మక్కా యాత్ర పవిత్రమైనదని అల్హరమైన్ హజ్–ఒ–ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ.ఆసిఫ్పాషా తెలిపారు.
పవిత్రయాత్ర మక్కా
Jan 9 2017 12:41 AM | Updated on Sep 5 2017 12:45 AM
కర్నూలు (ఓల్డ్సిటీ): మక్కా యాత్ర పవిత్రమైనదని అల్హరమైన్ హజ్–ఒ–ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ.ఆసిఫ్పాషా తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక భాగ్యనగర్లోని కార్యాలయంలో ఉమ్రా యాత్రికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్రా యాత్రికుల ఫ్లైట్ ఈనెల 16వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతుందన్నారు. అనంతరం యాత్రికులకు బ్యాగులు, ట్యాగులు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం.ఎ.ఆరిఫ్పాషా కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement