bags
-
రాహుల్గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’
ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్ చేశారు. బ్యాగులతో పాటు రాహుల్గాంధీ వచ్చిన హెలికాప్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. ఈ తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: కసబ్కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా -
తిరా ఈవెంట్ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్ అయితే!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ స్టైలిష్ లుక్స్తో ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేనా ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్ ఐకాన్గా పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో అంబానీ లేడీస్ తమ ప్రత్యేక నిలుపుకున్నారు. రిలయన్స్ బ్యూటీ వెంచర్ తిరా తన కొత్త స్టోర్ను ముంబైలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీపిరామిల్ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్సూట్ అందన్నీ ఆకట్టుకోగా, నీతా అంబానీ, లూజ్ ప్యాంట్, చెకర్డ్ బ్లేజర్తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి బ్యాగ్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నీతా అంబానీ పాప్కార్న్ బ్యాగ్నీతా అంబానీ పాప్కార్న్ పర్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్ ముత్యాలు, గోల్డ్-టోన్ మెటల్తో తయారు చేశారట.ఇషా అంబానీ బో క్లచ్ఫ్యాషన్ గేమ్లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్. చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ రిటైల్ చైన్ అయిన తీరా ఫ్లాగ్షిప్ స్టోర్ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్ క్వీన్లు మెరిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Limelight Nova (@limelightnova) ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
బ్యాగ్ బరువు తగ్గేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవం రోజైనా.. చిన్నారుల భవితవ్యంపై చర్చ జరగాలని పలువురు విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. కంప్యూటర్ల కాలంలోనూ బ్యాగ్ల బరువు మోత తప్పడం లేదంటున్నారు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్నిచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికీ దూరమవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇదీ మన చిన్నారుల పరిస్థితి.. కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం..70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయసులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వసాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తు భవనాల్లో ప్రైవేట్ స్కూళ్లుంటున్నాయి. బరువు వేసుకొని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఏవీ ఆ రూల్స్...? పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలంది. ఇలాంటి పరిస్థితి మరే దేశంలోనూ లేదని బరువులపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువుల వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కేలేదు. భుజాలు నొప్పిగా ఉంటాయి రోజూ 40 పుస్తకాలను స్కూలుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, వర్క్ïÙట్స్, నోట్బుక్స్ ఉంటాయి. లంచ్ బాక్స్, నీళ్లబాటిల్ అన్నీ బ్యాగులో ఉంటాయి. మూడు అంతస్తులు బరువు వేసు కొని ఎక్కాలి. భుజాలు నొప్పిగా ఉంటాయి. –సుంకర నవీన్, ఐదవ తరగతి కూకట్పల్లి మానసికోల్లాసం ముఖ్యం చదువుతో పాటు చిన్నారుల్లో మానసిక ఉల్లాసం పెంచాలి. అప్పుడే వారిలో ఆలోచన శక్తి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ పుస్తకాలతో బోధన ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారం పుస్తకాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇలా చెబితేనే మంచి విద్య అని తల్లిదండ్రులూ నమ్ముతున్నారు. వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. – పణితి రామనాథం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బరువు తగ్గించాల్సిందే పుస్తకాల బరువు వల్ల అనారోగ్య వాతావరణం కనిపిస్తోంది. బోధన విధానంలో ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అధిక బరువుల మోతను అరికట్టే యంత్రాంగం ఉండాలి. దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల మానసిక వ్యథపై ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం. – పింగిలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు -
ఫ్యాషన్తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్ సెన్సేషన్. ఢిల్లీకి చెందిన ఈమె సోషల్ యాక్టివిస్ట్, ఆర్టిస్ట్ కూడా. ఫ్యాషన్కు మారు పేరు. మరోవిధంగా చెప్పాలంటే వాకింగ్ ఫ్యాషన్ఎగ్జిబిషన్. అదిరిపోయే డ్రెస్లు, అద్భుతమైన హెడ్పీస్లు, ఆకట్టుకునే బ్యాగ్లు ఇలా షాలిని స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె బ్యాగులు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి.ఆమె బ్యాగుల కలెక్షన్ చాలా స్పెషల్మాత్రమేకాదు, ధర కూడా కళ్లు చెదిరే రేంజ్లోనే. పావురాలు, చిలుకలు, పాత కెమెరాలు ఇలా రకరకాల షేపుల్లో ఆమె బ్యాగులు మెస్మరైజింగ్గా ఉంటాయి.ఒక ఎపిసోడ్లో, షాలిని క్లాసిక్ క్లిక్ కెమెరాను పోలి ఉండే క్లచ్తో కనిపించింది. పాతకాలపు కెమెరా ఆకారంలో క్రిస్టల్-స్టడెడ్ హ్యాండ్బ్యాగ్ ధర సుమారు 5 లక్షల రూపాయలు. మరో ఎపిసోడ్లో ఆమె చేతిలో మెరిసిన ఫ్లెమింగో క్లచ్ ధర అక్షరాలా రూ. 5,400,000.బ్రిక్ ఫోన్ బ్యాగ్ ధర రూ. 600,000, ఇంకా 8 లక్షల, 30వేల విలువ చేసే టీవీ టెస్ట్ స్క్రీన్ బ్యాగ్, దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే క్రిస్టల్ హార్ప్ క్లచ్తో ఆకర్షణీయమైన లుక్లో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా, షాలిని జెల్లీ ఫిష్, టెడ్డీ బేర్స్, చిలుకలు, గులాబీలు, కుక్కలు , ఇతర ఫన్నీ బ్యాగ్స్కూడా ఆమె సొంతం.కాగా షాలిని పాసి భర్త బిలియనీర్,పాస్కో గ్రూప్ ఛైర్మన్ సంజయ్ పాసి. ఈ దంపతుల రాబిన్ రాబిన్ . ఇక ఈ సిరీస్లో మహీప్ కపూర్, నీలం కొఠారి, భావన పాండే, రిద్ధిమా కపూర్ సాహ్ని, సీమా సజ్దేహ్ మరియు కళ్యాణి సాహా చావ్లా కూడా నటించారు -
కేన్ క్రాఫ్ట్! ఆకట్టుకునే ఆకృతులు.. పర్యావరణ స్నేహితులు!
సాక్షి, సిటీబ్యూరో: నడిరోడ్డుపైన కొలువుదీరిన ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్టు వెదురు, కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికీ, వైవిధ్యానికి పట్టం గడుతున్నాయి. ఖరీదైన మాల్స్లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు, కేన్తో తయారు చేసిన బుట్టలు, బ్యాగ్లు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మది దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.రూ.200 నుంచి రూ.25 వేల వరకూ..ఒకొక్కటీ సుమారుగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఎన్ని మార్కెట్లు ఉన్నా మా వినియోగదారులు మాకున్నారంటున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉండాలే గాని ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, ఫైబర్, వంటివి ఎన్ని మోడల్స్ వచి్చనా సంప్రదాయ కళలకు ప్రజాదరణ ఉంటుందని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.ఇదే జీవనాధారం.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచి్చన ఓ కుటుంబం సంప్రదాయ హస్తకళనే జీవనాధారంగా చేసుకుంది. రామానాయుడు స్టూడియో నుంచి కిందికి వెళ్లే రోడ్డులో ఫుట్పాత్పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లో విద్యుత్తులైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతరు లైట్లు, తయారుచేస్తున్నారు. లాంతరు లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు, పెద్దపెద్ద హాల్స్లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువులను అక్కడికక్కడే తయారుచేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.పర్యావరణ హితం కోసం.. వెదురుతో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నాం. మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కళ ఇది. మాకు ఇదే జీవనాధారం. వివిధ ఆకృతుల్లో అందంగా, ఆకట్టుకునే వస్తువులను తీర్చిదిద్దుతున్నాం. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడిసరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తాం. పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కూలి గిట్టుబాటు అయితే చాలనుకుంటాం. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయి. రోజు పదుల సంఖ్యలో వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయి. – రమేష్, తయారీదారుడు, జూబ్లిహిల్స్ -
ఎన్నికల ‘కురుక్షేత్రం’.. మూటలు మోసిన కుబేరుడు!
Naveen Jindal: ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అపర కుబేరుడు, జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్లో కొనసాగారారు. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కొద్దిరోజుల కిందటే కాషాయ కండువా కప్పుకొన్న నవీన్ జిందాల్ అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్తో రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. హర్యానాలోని మొత్తం 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష కూటమి పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. हरियाणा के किसान, देश की जान...🙏 pic.twitter.com/WNdJZduS1P — Naveen Jindal (@MPNaveenJindal) April 17, 2024 -
వాడేసిన ప్లాస్టిక్తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్లు, కూరగాయల బ్యాగ్లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్పర్ట్గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
పొల్యూషన్కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్!
ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే.. సుప్రియా ఇంతవరకు మార్కెట్లోకి రాని వేగన్కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్లు, వాలెట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో కూడా ఈ బ్రాండ్కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్బ్యాగ్లు మరియు వాలెట్లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు. సతమ్ నేపథ్యం.. సతమ్ మార్కెటింగ్లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్వేస్లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్. అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్లు వ్యాలెట్లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది. బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే.. ఈ బ్రాండ్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్తో సతమ్ మంచి సక్సెస్ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్లైన్లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
ఆమె పేరే ఓ బ్రాండ్
గుజరాత్లోని కచ్లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది. ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం. కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్. పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది. -
బిగ్ డీల్: బీఈఎల్కు రూ.5,900 కోట్ల ఆర్డర్లు
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్) తాజాగా రూ.5,900 కోట్ల ఆర్డర్లకు చేజిక్కించుకుంది. ఇందులో ఆకాశ్ ప్రైమ్ వెపన్ సిస్టమ్ నుంచి రూ.3,914 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్లలో భాగంగా శక్తి ఈడబ్లు్య, సాంకేత్, ఎంకే–3 (నావల్ సిస్టమ్స్), జామర్ సిస్టమ్స్, ఎంకేబీటీ సిస్టమ్స్, ఎంకే–12 క్రిప్టో మాడ్యూల్స్ తయారీ, రోహిణి రాడార్స్ ఎస్డీపీ డిస్ప్లే ఆధునీకరణ చేపడుతుంది. ఇవీ చదవండి: హైదరాబాద్లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు WhatsApp Latest Features: స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్ -
ప్రపంచంలోని టాప్ 10 ఫ్యాషన్ బ్రాండ్లు
-
షాకింగ్ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!
అమెరికాలోని పశ్చిమ మెక్సికో రాష్ట్రంలో ఒళ్లు గగ్గుర్పొడిచే భయానక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. అందులో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద పారిశ్రామిక కేంద్రమైన గ్వాడలజారా శివారు ప్రాంతమైన జపోపాన్ మున్సిపాలిటీ వద్ద ఓ 40 మీటర్ల లోయలో ఈ భయానక ఘటన వెలుగు చూసిందని తెలిపారు. 30 ఏళ్ల వయసుగల ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు తప్పిపోయినట్లు ఫిర్యాదు రావడంతో వారి ఆచూకి కోసం వెతుకుతుండగా..ఈ ఘటన బయటపడింది. ఆయా వ్యక్తుల మిస్సింగ్ కేసులు వేర్వేరు రోజుల్లో వేర్వేరుగా అందినట్లు చెప్పుకొచ్చారు. అయితే వారందరూ ఒకే కాల్ సెంటర్లో పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతంలోనే కాల్సెంటర్ కూడా ఉంది. పోరెన్సిక్ నిపుణులు భాదితులు సంఖ్య, గుర్తింపును వెల్లడించాల్సి ఉంది. కాల్ సెంటర్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగి ఉండవచ్చిని అనుమానిస్తున్నారు. ఆ కాల్ సెటర్ వద్ద మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలిపారు. ఐతే బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వారిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు యత్రిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, జాలిస్కాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తొలిసారి కాదు. 2021లో, జాలిస్కోలోని తోనాలా మునిసిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 బ్యాగులు బయటపడ్డాయి. అంతకుమునుపు 2019లో జపోపాన్లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మానవ అవశేషాలను కనుగొన్నారు. కానీ 2018లో ముగ్గురు చలన చిత్ర విద్యార్థులు మిస్సింగ్ కేసులో.. వారి అవశేషాలు యాసిడ్లో కరిగిపోవడం అత్యంత వివాదాస్పదంగా మారి నిరసనలకు దారితీసింది. (చదవండి: ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరసిస్తూ.. నగ్నంగా నిలబడి..) -
గోద్రెజ్కు రూ.2,000 కోట్ల ఆర్డర్లు
న్యూఢిల్లీ: గోద్రెజ్ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రూ.2,000 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. పవర్ ట్రాన్స్మిషన్, రైల్వేస్, సోలార్ ప్రాజెక్టుల నుంచి తమ అనుబంధ కంపెనీ ద పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెనివేబుల్ ఎనర్జీ వీటిని అందుకుందని సంస్థ గురువారం ప్రకటించింది. రూ.900 కోట్ల ఆర్డరుతో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ విభాగంలోకి గోద్రెజ్ ప్రవేశించినట్టు అయింది. అలాగే గోద్రెజ్ తన పోర్ట్ఫోలియోను ఈహెచ్వీ కేబుల్, ఈహెచ్వీ సబ్స్టేషన్, ట్రాక్షన్ సబ్స్టేషన్, సోలార్ ప్రాజెక్ట్లలో దేశవ్యాప్తంగా, అలాగే నేపాల్లో విస్తరించింది. (ఇదీ చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్గా -
షాకింగ్: కండోమ్స్, గర్భనిరోధకాలతో స్కూల్కు విద్యార్థులు..!
బెంగళూరు: హైస్కూల్ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్స్, కండోమ్స్, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్స్ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేఏఎంఎస్). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయి. అలాగే వాటర్ బాటిల్లో లిక్కర్ దొరికింది.’ అని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్కు గురయ్యారని నగరభావి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్లో షేర్ చేశారు. తాము స్కూల్కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు. ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
రస్సోఫోబియా.. ఉక్రెయినీయన్ల ప్రాణాల కంటే ఎక్కువా?
ఒకవైపు యుద్ధ భయంతో ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచిపారిపోతున్నారు. మరోవైపు యుద్ధంలో ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించని కొందరు.. తిన్నది ఆరగక చేస్తున్న నిరసన గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. రష్యాలో ఉన్నత వర్గాలకు చెందిన కొందరు మహిళలు.. తమ లెదర్ హ్యాండ్ బ్యాగులను కత్తిరించి, ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఫ్రెంచ్(ఫ్రాన్స్) లగ్జరీ ఐటెమ్స్ బ్రాండ్ ‘చానెల్’.. తమ ప్రొడక్టులను రష్యన్ లేడీస్కు అమ్మకూడదని నిర్ణయించుకుంది. రష్యాపై ఈయూ ఆంక్షల నేపథ్యంలో చాలా కాలం కిందటే స్టోర్లను సైతం మూసేసింది చానెల్. ఇప్పుడు ఆన్లైన్లోనూ అమ్మకాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ తరుణంలోనే వీళ్లు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రస్సోఫోభియా-సపోర్టింగ్ బ్రాండ్స్ ట్రెండ్కు వ్యతిరేకంగా ప్రముఖ మోడల్ విక్టోరియా బోన్యా, నటి మరినా ఎర్మోష్ఖినా తో పాటు టీవీ సెలబ్రిటీలు, డిస్కో జాకీలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. కత్తెరతో తమ దగ్గరున్న చానెల్బ్యాగులను ముక్కలుగా కత్తిరించేస్తున్నారు. View this post on Instagram A post shared by Екатерина Гусева (@djkatyaguseva) ‘మాతృదేశం కోసం..’ అంటూ వాళ్లు చేస్తున్న పనికి కొంత అభినందనలు దక్కుతున్నా.. విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ పౌరులు ప్రాణ భయంతో దేశం విడిచిపోతున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికి మించి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ గడ్డపై మారణహోమానికి తెగపడుతున్నాయి. ఇందులో ఏ ఒక్క అంశంపై స్పందించేందుకు ధైర్యం లేని వీళ్లు, కనీసం సాటి మనుషులకు సంఘీభావం తెలపని వీళ్లు.. ఇలా బ్యాగులను చింపేస్తూ నిరసన తెలపడం నిజంగా విడ్డూరం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. -
6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!
ఇరవై ఎనిమిదేళ్ల ఓషియానాకు వ్యాపారం చేయాలన్న ఆశ బలంగా ఉంది. కానీ ‘‘ఇంట్లో ఎవరూ వ్యాపారస్థులు లేరు, ఏ అనుభవం లేకుండా వ్యాపారం ఎలా చేస్తావు’’ అంటూ తల్లిదండ్రులు ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లారు. అయితే అక్కడితో తన ఆశను వదిలేయకుండా, వాళ్లను ఎలాగో ఒప్పించి ఓ స్టార్టప్ ను ప్రారంభించింది. అనుభవం లేకపోయినా అంకిత భావం ఉండటం వల్ల ప్రారంభంలో ఎదురైన అనేక ఆటుపోట్లను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోయింది. ఫలితం.. ఇప్పుడామె ఆదాయం నెలకు కొన్ని లక్షలు. అలా వ్యాపారం చేయాలన్న ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తోంది ఓషియానా. ఢిల్లీకి చెందిన ఓషియానా ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ‘ఫ్యాషన్ ఎక్స్పోర్ట్ హౌజ్’లో చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తోంది కానీ మనసులో మాత్రం బిజినెస్ చేయాలని బాగా కోరిక. తన కోరికను తల్లిదండ్రుల ముందుంచితే ‘‘ఉద్యోగంలో ఎటువంటి రిస్కూ ఉండదు. వ్యాపారం అయితే లాభనష్టాలతో కూడుకున్నది. ఎక్కువ ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగం చెయ్యి’’ అని ప్రభుత్వ ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు ఆమెను వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఓషియానా వారి అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ తన మనసులో ఉన్న బిజినెస్ ప్లాన్ గురించి వివరించి ‘‘మీరు నాకు ఆరునెలలు సమయం ఇవ్వండి. నన్ను నేను నిరూపించుకుంటాను. అది జరగని పక్షంలో మీరన్నట్లే చేస్తాను’’ అని చెప్పి ఒప్పించింది. ఫ్రెండ్తో కలిసి.. తల్లిదండ్రులు ఒప్పుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా 2019 ఫిబ్రవరిలో తన స్నేహితుడు సౌరభ్ తోకస్తో కలిసి ‘మోడ్రన్ మిత్’ పేరిట ఓ స్టార్టప్ను ప్రారంభించింది. ఓషియానా ఉద్యోగం చేసేటప్పుడు దాచుకున్న డబ్బులు, ఇంకా సౌరభ్ తెచ్చిన కొంత మొత్తం కలిపి ఆరు లక్షల రూపాయలతో.. నాలుగు కుట్టు మిషన్లు, నలుగురు కళాకారులతో రెగ్జిన్ , కార్క్, కాటన్ , పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్ వంటి వీగన్ పదార్థాలతో బ్యాగ్ల తయారీ మొదలు పెట్టింది. చూడటానికి చాలా మోడర్న్గా ఉంటూ మన్నికగా ఉండే ఈ బ్యాగ్లకు మంచి ఆదరణ లభించింది. విక్రయాలు బాగా జరిగేవి. అలా వచ్చిన లాభాన్ని మళ్లీ దానిలోనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చింది. నేడు 15 మంది హస్త కళాకారులు, పది మిషన్లతో మోడ్రన్ మిత్ దూసుకుపోతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మిత్ కస్టమర్లకు నాణ్యమైన బ్యాగ్లు అందించేందుకు ప్రస్తుతం అందుబాటు లో ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్లను వాడుకుని నెలకు 14 నుంచి 20 లక్షల వరకు ఓషియానా ఆర్జిస్తోంది. డిజైన్ , నాణ్యతే మా ప్రత్యేకత ‘‘ఫ్యాషన్ పరిశ్రమలో డిజైన్ తోపాటు నాణ్యత చాలా ముఖ్యం. అందుకే నేను ముందు మంచి హస్తకళాకారులను అన్వేషించాను. తరతరాలుగా అదే పనిచేస్తోన్న కుటుంబాలకు చెందిన కళాకారులను ఎంపికచేశాను. నా కంపెనీలో పనిచేస్తోన్న కళాకారుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కూడా ఉన్నారు. వీళ్లు చేతితోనే అందమైన డిజైన్లు రూపొందిస్తారు. రెగ్జిన్ , కార్క్, కాటన్ లను ఢిల్లీ, కోల్కతాల నుంచి సేకరించి అందమైన బ్యాగ్లు రూపొందిస్తున్నాము. పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్ను కూడా తయారీలో వాడుతున్నాం. వీటివల్ల పర్యావరణానికి హాని కలగదు. మా దగ్గర 130 రకాల బ్యాగ్లు తయారవుతాయి. వీటిలో హ్యాండ్ బ్యాగ్స్, టాట్స్, స్లింగ్ బ్యాగ్స్, మేకప్ పౌచ్లు, ట్రావెలింగ్, ల్యాప్టాప్ బ్యాగ్లు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార అనుభవం లేని అమ్మాయిగా ప్రారంభంలో నాకు చాలా సమస్యలు ఎదురైనప్పటికీ సౌరభ్ సాయంతో అన్నింటినీ అధిగమించగలిగాను. మా ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా నేరుగా కస్టమర్లకు చేరుస్తూ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తున్నాను. ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే ముందు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాన్ని బాగా పరిశోధించి అర్థం చేసుకోవాలి. తర్వాత తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దానిపై పట్టు సాధించాక అంచెలంచెలుగా దానిని పెంచుకోవాలి’’ అని స్టార్టప్ ఔత్సాహికులకు సూచిస్తోంది ఓషియానా. -
నీతా అంబానీ : తగ్గేదే..లే! ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ. రిలయన్స్ ఛైర్మన్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ భార్యగా కంటే, కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, దాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. • 1985లో 20 ఏళ్ళ వయసులో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీతో వివాహం • ఆకాష్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు • ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో చోటు • ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలు • నీతా అంబానీకి లగ్జరీ కార్లంటే మోజు • ఆడి ఏ9 కమేలియన్ అత్యంత విలాసవంతమైన కారున్న తొలి భారతీయ మహిళ • ఈ ప్రత్యేక ఎడిషన్ కారు ఖరీదు సుమారు 100 కోట్ల రూపాయలు • ఈ కారు డ్రైవర్ జీతం సంవత్సరానికి రూ. 24 లక్షలు. • నీతా అంబానీ కార్ల లిస్ట్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే లాంటి మోడల్ కార్లు ఉన్నాయి. • నీతా అంబానీ డిజైన్స్ , స్టైల్స్ విషయంలో చాలా అప్డేట్గా ఉంటారు. నీతా జ్యుయల్లరీ కలెక్షన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వేసింది మళ్లీ వేసేదే లే.. సాంప్రదాయ బంగారు ఆభరణాలు, హారాలు, వడ్డాణాలు వజ్రాల ఉంగరాలు, అరుదైన డైమండ్ చోకర్లు ఇలా కోట్లాది రూపాయల కలెక్షన్ ఆమె సొంతం. నీతా అంబానీ అత్యంత ఖరీదైన చెప్పులు, షూ కలెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. వేసినవి మళ్లీ వేయకుండా లగ్జరీకి, రాయల్టీకి పెట్టింది పేరుగా ఉంటాయి. పెడ్రో, జిమ్మీ చూ, గార్సియా మార్లిన్ తదితర విలాసవంతమైన బ్రాండ్లను ఆమె వాడతారు. రూ.40 లక్షల చీర నీతా అంబానీ సారీ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి సెలబ్రిటీలైనా నీతా తరువాతే ఎవరైనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరలలో ఒకటిగా పేరొందిన రూ.40 లక్షల చీరను ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ధరించడం విశేషం. జాకెట్టు వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన శ్రీకృష్ణుడి అందమైన చిత్రం హైలైట్గా నిలిచింది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. కేవలం పట్టు చీరలు, బంగారంతో, చేతితో నేసిన చీరలే కాదు రియల్ డైమండ్స్, రూబీ, పుఖ్రాజ్, పచ్చ, ముత్యాలు, ఇతర మరెన్నో అరుదైన రత్నాలు పొదిగిన చీరలు ఆమె వార్డ్ రోబ్లో కొలువు దీరాయి. కళ్లు చెదిరే లిప్స్టిక్ కలెక్షన్ సాంప్రదాయ దుస్తులు, అరుదైన ఆభరణాలు, హై-బ్రాండ్ షూసే కాదు నీతా అంబానీకి లిప్స్టిక్లపై కూడా పిచ్చి ప్రేమ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్స్టిక్ల అరుదైన సేకరణ ఆమె సొంతం. లిపిస్టిక్ ప్యాకేజ్లే బంగారం, వెండితో తయారు చేసినవి అంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నీతా అంబానీ లిప్స్టిక్ కలెక్షన్ విలువ రూ. 40 లక్షలట. కార్పొరేట్ జెట్ 2007లో, ముఖేశ్ అంబానీ తన అందమైన భార్య నీతాకు విలాసవంతమైన కార్పొరేట్ జెట్ను పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారు. దీని అంచనా ధర రూ. 240 కోట్లు. కస్టమ్-ఫిట్ చేసిన ఆఫీస్, ఒక ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్ సెట్లు, వైర్లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్రూమ్, విలాస వంతమైన బాత్రూమ్లు ఇందులో ఉన్నాయి. మరో పుట్టినరోజుకు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కారును బహుమతిగా ఇచ్చారు ముఖేశ్. 3 లక్షల వజ్రాలు పొదిగిన దీని ధర రూ.30 కోట్లు. కోట్ల విలువచేసే జపనీస్ టీ సెట్ పురాతన అరుదైన వస్తువుల పట్ల నీతా అంబానీకి అమితమైన ప్రేమ. జపాన్లోని పురాతన కత్తుల సెట్ తయారీదారులు నోరిటాకేకుచెందిన స్పెషల్ టీ సెట్ దీనికి ఉదాహరణ. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు. లగ్జరీ హ్యాండ్బ్యాగ్లు ఫ్యాషన్ ఐకాన్గా డేన్సర్గా, డిజైనర్గా ఆకట్టుకునే 'కార్పొరేట్ లేడీ' నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్బ్యాగ్ల గురించి పత్ర్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కార్పొరేట్ మీట్ నుండి ఫ్యామిలీ ఈవెంట్ల వరకు, నీతా అంబానీకి అత్యంత ఖరీదైన హ్యాండ్బ్యాగ్ ఉండాల్సిందే. ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్స్ ఫెండి, సెలిన్ నుండి హెర్మేస్ వరకు ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షనే. దీంతోపాటు ఆమె ధరించే కార్టియర్, బల్గారీ, గూచీ లాంటి పాపులర్ బ్రాండ్ల వాచెస్ మరో ప్రత్యేక ఆకర్షణ ఫిట్గా ఉండేందుకు డైట్, వర్క్అవుట్స్ కఠినమైన డైట్ ప్లాన్ పాటిస్తారు నీతా. ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ , ఎగ్ వైట్ అల్పాహారం. మధ్యాహ్న భోజనంలో సూప్, తాజా ఆకుకూరలు, కూరగాయలను ఇష్టపడతారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు, మొలకలు, సూప్ తీసుకుంటారు. రోజంతా మధ్యలో పండ్లు తీసుకుంటారు. అంతేకాదు ఎంత రాత్రి అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్ సెషన్ను అస్సలు మిస్ కారు. స్విమ్మింగ్, యోగా శాస్త్రీయ నృత్యం వంటి అనేక శారీరక వ్యాయామాలను చేస్తారు. తనను తాను హైడ్రేట్గా ఉంచుకునేందుకు డిటాక్స్ వాటర్తోపాటు, బీట్రూట్ రసాన్ని డిటాక్స్ వాటర్గా తాగడానికి ఇష్టపడతారు నీతా. బీట్రూట్ జ్యూస్ శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. అందుకే ఆమె చర్మం ఎపుడు మెరుస్తూ, తాజాగా ఉంటుంది. ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమెకు కొత్త చెప్పులు లేదా షూస్ ఉండాల్సిందే. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ అయిన నీతా అడ్మిషన్ సీజన్లో అస్సలు ప్రయాణాలు పెట్టుకోరు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. బాలికా విద్యా, మహిళా క్రీడాకారులకు అండగా నిలుస్తారు. దీంతోపాటు కరోనా సమయంలో అనేక చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. - సాక్షి, వెబ్డెస్క్ ప్రత్యేకం -
విద్యా కానుక: బ్యాగ్లు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విద్యా కానుక కిట్లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ‘జగనన్న విద్యాకానుక’ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి అదనంగా అయ్యే ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది. జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. 1 నుంచి 10 వ తరగతి బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు. చదవండి: వన్టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్ -
బయటకు మాత్రమే అవి బస్తాలు; అసలు కథ వేరే ఉంది
టెక్కలి రూరల్: కుంకుడుకాయలు, మామిడి ముక్కల బస్తాల మాటున రవాణా అవుతున్న గుట్కా ప్యాకెట్లను టెక్కలి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి నుంచి అక్రమంగా గుట్కా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు టెక్కలి సీఐ ఆర్ నీలయ్య, ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు సిబ్బందితో కలిసి నర్సింగపల్లి వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఏపీ 39టీఎం 8581 నంబర్ బొలేరో వాహనంలో కుంకుడుకాయలు, మామిడి ముక్కల బస్తాల మధ్య అక్రమంగా రవాణా చేస్తున్న 19 బస్తాల గుట్కా, 30 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వ్యాన్తో పాటు గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముదిలి బాలకృష్ణ, సవర చిన్నలపై కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈ బ్యాగులు చూస్తే కొనాలని కాదు..తినాలనిపిస్తాయ్!
ఖరీదైన బ్రాండ్ ‘హమీజ్’ సంస్థ రొటీన్కు భిన్నంగా అంటే లెదర్తో కాకుండా కూరగాయలతో బ్యాగ్లను తయారు చేసింది. ధరా రొటీన్కు భిన్నమే. ధరే ప్రకటించకపోవడం. కారణం అమ్మకానికి కాకుండా ఆసక్తికోసం తయారైన బ్యాగ్లు కావడం. ప్యారిస్కు చెందిన డిజైనర్ బెన్ డెన్జర్.. తాజా కీరా, బ్రొకొలీ, క్యాబేజ్, యాపిల్తో కొన్ని బ్యాగులను రూపొందించాడు. వాటిని హమీజ్ సంస్థ తన ఇన్స్టాగ్రామ్లో ‘నోరూరించే కళాత్మకమైన హమీజ్ బ్యాగ్లు’ అంటూ పోస్ట్ చేసింది. దాంతో అవి ఆ బ్రాండ్ న్యూడిజైనర్ బ్యాగ్స్ అనుకొని కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. తర్వాత ఆ బ్యాగులు అమ్మకానికి పెట్టినవి కాదని తెలిసి నిరాశ పడ్డారు. ఈ వ్యవహారమంతా వైరల్గా మారింది. ఊహించని ఆ స్పందనను గుర్తించి త్వరలోనే ఈ డిజైనర్ బ్యాగ్లను అందిస్తామని హమీజ్ సంస్థ ప్రకటించడం కొసమెరుపు. -
ఈ విమానం మీరు ఎక్కడికే వెళ్తే అక్కడికి వస్తుంది..!
మగువల అందానికి అదనపు ఆకర్షణగా నిలిచేవి హ్యాండ్ బ్యాగ్స్. విదేశీ ప్రయాణాల్లో, పార్టీల్లోను, గెట్ టూ గెదర్ ఫంక్షన్లలో ఇతరులను ఆకట్టుకునేందుకు యువతులు రకరకాల డిజైన్లతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వారి ఇష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలు రకరకాల ఆకారాల్లో బ్యాగులను మార్కెట్లలో విడుదల చేస్తుంటాయి. వాటిలో ఎక్కువ శాతం బ్యాగులు ఆకట్టుకుంటే మరికొన్ని బ్యాగులు సహజత్వాన్ని కోల్పోయి నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ ను మిగుల్చుతాయి. ఇటీవల ప్రముఖ అమెరికన్ డిజైనర్ వర్జిల్ అబ్లో ఫాల్ వింటర్ 2021తో విమానం ఆకారంలో ఉండే ఓ బ్యాగ్ను డిజైన్ చేశాడు. ఆ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 28 లక్షలు(రూ.28,61,235) ఈ బ్యాగులను లూయిస్ విట్టన్ అనే ఫ్యాషన్ సంస్థ మార్కెట్ లో విడుదల చేసింది. మోనోగ్రామ్ లోగోతో డిజైన్ చేసిన ఈ బ్యాగ్ ను లూయిస్ విట్టన్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విమానం ఆకారంలో ఉన్న బ్యాగ్ను చూసి నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. విమానం ఆకారంలో ఉండే బ్యాగ్ను డిజైన్ చేసే కంటే నువ్వే ఓ నిజమైన విమానం కొనుగోలు చేయోచ్చు కదా అని ఓ నెటిజన్ అంటుంటే.. మరో నెటిజన్ ఈ విమానాన్ని దొంగ తనం చేసి వీధుల్లో తిప్పుకుంటా! అందం లేదు, స్టైల్గానూ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. Louis Vuitton Fall/Winter 2021 Airplane Bag by Virgil Abloh 💰$39,000 pic.twitter.com/GEUmoylYqD — SAINT (@saint) April 2, 2021 -
కిలేడీలు: అమాయక మహిళలే టార్గెట్!
రాజాం సిటీ: అమాయక మహిళలే టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలేడీలను రాజాం రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 వేలు స్వాదీనం చేసుకున్నారు. రాజాం రూరల్ సర్కిల్ స్టేషన్లో సీఐడీ నవీన్ వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకుల వద్ద మాటువేసి పిక్ పాకెటింగ్ చేయడమే పనిగా పెట్టుకుని ఆటోల్లో ప్రయాణిస్తున్న అమాయక మహిళల బ్యాగులు కాజేస్తున్నారు. ఇటీవల జి.సిగడాం మండలం మెట్టవలసకు చెందిన ఓ మహిళ రాజాం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఆటో ఎక్కగా, పొగిరి దాటిన తర్వాత ఆమె బ్యాగును కట్ చేయడాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే నిందితురాలు జారుకోవడంతో జి.సిగడాం పోలీసులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో మెట్టవలస జంక్షన్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న వారికి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేస్తున్నట్లు అంగీకరించారు. ఇటువంటి దోపిడీ ముఠాలు వంగర మండలం కోదులగుమ్మడ, జియ్యమ్మవలస దగ్గర తురకనాయుడుపేట, గజపతినగరం దగ్గర పిట్టాడ, కొత్తవలస తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానిత వ్యక్తులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జి.సిగడాం ఎస్సై మహ్మద్ ఆజాద్, ట్రైనీ ఎస్సై దివ్యజ్యోతి పాల్గొన్నారు. -
షాపింగ్ బ్యాగులతో వినూత్నంగా డ్రెస్సులు
షాపింగ్కు నుంచి వచ్చేటప్పుడు వెంట అక్కడి బ్యాగ్ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. అలా ఒక్కోటిగా పేరుకుపోయిన బ్యాగులను మూలన పడేయడం లేదా చెత్తబుట్ట పాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 22 ఏళ్ల టీచా ఏరియల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. రకరకాల షాపింగ్ బ్యాగులతో డిజైనర్ డ్రెస్సులను రూపొందిస్తుంది. ఆ డ్రెస్సులను ధరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆమె ఆలోచనను యూజర్స్ తెగ ప్రశంసిస్తున్నారు. వేస్టేజ్ను ఎలా తిరిగి వాడుకోవచ్చో ఈ విధానం భేషుగ్గా తెలియజేస్తుందని లైక్ల మీద లైకులు ఇస్తున్నారు. ఏరియల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థి. తను చేసిన ఆలోచన మాత్రం ప్రపంచమంతా ఆకట్టుకునేలా ఉంది. షాపింగ్ బ్యాగుల నుండి అధిక మొత్తంలో ఫ్యాషన్ దుస్తులను సృష్టించిన ఘనత ఏరియల్ సొంతం. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేసింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు చేసే ఆలోచనల్లో షాపింగ్ బ్యాగ్ డ్రెస్సులు క్లిక్ అయ్యాయి. ఒక్కో బ్యాగ్ కట్ చేసి.. వినూత్నంగా డ్రెస్సులు తయారు చేయడానికి ఇంట్లో స్టోర్ రూమ్లో ఉంచిన బ్యాగ్లను బయటకు తీసుకువచ్చింది. లాక్డౌన్ టైమ్ ఈ సృజనకు కొంత ఊతమిచ్చింది. ‘మొదట్లో ఖాళీ సమయం బాగా విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే షాపింగ్ బ్యాగుల నుండి ఫ్యాషన్ డ్రెస్సులను తయారుచేయాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సమయమే తెలియలేదంటుంది’ ఏరియల్. డ్రెస్సుల కోసం వాల్మార్ట్, టార్గెట్, వేన్స్, ట్రేడర్ జో బ్రాండ్ బ్యాగ్లను ఉపయోగించింది. ఆమె తన ఫ్రెండ్తో కలిసి ప్రతి సంచిని జాగ్రత్తగా కట్ చేసి, అమరిక ప్రకారం కుట్టింది. మిగిలిన సంచుల మెటీరియల్ నుండి అందమైన ఉపకరణాలనూ తయారు చేసింది. మనం ఉపయోగించి, పడేసే వస్తువులను తిరిగి ఎన్నిసార్లు వాడదగినవి రూపొందించుకోవచ్చో తన ప్రయత్నంతో తెలియజేస్తుంది. ఏరియల్ డ్రెస్ డిజైన్స్ చూసినవారు తాము కూడా అలాంటి దుస్తులు డిజైన్ చేస్తామని తెలిపారు. ఈ షాపింగ్ సంచుల నుండి కర్టెన్లు, రగ్గులు, ఇతర వాడదగిన వస్తువులను ఎలా ఉపయోగించాలో ప్రజలు నేర్చుకోవాలని ఈ అమ్మాయి కోరుతుంది. -
ఆ అంకుల్ దగ్గర ఓ బ్యాగ్ కొనడం మర్చిపోకండి!
వృద్ధాప్యం శాపంలా భావిస్తూ కాటికి కాళ్లు చాపుకుని రోజులు వెళ్లబుచ్చుతుంటారు చాలా మంది. అతి తక్కువమంది మాత్రమే దేవుడు ఆయుష్షును బోనస్లా ఇచ్చాడు అనుకుంటూ ఉన్న జీవితాన్ని అర్ధవంతంగా మలుచుకుంటారు. అలా అర్థవంతంగా జీవిస్తున్న జోషి అనే 87 ఏళ్ల వ్యక్తి కథ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పడేసే గుడ్డ పీలికలతో సంచులను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. అంకుల్ జోషి.. ముంబైలోని డొంబివాలిలో ఈ తాత చేతి సంచులను అమ్ముతూ కనిపిస్తుంటాడు. స్వశక్తిపై జీవిస్తున్న జోషి కథను ట్విట్టర్ యూజర్ గౌరీ వెలుగులోకి తెచ్చారు. ‘అంకుల్ జోషి’ వయసు 87. అతను అమ్మే ఒక్కో సంచి రూ .40 నుండి రూ. 80 మధ్యలో ఉంటుంది. సోఫా, కర్టెన్ తయారీదారులనుంచి చిరిగిన క్లాత్లను సేకరిస్తాడు. వాటిని జాగ్రత్తగా ఒక్కోటి జత చేస్తూ సంచులను కుడతాడు. అతను డోంబివాలి ఫడేకే రోడ్డున కూర్చుని ఉంటాడు. ఎవరైనా అటుగా వెళితే ముంబై జోషి అంకుల్ను కలిసి ఒక బ్యాగ్ కొనడం మాత్రం మర్చిపోవద్దు’ అని తన ట్వీట్ ద్వారా సందేశం ఇచ్చారు గౌరి. వయసు పైబడినా ఎవరిమీదా ఆధారపడకుండా చేతి సంచులను తయారుచేస్తూ, వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్న జోషి అంకుల్ నేటి తరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం
సోషల్ మీడియాకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఒక్క వీడియా జీవితాలనే మార్చేస్తుంది. రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కాంటా ప్రసాద్ అనే వృద్ధుడి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. మహమ్మారి కాలంలో వ్యాపారం జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించాలంటూ ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోకు స్పందించిన నెటిజన్లు వారికి సాయం చేసేందుకు వారి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయింది. సరిగ్గా మరోసారి అలాంటి కథే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. (‘బాబా కా దాబా’ వీడియో.. రెస్పాన్స్ సూపర్) ముంబైలోని ఫడేకే రోడ్ డోంబివాలిలో రీసైకిల్ బ్యాగులను అమ్ముతూ కుటుంబ పోషణను నెట్టుకొస్తున్న 87 ఏళ్ల జోషి అనే వ్యక్తి కథను ఓ యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. 'చిరిగిన సోఫా కవర్లు, కర్ట్న్లను అందమైన బ్యాగులుగా తీర్చుదిద్దుతున్నాడు. కేవలం 40-80 రూపాయలకే ఈ అందమైన బ్యాగును సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరకే చేతిసంచులను అమ్ముతున్న ఈ అంకుల్ను మనమూ ఫేమస్ చేద్దాం బ్యాగ్ కొనడం మాత్రం మరవద్దు' అంటూ వీడియాను పోస్ట్ చేయగానే వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం..ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతున్న అంకుల్ జోషికి మనమూ బాసటగా నిలుద్దాం అంటూ పలువురు నెటిజన్లు ముందుకొస్తున్నారు. Uncle Joshi age 87 sells bags of Rs 40 to 80.He buys broken pieces of clothes frm sofa and curtain makers.He himself stitches these bags.He sits at Phadeke Road Dombivali,#Mumbai Let's make Joshi Uncle famous & plz don't forget to buy 1 bag from him.🙏 pic.twitter.com/fbI7ZkP2dA — Gauri (@ardor_gauri) October 17, 2020 -
డిసెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్ సంచులను పంపిణీ చేయనుంది. -
మల్లెపూలలో మద్యం బాటిళ్లు
సాక్షి, ఉరవకొండ: కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయడానికి సివిల్, ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేసి పట్టుకుంటున్నా అక్రమార్కులు తమ దందా వీడటం లేదు. శనివారం రాత్రి విడపనకల్లు ఎస్ఐ గోపీ ఆధ్వర్యంలో విడపనకల్లు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్ డిజైర్ కారులో మల్లెపూల బస్తాలు తరలిస్తున్నారు. పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా తాము మల్లెపూల వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులూ తెలిపారు. పోలీసులకు వారి మాటలపై అనుమానం రావడంతో మల్లెపూల బస్తాలు లోపల చూడగా అందులో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం బయటపడ్డాయి. హైవార్డ్స్ బాటిళ్లు 87, వీస్కీ టెట్రా ప్యాకెట్లు 88, 8 పీఎం బాటిళ్లు స్వాధీనం చేసున్నారు. ఎస్ఐ గోపీ కేసు నమోదు చేసి కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఉరవకొండ సెబ్ ఆధ్వర్యంలో దాడులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సూపరిండెంట్ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్ సీఐ శ్యాంప్రసాద్, విడపనకల్లు ఇన్స్పెక్టర్ భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమం మద్యం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు చెక్పోస్టు వద్ద కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, నాగేంద్ర ద్విచక్రవాహనంలో 40 విస్కీ బాటిళ్లు, 96 హైవార్డ్స్ విస్కీ బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మద్యం బాటిళ్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన అశోక్, మంజునాథ్ల నుంచి 192 హైవార్డ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు మండలం హావళిగి గ్రామ శివార్లలో పాల్తూరు గ్రామానికి చెందిన నాగరాజు వద్ద 96 విస్కీ బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది రియాజ్ అహ్మద్, వెంకటేష్, రమేష్బాబు, రామకృష్ణ, వీరారెడ్డి, మౌలాలి, శైలజలు పాల్గొన్నారు. కర్ణాటక మద్యం స్వాధీనం చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలో పోలీసులు విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో 380 కర్ణాటక మద్యం బాటిళ్లు, ఒక ద్విచక్రవాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్ఐ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణస్వామి, నాగేంద్రలు కర్ణాటక రాష్ట్రంలోని తిరుమణి నుంచి మద్యం తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. సెబ్ ఉక్కుపాదం అనంతపురం క్రైం: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఆదివారం జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపారు. 5322 టెట్రా ప్యాకెట్లు, 25 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 19 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేశారు. అలాగే ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న ఇసుకను సీజ్ చేశారు. -
బామ్మగారి 'బ్యాగు'లు
లతికా చక్రవర్తి వయసు 90 ఏళ్లు. ఈ వయసులో ఇంక పనులేం చేస్తారు.. ‘కృష్ణా, రామా.. అనుకుంటూ రోజులు వెళ్లబుచ్చక..’ అనుకుంటారు ఎవరైనా. కానీ, ఈ బామ్మ భారతదేశం నలుమూలలా ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైనపాత చేనేత చీరలు, కుర్తాలు, బట్టలు సేకరించి వాటితో అందమైన ‘పొట్లి’ బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు.చేత్తో పట్టుకునే సంచులు, పర్సులను రీసైక్లింగ్ చేయడం అంటే ఈ బామ్మకు మహా ఇష్టం. ‘‘ఆడవాళ్లు ప్రతిబ్యాగ్తోనూ ఒక బంధాన్ని, ఓ ప్రత్యేకమైన కథను కలిగి ఉంటారు’’ అని చెబుతుంది. ఏ తరానికైనా పనికివచ్చే ఎన్నోముచ్చట్లతో పాటు, పనే దైవంగా భావించాలని చెబుతున్న ఈ బామ్మ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! లతిక 1930లో అస్సాంలోని ధుబ్రి పట్టణంలో జన్మించారు. ‘‘చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేదాన్ని. కానీ, మా కుటుంబ సంప్రదాయ పద్ధతులు పై చదువులకు వెళ్లకుండా నన్ను అడ్డుకున్నాయి. కాలేజీలో చేరకుండానే కృష్ణ లాల్ చక్రవర్తితో పెళ్లైంది. తను సర్వే ఆఫ్ ఇండియాలో సర్వేయర్గా చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా తను ఏ రాష్ట్రానికి వెళితే నేనూ అక్కడికి వెళ్లాను. బయటకు వెళ్లి గుర్తింపు తెచ్చే పనులు చేయాలని ఉండేది. కానీ, నా భర్తకు నేను బయటకు వెళ్లి సంపాదించడం ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు. వాళ్ల ఆలనా పాలనతో ఇంట్లోనే ఉండిపోయాను. కానీ, నా జీవితం ఇలాగే నాలుగ్గోడల మధ్య ఉండిపోకూడదు అనిపించేది. ఒక ఏడాది ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో టీచర్గా పనిచేయాలనే ఆలోచనతో తొలిసారి బయటికి అడుగుపెట్టాను. పనిలో ఉన్న ఆనందం, స్వయంకృషితో సంపాదించే డబ్బు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడూ ఇంటిపట్టున ఉండాలనే ఆలోచన కూడా చేయలేదు. మా రోజులు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటిలా అప్పుడు చాలా వస్తువుల అవసరం లేదు. ఒకసారి వాడిన వస్తువులును తిరిగి చక్కగా ఉపయోగించుకునేవాళ్లం. ఎలాంటి భేషజాలు లేవు. ఒకరితో పోల్చి చూసుకోవడం ఉండేది కాదు. దీంతో చాలా సంతోషంగా ఉండేవాళ్లం’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు లతిక. వృథా ఇష్టం ఉండదు యాభైఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన లతిక పిల్లలతో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ రోజులు గడిపేశారు. అయితే, ఆమె స్వయంకృషి, అభిరుచి.. తొమ్మిది పదులకు చేరువవుతున్న దశలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా చేశాయి. ఇప్పుడు ఆమె ఒక బిజినెస్ ఉమెన్. తను తయారు చేసిన అందమైన ‘పొట్లి’ సంచులను తయారు చేస్తూ వాటిని అమ్ముతున్నారు. ‘‘పాత బట్టలను పడేయడం అంటే ఇష్టముండేది కాదు. ఆ మాటకొస్తే ఏదైనా వృథా అవుతుంటే నా మనసు చివుక్కుమంటుంది. పాత చీరలతో పిల్లలకు కుర్తాలు కుట్టేదాన్ని. కుర్తాలతో పర్సులు, సంచులు తయారు చేసేదాన్ని. అయితే వాటిని అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. మా బంధువుల్లోనే ఎవరైనా అడిగితే ఇచ్చేదాన్ని..’’ అంటూ తన వ్యాపారం ఎలా మొదలైందీ వివరిస్తారు లతిక. రెండు–మూడు రోజుల్లో ఒక బ్యాగును తయారు చేస్తారామె. అలా.. మొదట ఓ 300ల బ్యాగులను తయారు చేశారు. బామ్మ ఆసక్తిని చూసిన మనవడు ‘లతికాస్ బ్యాగ్’ పేరుతో ఆమె కోసం ఒక వెబ్సైట్ని ప్రారంభించాడు. బామ్మ కుట్టిన బ్యాగులను వెబ్సైట్లో పెట్టడంతో వాటికి డిమాండ్ పెరిగింది. న్యూజిలాండ్, జెర్మనీ నుంచి కూడా లతిక బ్యాగులకు ఇప్పుడు గిరాకీ వస్తోంది! సంతోషాన్నిచ్చే వ్యాపకం ‘‘నా భర్త 65 ఏళ్ల క్రితం ఓ కుట్టుమిషన్ని కానుకగా ఇచ్చాడు. దానిమీదే ఈ బ్యాగులను కుట్టడం మొదలుపెట్టాను. మా కోడలు, కూతుళ్లు వాడేసిన చీరలూ తీసుకున్నాను. పాత క్లాత్తో కుట్టిన ఈ బ్యాగులకే టాజిల్స్, ఎంబ్రాయిడరీతో కొత్తగా రూపు కడతాను. అయితే బ్యాగులను అమ్మాలనే ఉద్దేశంతో ఈ పనిని మొదలుపెట్టలేదు. వీటి తయారీలో ఒక ఆనందాన్ని పొందుతాను. నా వయసును మర్చిపోతాను. నా భక్తి అంతా నా బ్యాగ్ రూపకల్పనలోనే ఉంటుంది. నా హృదయంతో వీటిని తయారు చేస్తాను. ఈ తరం అమ్మాయిలకు కూడా నా బ్యాగులు నచ్చుతున్నాయంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వయసు మీద పడినవాళ్లు కూడా నా బ్యాగులను ఇష్టపడతారు..’ అంటూ బ్యాగుల గురించి ఎన్నో విషయాలను చెబుతారు లతిక.ఈ బామ్మ తన వయసు పెరుగుతుందనే భావన దర చేరనీయరు. అందుకే తన గదిలో ఒక్క అద్దాన్నీ ఉంచుకోరు. ఎంతసేపూ స్నేహితులతో గడపడం, నలుగురి మధ్యలో మాట్లాడుతూ ఉండటాన్ని ఇష్టపడతారు. ముడతలు పడిన చేతులతో ముచ్చటగా తీర్చిదిద్దే ఒక్కో బ్యాగ్కు ఒక్కో అందమైన పేరు పెట్టి మురిసిపోతుంటారు– ఆరెన్నార్ -
కేరాఫ్ పాలగుట్టపల్లె
పాలగుట్ట పల్లె గురించి వెతికితే ఒకప్పుడు ఎలాంటి సమాచారం తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు పాలగుట్టపల్లెకు కాటన్ బ్యాగ్స్ ఒక ఉనికిని తీసుకువచ్చాయి. చిత్తూరు జిల్లాలోని పాకాల చెంతనే ఉండే ఈ పల్లెకు బ్యాగ్స్ కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఆ పల్లెలో సుమారు అరవై కుటుంబాలు ఉంటాయి. ఆడా,మగ అందరూ వ్యవసాయ కూలీలే. పశువులు, కోడీ, మేకా వారి మరో జీవనాధారం. వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు.. వాటిలో కూలి పనులు. లేదంటే అవీ లేవు. అలాంటి చోట.. ‘మేం ఇటీవల తయారు చేసిన బ్యాగులలో బాగా ప్రాచుర్యం పొందింది చిన్న చిన్న కంపార్ట్మెంట్లతో కూడిన బలమైన కాన్వాస్ వెజిటబుల్ బ్యాగ్. మార్కెట్కు వెళ్లినప్పుడు అన్ని కూరగాయలను ఒక సంచిలో వేయించుకుంటాం. టొమాటోల మీద బంగాళదుంపలు వేశామనుకోండి.. టొమాటోలు ఇక అంతే. అలా కాకుండా దేనికది విడిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పుట్టుకొచ్చిందే కంపార్ట్మెంట్ కాన్వాస్ బ్యాగ్. ఇవే కాదు స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, షాపుల్లోకి బ్యాగులు, పౌచులు.. ఆర్డర్ల మీద తయారుచేసి ఇస్తున్నాం.’ అని ఆనందంగా వివరించారు రూప, అన్నపూర్ణ. మూడేళ్లుగా మొత్తం తొమ్మిది మంది గ్రూప్గా వందలాది బ్యాగుల తయారీలో నిమగ్నమై ఉంటున్నారు. వంద బ్యాగులతో మొదలు ‘కూలిపనులకు వెళ్తే గిట్టుబాటు కూలీ దొరికేది కాదు. మగవాళ్లు కొద్దోగొప్పో సంపాదిస్తే అది తిండికే సరిపోయేది. మా ఊళ్లో నలుగురు ఆడవాళ్లు మాత్రం మిషన్ మీద బ్లౌజులు కుట్టుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడు అపర్ణామేడమ్ వచ్చి ‘మీరు బ్యాగులు కుట్టగలరా..’ అని అడిగింది. సంతోషంగా మూడేళ్ల కిందటి వివరాలు చెప్పుకొచ్చారు రాణి, కళావతి. అపర్ణ కృష్ణన్ కుటుంబం పాతికేళ్ల కిందట సేంద్రీయ వ్యవసాయం చేయడానికి పాలగుట్టపల్లెకు వచ్చారు. వారిది చెన్నై. ‘మేడమ్ చుట్టుపక్కల అంతా చూస్తూ మా వద్దకు వచ్చి, పరిచయం చేసుకున్నారు. మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి గురించి అడుగుతుంటేవారు. మాకు, మా పిల్లలకు ఆయుర్వేద మందులు, పిల్లలకు పాలలో కలపడానికి అశ్వగంధచూర్ణం.. వంటివి ఇచ్చి వెళుతుండేవారు. మూడున్నరేళ్ల క్రితం ‘హైదరాబాద్లో తెలిసినవాళ్లు కాటన్ బ్యాగ్లు కావాలని అడిగారు, కుట్టగలరా?’ అన్నారు. అప్పుడు ఆ మేడమే అడ్వాన్స్గా డబ్బు ఇచ్చింది. కాటన్ క్లాత్ కొనుక్కొచ్చి 100 బ్యాగులు కుట్టి ఇచ్చాం’ అని వివరించింది రూప. ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ పనులు కాస్త ముతకగా ఉండే కాటన్ బ్యాగ్లు అంతటా దొరకవచ్చు. ‘కానీ, మా పల్లెకే ప్రత్యేకమైన బ్యాగులు ఉండాలనుకున్నాం. అప్పుడు అపర్ణామేడమే ఆ బ్యాగుల మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ ఉంటే ఆకట్టుకుంటాయి అని చెప్పారు’ వివరించింది అన్నపూర్ణ. అప్పుడు మేడమ్ సూచనతో మాలో నలుగురం చెన్నైకి వెళ్లి ప్రింట్లు ఎలా చేస్తారు, వాటిని బ్యాగ్ మీద ఎలా వేస్తారో .. వర్క్ నేర్చుకున్నాం. అలా బ్యాగుల మీద నెమలి, గణపతి బొమ్మలు, ఆర్డర్లు ఇచ్చే కంపెనీల లోగోలు.. ప్రింట్లు వేసి, కుట్టి పంపుతున్నాం. దీంతో మా బ్యాగ్స్కు ఇంకా మంచి పేరు వచ్చింది. ముందు ముగ్గురం, నలుగురం ఈ పనిలో ఉండేవాళ్లం. ఉత్తరప్రదేశ్లో ఆర్గానిక్ కాంగ్రెస్కు 2000 బ్యాగులు ఆర్డర్ రావడంతో మరో ఆరుగురం కలిశాం. ఆ తర్వాత ఆరు పాకెట్లతో ఉన్న వెజిటబుల్ బ్యాగులు కుట్టి ఫేస్బుక్, వాట్సప్లో పెట్టాం. వీటికీ బాగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, దుబాయ్, ముంబయ్కి కూడా ఆర్డర్ల మీద మా బ్యాగులు వెళుతున్నాయి. రెండు నెలల నుంచి ఆర్గానిక్ సరుకులు అమ్మే షాప్లకు బ్యాగులు కుట్టి పంపిస్తున్నాం’ అని వివరించింది ఈ తొమ్మిది మంది బృందం. నెలవారీగా ఆర్డర్లు రెండేళ్ల క్రితం పాలగుట్టపల్లె నుంచి బ్యాగులు గోవా ఎగ్జిబిషన్కు వెళ్లాయి. దీనికి అపర్ణతోపాటు లావణ్య, విఘ్నేశ్వరన్లు కూడా సాయం చేస్తున్నారు. మొదట్లో వచ్చిన డబ్బుతోనే ఇప్పటివరకు రొటేషన్ చేస్తూ వచ్చారు. కాటన్ క్లాత్, పెయింటిగ్ మధురై నుంచి తెప్పించుకుంటారు. కుట్టుపని, ప్యాకేజీ పనులన్నీ వాళ్లే చూసుకుంటారు. ఆ ఊరికి బస్సు, ఆటో సౌకర్యం కూడా లేదు. ‘కొంచెం చీకటి పడిందంటే ఆటో ఛార్జీలు పెంచుతారు. అందుకే రేపు బ్యాగులు పోస్టులో వెళ్లాలి అంటే ఈ రోజే ఆటో అతనికి చెబుతాం. ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజులు కూడా కుట్టాలనుకుంటున్నాం. బ్యాగులకు ఎంబ్రాయిడరీ చేస్తున్నాం కాబట్టి బ్లౌజులు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాం..’ అని చెప్పారు లక్ష్మీకాంత, ప్రమీల. సైజ్, మోడల్ను బట్టి ధరలు అప్పటి వరకు వ్యవసాయ పని, పశువులు పెంపకం తప్ప వేరే నైపుణ్యం లేదు వారికి. అలాంటి వారు స్క్రీన్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. కొత్త కొత్త డిజైన్ల కోసం కోలాం నమూనాలను అనుసరించారు. దీంతో అపర్ణా కృష్ణన్ పాలగుట్టపల్లె బ్యాగ్స్ పేరుతో వెబ్సైట్, ఫేస్బుక్ పేజీ ద్వారా ఫైనాన్స్ సోర్స్ను ఏర్పాటు చేసి మార్కెటింగ్ వారితో ఈ బృందానికి ఒక మాధ్యమం ఏర్పడేలా సాయం చేశారు. మిగతావన్నీ .. జాబితాను నిర్వహించడం, క్లాత్ కొనడం, డిజైన్ చేయడం, పాత బియ్యం బిస్తాలలో సంచులను ప్యాక్ చేయడం, పోస్ట్ చేయడం, పనిని విభజించుకోవడం, ఆదాయాలను పంచుకోవడం.. అన్నీ ఇక్కడి మహిళలే చేస్తారు. బ్యాగు సైజ్, డిజైన్ బట్టి ధరలు ఉన్నాయి. – నిర్మలారెడ్డి ఫొటోలు: టి. తులసీరామ్, సాక్షి, పాకాల, చిత్తూరు రెండేళ్ళ కిందట నోయిడాలో జరిగిన ఆర్గానికి వరల్డ్ కాంగ్రెస్కు 2000 బ్యాగులను సప్లయ్ చేశారు. మొదటిసారి పొందిన పెద్ద ఆర్డర్ అది. ఆ తర్వాత ఏడాదికి గోవాలో జరిగిన హ్యాండ్లూమ్ ఎక్స్పో∙ఆర్డర్ వచ్చింది. ఇటీవల అమెరికాకు కూడా ఆర్డర్ ద్వారా వీరి బ్యాగులు వెళ్లాయి. తమిళనాడులోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పాలగుట్టపల్లె బ్యాగులు తెప్పించుకుంటున్నాయి. డిజైన్ బట్టి ఒక్కో బ్యాగ్ ధర రూ.20 నుంచి ఉన్నాయి. ఈ బ్యాగుల కోసం ఆన్లైన్ ద్వారా నేరుగా ఆర్డర్లు ఇవ్వచ్చు. పాలగుట్టపల్లె కాటన్ బ్యాగ్లకు ఇంత పేరు రావడానికి కారణం ఈ మహిళలు ఎంచుకున్న నాణ్యతే ప్రధానం. మొదట కొంత మొత్తం లోన్గా తీసుకున్నారు. ఆ తర్వాత వారి రాబడి పెరుగుతూ ఉండటంతో ఆ మొత్తం తీర్చేశారు. పల్లెటూరి మహిళలు నాణ్యమైన వస్తువులను అందించడంలో ముందుంటారు. వీరికి రూరల్ డెవలప్మెంట్ కింద ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలను చూస్తారు. – అపర్ణాకృష్ణన్ -
