను తగ్గిస్తుందని తర్కం చెబుతుంది. కానీ మానవులు తార్కిక జీవులు కారు. వారి ప్రవర్తన సహజంగానే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేలా చేయగలుగుతుంది. పేదలు తమకున్న దానిలోనే బతకడం నేర్చుకుంటారు. కాబట్టి వారు ధనవంతుల కంటే ఎక్కువ నిజాయితీగా ఉంటారు. ధనవంతులకు బంగారు గోళ్లతో వీపు గోక్కోవాలనే దురద ఎప్పుడూ ఉండేదే. ఫుట్బాల్, క్రికెట్ల పరిధిలోకి డబ్బు ముఖ్యమైనదిగా రంగ ప్రవేశం చేయడంతో ఆ రెండు క్రీడలూ రోగగ్రస్తమై పోయాయి. బెట్టింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు భారీ కార్యకలాపాలుగా బలిసిపోయాయి. కాగలిగిన చోట అవి చట్టబద్ధమైనవే అయ్యాయి. చట్టాలు నిజమనే వక్రరేఖకు వెనుకనే మిగిలిపోయిన చోట అవి చాటుమాటు వ్యవహారమయ్యాయి. ఆట తీరులోని అతి స్వల్పమైన మార్పులకు సైతం అంత డబ్బు అందుతుండేటప్పుడు గిరాకీ సరఫరాను ఊరిస్తుంది. క్రీడాకారుల వృత్తి జీవిత కాలం స్వల్పం. వారిలో చాలామంది ఒక్కసారి తమ కెరీర్ ఒక్క ఏడుపుతో అలా మటుమాయమై పోయాక వారి ముందు నిలిచేది శూన్యమే. ఒక జట్టులోని ఏ ఇద్దరు హీరోలకైనా తొమ్మిది మంది త్వరగానే మరపున పడిపోయేవారై ఉంటారు. బెంచ్పైనున్న రెండు డజన్ల మందిని ఎన్నడూ గుర్తుంచుకోరు. ఫుట్బాల్, క్రికెట్ క్రీడలు రెండూ దశాబ్దాలుగా అవినీతి కాన్సర్ వ్యాధితో గుంజుకులాడుతున్నాయి. ఆ వ్యాధికి బలైపోయినవారి జాబితా పొడవైనది. ఒకప్పుడు దక్షిణ ఆఫ్రికా, భారత జాతీయ జట్లకు నాయకత్వం వహించిన తాత్కాలిక హీరోలు కూడా అందులో ఉన్నారు. తప్పులకు యూరోపియన్ ఫుట్బాల్ సమష్టి శిక్షల తీర్పులను అమలు చేసింది. తీర్పు వెలువడే ప్రతి ఒక్క ఘటనకూ పది తప్పించుకున్నాయని నిస్సంకోచంగా అనుకోవచ్చు. ఆ కంపు ఇంకా అలాగే కొడుతూనే ఉండటానికి కారణం అది అత్యున్నత స్థాయికి, పరిపాలనా యంత్రాంగం వరకు చేరతుండటమే. క్రికెట్ లోని అత్యంత శక్తివంతుల పేర్లు బుకీలతో కలసి గదులను పంచుకుంటాయి. తిను, తినిపించు అనే వ్యవస్థ కామెంటేటర్లు, మీడియా పండిత వర్గాలు సహా దిగువన ఉన్నవారందరి సంగతీ చూసుకుంటుంది. పదిహేడేళ్లపాటూ ఫీఫా(అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య) అధిపతిగా ఉన్న సెప్ బ్లాటర్ అధికారంలో ఉండగా డబ్బు రాజ్యమేలింది. ఆయన బండారం కాస్తా బట్టబయలు కావడంతో ప్రపంచ ఫుట్బాల్ గిలగిలలాడుతోంది. అది పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం. ఒక ప్రపంచ కప్పు మ్యాచ్ ఏర్పాటంటే హోదాకు పాస్పోర్ట్గా మారింది. ఫుట్ బాల్ క్రీడను నియంత్రించే కొందరి గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం నుంచి ఆ విశేష హోదాను సంపాదించడంలో విజయవంతమయ్యే మార్గాన్ని కొనుక్కో డానికి ఎందరో సిద్ధంగా ఉంటారు. ఇలా వేలానికి దిగేవాళ్లలో ఆ తర్వాత నష్టపోయేవారు ఎవరూ ఉండరు... ఒక్క ఆ క్రీడ తప్ప. వమాన భారం భరించలేక బ్లాటర్ తన ఖడ్గంపై పడి మరణించలేదు. చాలా మంది పరిస్థితి నరాలు తెగిపడేంత ఉత్కంఠతో ఉన్నది కాబట్టే ఆయన్ని శిఖరం మీది నుంచి నెట్టారు. ఒకప్పుడు క్రీడా స్ఫూర్తికి మూలంగా ఉండిన క్రీడ నేడు వంచనాత్మకతకు మించి మరేదైనా అయితే మనజాలదు. ఒక క్రీడ విశ్వసనీయతను కోల్పోయిందీ అంటే ఇక దానికి అర్థమే లేకుండా పోతుంది. అద్భుత మేధో ప్రమాణాలకు చేరిన అవినీతికి అడ్డుకట్ట వేయడానికి క్రికెట్ చాలానే చేసింది. బ్లాటర్ నిష్ర్కమణైనా ఫుట్బాల్ క్రీడలో రాజును మార్చడానికి మించిన వ్యవస్థాగతమైన మార్పులకు ప్రేరణకాగలదని ఎవరైనాగానీ ఆశించగలరు. అప్పుడే ఫుట్బాల్, క్రికెట్ 21వ శతాబ్దపు ప్రధాన క్రీడలుగా మిగులుతాయి. (వ్యాసకర్త: ఎంజే అక్బర్.. సీనియర్ సంపాదకులు ) -
త్వరలో ఫేస్బుక్ మెసెంజర్ గేమ్స్
న్యూయార్క్: మనం త్వరలోనే ఫేస్బుక్ మెసెంజర్లో గేమ్స్ను ఆడుకోవచ్చు. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయి. ఫేస్బుక్ ఇదివరకే గేమ్స్ను డెవలప్ చేసే కంపెనీలతో మెసెంజర్ కోసం గేమ్స్ రూపొందించే చర్చలు జరిపింది. గేమ్స్ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ మెసెంజర్లో గేమ్స్ అనే ఊహ చాలా మందిని ఆక ర్షిస్తోంది. అధిక సంఖ్యాక ప్రజలు మెసెంజర్ను వినియోగిస్తున్నారు. కాబట్టి మెసెంజర్లో గేమ్స్ ఆడుకునే ఫీచర్ను పొందుపరిస్తే అది గేమ్స్ ఆడే చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇద్దరు గేమ్ ప్లేయర్ల మధ్య మెసెంజర్ ఒక వారధిగా పనిచేస్తుందా? లేకపోతే ఒక రు మాత్రమే ఆడే గేమ్స్ను ప్రవేశపెడుతుందా? అనే అంశాన్ని ఫేస్బుక్ నిర్ణయించాల్సి ఉంది. -
మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మండలానికొక ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను నిర్మించాలని ఎంపీ జితేందర్రెడ్డి కేంద్ర క్రీడల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో మంగళవారం క్రీడలకు ప్రోత్సాహం అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారిణులు క్రీడల్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నారని టాప్ ర్యాంకర్లుగా ఉన్న సైనా నెహ్వాల్, సానియా మీర్జాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2024 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చేలా చొరవచూపాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోన్వాల్.. అన్ని రాష్ట్రాల క్రీడా మంత్రులు, జాతీయ క్రీడల సమాఖ్య కార్యవర్గం, ఒలింపిక్ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. -
క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు
-
చదువు మూరెడు.. నెట్ బారెడు!
* కాలేజీ చదువులకన్నా ఇంటర్నెట్కే ప్రాధాన్యం * చాటింగ్, గేమ్స్కు 10 వేల గంటలు..పుస్తక పఠనానికి 5 వేల గంటలే * తాజా అధ్యయనంలో విస్తుగొలిపే గణాంకాలు * ఆవహిస్తున్న మానసిక రుగ్మతలు: మానసిక వైద్యులు సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ విప్లవం అంతులేని ప్రయోజనాలతోపాటు భయంకరమైన దుష్ర్పభావాలనూ మోసుకొస్తోంది. విభిన్న రూపాలు సంతరించుకున్న డిజిటల్ మాధ్యమం ప్రజల జీవితాలను శాసించే స్థాయికి చేరుతోంది. ఇంటర్నెట్ సహా సకల సదుపాయాలున్న స్మార్ట్ఫోన్ల ప్రవేశం ప్రజలు ప్రత్యేకించి విద్యార్థులను పూనకంలా ఆవహిస్తోంది. జీవితాలను నిలబెట్టే చదువుకన్నా విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇంటర్నెట్ ఆధారిత సేవలకు ఇచ్చేలా వారిని ‘నెట్’లోకంలో విహరింపజేస్తోంది. దీంతో విద్యార్థులు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు. దేశంలో 2000 సంవత్సరంలో 50 లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా 2014 నాటికి ఆ సంఖ్య 23.40 కోట్లకు చేరుకుంది. ఒక సర్వే ప్రకారం ఒక విద్యార్థి తన కాలేజీ జీవితంలో సరాసరి 10 వేల గంటలకు తక్కువ కాకుండా కంప్యూటర్లు, మొబైల్స్ల్లో వీడియో గేమ్స్, చాటింగ్కు సమయం కేటాయిస్తుంటే... పుస్తకాలు చదవడానికి కేవలం 5 వేల గంటలు కూడా కేటాయించడంలేదట. ఈ పరిణామం యువతలో తీవ్రమైన మానసిక రుగ్మతలు కలిగించే ప్రమాదం ఉందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎందరో ఇటువంటి వ్యాధులతో సతమతం అవుతున్నారని చెబుతున్నారు. శారీరక శ్రమకు దూరం... విద్యార్థులు శారీరక శ్రమ లేకుండా స్మార్ట్ఫోన్లలో వినోదానికే పరిమితం అవుతుండటంతో మానసిక అలసటకు గురవుతున్నారు. దీంతో జీవితం రోజురోజుకూ సోమరితనంగా మారుతోంది. దీని ప్రభావం వారి మానసిక స్థితిపై పడుతోంది. పిల్లల జీవితాలు కంప్యూటర్లు, వీడియో గేమ్స్, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్స్, సెల్ఫోన్లు వాటి ద్వారా మెసేజ్లు, ఫొటోలు, చాటింగ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి వాస్తవ జీవితం ప్రమాదంలో పడుతోంది. దేశంలోని పట్టణ జనాభాలో 60% మంది ఇంటర్నెట్ లేకుండా జీవితాన్ని గడపడంలేదని, అందులో సగం మంది రోజుకు 4 గంటల వరకు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని, 19% మంది వారానికి తమ కుటుంబంతో గడిపే కాలం కంటే ఎక్కువ భాగం ఇంటర్నెట్కే అతుక్కుపోతున్నారని తాజా గణాంకాలు చెబుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హింసాత్మక ధోరణులు... స్మార్ట్ఫోన్ల ద్వారా ఉచితంగా వీడియోగేమ్స్, 3డీ గేమ్స్ వంటివి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం రావడంతో పిల్లలు వాటికి బానిసలు అవుతున్నారు. హింసాత్మక ధోరణిలో ఉంటున్న వీడియో గేమ్స్ కారణంగా యువతీ యువకుల్లో దూకుడు భావనలు, దూకుడు మనస్తత్వం, హింసాత్మక ఆలోచనలు పెరిగిపోతున్నాయి. రోజుకు 2 నుంచి 7 గంటలపాటు వీడియో గేమ్స్ ఆడేవారిలో ఒక రకమైన మానసిక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. సామాజిక వెబ్సైట్లు మానసిక రుగ్మతలకు వేదికలుగా మారుతున్నాయి. అసూయ, ఆశ, నిరాశ, ఆత్మన్యూనత వంటివి తెలియకుండానే ప్రభావం చూపుతున్నాయి. అయితే యువతను ఇటువంటి వాటికి దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. మానసిక రుగ్మతలు... దేశంలో 6 వేల మంది ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వినియోగదారులపై ఒక సర్వే చేయగా 80% మంది ఇంటర్నెట్, మొబైల్స్ కారణంగా నిద్రలేమి, సరైన వేళకు భోజనం చేయకపోవడం, ఉద్యోగం, వ్యాపార వ్యవహారాల్లో సమయపాలన పాటించకపోవడం తదితర అంశాల్లో విఫలం అవుతున్నారని తేలింది. దీనివల్ల మానసిక రుగ్మతలతోపాటు అసిడిటీ, స్థూలకా యం వంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. 13% మంది విద్య, వృత్తి సామర్థ్యాల్లో వెనుకబడుతున్నారు. 2% మంది ప్రతికూల పరిస్థితుల్లోకి (పిచ్చివారుగా) మారుతున్నారు. కొందరు తాగుడుకు బానిసలవుతున్నారు. 25% మంది వరకు యువతీ యువకులు పూర్తిగా ఇంటర్నెట్కు బానిసలైపోయారు. మానసిక ఒత్తిడికి, రుగ్మతలకు గురవుతున్నారు. శారీరకంగా జబ్బులకు గురవుతున్నారు. -
ఒకవైపు జెడ్పీ సమావేశం...మరోవైపు ఆటలు
-
వార్షిక క్రీడలకు ఎస్వీయూ సన్నద్ధం
తిరుపతి స్పోర్ట్స్ : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) 2014-15 వార్షిక క్రీడాపోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల క్రీడాపోటీల వేదికలను స్పోర్ట్స్ కమిటీ ప్రకటించింది. ఎస్వీయూ ఫిజికల్ డిపార్టుమెంట్లో బుధవారం ఎస్వీయూ స్పోర్ట్స్ కమిటీ సమావేశం అయింది. కమిటీ చైర్మన్ అయిన వీసీ రాజేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014-15 వార్షిక క్రీడాపోటీల నిర్వహణ, వేదికల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల పురుషుల గేమ్స్ను ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించాలని నిర్ణయించా రు. అందులో వాలీబాల్, హాకీ, హ్యాండ్బాల్, టెన్నిస్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. పుత్తూరు శేషాచల వెంకటసుబ్బయ్య కళాశాల క్రీడామైదానంలో బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, కోకో నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో పురుషులకు షటిల్ బ్యాడ్మింటన్, చెస్, బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తారు. అంతర కళాశాలల బోధనా సిబ్బంది (పురుషులు) క్రీడలు వాల్మీకిపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. మహిళలకు ఎస్పీడబ్ల్యూలో... ఎస్వీయూ అంతర కళాశాలల పరిధిలోని మిహ ళలకు తిరుపతి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కళాశాలలో గేమ్స్ నిర్వహించనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా అథ్లెటిక్ పోటీలను ఎస్పీడబ్ల్యూ కళాశాలలోనే నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల బోధన(మహిళలు) సిబ్బందికి ఇక్కడే అన్ని రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్ స్కాలర్ షిప్ రూ.4 వేలకు పెంపు యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతూ క్రీడల్లో విశేషంగా రాణిస్తున్న పురుషులు 300 మంది, మహిళలు 200 మందికి ఎస్వీయూ ప్రతి ఏటా ‘స్పోర్ట్స్ మెరిట్ స్కాలర్షిప్’ కల్పిస్తోంది. ఈ ఏడాది నుంచి ఈ స్కాలర్షిప్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 1987లో ముద్రించిన ‘ఎస్వీయూ స్పోర్ట్స్ రూల్స్’ బుక్ స్థానంలో నూతన నిబంధనలతో బుక్ను తీసుకు రానున్నారు. ఈ ఏడాది ఎస్వీయూ వార్షిక క్రీడల నిర్వహణకు రూ.32 లక్షల బడ్జెట్ను కేటాయించినట్టు వీసీ రాజేంద్ర తెలిపారు. గత ఏడాది రూ.28 లక్షలు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ దేవరాజులు నాయుడు, స్పోర్ట్స్ కమిటీ కార్యదర్శి, ఫిజికల్ డెరైక్టర్ శివశంకర్రెడ్డి, సభ్యులు ఉషారాణి (ఎస్పీడబ్ల్యూ), క్రిష్టఫర్ (ఎస్వీ ఆర్ట్స్), సత్యనారాయణ (శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల), రాబర్ట్ (పీవీకేఎన్, చిత్తూరు), నళిని (చిత్తూరు), ఎస్వీయూ అసిస్టెంట్ పీడీలు అవల్దార్ గిరిధర్, నాగమణి, పెన్నా భాస్కర్, చంద్రశేఖర్రాజు, మాధవ్రెడ్డి పాల్గొన్నారు. -
డ్యాబ్లర్ మీ చదువులు మీ చేతుల్లో!