చిట్టి వెన్నుపై గుట్టంత బరువు
ఒక విద్యార్థి తన మొత్తం శరీర బరువులో 10 నుంచి 15 శాతానికి మించి బరువు మోయ కూడదు. కానీ నగరంలో నూటికి 90 శాతం మంది తమ బరువు కంటే ఎక్కువగా పుస్తకాల బరువును మోస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలల్లో సుమారు 10 లక్షల మంది చిన్నారులు చదువుతుండగా, వీరిలో ప్రతి వందమందిలో 20 మంది వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. వెన్నునొప్పితో బాధపడుతూ ఇటీవల వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమతోంది. సాక్షి, సిటీబ్యూరో :ఆటలతో అలసిపోవాల్సిన చిన్నారుల శరీరం బండెడు పుస్తకాల బరువుతో నీరసిస్తోంది. నిటారుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగాల్సిన వెన్నుపూస.. పది, పదిహేనేళ్లకే వంకర్లు పోతోంది. కిండర్ గార్డెన్ చదువులోనే కేజీల బరువు మోయలేని భారంగా తయారైంది. బడిలో చేరిన నాటినుంచే కొండంత ఎత్తుకు ఎదగాలన్న తల్లిదండ్రుల ఆశ చిన్నారులు మోస్తున్న బరువుపై ఆలోచింపజేయనివ్వడంలేదు. మెల్బోర్న్ యూనివర్సిటీ ఇటీవల విద్యార్థులు ఎత్తుతున్న పుస్తకాల బరువుపై ఓ సర్వే నిర్వహించింది. విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి, బరువు మోయని వారు, స్వల్ప బరువు మోస్తున్నవారు, తగినంత బరువు మోస్తున్నవారు, అధిక బరువు మోస్తున్న వారు ఇలా సుమారు 1400 మంది బడిపిల్లలను ప్రాతిపదికగా తీసుకుంది. ఇందులో అధిక బరువు మోస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ బరువు మోస్తున్న వారిలోనే వెన్నుపూస సమస్యలు వస్తున్నట్టు నిర్ధారించింది. విద్యార్థి బరువు కంటే అతను భుజాన మోస్తున్న పుస్తకాల బ్యాగు బరువు 30 శాతానికి మించి ఉన్నట్లు తేలింది. బ్యాగు అమరిక ఇలా ఉండాలి.. ♦ బ్యాగు వెడల్పు ఛాతీకి మించకుండా ఉండేలా చూసుకోవాలి ♦ బ్యాగు పొడవు ఎక్కువ ఉండకూడదు ♦ బ్యాగు వేసుకుని కూర్చున్నప్పుడు బల్లను బ్యాగు తాకకూడదు ♦ వెడల్పు పట్టీలు ఉన్న బ్యాగును వాడాలి ♦ బరువైన పుస్తకాలను వెన్నుకు సమీపంలో, తేలికైనవి బ్యాగు చివర్లో ఉంచాలి ♦ బ్యాగు బరువు రెండు భుజాలపై సమానంగా ఉండేలా చూసుకోవాలి అధిక బరువుతో వచ్చే సమస్యలివే.. సాధారణంగా చిన్నారుల్లో డిస్కుల అరుగుదల సమస్య ఉండదు. కానీ చిన్నతనంలో అధిక బరువు మోయడం వల్ల వెన్ను వంకర్లు పోవడం, సమస్యలు రావడంతో ఇలాంటి వారికి 35 ఏళ్లు దాటిన తర్వాత డిస్కుల అరుగుదల మొదలైనప్పుడు మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. బరువుతో భుజాలకు ఇరువైపులా ఉన్న కండరాలు అలసిపోతాయి. తరగతి గదిలో ఎక్కువసేపు కూర్చోలేకపోతూంటారు. వెన్నెముక సహజంగా ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇందులో మార్పు సంభవిస్తుంది.అధిక బరువు కారణంగా నడుము నొప్పి రావడం, ఎల్–4, ఎల్–5 మధ్య, ఎల్–5, ఎస్–1 భాగాల మధ్య డిస్కులు జారిపోతాయి. భుజాలకు, వెన్నెముకకు మధ్య బ్యాలెన్స్ లేకుండాపోతుంది. చిన్నప్పప్పుడు వచ్చిన ఈ సమస్య పెద్దయ్యాక వస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు. స్కూలు బ్యాగు బరువుతోనే కాకుండా దాని వాడకంలోనూ జాగ్రత్తలు పాటిస్తే ఉత్తమం. శరీర బరువు కంటే పుస్తకాల భారం 15 శాతం మించకూడదు పది కేజీల బరువు ఉన్న విద్యార్థి కేజీ నుంచి కేజీన్నర బరువుకు మించి పుస్తకాలు మోయకూడదు. స్కూలు బ్యాగు తగిలించుకున్నా వెన్నెముక నిటారుగా ఉండాలి. అలా లేదం టే ప్రమాదం వస్తున్నట్టు భావించాలి. వెన్నుపూస సమస్య వచ్చి ఉంటే కచ్చితంగా ఆడ మ్స్ టెస్ట్ చేయించాలి. అంటే రెండు పాదా లు దగ్గరగా తెచ్చి మోకాళ్లు వంచకుండా నడుము కిందకు వంచాలి. అప్పుడు భుజాలు రెండూ ఒకే స్థాయిలో లేకపోతే వెన్నునొ ప్పి ఉన్నట్టు గుర్తించాలి. పుట్టుకతోనే వెన్నులోపంతోబాధపడే వారికి ఇది మరింత ఇబ్బంది. – డాక్టర్ కమల్,జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ స్కూల్లోనే ప్రత్యేక ర్యాక్లుఏర్పాటు చేయాలి విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించేందుకు చాలా పాఠశాలలు ప్రత్యేక సబ్జెక్టుల పేరుతో అవసరానికి మించి పుస్తకాలు, నోటుబుక్స్ కొనుగోలు చేయిస్తోంది. పైఅంతస్తుల్లోని తరగతి గదులకు చేరుకునేందుకు కనీసం లిఫ్ట్లు కూడా లేవు. దీంతో శక్తికి మించిన బరువును భుజాన మోస్తూ మెట్లపై నుంచి పై అంతస్తులకు చేరుకోవాల్సి వస్తుంది. పుస్తకాల బరువు, వెన్నుపైనే కాకుండా మోకీళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వెన్ను, మోకాలి నొప్పులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయంగా పాఠశాలల యాజమాన్యాలే తరగతి గదుల్లో ప్రత్యేక ర్యాక్లను ఏర్పాటు చేయాలి. అవసరమైన పుస్తకాలనే ఇంటికి పంపాలి. అవసరం లేనివి స్కూల్లోనే ర్యాక్లో భద్రపర్చడం ద్వారా పిల్లపై భారాన్ని తగ్గించవచ్చు. – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం -
నిషేధం అమలయ్యేనా?
టీ స్టాల్కి వెళితే ప్లాస్టిక్ కప్పు.. విందు భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు.. దాహం వేస్తే ప్లాస్టిక్ వాటర్ బాటిల్.. ఇలా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్లాస్టిక్ వినియోగం జీవితంలో ఒక భాగమైపోయింది. ఇందుగలదు అందులేదని సందేహంబు వలదు అన్నట్టు.. ఎక్కడ చూసినా ప్లాస్టికే. హోటళ్లు, టీ స్టాళ్లు, కర్రీ పాయింట్లు, కిరాణా షాపులు, రైతు బజార్లు, తోపుడు బండ్లు.. ఒకటేమిటి పాలిథిన్ సంచులు కనిపించని ప్రదేశం లేదు. కొనే వస్తువు చిన్నదైనా, పెద్దదైనా పాలిథిన్ కవర్ తప్పనిసరైంది. చివరికి డ్రైనేజీలు, చెత్తకుప్పల్లో సైతం వాటి వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్రమాదకారకమైన పాలిథిన్ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు యథేచ్ఛగా వాడుతున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లపై నిషేధం ఒట్టిమాటగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు నగరపాలక సంస్థ రంగంలోకి దిగింది. నగరంలో ప్లాస్టిక్ అమ్మకం, వాడకం, కొనుగోలును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తే రూ.100 నుంచి రూ.500 వరకు జరిమానా విధించేలా చర్యలు చేపట్టింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి ఒంగోలు నగరంలో నిషేధం అమలుకానుంది. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సక్రమంగా అమలవుతుందా..? లేక ఆరంభశూరత్వంగా మిగిలిపోతుందా.. అనే సందేహాలు నగర వాసుల నుంచి వ్యక్తమవుతోంది. ఒంగోలు టౌన్:ఒంగోలు నగర పాలక సంస్థలో ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలే కనిపిస్తుంటాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో ప్లాస్టిక్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. ఇళ్లల్లో నుంచి, పని ప్రదేశాల నంచి ఖాళీ చేతులతో వెళ్లి భోజనం ప్యాకెట్లు, కర్రీ ప్యాకెట్లు, దోశ ఇడ్లీ ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్, మటన్, చేపలు.. ఇలా ప్రతిదానిని ప్లాస్టిక్ కవర్లలో వేయడం, ఆ పదార్ధాలన్నీ తీసుకువచ్చేందుకు మరో ప్లాస్టిక్ కవర్ను ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. టీ తాగడానికి, జ్యూస్ తాగడానికి ప్లాస్టిక్తో తయారు చేసిన డిస్పోజల్ గ్లాస్లనే వాడుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం పేపర్ గ్లాస్లు వాడుతున్నారు. ఇలా ప్రతి దానిలో ప్లాస్టిక్ భూతం కనిపిస్తోంది. వాటిని వినియోగించిన తరువాత కాలువలు, చెత్తలో పడవేయడంతో తదుపరి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం జంతువులపై ప్లాస్టిక్ భూతం పడగ విప్పగా, దానిని అలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో మనుషులపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు.. ఒంగోలు నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని వంద శాతం అమలు చేసేందుకు వీలుగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను యంత్రాంగం తెరపైకి తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ప్లాస్టిక్ను ఎవరు వినియోగించినా బాధ్యులవుతారు. ప్లాస్టిక్ వాడినా, అమ్మినా, కొనుగోలు చేసినా ఆ ముగ్గురిని బాధ్యులను చేయనున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానావిధిస్తారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు వీలుగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు నగరమంతా జల్లెడపడుతూ పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపి వేసేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా జరుగుతుందో, అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. మాల్స్ వసూలు నగర పాలక సంస్థ ఖజానాకు.. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో మాల్స్ సంఖ్య పెరిగింది. కొన్ని మాల్స్ తమ వద్ద వినియోగదారులు సరుకులు కొనుగోలు చేసినప్పటికీ వాటిని వాళ్ల ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వీలుగా ఆ మాల్స్ ముద్రించిన కవర్లను విక్రయిస్తోంది. ఎక్కడైనా వందలు మొదలుకొని వేలాది రూపాయల వరకు నిత్యావసర సరుకులు, వస్తువులు కొనుగోలు చేస్తే వాటిని తీసుకువెళ్లేందుకు కవర్లను అందించేవారు. ఇటీవల కాలంలో నగరంలో మాల్స్ ఏర్పడిన తరువాత అక్కడ కొనుగోలు చేసిన వస్తువులను తీసుకువెళ్లే కవర్లకు ఒక్కో వినియోగదారుడి వద్ద మూడు నుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ జయంతి నుంచి నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించిన నేపథ్యంలో మాల్స్ వినియోగదారుల నుంచి కవర్ల కోసం వసూలు చేసిన డబ్బును ఇక నుంచి నేరుగా నగర పాలక సంస్థ కార్యాలయ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. మిగిలిన దుకాణాలకు యూజర్ ఛార్జీలు.. ఒంగోలు నగరంలోని వస్త్ర దుకాణాలు, మందుల దుకాణాలు, ఇతర దుకాణాలు తమ వద్ద దుస్తులు, మందులు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ప్రత్యేకంగా ముద్రించిన కవర్లలో పెట్టి ఇస్తుంటారు. ఇక నుంచి అలాంటి దుకాణాలకు యూజర్ ఛార్జీలు వేయనున్నారు. ఆ దుకాణంలో ఎంతమంది వినియోగదారులు వచ్చారు, ఎన్ని వస్తువులు కొనుగోలు చేశారు, ఎన్ని కవర్లు వినియోగించారో నగర పాలక సంస్థ లెక్కతేల్చి వాటికి యూజర్ ఛార్జీలు వేయనుంది. -
ఆమె ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే
ఆకర్షణీయమైన వస్తువులు, బ్యాగులు, చెవి రింగులను కళాత్మకంగా ఎవరైనా చేస్తారు. అందుకోసం రాళ్లు, బంగారం, వెండి ఇలా ఏవేవో వాడుతుంటారు. వెంట్రుకలతో, కుట్టు మిషన్లతో ఇలా కాదేదీ కళకనర్హం అన్నట్లు అన్ని వస్తువులను వాడేశారు కళాకారులు. అయితే వీరందరికీ భిన్నాతిభిన్నంగా బ్రిటన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్కు చెందిన అలైస్ పాట్స్ ఆలోచించారు. మహిళల కోసం పలు రకాల ఉత్పత్తులను భిన్నమైన పదార్థాలతో తయారు చేసి చాలా ఫేమస్ అయిపోయారు. ఎందుకంటే వాటిని తయారు చేసేందుకు ఆమె ఎంచుకున్న ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే. అవేంటో తెలుసా.. మన శరీరం నుంచి ఉత్పత్తయ్యే చెమట, మూత్రం, రక్తం! ఏంటీ వీటితో ఎలా తయారు చేస్తారనుకుంటున్నారా..? వీటి నుంచి తెల్లగా మెరిసే స్ఫటికాలను తయారు చేసి బట్టలను చాలా అందంగా ముస్తాబు చేస్తారట. ప్లాస్టిక్ను వాడే కన్నా వీటితో తయారు చేస్తే ప్రకృతికి కూడా మేలు చేసినట్లవుతుందని పాట్స్ చెబుతున్నారు. ఇటీవల కాలేజీ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచితే అనూహ్య స్పందన వచ్చింది. -
‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు బ్యాగ్ అవసరం లేదు’