‘‘మెకానికల్ తీస్కోరా! గౌతమ్ మీనన్, చేతన్ భగత్ రేంజ్కి వెళ్తావ్.’’ ‘‘సీఎస్సీ మే పొట్టి యా మస్త్ రెహతే మాలూం.’’ ‘‘ మీపెదనాన్న గారబ్బాయిని చూశావా? ఈసీఈ చేసి, ఇప్పుడు నెలకు ఆరంకెల జీతం సంపాదిస్తున్నాడు.’’ ఎమ్సెట్, జేఈఈ ర్యాంకుల వేడిలో ఇలాంటి డైలాగులు గంటకోచోట ఏదో ఓ మూల వినిపిస్తూనే ఉంటాయి. ఇంటర్ తరువాత ఎక్కువ మంది విద్యార్థుల ఫేవరెట్ ఛాయిస్ ఇంజనీరింగే. ఆసక్తి ఉన్నా ఆ కోర్సులపై అవగాహన ఉన్నది మాత్రం చాలా తక్కువ మందికే. మరి ఆ విషయంపై అవగాహన పెరిగేదెలా? పెంచేదెవరు? ఆ కొరతను తీరుస్తూ ఒక యాప్ను తయారు చేసిన యువకుల కథే ఇది. ‘‘ఏ మొబైల్ ఫోన్ చూసినా వాటిలో డిఫాల్ట్గా వచ్చే యాప్స్లో ఎక్కువ శాతం గేమ్స్, సోషల్ నెట్వర్కింగ్ తాలూకువే. అయితే మొబైల్ వాడే వారిలో ఎక్కువ శాతమైన విద్యార్థుల కోసం ఒక యాప్ కూడా లేదన్న ఆలోచన నుండి పుట్టిందే మా డ్యాబ్లర్’’ అంటారు డ్యాబ్లర్ యాప్ వ్యవస్థాపకులైన శ్రీకాంత్, శిరీష్. ‘‘మా ఇద్దరిదీ హైదరాబాదే. గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చేసిన మేము ఎంబీఏ కోసం ఎమ్.ఐ.సి.ఎ. అహ్మదాబాద్ వెళ్లాం. అక్కడికి వెళ్లాక వారితో పోలిస్తే మన రాష్ట్రంలోని విద్యార్థులు ఎంతో తెలివైన వారే కానీ, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఆపర్చ్యునిటీల గురించిన అవగాహన లోపం వల్ల వెనకబడి ఉన్నారని, వారికి మా వంతు సాయం చెయ్యాలనీ అనిపించింది. ఇంటర్నెట్లో వెతికితే ఇంజినీరింగ్కు సంబంధించి ఎన్నో వేల సలహాలు, ఆప్షన్లు ఉండడంతో ఏది ఎంచుకోవాలో తెలియక ఒకటే కన్ఫ్యూజన్. ఒక విద్యార్థికి ఈ నాలుగేళ్లలో ఏ బ్రాంచ్లో ఏమేమి సబ్జక్ట్స్ ఉంటాయి, ఏం నేర్చుకుంటాం, ఉద్యోగావకాశాలు ఏమిటి తదితర వివరాలు చూపించేలా ఒక యాప్ను రూపొందించాలనుకున్నాము’’ అని తమ డ్యాబ్లర్ యాప్ ఆవిర్భావం గురించి చెప్పారు 27 ఏళ్ల శ్రీకాంత్. ఇంజనీరింగ్ విద్యార్థికి అవసరమైన సమాచారం అంటే ఒకటి రెండు పేజీల వ్యవహారం కాదు. ఎన్నో గ్రూప్స్, సబ్ గ్రూప్స్, సబ్జెక్ట్స్, ఈవెంట్స్ సేకరించి, ఒక చోట పెట్టడం మామూలు విషయం కాదు. కష్టమైన పనిని సులభంగా చేయగలగడమే వారి మోటో. అందుకే ఆ అర్థాన్నిచ్చే ‘డ్యాబ్లర్’ అనే పదాన్ని యాప్ పేరుగా పెట్టి యాప్ పనులు మొదలు పెట్టారు. ఇది ఇద్దరివల్ల అయ్యేది కాదు అని అర్థం అయ్యింది వారికి. అందుకే తమ స్నేహితులైన రోహిత్, అవని, భగత్లను తమతో పని చేయడానికి ఆహ్వానించారు. ఫేస్బుక్, పర్పుల్ టాక్, వాటర్ హెల్త్లాంటి పెద్ద కంపెనీలలో ఉద్యోగాలను వదిలేసి వారు శ్రీకాంత్, శిరీష్లతో కలిసి ఈ యాప్ పనిమీద పడ్డారు. అందరూ సాంతం గానే డబ్బు పెట్టుబడి పెట్టి, ఆరు నెలలపాటు కష్టపడి ఎట్టకేలకు 2013, డిసెంబర్ 20న గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ని లాంచ్ చేశారు. ‘‘ఆరంభంలో ఫండింగ్ లేక ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. విద్యార్థులకు ఉపయోగపడుతుందని కొన్ని కాలేజీలు మాత్రం మాతో అనుసంధానం అయ్యాయి’’ అని తమ ఆర్థిక కష్టాల గురించి చెప్పారు 27 ఏళ్ల శిరీష్. ఇలా ఈ యాప్ ఆరు నెలల్లోనే 40,000 మంది విద్యార్థుల ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది. దాంతో దీన్ని విండోస్, ఐఓఎస్లలో కూడా విడుదల చేశారు. ఎమ్.ఐ.సి.ఎ.లో చదువుతున్నప్పుడు శ్రీకాంత్, శిరీష్ల ప్రొఫెసర్ అయిన శ్రీధర్ చారి ఇప్పుడు డ్యాబ్లర్ మెంటర్గా ఉండి వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. హర్ష ఆలూరి అనే ఐ.ఐ.ఐ.టి. పూర్వ విద్యార్థి స్థాపించిన డెక్ట్సర్ ల్యాబ్స్ సంస్థ డ్యాబ్లర్కు విస్తృతమైన సేవలందించి దీన్ని మరింత ముందుకు తీసుకెళుతోంది. ఇక, ఇప్పుడు డ్యాబ్లర్ని కేవలం మన రాష్ట్రానికే కాక, తమిళనాడు, మహారాష్ట్రలకు కూడా వ్యాప్తి చేసే ఆలోచనలో ఉన్నారు డ్యాబ్లర్ వ్యవస్థాపకులు. ‘‘విద్యార్థులకు సరైన అవగాహన, ఆలోచన కలిగించే విషయాలని కాస్త వినోదంతో మేళవించి చెప్పడం అనే ఐడియా నాకెంతో నచ్చింది. పెద్ద పెద్ద కంపెనీల కన్నా సొంత స్టార్టప్స్లోనే నేర్చుకోడానికి చాలా ఉంటుంది. మా ఐడియా సక్సెస్ అవుతుందో లేదో అనే భయం ఉన్నా, మా కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందన్న ధైర్యంతో ముందుకొచ్చాను. నాలాగా మరింతమంది ఎంటర్ప్రెన్యూవర్స్ ముందుకు రావాలి’’ - అవని, డ్యాబ్లర్ యాప్ డెవలపర్ ‘‘ఇ-యాప్స్ రంగం చూడటానికి సాధారణం గానే ఉన్నా, ఇందులో నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. పేషన్, కమిట్మెంట్తోబాటు ఒక యాప్ డెవలపర్ పూర్తిస్థాయిలో పని చేస్తేనే ఏ యాప్ అయినా మార్కెట్లో నిలబడగలిగేది. ఈ రంగానికి సృజనాత్మకత ఒక్కటే కొలమానం. సామర్థ్యం ఉండీ, తగిన అవకాశం దొరకని వారికి ఇది ఒక అద్భుతమైన వేదిక’’. - శ్రీధర్ చారి, డ్యాబ్లర్ మెంటర్ అసలేంటి ఈ ‘డ్యాబ్లర్?’ డ్యాబ్లర్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం డిజైన్ చేయబడిన యాప్. ఈ యాప్లో వివిధ రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక దానిలో వివిధ బ్రాంచిలకు సంబంధించిన వివరాలు, ఆయా సబ్జెక్ట్ల వివరాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే జర్నల్స్ని వడబోసి ఒక చోట చేర్చి విద్యార్థులకు ఉపయోగపడే న్యూస్ని అందిస్తుంది. దేశంలోని నలుమూలలలో జరిగే స్టూడెంట్ ఈవెంట్స్, ఫెస్ట్స్ వివరాలను అప్డేట్ చేస్తాయి. విద్యార్థులు రాసే ఆర్టికల్స్, పేపర్స్, జర్నల్స్ని అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ఏ రోజు ఏ టైం టేబుల్ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ రోజు తాలూకు టైం టేబుల్ని ఆ రోజు ఆన్లైన్లో చూపిస్తుంది. దాన్ని ఎడిట్ చేసుకునే సదుపాయంతో పాటు రిమైండర్ సెట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇలా విద్యార్థులకు గైడ్లానే కాక, ఒక పి.ఎ.లా వ్యవహరిస్తున్న ఈ డ్యాబ్లర్కు అశేషమైన ఆదరణ లభించింది. -
ఊహల ఉయ్యాల ఊసుల జంపాల
వివరం: బ్లాగ్ : రాధికకు తన చిన్ననాటి అనుభవాలు, ఆటలు గుర్తుచేసుకుని ఆ పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ భావాలను అక్షర రూపంగా మార్చుకోవాలనుకుంటుంది. కవితలు రాసే అలవాటున్నా వాటిని పత్రికలవాళ్లు తిరిగి పంపిస్తున్నారు. తనలోని భావావేశాన్ని ప్రకటించుకోవడం ఎలా అని మధనపడుతూ ఉంటుంది. రమణ మంచి రచయిత. ఎన్నో రాయాలని ఉంటుంది కాని తను రాసినవన్నీ పత్రికలవాళ్లు అచ్చేయరు. దానితో అతనికి నిరాశే మిగులుతుంది. అశోక్ కొత్తగా విడుదలైన సినిమా చూసి చాలా ప్రభావితుడయ్యాడు. ఆ సినిమా గురించి చాలా మాటలు చెప్పాలని, స్నేహితులతో పంచుకోవాలని అనుకున్నాడు. కాని ఎలా? ఇలా రాయాలనే కోరిక ఉన్నవాళ్లకి, సాహిత్యం, భాష మీద అభిమానం ఉన్నవాళ్లకి తమ మనసులోని భావాలను, అభిరుచులను, ఆలోచనలను మరికొంతమందికి తెలియజేయాలనుకునేవారికి సరియైన వేదిక ‘బ్లాగు’. నేడు కంప్యూటర్, అంతర్జాలం (ఇంటర్నెట్) దాదాపు ఒక నిత్యావసర వస్తువుగా మారాయి. వారూ వీరూ అని కాకుండా ఉద్యోగస్తులు, విద్యార్థులు, విశ్రాంత ఉపాధ్యాయులు, మహిళలు చాలా విరివిగా వాడుతున్న అంతర్జాలంలో తమ తమ మాతృభాషలోనే చదువుకుంటూ, రాసుకునే అవకాశం ఉంది. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండానే. అచ్చ తెలుగులో చెప్పాలంటే బ్లాగు ఒక అచ్చుపత్రిక, ఆవకాయ నుండి అంతరిక్షం దాకా అన్ని విషయాలు ఇంట్లో నుండే ముచ్చటించుకునే అద్భుతమైన సాధనం అని కూడా చెప్పవచ్చు. అసలు ఈ బ్లాగు అంటే ఏమిటి? ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది? ప్రారంభం ఇంటర్నెట్ ప్రారంభం కాకముందే ఎలక్ట్రానిక్ సొసైటీలు ఉన్నాయి. అందులో ఒకటి హ్యామ్ రేడియో. బ్లాగులు ప్రారంభం కంటే ముందే యూజ్ నెట్, ఈమెయిల్ లిస్టులు, బులిటెన్ బోర్డులు మొదలైనవి వాడకంలో ఉండేవి. 1990లలో వెబ్ఎక్స్ లాంటి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లు నిరంతరంగా సాగుతూ ఉండే సంభాషణలకు అనువైన సాఫ్ట్వేర్ను సృష్టించాయి. 1994 లో కాలేజీ విద్యార్థి జస్టిస్ హాల్ని బ్లాగటం మొదలుపెట్టినవారిలో ఒకరిగా భావిస్తారు. తర్వాత 1997 సంవత్సరంలో జాన్ బార్జర్ మొదటిసారి వెబ్ లాగ్ (Weblog)అనే పదాన్ని ఉపయోగించాడు. కాలక్రమేణా ఆ పదం We blog అంటూ తర్వాత Blog గా క్రియాపదంగా స్థిరపడిపోయింది. అదే సమయంలో ప్రారంభమైన బ్లాగర్.కామ్ (2004 లో గూగుల్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది) బ్లాగుల విస్తరణ, వినియోగాన్ని మరింత వేగవంతం చేసింది. 2003లో ఈ బ్లాగు అనే పదం నిఘంటువులలో చేరింది. బ్లాగు అనేది పర్సనల్ వెబ్సైట్ లాంటిదే. ఈ బ్లాగులకు కొత్త హంగులు చేర్చిన వ్యక్తి డేవ్ వైనర్. దీనికోసం ఆయన ఒక సర్వర్ సృష్టించాడు. ఎవరైనా బ్లాగరు తన బ్లాగులో మార్పులు, చేర్పులు చేయగానే ఈ సర్వరుకు తెలిసేది. బ్లాగులో బ్లాగ్ రోల్/ లిస్ట్, వ్యాఖ్యలు, విభాగాలు మొదలైన ముఖ్యమైన లింకులను తేలిగ్గా అమర్చుకునే వీలు కలిగింది. ఒకరి ఆధిపత్యంలో రాసే అవసరం లేకుండా బ్లాగు సొంతదారు నియంత్రణలోనే ఎవరి బ్లాగు వారు స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం కలిగింది. దానితో ఆయా బ్లాగులు వారి వ్యక్తిత్వాలను ప్రతిబింబించేవిగా ఉండేవి. Ritual Entertainmentసంస్థవారు 1997లో స్టీవ్ గిబ్సన్ను తమకోసం బ్లాగటానికి నియమించుకున్నారు. బహుశా అతనే మొదటి బ్లాగుద్యోగి అనవచ్చు. బ్లాగులను రాయడం వరకు బానే ఉంది కాని వాటిని వేరే వాళ్లతో పంచుకోవటానికి, చదవటానికి వాటిని ఇంటర్నెట్లో హోస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 1997లో ash Dot, Live Journal, Pitas.comపేర్లతో పలు హోస్టింగ్ సైట్లు ప్రారంభమయ్యాయి. 1998లో ైఞ్ఛ ఈజ్చీటడ ప్రారంభమై వేలాది కొత్త బ్లాగులు లేదా ఓపన్ డైరీల సృష్టికి పునాది వేయడమే కాదు, బ్లాగులలో రాసిన రాతలు చదివినవారు తమ అభిప్రాయాలను కూడా చెప్పగలిగే వీలు కల్పించింది. ఇప్పుడు అధిక శాతం బ్లాగర్లు ఉపయోగిస్తున్న బ్లాగర్.కామ్ను Evan Williams, Meg Hourihanలు ఆగస్టు 1999లో ప్రారంభించారు. తర్వాత గూగుల్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది. అలా బ్లాగులు మెల్లిగా విస్తరిస్తూ 1999 నుండి వేగం పుంజుకున్నాయి. అభిప్రాయాలు మాత్రమేనా?! బ్లాగులంటే కేవలం తమ అభిప్రాయాలను వెల్లడించడమే కాదు, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి దోషులను శిక్షపడేలా చేయడం కూడా అని మొదటి బ్లాగు వివాదం ‘ట్రెంట్ లాట్ పతనం’ నిరూపించింది. 1948లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేసిన సెనెటర్ Strom Thurmondగౌరవార్థం ఇచ్చిన ఓ విందులో మరో నాయకుడు Trent Lott థర్మండ్లోని నాయకత్వ లక్షణాల కారణంగా ఆయన అమెరికాకు ఒక ఉత్తమ అధ్యక్షుడు కాగలడని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని పత్రికలవాళ్లు ప్రస్తావించకున్నా, ప్రజలు సహించలేకపోయారు. ఎందుకంటే థర్మండ్ తన రాజకీయ జీవితపు తొలినాళ్లలో తెల్ల జాత్యహంకారుల సానుభూతిపరుడుగా ఉండేవాడు. అందుకే అతనిని తీవ్రంగా ఖండించారు. తమ వాదనలకు సాక్ష్యాలను కూడా బ్లాగుల ద్వారా బయటపెట్టారు. ఆయన వ్యాఖ్యలు ఏదో పొరపాటున నోరుజారి చేసినవి కావని, లాట్ స్వతహాగానే జాతి దురహంకారి అని వాదిస్తూ ఆయన చేసిన మరికొన్ని ప్రసంగాలను, డాక్యుమెంట్లను వెలికితీసి వాటి గురించి తమ బ్లాగుల్లో రాశారు. ఈ వివాదం ముదిరి తీవ్రంగా మారడంతో ఒత్తిడి పెరిగి చివరికి సెనేట్ మెజారిటీ నాయకుడిగా లాట్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఇది ఏ పత్రికా విలేఖరి, సంస్థలకు తక్కువకాని విధంగా సామాన్య ప్రజలు తమ రాతలను, వ్యతిరేకతను బ్లాగుల ద్వారా సాధించిన విజయం. బ్లాగుల ద్వారా సాధించిన మరో విజయం Rather Gateకుంభకోణం. సీబీఎస్ వార్తాసంస్థలో 60 మినిట్స్ అనే టీవీ కార్యక్రమంలో Don Ratherఅనే జర్నలిస్టు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మిలిటరీ రికార్డులకు సంబంధించిన పత్రాలను చూపించాడు. కాని అవి నకిలీవని వాదిస్తూ, కొందరు బ్లాగర్లు తమ బ్లాగులలో రాశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా చూపించారు. దానితో వార్త ప్రసారమైన మూడు రోజుల్లోనే సీబీఎస్ సంస్థ బహిరంగంగా తమ తప్పును ఒప్పుకుని, క్షమాపణ చెప్పక తప్పలేదు. దీనితో బ్లాగు ఒక వ్యక్తిగత రచనలకు ఉపయోగించే పుస్తకంలా కాకుండా వార్తామాధ్యమంగా ఒక శక్తివంతమైన సాధనం అని కూడా అందరూ గుర్తించారు. వినియోగదారుల ఫిర్యాదులను వెలుగులోకి తీసుకువచ్చే పని కూడా బ్లాగుల ద్వారా చేయడం మొదలుపెట్టారు. ఇలా బ్లాగులు నడక మాని పరుగులు మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మొదలైంది. ఈ బ్లాగులను హోస్టింగ్ చేయడానికి ఉచితంగా ఎన్నో సైట్లు ఉన్నాయి. మనం తరచూ వాడే ్ఛఝ్చజీతో ఈ బ్లాగులను ప్రారంభించవచ్చు. అలాగే వెబ్లో బ్లాగులను నిక్షిప్తం చేసి ఆవిష్కరించడానికి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో Blogger, Wordpress. Live journal Tumblr, Posterious... పేర్లతో నడుపబడుతున్న ఈ సైట్ల ద్వారా ఎవరైనా ఎక్కడున్నా తమ మాతృభాషలోనే బ్లాగులు మొదలుపెట్టి ఇష్టమున్నవన్నీ రాసుకోవచ్చు. వీటికి పైసా కూడా చెల్లించనక్కరలేదు. నిరాటంకంగా నడపాలి బ్లాగును నిరాటంకంగా నడపడం ఒక సరదా మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఈ బ్లాగు వల్ల బోల్డు డబ్బు సంపాదించలేం, చాలామంది మందీమార్బలాన్ని సంపాదించలేం, మన రాతల వల్ల అందరినీ మార్చలేం. కానీ మన బ్లాగు వల్ల మనలో కలిగిన చిన్న మార్పు చాలు, ఇది విజయవంతమైనదని చెప్పుకోవడానికి. ఎందుకంటే మనం రాసేది ముందు మనకు ఉపయోగపడాలి. బ్లాగులు ప్రారంభమైనప్పటినుండి సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చినా; ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చినా బ్లాగులు తమ శోభను కోల్పోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో బ్లాగులు ప్రజ్వరిల్లుతున్నాయి. వెబ్సైట్లు ఏర్పాటు చేసుకోవడం సులువైనా కూడా బ్లాగులకున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అస్సలు తరగలేదు. ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఇంటి అడ్రెస్సు, ఫోన్ నంబర్లా బ్లాగు కూడా ఒక చిరునామాగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన దేశంలో 2004 నుండి బ్లాగులు విస్తరించడం ప్రారంభమైంది. అదే సమయంలో యూనీకోడ్ ఆవిష్కరణతో భారతీయ భాషలలో కంప్యూటర్లో టైప్ చేయడం చాలా సులువుగా మారింది. అప్పటినుండి బ్లాగులు ఒక ప్రభంజనంలా విస్తరించాయి. 2004లో మొదలైన తెలుగు యూనీకోడ్ అంతర్జాల విప్లవం బ్లాగుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలుగువారిని మరింత దగ్గరగా చేసింది. బ్లాగులు రాసేవాళ్లే బ్లాగులు, వికీపీడియా, తెలుగు టైపింగ్ మొదలైన అంశాల మీద ప్రింట్ పత్రికలలో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. టీవీలలో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. దీనితో తెలుగు బ్లాగులు మరింత వేగంగా వ్యాపించాయి. వివిధ సాఫ్ట్వేర్ల ద్వారా తెలుగు చదవడం, రాయడం సులభతరమైన తర్వాత, ఈ పరుగుకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమైపోయింది. ఉద్యోగాలు చేసేవారే కాక విశ్రాంత ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు... ఇలా అందరూ బ్లాగుల ద్వారా తమలోని తృష్ణను తీర్చుకున్నారు. బ్లాగు రచనలు పత్రికా రచనలకు దీటుగా ఉన్నాయి. పాటలు, పద్యాలు, కవితలు, కథలు, వంటలు, పుస్తకాలు, సినిమాలు, సరదా రాతలు, సాంకేతిక పాఠాలు, విద్యకు సంబంధించిన అంశాలు... ఇలా ఎన్నో బ్లాగులు తెలుగులో ప్రారంభమయ్యాయి. ఈ బ్లాగుల రచనలను గురించిన సమాచారం కోసం అగ్రిగేటర్/ సంకలనం తయారుచేసుకున్నారు. కూడలి, మాలిక, జల్లెడ వంటివి ప్రింట్లో ఉన్న పత్రికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న బ్లాగు రచనలు వాటికి గట్టి పోటీనిస్తున్నాయని అందరూ ఒప్పుకునే మాటే. తమ రచనలను పత్రికలవాళ్లు అంగీకరించరేమో, ప్రచురించరేమో అన్న దిగులు లేకుండా ఎంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో తమ సొంత పత్రిక లాంటి బ్లాగులో రాసుకుంటున్నారు. వీటిని సందర్శించి, చదివి స్పందించే చదువరులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. తప్పులు, దిద్దుబాట్లు ఉన్నా నిర్మొహమాటంగా వ్యాఖ్యల రూపంలో తెలియజేస్తున్నారు. వీటివల్ల సదరు బ్లాగరుకు తమ రాతలను మరింత సానబెట్టే అవకాశం లభిస్తుంది. ఈ మాటలు నిజమని హిందీ, తమిళ బ్లాగర్లు కూడా ఒప్పుకుంటారు. బ్లాగులు రాసేవారిలో ప్రముఖులెందరో ఉన్నారు. రచయితలు, సినిమా తారలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఎందరో తమ మాటలను బ్లాగుల ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకున్నా, బ్లాగు రాతలు, వ్యాఖ్యల ద్వారా ఒకరికొకరు పరిచయమవుతున్నారు. తెలుగు బ్లాగు పదకోశం అంతర్జాలం, బ్లాగరి, బ్లాగోతం, బ్లాగావరణం, బ్లహసనం, బ్లాస్యం, బ్లాక్కవిత, బ్లాక్కధ, బ్లాగుడు, బ్లాగుడుకాయ, బ్లాగుసందడి, బ్లాగ్శోధన, బ్లాగ్పటిమ, బ్లాగ్శూరుడు, బ్లాగ్ధానం, బ్లాగ్ధోరణి, బ్లాగ్మాయ, బ్లాజకీయాలు, బ్లాశ, బ్లూతు, బ్లోటో, బ్లాగ్మయం... ఇలా తెలుగులో బ్లాగు పదకోశం వృద్ధి చెందుతూ వచ్చింది. ఇంత ప్రాచుర్యం పొందిన బ్లాగుల ద్వారా ఆదాయం అనేది కష్టమే కాని అసాధ్యమేమీ కాదు. వాస్తవ ప్రపంచమైనా, మిధ్యా ప్రపంచమైనా బ్లాగు లోకమైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. కాని చెడుకు త్వరగా వ్యాపించే గుణముంది. ఉచితం, నియంత్రణ లేకపోవడంతో తమ బ్లాగును దుర్వినియోగపరిచే అవకాశం లేకపోలేదు. బ్లాగుల్లో కూడా కాలుష్యం పెరుగుతుంది. జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లాగర్స్ డే. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించేవారిని వెబ్ బ్లాగర్స్ అంటారు కదా. దాన్నుంచి పుట్టిందే బ్లాగింగ్ ప్రక్రియ. 1993 జూన్లో ఇది మొదలైంది. 2003లో మొదటిసారిగా జూన్ 9ని బ్లాగర్స్ దినోత్సవంగా జరుపుకున్నారు. తర్వాత ఏడాదికి ఆ రోజును జూన్ 14కు మార్చారు. ప్రస్తుతం ఇదే రోజును అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుండి వందలు, వేల మంది బ్లాగర్లందరూ శక్తివంతమైన అక్షర, పదప్రయోగాలతో రచనలు చేస్తూ, తమలోని శక్తికి బ్లాగు ద్వారా గుర్తింపు లభించినందుకు పండగ జరుపుకునే రోజు ఇది. ఈ సంబరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లాగర్లు పోటీలు, సమావేశాలు మొదలైన సామూహిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇవి బ్లాగుల ద్వారానే కాక ప్రత్యక్షంగా కూడా జరుగుతుండడం విశేషం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రెంట్ లాట్పై విరుచుకుపడుతూ సాక్షాధారాలతో సహా అతడి వ్యాఖ్యలు నిజం కాదని నిరూపించిన బ్లాగర్లు కాని దాన్ని అడ్డుకట్ట వేయడం మిగతా బ్లాగర్ల బాధ్యత. కుల, మత, వర్ణాహంకార రాతలు, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, అశ్లీల రాతలు, ఫొటోలు, ద్వేషాలు... కనిపిస్తున్నాయి. ఇతర వ్యక్తులను, మతాలను, దేశాలను దూషిస్తూ రాసిన బ్లాగర్లను అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తమ సంస్థలోని గుప్తంగా ఉన్న విషయాలను బ్లాగులో రాసినందుకు ఒక కంపెనీవారు ఆ బ్లాగరుపై పోలీస్ కంప్లయింట్ చేసి ఉద్యోగం నుండి తీసేశారు. అంతర్జాలం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడవచ్చు. కూరగాయలు తరిగి భోజనం పెట్టవచ్చు. కుత్తుక కోసి ప్రాణాలు తీయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకుని లాభపడాలి. పదిమందికి స్ఫూర్తిగా నిలవాలి. - జ్యోతి వలబోజు -
నేతలతో ఆడుకుంటున్నారు..!
-
గేమ్స్, యాప్స్ కోసం
న్యూఢిల్లీ: మొబైల్ సేవలందించే వొడాఫోన్ కంపెనీ, యానిమేషన్ దిగ్గజం డిస్నీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్స్, యాప్స్ అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ మాధుర్ బుధవారం తెలిపారు. వినియోగదారులు ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ గేమ్స్ను, యాప్స్ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు. వేరీజ్ మై వాటర్? వేరీజ్ మై మిక్కీ? వేరీజ్ మై పెర్రీ?, టాయ్ స్టోరీ తదితర గేమ్స్ను, యాప్స్ను వినియోగదారులు పొందవచ్చని పేర్కొన్నారు. ఇటీవలనే వొడాఫోన్ మ్యూజిక్, వొడాఫోన్ స్పోర్ట్స్ వంటి సర్వీసులను అందజేశామని తెలిపారు. గేమింగ్ బిజినెస్ వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. -
ఎన్నికల కోడ్ కూసినా...
చెరువుమాధారం(నేలకొండపల్లి)న్యూస్లైన్: ఎన్నికల కోడ్ కూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించి పార్టీ ఆధ్వర్యంలో క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని చెరువుమాధారం గ్రామంలో అంకమ్మజాతర సందర్భంగా ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. టీడీపీ పేరుతో పసుపు పచ్చ రంగు కరపత్రంలో పాలేరు నియోజకవర్గ ఇన్చార్జీ స్వర్ణకుమారి, మండలాధ్యక్షుడు నెల్లూరి భద్రయ్య, మండల కార్యదర్శి మైశా శంకర్ పేర్లతో ముద్రించి వేలాది కరపత్రాలను పంచుతున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా తెలుగుదేశం నాయకులు ఈరకంగా ప్రచారం చేస్తున్నారు. క్రీడలను టీడీపీ గ్రామశాఖ కార్యకర్తలు నిర్వహిస్తుండుటతో గ్రామంలో రాజకీయ గోడవలకు నిలయంగా మారింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో కొలువైన అంకమ్మ జాతర ఈనెల 17వ తేదీ నుంచి జరిగే ఉత్సవాన్ని టీడీపీ రాజకీయం చేస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుని వెంటనే కరపత్రాలు నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్సై బి.సత్యనారాయణను ప్రశ్నించగా చెరువుమాదారం గ్రామంలో టీడీపీ నాయకులు కరపత్రాలు పంచే విషయం తన దృష్టికి వచ్చిందని, పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈ గేమ్స్ బల్లే... బల్లే...