చండీగఢ్: ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హర్యానా ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఒకటి, రెండో తరగతి చదువుతున్న పిల్లలు పాఠశాలకు బ్యాగ్లు తీసుకురావల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశాలు జరిచేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్బిలాస్ శర్మ శుక్రవారం ప్రకటన చేశారు. గతకొంత కాలంగా ప్రైమరీ స్కూల్ పిల్లల బ్యాగుల బరువు తగ్గించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్వర్వులను అమలు చేయలని హర్యానా ప్రభుత్వం భావించింది. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బరువైన బ్యాగులు, అధిక హోం వర్కుల నుంచి ఉపశమనం కల్పించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించాలని మే 30న మద్రాస్ హైకోర్టు సిఫారస్సు చేసిన విషయం తెలిసిందే. పిల్లల బరువులో పదిశాతానికి మించి బ్యాగ్ బరువు ఉండకూదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ఆదేశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆదేశించారు. -
బడికి రెడీ
ఇక రాత్రి వేళ పొద్దుపోయేంతవరకు టీవీలకు అతుక్కుపోవడం కుదరదు. ఉదయం తొమ్మిదింటి వరకు నిద్రపోవడం అసలే జరగని పని. అమ్మమ్మలు.. నాన్నమ్మలు, తాతయ్యలతో కబుర్లు కట్టేయాల్సిందే. ఆటపాటలు, అల్లరి చేష్టలకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చింది. వేసవి సెలవులకు ఇక సెలవే. గురువారంతో హాలీడేస్ ముగిశాయి. శుక్రవారం బడిగంటలు మోగనున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, షూస్, లంచ్ బాక్స్లు తదితర సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచి బడికి పంపించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. కొండాపూర్(సంగారెడ్డి): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలల గేట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఉత్సాహంగా.. ఉల్లాసంగా, నిన్నామొన్నటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 1న బడిగంట మోగనుండడంతో ఇక పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సుమారు 50 రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడులకను ఘనంగా నిర్వహిం చేందుకు జూన్ 1న పాఠశాలలను పునః ప్రారంభించనున్నారు. సమస్యలతో స్వాగతం.. జిల్లా వ్యాప్తంగా 1,733 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సర్కారు స్కూళ్లు 1,350 కాగా ప్రైవేటు పాఠశాలలు 383 ఉన్నాయి. సర్కారులో ప్రాథమిక పాఠశాలలు 864, ప్రాథమికోన్నత 198, ఉన్నత పాఠశాలలు 205తో పాటు తెలంగాణ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురకుల పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. లక్షా 50 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో,మరో 1,19,677 మంది ప్రైవేటులో విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు మౌలిక సౌకర్యాలు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు నిర్మించినా రన్నింగ్ వాటర్ లేకపోవడంతో చాలా పాఠశాలల్లో ప్రయోజనం లేకుండా పోయింది. పాఠశాలలకు ప్రహరీలు, ఆటలు ఆడుకునేందుకు మైదానాలు కరువయ్యాయి. ఇన్చార్జీల పాలనలోనే.. విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలంటే పర్యవేక్షణ తప్పనిసరి. పాఠశాలలను పర్యవేక్షించాల్సి మం డల విద్యాదికారుల పోస్ట్లు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 26 మండలాలకు గాను 18 మండలాల్లో మాత్ర మే మండల విద్యాధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 మండలాలల్లో విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మండలాల్లో కంగ్టి, జిన్నా రం మండలాల్లో మాత్రమే రెగ్యులర్ విద్యాధికారులు కాగా మిగతా 16 మంది ఇన్చార్జులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు మండలాలకు గానూ జిన్నారం ఎంఈఓ జూన్ చివరి నాటికి పద వీ విరమణ చేస్తుండడంతో అక్కడ కూడా ఇన్చార్జి నే నియమించే అవకాశం ఉంది. ఇన్చార్జి ఎంఈఓలుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులకు కూడా ఒకొక్కరికి రెండు మండలాలు ఉండడంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. అటు పాఠశాలల్లో విద్యాబోధన చేయలేక, ఇటు పాఠశాలలను పర్యవేక్షించలేక ఇన్చార్జి ఎంఈఓలు సతమతమవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 250 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 34 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తగ్గని ఉష్ణోగ్రతలు రుతు పవనాల రాక ఆలస్యం కావడం, ఉష్ణోగ్రతలు నేటికీ 40 డిగ్రీల నుంచి తగ్గకపోవడంతో 4 నుంచి 8వ తేదీ వరకు ఒంటిపూట మాత్రమే బడులు నిర్వహించనున్నారు. ఆ ఒక్కపూట కూడా విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే జూన్ రెండో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం : జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆర్వీఎం కార్యాయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయని, అదే రోజున ప్రతి విద్యార్థికి పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు మొత్తం 7,20,740 పుస్తకాలు అవసరం కాగా వంద శాతం వచ్చాయని, ఇప్పటికే ప్రతి మండలంలోని మానవ వనరుల కేంద్రం ద్వారా సంబంధిత పాఠశాలలకు చేరవేయడం జరిగిందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన 95,315 యూనిఫాంలను పాఠశాలలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రేడియో పాఠాలతో పాటు డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధన ఉంటుందన్నారు. జూన్ 4నుంచి బడిబాట ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదుకు గానూ జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు బడిబాట చేపడుతున్నట్లు డీఈఓ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలతో పాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం తదితరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా 15,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు. ఐదు కేజీబీవీల్లో ఇంటర్కు అవకాశం బాలికల విద్యను బోలపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 17 కేజీబీవీలకు గానూ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 5 కేజీబీవీల్లో ఇంటర్ అవకాశం కల్పిస్తున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. జహీరాబాద్, సదాశివపేట, జిన్నారం, అందోల్, నారాయణఖేడ్ కస్తూర్బాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించడం జరుగుతందన్నారు. కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు గానూ 80 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. బడి బయట పిల్లలపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మెప్మా సంస్థ వారు జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో ఒకటి నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు 448 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. బడి బయట ఉన్న పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి వివరించారు. -
వెరయిటీగా పాత బంగారం
చూస్తుండగానే సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి. సెలవల కోసం పిల్లలు ఎదురు చూసినన్ని రోజులు పట్టలేదు అయిపోవడానికి. మహా ఉంటే మరో వారం రోజులు... జూన్ మొదటికల్లా స్కూళ్లు తెరుస్తారు. ఆంధ్రలో అయితే, సెలవులు ఇవ్వడం కాస్త ఆలస్యం అయింది కాబట్టి, బళ్లు తెరవడం కూడా ఇంకో గుప్పెడు రోజుల తర్వాతే. అది సరే, స్కూల్ తెరిచేసరికే పిల్లలకు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, లంచ్బాక్స్, యూనిఫారమ్, షూస్, టై, బెల్టు, బుక్స్ షాపింగ్తో పేరెంట్స్కు హడావుడి. కొత్తవి కొనక ఎలాగూ తప్పదు. పాతవాటినేం చేస్తారు మరి? అటకమీద పడేస్తారు. లేదంటే ఇంట్లోనే తర్వాత పుట్టిన పిల్లలకు అంటే తమ్ముళ్లకో, చెల్లెళ్లకో బలవంతాన ఇస్తారు. అంతేగా! మరింకేం చేస్తాం అంటారా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే, చిన్నారులకు కావలసిన స్కూలు సరంజామా కొనడానికి కిందా మీదా అవుతుంటే, ఇళ్లలో పని చేసే వారి పరిస్థితి ఏంటి మరి? ఎప్పుడైనా ఆలోచించారా? కారు డ్రైవర్లు, పాలు పోసి పొట్టపోసుకునేవాళ్లు, ఆకుకూరలు, కూరగాయలు అమ్మే వాళ్లు, చెత్తబండి వాళ్ల పిల్లలు, పేపర్లు, పాలప్యాకెట్లు వేసి చదువుకునే వాళ్ల సంగతి ఏమిటి మరి? పిల్లల చదువుల దగ్గర మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతున్నారేంటి అని తల పట్టుకుంటున్నారా? మరేం లేదు, మీ పిల్లల యూనిఫామ్స్, బుక్స్, స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, షూస్ వంటి వాటిలో బాగున్న వాటిని ఇంటిలో పని చేసేవారి పిల్లలకు ఇవ్వండి. వీలయితే, కొత్తవి కొనివ్వడం బెటర్. లేదంటే, చిన్న చిన్న చిరుగులు పడ్డవాటికి లేదా జిప్పులు పోయిన బ్యాగ్లకు చిన్నాచితకా రిపేర్లు చేయించి వాటిని కొనుక్కోలేని వారికి ఇవ్వండి. ఈ చిన్ని సాయమే వారిని పాఠశాలకు దూరం కాకుండా చేస్తుందేమో! స్టీలుసామాన్ల వారికో లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఇచ్చేసి, వాళ్లు ఇచ్చే ఓచర్లు తెచ్చుకుని, వాటిని వదిలించుకోవడానికి అంతకు పది రెట్లు ఖర్చు చేసి, పర్సుకు చిల్లులు పెట్టుకోకండి. ఒకవేళ ఇతరులకు ఇచ్చేంత స్తోమత లేకపోతే, పాత వాటినే, కొద్ది మార్పులతో కొత్త వాటిలా తయారు చేసే ప్రయత్నం చేయండి లేదంటే, రీ సైక్లింగ్కు ఇవ్వండి. ఇదంతా ఎందుకంటే, ఒక వస్తువును తయారు చేయడానికి ఎంతో ఖర్చవుతుంది. దానిని పూర్తిగా వాడుకోకుండా మధ్యలోనే పారేసి, కొత్తవి కొంటూ పోతే, ఎంత చెత్త పేరుకు పోతుంది? తద్వారా పర్యావరణానికి ఎంతముప్పు? ప్రకృతిని ప్రేమించే వాళ్లయితే, బుర్రలకు కాస్త పదును పెట్టండి పాత వాటిని ఏం చేస్తే వాటిని పర్యావరణ హితంగా మలచుకోవచ్చో... నెట్లో సెర్చ్ చేస్తే బోలెడన్ని సైట్లు ... ఉపాయాలు... ట్రై చేయండి మరి! -
అశోక లేలాండ్ చేతికి భారీ ఆర్డర్
సాక్షి,చెన్నై: భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ ఆర్డ్ర్ను తన ఖాతాలో వేసుకుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనుంచి ఈ ఆర్డర్ను సాధించింది. బస్సుల రూపకల్పనకుగాను రూ. 321 కోట్ల విలువైన ఆర్డర్ను పొందింది. తమిళనాడులో 2,100 బస్సుల సరఫరా కోసం ఈ ఆర్డర్నుసాధించామని హిందూజ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అశోక్ లేలాండ్ బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది. 2వేల పాసింజర్ వాహనాలకు ఆధారమైన లోహపు చట్రాలను, పూర్తిగా నిర్మించిన 100 చిన్న బస్సులను సరఫరా చేయనున్నా మని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం నాటికి సరఫరా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దీంతో అశోక్ లేలాండ్ షేర్లు 1.54 శాతం లాభాలను నమోదు చేశాయి. -
ఎల్ అండ్ టీకి బారీ ఆర్డర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ లార్సన్ టుబ్రో భారీ ఆర్డర్ను సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్అథారిటీ (ఎపీ సీఆర్డీఏ)నుంచి రూ.2,265 కోట్ల కాంట్రాక్టును ఆర్జించింది. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, డిజైన్లు కల్వర్టు, నీటి సరఫరా, మురుగునీరు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, విద్యుత్తు యుటిలిటీ డక్ట్స్ తదితర నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు సోమవారం వెల్లడించింది ఏపీ రాజధాని అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈ ఆర్డర్లు ఆర్జించినట్లు ఎల్ అండ్ టి బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రవాణా వ్యవస్థ నీరు, నీటి పారుదల రంగాల నుంచి ఉమ్మడిగా మూడు ఈపీసీ ఆర్డర్లను సాధించినట్టు తెలిపింది. రాజధాని నగరంలో 6, 7, 10 జోన్లలో ఈ పనులు నిర్వహించనుంది. మూడు ఎపిసి ఆర్డర్లు జారీ చేశాయి" అని ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేజర్ బిఎస్ఇ ఫైలింగ్లో పేర్కొంది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్ ఎల్ అండ్టీ షేరు భారీ లాభాలను ఆర్జిస్తోంది. -
బడి సంచులా.. బస్తాలా?
సాక్షి, హైదరాబాద్: ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాల్యం పుస్తకాల బరువుతో భారంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో చిన్నారులు అల్లాడిపోతున్నారు. తమ సామర్థ్యానికి మించిన బరువును మోయలేక వారి నడుములు ఒంగిపోతున్నాయి. ఇక రెండు, మూడు అంతస్తుల్లోని తరగతి గదుల్లోకి వెళ్లాలంటే విద్యార్థులకు నరకమే. పుస్తక భారంతో విద్యార్థి శారీరక ఎదుగుదల ప్రమాదంలో పడుతున్నా ప్రభుత్వాలకు మాత్రం పట్టడం లేదు. పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించకూడదని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్–2006 చెబుతున్నా.. రెట్టింపు (100 శాతానికిపైగా) బరువుతో విద్యార్థుల నడ్డివిరిగిపోతోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు అసలు పుస్తకాలే మోయవద్దని చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. బరువే బరువు.. భారంగా చదువు రాష్ట్రంలోని 11 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో రెండు, మూడు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న స్కూళ్లే అత్యధికం. అసలే బ్యాగు బరువు.. పైగా రెండు, మూడు అంతస్తుల్లో తరగతి.. దీంతో విద్యార్థులు తంటాలు పడాల్సివస్తోంది. పాఠశాల విద్యా శాఖ నిర్వహించిన సర్వేలో విద్యార్థుల వద్ద ఉన్న పుస్తకాలు తూచారు. ఎల్బీ నగర్లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి బ్యాగ్లో 15 కిలోల బరువున్న 38 పుస్తకాలు, యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని ఓ బడిలో 1వ తరగతి విద్యార్థి వద్ద 7 కిలోల బరువున్న 26 పుస్తకాలు, సూర్యాపేటలోని ఓ కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి వద్ద 25 కిలోల బరువున్న 32 పుస్తకాలు ఉన్నట్టు గుర్తించారు. అదే సూర్యాపేట మండలం చివమ్ములలో మూడు ప్రాథమిక, మూడు ఉన్నత పాఠశాలల్లో పరిశీలిస్తే పుస్తకాల సంచి బరువు 1.5 కిలోల నుంచి 8.5 కిలోలకు మించలేదని తేల్చారు. ప్రస్తుతం యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. అతని స్కూల్ బ్యాగ్ బరువే 3.5 కిలోలకు పైగా ఉంటోందని విద్యాశాఖ అంచనా వేసింది. మూడో తరగతి విద్యార్థి బరువు 22 కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువే 8 కిలోలకుపైగా ఉంటోంది. ఇక 35 కిలోల బరువు ఉండే ఏడో తరగతి విద్యార్థి పుస్తకాల బరువు 10 కిలోలకు పైగా ఉంటోంది. చట్టం ఏం చెబుతోదంటే.. – నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్ బ్యాగ్ మోయకూడదు. ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు. – స్కూల్ బ్యాగ్ బరువు, రోజువారీగా తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు తల్లిదండ్రులకు మార్గదర్శకాలివ్వాలి. – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలను స్కూల్లోనే దాచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. – ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు(రోజు అవసరం లేనివి ఇంటికి తీసుకెళ్లి మోసుకు రావడం తగ్గించేందుకు) ప్రతి విద్యార్థికీ లాకర్లు, డెస్క్లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే గుర్తింపును రద్దు చేయవచ్చు. బ్యాగు బరువుతో ఆరోగ్యానికి దెబ్బ.. ‘‘విద్యార్థి బ్యాగు బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగులపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, కింది భాగం దెబ్బతిని వెన్నునొప్పి వస్తుంది. భుజాలు ముందుకు ఒంగిపోవడంతో పాటు కిందకు ఒంగిపోతాయి. వెన్నుముక ఒంగిపోవడమే కాక దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. ఆయాసం పెరుగుతుంది’’అని వైద్యులు చెపుతున్నారు. తరగతుల వారీగా ఉండాల్సిన పుస్తకాలు, బరువు(కిలోల్లో) తరగతి పుస్తకాలు బరువు 1 మాతృభాష, ఇంగ్లిషు, గణితం 0.85 2 మాతృభాష, ఇంగ్లిషు, గణితం 0.81 3 మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1.1 4 మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1.2 5 మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1.3 6 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ 2.6 7 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ 2.2 8 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్ (ఫిజికల్, బయలాజికల్), సోషల్ 2.8 9 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్ (ఫిజికల్, బయలాజికల్), సోషల్ 2.9 10 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్ (ఫిజికల్, బయలాజికల్), సోషల్ 3.5 కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల బ్యాగులో పుస్తకాలు, వాటి సంఖ్య, బరువు తరగతి పుస్తకాలు, నోటు బుక్కుల సంఖ్య బరువు 1 16 5.5 2 21 7.5 3 22 8.5 4 23 8.7 5 25 9.5 6 26 9.7 7 27 10 8 30 12 9 34 14.5 10 38 16 -
ఇండియన్ కోస్ట్ గార్డ్తో రిలయన్స్ భారీ డీల్
ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ , ఇండియన్ కోస్ట్ గార్డ్ తో భారీ డీల్ కుదుర్చుకుంది. భారత తీర రక్షక దళం(ఇండియన్ కోస్ట్ గార్డ్) నుంచి రూ. 916 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు రిలయన్స్ డిఫెన్స్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపింది. ఒక ప్రైవేటు రంగ షిప్ యార్డ్తో ప్రభుత్వం ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి. 14 ఫాస్ట్ పెట్రోల్ ఓడల నిర్మాణానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు అనిల్ అంబానీ సోమవారం ప్రకటించారు. ఈ కాంట్రాక్టులో భాగంగా 14 మీడియం, హై స్పీడ్ పేట్రోల్ వెస్సల్స్ను సరఫరా చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. తీరప్రాంతాల్లో నిఘా, యాంటీ స్మగ్లింగ్ వ్యతిరేక , యాంటీ పైరసీ, సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్స్లో వీటిని వినియోగించనున్నట్టు చెప్పారు. మాడ్యులర్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో గణనీయమైన నైపుణ్యం తో కమర్షియల్, వినియోగం నౌకాదళాంలో వినియోగంకోసం పెద్ద ఓడల్ని నిర్మిస్తున్న దేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ రిలయన్స్ డిఫెన్స్ . మరోవైపు ఫ్రంట్ లైన్ సంస్థలులార్సన్ అండ్ టుబ్రో, కొచ్చిన్ షిప్ యార్డ్, గోవా నౌకా నిర్మాణ కేంద్రం, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ సహా ప్రాజెక్ట్ కోసం బిడ్ వేయగా రిలయన్స్ ఈ ఆర్డర్ను చేజిక్కించుకోవడం విశేషం. ఈ ఒప్పంద వార్తలతో మార్కెట్లో ఈ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. రిలయన్స్ డిఫెన్స్ షేరు దాదాపు 6 శాతం జంప్చేసింది. -
జూట్ కారిడార్కు అనుమతి
- జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరు - మొదట కోడుమూరు.. తర్వాత ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు - జాతీయ జనపనార బోర్డు కార్యదర్శితో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్సిటీ): కర్నూలు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరైనట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. రాయలసీమ పరిధిలో కర్నూలు నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇక్కడి ప్రజల ఉపాధి కోసం జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రాల ఏర్పాటు కోసం ఈనెల 5వ తేదీన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ జనపనార బోర్డుకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఇందుకు నేషనల్ జ్యూట్ బోర్డు (జాతీయ జనపనార బోర్డు) సానుకూలంగా స్పందించిందన్నారు. బోర్డు కార్యదర్శి, డైరెక్టర్ అరవింద్కుమార్ సోమవారం కర్నూలుకు వచ్చి ఎంపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలోగా కోడుమూరులో 25 మందికి మొదటి శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో కలకత్తా, హైదరాబాదుకు సంబంధించిన జ్యూట్బోర్డు సాంకేతిక అధికారులు నరసింహులు (ఎన్జేబీ ఎంపీఓ), ధనుంజయ్ (ఎన్జేబీ టీఏ) తదితరులు పాల్గొన్నారు. -
పవిత్రయాత్ర మక్కా
కర్నూలు (ఓల్డ్సిటీ): మక్కా యాత్ర పవిత్రమైనదని అల్హరమైన్ హజ్–ఒ–ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ.ఆసిఫ్పాషా తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక భాగ్యనగర్లోని కార్యాలయంలో ఉమ్రా యాత్రికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్రా యాత్రికుల ఫ్లైట్ ఈనెల 16వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతుందన్నారు. అనంతరం యాత్రికులకు బ్యాగులు, ట్యాగులు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం.ఎ.ఆరిఫ్పాషా కూడా పాల్గొన్నారు. -
కలకలం రేపిన పొట్టు బస్తాలు
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వలో సుమారు పొట్టుతో కూడిన 50 బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడంతో కలకలం రేగింది. ఈ బస్తాలో ఉన్న పొట్టు ఒక రకమైన వాసన వస్తుండటంతో ఎందుకు ఉపయోగిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సింగవరం, సోమయాజులపల్లె గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. ఆ విధంగా సంచుల్లో ఉన్న పొట్టును మసాలా తయారీలో కల్తీ చేయడానికి తీసుకెళ్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. -
232 బస్తాల చౌక బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: చౌక దుకాణాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా సేకరించి రీసైక్లింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించారు. డీఎస్పీ వి.వి.రమణ కుమార్ నేతృత్వంలో సీఐ ఎన్.కిషోర్బాబు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని విఘ్నేశ్వర ట్రేడర్స్ రైస్మిల్లులో ఈమేరకు తనిఖీలు చేపట్టారు. అప్పుడే లారీలో వచ్చిన బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్నారు. మిల్లులో 202 తెల్లగోతాల్లో, 30 గన్ని బ్యాగులో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మొత్తం రూ. 3 లక్షలు విలువ చేసే 116 క్వింటాళ్ళ చౌక బియ్యన్ని పట్టుకున్నారు. ఇదే మిల్లులో గత జూన్లో కూడా దాడి చేసి బియ్యం పట్టుకుని కేసు నమోదు చేయడంతోపాటు, సీజ్ చేసినట్లు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ఎక్కడైనా చౌక బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లయితే విజిలెన్స్ ఎస్పీ 80082 03288, డీఎస్పీ 80082 03289, సీఐ 80082 03291 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ కె.వెంకటరావు, కానిస్టేబుళ్ళు నాంచారయ్య, నాగేశ్వరరావు, రాము, రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దరియావలి, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. -
డెలివరీ బాయ్స్ బ్యాగులకే కన్నం వేశాడు
తుర్కయంజాల్: ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేస్తున్న ఓ యువకుడు వస్తువు డెలవరీ చేసేందుకు వస్తున్న ఆయా కంపెనీ ఉద్యోగుల బ్యాగ్లతో ఉడాయిస్తున్నాడు. సదరు కేటుగాడిని వనస్థలిపురం పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. క్రైం సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, డీఐ సంజీవరెడ్డి కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్లోని తణుకుకు చెందిన సురేష్ (26) వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ఇతగాడు మొదట ఆన్లైన్లో తప్పుడు చిరునామాతో వస్తువులు బుక్ చేస్తాడు. ఆర్డర్ చేసిన వస్తువులను ఆయా కంపెనీల ఉద్యోగులు డెలవరీ చేసేందుకు ఇతడు పేర్కొన్న అడ్రస్కు వస్తారు. తాను ఇంటి పై అంతస్తులో ఉన్నానని పార్శిల్ తీసుకుని రావాలని ఆ ఉద్యోగికి చెప్తాడు. అతను తన బ్యాగును కింద బైకు మీద ఉంచి పైకి వెళ్తాడు. కిందే ఉన్న సురేష్ అతలోనే బైక్పై ఉన్న బ్యాగ్ ఎత్తుకుపోతాడు. ఈ విధంగా జూలై 27న నాగార్జునకాలనీలో, ఆగస్టు 8న కమలానగర్కాలనీలో నాప్టాల్, షాపింగ్జోన్ సంస్థల ఉద్యోగుల బ్యాగ్లు ఎత్తుకుపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఆ బ్యాగ్లు కాజేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల 20 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
గన్నీ సంచుల ఆవిష్కరణ
ఖమ్మం జెడ్పీసెంటర్: వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష గన్నీ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్ లోకేష్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు లక్షల కుటుంబాలున్నాయని, ఒకొక్క కుటుంబానికి 3 సంచుల చొప్పున పంపిణీ చేయాలన్నారు. దీనికి వాసవీక్లబ్ నిర్వహకులు అంగీకరించారు. ముందస్తుగా ముద్రించిన లక్ష గన్నీ సంచులను పంపిణీ చేయగానే మిగిలిన వాటిని త్వరలో ప్రజలకు అందిస్తామన్నారు. తన సొంత గ్రామంలో ప్లాస్టిక్ వాడకం లేదని, ఆ విధంగా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షుడు పబ్బా విజయ్కుమార్, ఇంటర్నేషనల్ వాసవిక్లబ్ అడిషనల్ వైస్ ప్రెసిడెంట్ గెల్లా కృష్ణవేణి, అడిషనల్ ట్రెజరర్ మధన్మోహన్, వరప్రసాద్, ఉమారాణి, జిల్లా ట్రెజరర్ వందనం సత్యనారాయణ పాల్గొన్నారు. -
లార్సన్ అండ్ టుబ్రో చేతికి భారీ ఆర్డర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో భారీ ఆర్డర్ ను చేజిక్కించుకుంది. వివిధ వ్యాపార భాగాల్లో దాదాపు వెయ్యికోట్ల రూపాయల ఆర్డను పొందింది. ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,167 కోట్ల ఆర్డర్ ను అందుకున్నట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో సంస్థ తెలిపింది. విజయవాడ నగరానికి నీటి సరఫరాకు గాను ఏపీ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంనుంచి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని రెండవ వాటర రిజర్వాయర్ ప్లాంట్ నిర్మాణంకోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) నుంచి ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ నుంచి రూ.843 కోట్ల విలువ చేసే ఆర్డర్ కైవసం చేసుకుంది. కర్నాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ పంపిణీ బోర్డు నుంచి మరో రూ. 259 కోట్ల విలువచేసే ఆఫర్ అందుకుంది. దీంతోపాటుగా ప్రతిష్టాత్మక వినియోగదారులనుంచి లోహశోధన మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యాపారంలో ఆర్డర్ ను హల్దియా లో పెట్ కోక్ నిర్వహణ వ్యవస్థ నిర్మాణానికి గానుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో అదనపు ఆర్డర్లను అందుకున్నట్టు చెప్పింది. అలాగే వివిధ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నుంచి రూ. 65 కోట్లను ఆర్డర్ ను కూడా అందుకుంది. అయితే బలహీన ఫలితాల ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో సంస్థ షేర్లలో మదుపర్లు అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో షేర్ ధర4 శాతం క్షీణించింది. సుమారు 63.85 నష్టంతో 1,495 దగ్గర నిలిచింది. -
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే దివాకర్రావు విద్యార్థులకు బ్యాగులు అందజేత దండేపల్లి : మండలంలోని రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్రింగ్ ఏ స్మైల్ స్వచ్ఛంద సంస్థతో పాటు మరికొందరు ఎన్ ఆర్ఐలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్యూల్బ్యాగులు, కంపాక్స్ బాక్సులు, ఆట వస్తువులు, క్రీడా సామగ్రిని విరాళంగా ఇచ్చారు. వీటిని ఎమ్మెల్యే దివాకర్రావు విద్యార్థులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛంద సంస్థల వారు బాసటగా నిలిచి వాటి అభివద్ధిలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కొట్టె రాజేశ్వరి సత్తయ్య, ఉప సర్పంచ్ బత్తుల శేఖర్, పాఠశాల హెచ్ఎం అర్చన, వివిధ గ్రామాల సర్పంచులు లింగాల తిరుపతి, మగ్గిడి శ్రీనివాస్, గూడెం ఎంపీటీసీ ముత్తెనారాయణ, నాయకులు సురేందర్, శంకర్రావు, అశోక్, రాకేశ్, సత్యగౌడ్, శ్రీనివాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
అభిరాం సేవలు అభినందనీయం
ఆత్మకూరు : పట్టణంలోని అభిరాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఎల్ఆర్పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ట్రస్టు అధినేత డాక్టర్ శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలు సామాజికసేవ వెలకట్టలేనివన్నారు. శ్రావణ్కుమార్ మాట్లాడుతూ హెల్ప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అధినేత స్టీఫెన్ బ్యాగులు అందజేయాలని కోరారన్నారు. దీంతో పలు పాఠశాలల్లో పేద 120 మంది విద్యార్థులను గుర్తించి రూ.40 వేలు విలువైన బ్యాగులు సమకూర్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అభిరాం ఆస్పత్రిని స్థాపించామన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్రావు, ఉపాధ్యాయులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్ర బంగారులోకం..