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు పంజాబ్లోని లూథియానా నగరం సమీపంలో ఉన్న కిలా రాయ్పూర్ గ్రామం అందరి నోటా వినిపిస్తుంది. మూడు రోజులపాటు ఎక్కడ చూసినా సందడే సందడి... ఒక పక్క ఎడ్ల పందేలు... మరోవైపు శునకాల రేసులు... ఇంకో చోట గుర్రపు పందేలు... కాస్త ముందుకెళితే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... వయో భేదం లేకుండా తమలో ఉన్న అపార ప్రతిభను ప్రదర్శించేందుకు ఉత్సాహంతో ఉరకలెత్తే వేలాది మంది పోటీదారులతో... లక్షలాది ప్రేక్షకులతో కిలా రాయ్పూర్ గ్రామం కళకళలాడుతుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ క్రీడోత్సవాల వివరాలు క్లుప్తంగా.... - కరణం నారాయణ (సాక్షి స్పోర్ట్స్) రైతులకు వినోదం కోసం, వారందరినీ ఒకే తాటిపై తెచ్చేందుకు, వారిలో పోటీతత్వం పెంచేందుకు ఎనిమిది దశాబ్దాల క్రితం ఊపిరి పోసుకున్నవే కిలా రాయ్పూర్ క్రీడోత్సవాలు. 1933లో సంఘ సేవకుడు ఇందర్ సింగ్ గ్రేవాల్ ఈ క్రీడలకు అంకురార్పణ చేశారు. ఈ క్రీడలను భారత గ్రామీణ ఒలింపిక్స్గా కూడా పిలుస్తారు. ప్రతి యేటా ఫిబ్రవరి తొలి వారంలో లూథియానాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిలా రాయ్పూర్ గ్రామంలో జరిగే ఈ క్రీడోత్సవాల్లో సుమారు 50 నుంచి 60 సంప్రదాయ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు. ఎడ్ల పందేలు ఈ క్రీడల్లో అన్నింటికంటే హైలైట్గా నిలుస్తాయి. విజేతలకు లక్షల రూపాయల్లో నజరానాలు లభిస్తాయి. దంతాలతో సైకిళ్లను ఎత్తడం... తల వెంట్రుకలతో ట్రాక్టర్లను లాగడం... కాళ్లపై నుంచి ట్రాక్టర్ను తీసుకెళ్లడం.. మండుతున్న వలయాలతో సైకిల్ను నడపడం... టగ్ ఆఫ్ వార్... ఇలా ఎన్నో అబ్బురపరిచే విన్యాసాలు ఈ క్రీడోత్సవాల్లో కనువిందు చేస్తాయి. ఆరంభంలో కొద్దిమందికే పరిమితమైన ఈ క్రీడోత్సవాలు ఇంతింతై వటుడింతై అన్నట్లు నేడు విదేశీ జట్లు కూడా పాల్గొనే స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రీడలను నిర్వహించే గ్రేవాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని హాకీ అకాడమీ నిర్వహణకు కేటాయిస్తోంది. ఈ హాకీ అకాడమీలో 150 మందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం కిలా రాయ్పూర్ స్టేడియంలో 50 వేల మంది ప్రేక్షకులు ఈ క్రీడోత్సవాలను ఏకకాలంలో తిలకించే సౌకర్యం ఉంది. ఒకప్పుడు ఈ క్రీడోత్సవాల్లో భారత అత్యుత్తమ క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. హాకీ దిగ్గజం ధ్యాన్చంద్తోపాటు బల్బీర్ సింగ్, పర్గత్ సింగ్, దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
కుర్రకారు జోష్
-
క్రీడల క్యాలెండర్ - 2014
జనవరి 3-7: క్రికెట్-ఫిబ్రవరి 2 వరకు: క్రికెట్-ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ పర్యటన (యాషెస్ ఐదో టెస్టు, ఐదు వన్డేలు, మూడు టి20లు) 7-12: బ్యాడ్మింటన్-కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్) 8-20: క్రికెట్-పాకిస్థాన్ x శ్రీలంక, రెండు, మూడో టెస్టులు 10-18: హాకీ-పురుషుల వరల్డ్ లీగ్ ఫైనల్ (న్యూఢిల్లీ) 13-26: టెన్నిస్-ఆస్ట్రేలియన్ ఓపెన్ (మెల్బోర్న్) 14-19: బ్యాడ్మింటన్-మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలాలంపూర్) 18-29: లూసోఫోనియా అంతర్జాతీయ క్రీడలు (గోవా) 21-26: బ్యాడ్మింటన్-ఇండియా ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో) 19- ఫిబ్రవరి 18: క్రికెట్-భారత్ x న్యూజిలాండ్ (ఐదు వన్డేలు, 2 టెస్టులు) 23-ఫిబ్రవరి 23 వరకు: హాకీ ఇండియా లీగ్ (భారత్) 27-ఫిబ్రవరి 22 వరకు: క్రికెట్-బంగ్లాదేశ్లో శ్రీలంక పర్యటన (రెండు టెస్టులు, రెండు టి20లు, మూడు వన్డేలు) 31-ఫిబ్రవరి 2: టెన్నిస్-డేవిస్ కప్ తొలి రౌండ్ (భారత్ ఁ చైనీస్ తైపీ, ఇండోర్లో) ఫిబ్రవరి 7-23: వింటర్ ఒలింపిక్స్ (సోచి, రష్యా) 12-మార్చి 14 వరకు: క్రికెట్-దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా పర్యటన (మూడు టెస్టులు, మూడు టి20లు) 14-మార్చి 1 వరకు: క్రికెట్-ప్రపంచ అండర్-19 వరల్డ్ కప్ (యూఏఈ) 15-16: గ్రీకో రోమన్ రెజ్లింగ్-ప్రపంచ కప్ (రష్యా) 28-మార్చి 13 వరకు: క్రికెట్-వెస్టిండీస్లో ఇంగ్లండ్ పర్యటన (మూడు వన్డేలు, మూడు టి20లు) మార్చి 4-9: బ్యాడ్మింటన్-ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ (బర్మింగ్హమ్) 4-12: వెయిట్లిఫ్టింగ్-ఆసియా యూత్, జూనియర్ చాంపియన్షిప్ (థాయ్లాండ్) 7-13: షూటింగ్-ఆసియా చాంపియన్షిప్ (కువైట్) 11-ఏప్రిల్ 1 వరకు: చెస్-క్యాండిడేట్స్ టోర్నమెంట్ (రష్యా) 13-23 వరకు: హాకీ-సుల్తాన్ అజ్లాన్ షా కప్ (కౌలాలంపూర్) 15-16: ఫ్రీస్టయిల్ రెజ్లింగ్-ప్రపంచ కప్ (అమెరికా) 16-ఏప్రిల్ 6 వరకు: క్రికెట్-ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ (బంగ్లాదేశ్) 16: ఫార్ములావన్-ఆస్ట్రేలియా గ్రాండ్ప్రి 26-ఏప్రిల్ 3 వరకు: షూటింగ్-ప్రపంచ కప్, రైఫిల్-పిస్టల్ (అమెరికా) 30: ఫార్ములావన్-మలేసియా గ్రాండ్ప్రి ఏప్రిల్ 1-6: బ్యాడ్మింటన్-ఇండియా ఓపెన్ (నూఢిల్లీ) 4-6: టెన్నిస్-డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్స్ 6: ఫార్ములావన్-బహ్రెయిన్ గ్రాండ్ప్రి 7 - 23 : చెస్-మహిళల గ్రాండ్ప్రి (రష్యా) 8-15: షూటింగ్-ప్రపంచ కప్, షాట్గన్ (అమెరికా) 8-13: బ్యాడ్మింటన్-సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ (సింగపూర్) 20: ఫార్ములావన్-చైనా గ్రాండ్ప్రి 22-27: ఆర్చరీ-ప్రపంచ కప్ స్టేజ్-1 (షాంఘై) 23-27: రెజ్లింగ్-ఆసియా చాంపియన్షిప్ ఏప్రిల్-మేలలో ఐపీఎల్ (తేదీలు ఖరారు కాలేదు) మే 11: ఫార్ములావన్-స్పెయిన్ గ్రాండ్ప్రి 20-జూన్ 24 వరకు: క్రికెట్-ఇంగ్లండ్లో శ్రీలంక పర్యటన (ఒక టి20, ఐదు వన్డేలు, రెండు టెస్టులు) 16-25: షూటింగ్-ప్రపంచ కప్(కజకిస్థాన్) 25: ఫార్ములావన్-మొనాకో గ్రాండ్ప్రి 25 నుంచి జూన్ 8 వరకు: టెన్నిస్-ఫ్రెంచ్ ఓపెన్ (పారిస్) 31-జూన్ 15 వరకు: హాకీ-ప్రపంచ కప్ (నెదర్లాండ్స్) జూన్ 8: ఫార్ములావన్-కెనడా గ్రాండ్ప్రి 10-15: బ్యాడ్మింటన్-జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ (టోక్యో) 17-22: బ్యాడ్మింటన్-ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ (జకార్తా) 22: ఫార్ములావన్-ఆస్ట్రియా గ్రాండ్ప్రి 15-22: చెస్-ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ (దుబాయ్) 20-28: వెయిట్లిఫ్టింగ్-ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ (రష్యా) 23-జులై 6 వరకు: టెన్నిస్-వింబుల్డన్ (లండన్) జూలై 9 నుంచి సెప్టెంబరు 7 వరకు: క్రికెట్-ఇంగ్లండ్లో భారత్ పర్యటన (ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్) 1-10: షూటింగ్-ప్రపంచ కప్; రైఫిల్, పిస్టల్, షాట్గన్ (చైనా) 6: ఫార్ములావన్-గ్రేట్ బ్రిటన్ గ్రాండ్ప్రి 22-27: అథ్లెటిక్స్-ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ (అమెరికా) 20: ఫార్ములావన్-జర్మనీ గ్రాండ్ప్రి 27: ఫార్ములావన్-హంగేరి గ్రాండ్ప్రి ఆగస్టు 1-14: చెస్-వరల్డ్ ఒలింపియాడ్ (నార్వే) 5-10: ఆర్చరీ-ప్రపంచ కప్ స్టేజ్-4 (పోలండ్) 19-24: ఆర్చరీ-ప్రపంచ చాంపియన్షిప్ (క్రొయేషియా) 24: ఫార్ములావన్-బెల్జియం గ్రాండ్ప్రి 25-31: బ్యాడ్మింటన్-ప్రపంచ చాంపియన్షిప్ (డెన్మార్క్) 25 నుంచి సెప్టెంబరు 8 వరకు: టెన్నిస్-యూఎస్ ఓపెన్ (న్యూయార్క్) సెప్టెంబర్ 3-21: వాలీబాల్-పురుషుల ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (పోలండ్) 5-7: ఆర్చరీ-ప్రపంచ కప్ ఫైనల్స్ (స్విట్జర్లాండ్) 7: ఫార్ములావన్-ఇటలీ గ్రాండ్ప్రి 12-14: టెన్నిస్-డేవిస్ కప్ సెమీఫైనల్స్ 6-20: షూటింగ్-ప్రపంచ చాంపియన్షిప్ (స్పెయిన్) 8-14: రెజ్లింగ్-ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (తాష్కెంట్) 21: ఫార్ములావన్-సింగపూర్ గ్రాండ్ప్రి అక్టోబర్ 5: ఫార్ములావన్-జపాన్ గ్రాండ్ప్రి 12: ఫార్ములావన్-రష్యా గ్రాండ్ప్రి 14-19: బ్యాడ్మింటన్-డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ (ఒడెన్స్) 21-26: బ్యాడ్మింటన్-ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ (పారిస్) 21-28: షూటింగ్-ప్రపంచ కప్ ఫైనల్స్; రైఫిల్, పిస్టల్, షాట్గన్ (అజర్బైజాన్) 11-31: చెస్-మహిళల ప్రపంచ చాంపియన్షిప్ నవంబర్ 2: ఫార్ములావన్-అమెరికా గ్రాండ్ప్రి 4-16: వెయిట్లిఫ్టింగ్-ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (కజకిస్థాన్) 9: ఫార్ములావన్-బ్రెజిల్ గ్రాండ్ప్రి 9-16: టెన్నిస్-వరల్డ్ టూర్ ఫైనల్స్ (లండన్) 11-16: బ్యాడ్మింటన్-చైనా ఓపెన్ (గ్వాంగ్జూ) 18-23: బ్యాడ్మింటన్-హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ (కౌలూన్) 21-23: టెన్నిస్-డేవిస్ కప్ ఫైనల్ 23: ఫార్ములావన్-అబుదాబి గ్రాండ్ప్రి 5-25: చెస్-పురుషుల ప్రపంచ చాంపియన్షిప్ క్రికెట్: నవంబర్-డిసెంబర్లలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన- నాలుగు టెస్టులు, ముక్కోణపు వన్డే సిరీస్తో పాటు 2015 వన్డే ప్రపంచ కప్ వరకు పర్యటన కొనసాగుతుంది. డిసెంబర్ 10-14: బ్యాడ్మింటన్-వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ యూత్ ఒలింపిక్స్-2014 ఆగస్టు 16 నుంచి 28 వరకు (నాన్జింగ్, చైనా) ఆసియా క్రీడలు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు (ఇంచియోన్, దక్షిణ కొరియా) ఫుట్బాల్ ప్రపంచ కప్ జూన్ 12 నుంచి జూలై 13 వరకు (బ్రెజిల్) కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు (గ్లాస్గో, స్కాట్లాండ్) -
భాషణం: వెళ్లి ఆడుకో పో..!
పిల్లలున్న చోట ఆటలు ఉంటాయి. ఆటలు ఉన్న చోట అల్లరి ఉంటుంది. అల్లరి ఎక్కువైన చోట పెద్దలు కసురుకోవడమూ ఉంటుంది. మామూలే. పిల్లల ఏరియాలో పిల్లలు, పెద్దల ఏరియాలో పెద్దలు ఉన్నంత వరకు పర్లేదు. కొన్నిసార్లు పెద్దల మధ్యలోకి పిల్లలు వచ్చేస్తారు. పెద్దల పనుల్లోకి, పెద్దల మాటల్లోకి! అప్పుడు పెద్దవాళ్లకు కోపం వచ్చేస్తుంది. ‘వెళ్లి ఆడుకో ఫో’ అని ఒక తిట్టు తిట్టేస్తారు. ‘ఆడుకోమ్మా’ అనడం తిట్టు కాదు. ‘వెళ్లి ఆడుకో’ అన్నా, ‘ఆడుకో ఫో’ అన్నా తిట్టే. ఇంగ్లిషులో Go play with yourself! అంటారు. ఈవారం మనం play తో వచ్చే కొన్ని మాటలకు అర్థాలు తెలుసుకుందాం. play అంటే enjoy, game, act అని మూడు సాధారణ అర్థాలున్నాయి. playకి ఉన్న ఇంకో అర్థం risk money. రిస్క్ మనీ అంటే రేసుల్లో, స్టాక్ మార్కెట్లలో పెట్టిన డబ్బు. ఇలాంటి వాటిలో డబ్బు వస్తే మూటలకొద్దీ వస్తుంది. పోతే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. అందుకే రిస్క్ మనీ అన్నారు. బిజినెస్లో పెట్టేదీ కూడా రిస్క్ మనీనే. play అనే మాటతో వచ్చే phrasal verbs కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉదా: play around. దీనర్థం to behave in a silly way అని. బుద్ధిహీనంగా, తెలివితక్కువగా ప్రవర్తించడం అని. (Stop playing around and get on with your home work). play about అన్నా కూడా ఇదే అర్థం. ఞ్చడ ఛీౌఠీ అంటే తగ్గించి చెప్పడం, తగ్గించి చూపడం. (Military spokespeople tried to play down the seriousness of the disaster). ఞ్చడ ఠఞ అంటే ఎక్కువ చేసి చూపడం. (The official report plays up the likely benefits of the scheme, but glosses over the costs). ఞ్చడ ౌఠ్ట అంటే బహిర్గతం కావడం. (The debate will play out in the meetings and in the media over the next week or two). play chicken అంటే ఎవరు ధైర్యస్థులో తేల్చుకోడానికి ప్రమాదకరమైన ఆటలు ఆడడం, లేదా ప్రాణాంతకమైన పందేలు కాయడం. play hooky అంటే స్కూల్కి తరచు డుమ్మా కొడుతుండడం. ఞ్చడ ఛీజీట్టడ అంటే ఆటలో మోసం చేయడం. play the fool అంటే ఎదుటివాళ్లను నవ్వించడానికి, వారి ధ్యాసను మళ్లించడానికి పిచ్చివేషాలు వెయ్యడం. (Stop playing the fool, I'm trying to talk to you). play gooseberry అంటే ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రేయసీప్రియులు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ల మధ్యలోకి వెళ్లడం. play both ends against the middle అంటే తగువులు పెట్టి లాభం పొందడం. play footsie అంటే టేబుల్ కింద దొంగచాటుగా కాలిని కాలుతో నొక్కడం. (He kicked off his shoes and started playing footsie with her). play hardball అంటే అనుకున్నది సాధించడానికి గట్టిగా నిలబడడం, దృఢచిత్తంతో ఉండడం. play for time అంటే మనం సిద్ధం అయ్యేవరకు పనిని జాప్యం చేయడం. play God అంటే తను చెప్పిందే వేదం అన్నట్లుండడం. (Genetic engineers should not be allowed to play God, interfering with the basic patterns of Nature). play with ear అంటే ప్రణాళికను బట్టికాకుండా, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం. play to the gallery అంటే... అందరూ చూడండీ అన్నట్లు ప్రవర్తించడం. దృష్టిని తమవైపు మళ్లించుకోవడం. All work and no play ఇదొక సామెత. ఎప్పుడూ పని పనీ అంటుంటే నిన్నెవరూ పట్టించుకోరని చెప్పడం. అస్తమానం పనిలో మునిగివుండే మనిషికి మిగతా ప్రపంచంతో పని ఉండదు. కొన్నాళ్లకు ప్రపంచం కూడా ఆ మనిషి గురించి ఆలోచించడం మానేస్తుంది. వేడుకలు, ఉత్సవాలకు కూడా అతనికి ఆహ్వానం అందదు. అతని పేరెత్తితేనే బోర్గా ముఖం పెట్టేస్తారు. ‘కొంచెం మార్పు ఉండాలోయ్, లేదంటే లైఫ్ డల్గా ఉంటుంది’ అని చెప్పేటప్పుడు కూడా ఈ సేయింగ్ని వాడతారు. పూర్తి సామెత ఇలా ఉంటుంది All work and no play (makes Jack a dull boy). -
రూ. 2,700 కోట్లకు గేమ్స్, యాప్స్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మొబైల్ గేమ్స్, అప్లికేషన్ల మార్కెట్ 2016 నాటికి రూ.2,700 కోట్లకు చేరుకుంటుందని అవెండస్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. పెయిడ్ యాప్స్ ఒక్కటే రూ.2 వేల కోట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. స్మార్ట్ఫోన్ల అమ్మకాలతోపాటు 3జీ వాడకం బారీగా పెరగడమే ఇందుకు కారణమని అవెండస్ నివేదిక వెల్లడించింది. స్మార్ట్ఫోన్ యూజర్లు ఈ ఏడాది 6.7 కోట్లకు, 2016 నాటికి 38.2 కోట్లకు చేరతారని వివరించింది. అలాగే 3జీ యూజర్ల సంఖ్య 2013లో 5.6 కోట్లు, వచ్చే మూడేళ్లలో 26.6 కోట్లు ఉండబోతోందని తెలిపింది. పెయిడ్ యాప్స్ మార్కెట్ పరిమాణం 2012లో దేశంలో రూ.300 కోట్లుగా అంచనా. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫీచర్ ఫోన్లు సైతం గేమ్స్, యాప్స్ వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 3.6 కోట్లు మాత్రమే. అయితే ఇంటర్నెట్ సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ల సంఖ్య 43.1 కోట్లుండడం విశేషం. -
ఇబిఎల్ ఫైనల్లో హైదరాబాద్ హాట్ షాట్స్
-
ఉచిత శిక్షణ కోసం గెలిచేవాడిని!
ప్రపంచ క్రీడాపటంపై మరోసారి తెలుగు వెలుగులు... ఆర్చరీలో కడప కుర్రాడు చరణ్ రెడ్డి మూడు పతకాలతో సంచలనం సృష్టిస్తే.. ప్రపంచంలోని పోలీసుల మధ్య ప్రతిష్టాత్మకంగా సాగే పోలీస్ క్రీడల్లో విజయవాడకు చెందిన తులసీ చైతన్య ఏకంగా ఆరు పతకాలతో అదరగొట్టాడు. ‘చిన్నప్పటినుంచే స్విమ్మింగ్ అంటే అమితాసక్తి. వేసవి శిబిరంలో రాణిస్తే ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. దాంతో ప్రతి ఏటా పట్టుదలగా ఆడి గెలిచేవాడిని. అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది. కానిస్టేబుల్ కుమారుడినైన నాకు పోలీస్ శాఖలోనే తగిన గుర్తింపు దక్కింది. తాజా విజయాలు మా శాఖకు అంకితం’ అని ఏపీ స్విమ్మర్ తులసీ చైతన్య వ్యాఖ్యానించాడు. బెల్ఫాస్ట్లో జరుగుతున్న అంతర్జాతీయ పోలీస్ గేమ్స్లో చైతన్య 6 పతకాలు (3 స్వర్ణాలు, 3 రజతాలు) గెలుచుకోవడం విశేషం. స్కూల్ స్థాయి నుంచే... విజయవాడలో పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్నప్పుడు చైతన్యకు స్విమ్మింగ్పై ఆసక్తి కలిగింది. అప్పుడే స్కూల్ నేషనల్స్లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ‘శాప్’ అకాడమీలో చేరడంతో చైతన్య ఈత మెరుగుపడింది. ఆ తర్వాత 2003 నుంచి 2006 వరకు వివిధ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో నాగార్జున విశ్వ విద్యాలయం తరఫున స్వర్ణం నెగ్గాడు. రైల్వేస్లో నాలుగో తరగతి ఉద్యోగిగా ఎంపికైనా పోలీస్ ఉద్యోగంపై ఆసక్తితో కొన్నాళ్లకే దానిని చైతన్య వదిలేశాడు. స్పోర్ట్స్మన్గా విజయాలతో పాటు చక్కటి ఫిట్నెస్ రికార్డుతో అతను వెంటనే ఎంపికయ్యాడు. పోలీసుగా విజయాలు... పోలీస్ శాఖలో ఉద్యోగిగా ఉన్న చైతన్యకు తొలి సారి ఆలిండియా పోలీస్ అక్వాటిక్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అతని ప్రతిభను గుర్తించిన అడిషనల్ డీజీ (స్పోర్ట్స్) రాజీవ్ త్రివేది ఈ ఎంపిక చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ చైతన్య ఒక స్వర్ణం, మరో రజతం నెగ్గాడు. దాంతో త్రివేది అతడిని మరింతగా ప్రోత్సహించారు. వరల్డ్ పోలీస్ గేమ్స్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ కోసం బెంగళూరు పంపించారు. అక్కడ ప్రముఖ కోచ్ ప్రదీప్ కుమార్ వద్ద శిక్షణ పొందిన చైతన్య వరల్డ్ గేమ్స్లో అద్భుత విజయాలు అందుకున్నాడు . ‘అమెరికా, కెనడా, ఆస్ట్రేలియావంటి దేశాలనుంచి పోటీని తట్టుకొని ఇన్ని పతకాలు సాధించడం నమ్మలేకపోతున్నాను. నా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. త్రివేదిగారు ఎంతో ప్రోత్సహించారు. ఈ విజయాలు మా పోలీస్ శాఖకు అంకితం’ అని చైతన్య అన్నాడు. భవిష్యత్తులో స్విమ్మింగ్లో మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైతన్య వెల్లడించాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు హాజరైన తులసీ చైతన్య కోసం రాష్ట్ర హోంశాఖ రూ.1.76 లక్షలు సోమవారం విడుదలచేసింది. ‘త ఆరేళ్లుగా జూనియర్ స్థాయిలో పలు విజయాలు సాధించినా... జాతీయ స్థాయి సీనియర్ విభాగంలో పతకం కోసం శ్రమించాను. అయితే అది దక్కకపోయినా ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ పతకం సాధించడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి అన్నాడు. ఇటీవల మంగోలియాలో జరిగిన రెండో ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీ చాంపియన్షిప్లో చరణ్ మొత్తం 3 పతకాలు (స్వర్ణం, రజతం, కాంస్యం) గెలుచుకున్నాడు. రాష్ట్రానికి చెందిన రితుల్ ఛటర్జీ, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, జ్యోతి సురేఖ ఇప్పటికే అంతర్జాతీయ ఆర్చరీలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించగా తాజాగా చరణ్ ఆ జాబితాలో చేరాడు. మారిన చేయి!: సాధారణంగా ఆర్చరీలో ఎక్కువ మంది కుడి చేతి వాటంవారే కనిపిస్తారు. అయితే చరణ్ది భిన్నమైన శైలి. మామూలుగా కుడి చేతి వాటమే అయినా ఆర్చరీలో మాత్రం అతనిది ఎడమ చేతి వాటమే. కుడి కంటితో పోలిస్తే అతడి ఎడమ కన్ను దృష్టి బలంగా ఉండటమే అందుకు కారణం. ఈ విషయాన్ని గుర్తించిన కోచ్లు అతడిని అదే తరహాలో ప్రోత్సహించారు. ‘దీని వల్ల నేను సాధారణ ఎక్విప్మెంట్ వాడటంలో ఇబ్బంది పడ్డాను. పైగా స్పోర్ట్స్ స్కూల్లో ఎక్కువగా రికర్వ్ విభాగం విల్లులే ఉన్నాయి. దాంతో నా సొంత డబ్బులు వెచ్చించి నాకు అనుకూలమైన విల్లును కొనాల్సి వచ్చింది’ అని ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చరణ్ రెడ్డి వెల్లడించాడు. స్పోర్ట్స్ స్కూల్తోనే మొదలు...: వైఎస్సార్ కడపకు చెందిన చరణ్ రెడ్డిది సాధారణ కుటుంబ నేపథ్యం. తండ్రి ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్నారు. 2003లో అతను హకీంపేటలోని ఏపీ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికయ్యాడు. మూడేళ్ల ప్రాథమిక శిక్షణ అనంతరం ఆర్చరీ క్రీడను ఎంచుకున్న అతను కాంపౌండ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 25కు పైగా పతకాలు గెలుచుకున్నాడు. గత ఏడాది జార్ఖండ్లో టీమ్ చాంపియన్షిప్ స్వర్ణం నెగ్గిన ఏపీ జట్టులో అతను సభ్యుడు. స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి నర్సయ్య, కోచ్ రవిశంకర్ల ప్రోత్సాహంతో అతను మరింత పదును తేలాడు. మంగోలియా గ్రాండ్ప్రి కోసం జరిగిన ఇండియా టీమ్ సెలక్షన్స్లో టాపర్గా నిలిచిన చరణ్ ఆ ఈవెంట్లో సత్తా చాటాడు. ‘మరింత ప్రాక్టీస్ చేసి నిలకడగా ఆడాలని భావిస్తున్నాను. ప్రస్తుతం నాతో పాటు కోచ్, కుటుంబ సభ్యులందరిదీ ఒకటే లక్ష్యం. ఆసియా క్రీడల్లో పతకం నెగ్గాలనే పట్టుదలతో ఉన్నాను’ అని చరణ్ రెడ్డి చెప్పాడు.