♦ మార్కెట్కు పోటెత్తిన మిర్చి ♦ శుక్రవారం 80వేల బస్తాలు రాక ♦ నిండిన యార్డులు, రహదారులు ♦ వరుస సెలవులే కారణం ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ శుక్రవారం ఎర్రబంగారంతో నిండిపోయింది. దాదాపు 80వేల మిర్చి బస్తాలను రైతులు మార్కెట్కు తరలించడంతో కళకళలాడింది. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మార్కెట్ యార్డును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్, కౌంటింగ్ తదితర ప్రక్రియను యార్డులోనే నిర్వహించారు. శని, ఆదివారం సెలవులు, అమావాస్య కావడంతో ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో గురు, శుక్రవారా ల్లో మిర్చి భారీగా అమ్మకానికి వచ్చింది. 12, 13 తేదీలు కూడా సెలవు దినాలు కావటంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. గురువారం కూడా దాదాపు 80 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. యార్డుల్లో సరుకు కొనుగోళ్లు, కాంటా లు పూర్తయినా వ్యాపారులు సరుకును కేంద్రాలకు తరలించలేకపోయారు. వాహనాల్లో లోడ్ చేయటం.. వాటిని తరలించటానికి సమయం పడుతోంది. శుక్రవారం కూడా 80వేల బస్తాల మిర్చి అమ్మకానికి రావటంతో యార్డులు, రహదారులపై రైతులు సరుకును దించక తప్పలేదు. మిర్చి, అపరాల యార్డు రహదారుల్లో బస్తాలను దించుకున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ కార్యాలయానికి దారికూడా మూసుకుపోయింది. ఓ వైపు ఎండ.. మరో వైపు ఘాటు ఉండటం తో కార్మికులు పంట ఉత్పత్తిని కాంటా పెట్టడానికి.. సరుకును వాహనాల్లో ఎత్తటానికి ఇబ్బంది పడ్డారు. మిర్చి గరిష్టధర రూ.12,300 పలికింది. ధర కూడా కొంత మేర ఆశాజనకంగా ఉండటంతో జిల్లా రైతులేకాక నల్లగొండ, వరంగల్, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన రైతులు సరుకును ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయకుండా నేరుగా మార్కెట్లో అమ్ముతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావటంతో యార్డులు, రహదారుల్లో ఉన్న సరుకునంతా బయటకు పంపించి.. సోమవారానికి యార్డులను సిద్ధం చేస్తామని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు. -
20 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
-
ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..!!
పొద్దంతా పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆటోలో వెళ్లేటప్పుడు నిత్యం ఈ తిప్పలు తప్పడం లేదు. పరిమితికి మించి ఆటోలో కుక్కేసి తీసుకెళుతున్నారు. లోన ఖాళీ లేక పిల్లల బ్యాగులను ఆటో టాపుపై ఉంచారు. అవి తీసి ఇవ్వడానికి డ్రైవర్ రాకపోవడంతో విద్యార్థులే కష్టపడుతూ టాపు పైకి ఎక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో ఏదన్నా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యులెవరు..!! ఈ దృశ్యాలను సూరారం ప్రధాన చౌరస్తాలో ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. -
హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ చేయాలిలా!!
ఆడవారికి అత్యవసరమైపోయిన వస్తువుల్లో హ్యాండ్ బ్యాగ్ ముఖ్యమైనది. ఒకప్పుడు అవసరమైన వస్తువుల్ని మోసేందుకు ఉపయోగించిన ఈ బ్యాగులు... ఇప్పుడు ఫ్యాషన్లో భాగమైపోయాయి. అందుకే ఆడవారిని అనుక్షణం అంటిపెట్టుకుని ఉంటున్నాయి. అయితే వీటిని క్యారీ చేస్తే చాలదు... పది కాలాల పాటు కాపాడుకోవాలంటే కేర్ తీసుకోవడం కూడా తెలియాలి. లేదంటే ఎంత ఖరీదైన బ్యాగ్ అయినా కళ్లు మూసి తెరిచేలోగా కళావిహీనమైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే... ♦ అందరూ కామన్గా చేసే తప్పు... అవసరమైనవన్నీ బ్యాగులో కూరేయడం. అది ఇంత లావు అయిపోతుంది. దాంతో అందం పోతుంది. మీరు ఏం పెట్టినా, ఎన్ని పెట్టినా బ్యాగ్ షేప్ మారనివ్వనంత వరకే. ♦ పౌడర్, క్రీమ్, మాయిశ్చరైజర్, నూనె, జెల్, లిప్స్టిక్ అంటూ ప్రతి దానినీ బ్యాగులో వేసేస్తారు. అలా నేరుగా వేయకూడదు. ఒక పౌచ్లో వేసుకుని, ఆ పౌచ్ని బ్యాగ్లో వేసుకోవాలి. లేదంటే మరకలు పడిపోతాయి. ♦ సూదిగా ఉండే వస్తువులు బ్యాగ్లో వేయకూడదు. కావాలంటే బాక్స్లో కానీ పౌచ్లో కానీ పెట్టి వేసుకోవాలి. ♦ కూలింగ్ వాటర్ బాటిళ్లు, ఐస్క్రీమ్ వంటివి పెట్టకూడదు. ఆ తడి బ్యాగ్ మెటీరియల్ను పాడు చేస్తుంది. అలాగే లంచ్ బాక్సులు కూడా. అవి బ్యాగ్ సహజ వాసనను పోగొట్టి దుర్వాసనకు దారితీస్తాయి. ♦ ఏ క్రీమో, నూనో రాసేసుకుని ఆ చేత్తోనే వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతారు. ఆ అలవాటు చాలు బ్యాగ్ని పాడు చేయడానికి. శుభ్రంగా చేతులు కడుక్కుని, తుడుచుకున్నాకే బ్యాగ్ పట్టుకోవాలి. ♦ లెదర్ అయినా, మరే మెటీరియల్ అయినా సబ్బు పెట్టి ఉతక్కూడదు. నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ కలిపి, మెత్తని గుడ్డను ముంచి, దానితో బ్యాగ్ను మృదువుగా తుడవాలి. ♦ మరకపడితే వీలైనంత త్వరగా దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలి. బాగా ఆరిపోయిన తర్వాత కొన్ని రకాల మెటీరియల్స్ మీది నుంచి మరకను తొలగించడం కష్టం. ♦ బ్యాగ్ దుర్వాసన వస్తోంటే డియోడరెంట్లు, సెంట్లు కొట్టకండి. ఓ చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను వేసి బ్యాగ్లో ఉంచుకోండి. కొన్ని గంటలు గడిచేసరికి ఆ వాసనను సోడా పీల్చుకుంటుంది. దుర్వాసన పోతుంది. ♦ వాడనప్పుడు బ్యాగ్ని ఏ షెల్ఫులోనో పడేసి ఉంచుతారు. అలా చేయకూడదు. డస్ట్ బ్యాగ్స్ అని ఉంటాయి. వాటిలో పెట్టి దాచాలి. అప్పుడే దుమ్ము చేరకుండా ఉంటుంది. కావాలంటే దిండు కవర్లో పెట్టి కూడా దాచుకోవచ్చు. -
ఫ్యాషన్ జ్యూట్
బ్యాగులు మాత్రమే కాదు జనపనారతో తయారైన ఆభరణాలూ అలంకరణలో భాగమవడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి తేలికగా ఉండటమే కాకుండా మన దేశీయతను చాటుతున్నాయి. ఇవి సాధారణ దుస్తుల మీదకు ధరించినా ఆకర్షణీయతను రెట్టింపు చేస్తాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఆకట్టుకుంటున్న ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. పర్యావరణానికి అనుకూలమైనవి. పర్యావరణ ప్రేమికులకు ఈ ఆభరణాలు నేస్తాల్లాంటివి. ఫ్యాషన్కి చిరునామా: అందంగా కాదు అధునాతనంగా తయారవడానికి నేటి యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ ఉత్పత్తులు ధరించడం వల్ల ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్నారు. అందుకే దేశీయ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. జనపనారతో తయారైన ఈ ఆభరణాలే అందుకు నిదర్శనం. కాస్ట్యూమ్ జువెల్రీగా పేరొందిన జ్యూట్ ఆభరణాలు భిన్నమైన రంగులు, మోడల్స్లో లభిస్తున్నాయి. పర్యావరణ నేస్తాలు కూడా కావడంతో ఇవి చర్మానికి హాయినిస్తాయి. ఫ్యాషనబుల్గా, నాణ్యతగా రూపొందించడానికి తయారీదారులు మరింత శ్రద్ధ పెడుతున్నారు. లోహాలతో తయారైన ఆభరణాల డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో దుస్తుల మ్యాచింగ్కి అధిక ప్రాధాన్య మిస్తున్నారు. నారతో తయారుచేసిన కేశాలంకరణ బ్యాండ్స్, క్లిప్పులు, గాజులు, హారాలు.. డ్రెస్లకు చక్కగా సరిపోలేవి లభిస్తున్నాయి. రూ.50 నుంచి లభించే ఈ ఆభరణాలు దుస్తుల రంగులకు తగినవి వీలైనన్ని ఎంపిక చేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్, ఆన్లైన్ మార్కెట్ లోనూ విభిన్నంగా కనువిందుచేస్తున్న జ్యూట్ ఆభరణాల నుంచి వినియోగ దారుల దృష్టి మళ్లడం లేదు. మగువలకే కాదు మగవారికీ నప్పే జ్యూట్ డిజైన్లు ఎన్నో కొలువుదీరాయి. -
డాక్టర్ వేషంలో వచ్చి బ్యాగ్లు నొక్కేసింది
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఓ మహిళ హల్చల్ చేసింది. డాక్టర్ వేషంలో వచ్చిన అమ్మడు....అందినకాడికి మహిళా వైద్యుల బ్యాగ్లను నొక్కేసింది. సుమారు పదిమంది బ్యాగ్లను అపహరించిన ఆమె అక్కడ నుంచి ఉడాయిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం మహిళను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను చిలకలగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
రంజాన్కు భారీ ఏర్పాట్లు
చార్మినార్/బహదూర్పురా/సాక్షి, సిటీబ్యూరో: ఈద్-ఉల్-ఫితర్ను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రార్థనలను పురస్కరించుకుని ఈద్గాలను ము స్తాబు చేస్తున్నారు. పాతబస్తీలోని మీరాలం, మాదన్నపేట్, గోల్కొండ, సికింద్రాబాద్లోని ఈద్గాలతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఆ యా ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీ మీరాలం ఈద్గాను అన్ని హంగులతో ప్రార్థనలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. పండుగరోజు ఆంక్షలు.. సామూహిక ప్రార్థనల దృష్ట్యా మీరాలం ఈద్గా తదితర ప్రాంతాల్లో పండుగ రోజు ట్రాఫిక్ ఆం క్షలు విధించనున్నారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను పురానాపూల్, బహదూర్పురా పోలీస్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించనున్నారు. మీరాలం ఈద్గా క్రాస్ రోడ్డు నుంచి ఈద్గా వైపు ఎటువంటి వాహనాలను అనుమతించరు. శివరాంపల్లి, ఎన్పీఏ నుంచి బహదూర్ఫురా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ నుంచి అలియాబాద్ వైపు దారి మళ్లిస్తారు. బ్యాగులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు వద్దు: డీసీపీ ఈద్గాలో సామూహిక ప్రార్థనలకు వచ్చే ముస్లిం లు తమ వెంట బ్యాగులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులు తీసుకు రాకూడదని దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠీ కోరారు. ఈద్గా వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించిన అనంతరమే సామూహిక ప్రార్థనలకు అనుమతిస్తామన్నారు. ఈద్గాల అభివృద్ధి: డిప్యూటీ సీఎం రాష్ట్రంలోని ఈద్గాలను అభివృద్ధి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ను పురస్కరించుకొని పాతబస్తీ మీరాలం ఈద్గాను ఆదివారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తాడ్బన్ మీరాలం ఈద్గాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. మీరాలం ఈద్గా ముఖద్వారం వద్ద శాశ్వత కమాన్, మీరాలం ఈద్గా లోపల శాశ్వత షెడ్ను త్వరలో నిర్మిస్తామన్నారు. ఆయన వెంట బహదూర్పురా ఎమ్మెల్యే మోజాం ఖాన్, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రత్యూమ్నా, పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ అధికారులు, కార్పొరేటర్లు మహ్మద్ మోబీన్, ఎంఏ గఫార్, అజీజ్ బేగ్, టీఆర్ఎస్ బహదూర్పురా నియోజకవర్గ ఇన్చార్జి ఎస్ఏ ఖైసర్, మహ్మద్ అబ్దుల్ గఫార్ ఖాన్ తదితరులు ఉన్నారు. -
కళకళ.. వెలవెల
సాక్షి, సిటీబ్యూరో: వేసవి ముగియడంతో నగరంలోని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ గురువారం పునఃప్రారంభమయ్యాయి. కొత్త దుస్తులు, పుస్తకాల బ్యాగులు తగిలించుకొని వచ్చిన విద్యార్థులతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కళకళలాడగా, సర్కారీ స్కూళ్లు మాత్రం విద్యార్థులు లేక బోసిపోయాయి. కొత్తగా చేరుతున్న చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట రావడంతో పలు ప్రైవేటు పాఠశాలలు కిటకిటలాడా యి. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు ఉపాధ్యాయులంతా వచ్చినప్పటికీ.. విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. సెలవులకు ఊళ్లకు వెళ్లిన విద్యార్థలు కొందరు తిరిగి రాకపోవడం, ఎండ తీవ్రత ఇంకా తగ్గకపోవడం కూడా కారణాలు కావచ్చని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే..జిల్లావ్యాప్తంగా ఏ పాఠశాల్లోనూ విద్యార్థులకు కనీసం ఒక్కజత యూనిఫారాన్ని కూడా విద్యాశాఖ అధికారు లు అందజేయలేదు. విద్యార్థులకు ఉచి త పాఠ్యపుస్తకాలను కూడా అరకొరగానే పంపిణీ చేశారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏ యేటికాయేడు తీవ్రంగా పడిపోతోంది. అదేమీ లేదని అధికారులంటున్నప్పటికీ ఇది వాస్తవం. సాధారణంగా వేసవి సెలవుల్లో బడిబాట, విద్యా పక్షోత్సవాలు.. తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు ను పెంచుకోవటానికి విద్యాశాఖ కసరత్తు చేయ టం పరిపాటి. కానీ ఈసారి అలాంటి కార్యక్రమాలేవీ జరగకుండానే పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది. విద్యాశాఖ అధికారులు వేసవి సెలవు ల షెడ్యూల్లో బడిఈడు బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరం. పాఠ్య పుస్తకాల కొరత! పాఠశాలల పునఃప్రారంమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు. ప్రతిఏటా పాఠ్యపుస్తకాల కొరత విద్యార్థులను వేధిస్తున్నా..ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జూన్ 12నుంచి పాఠశాలలు తెరిచిన వెం టనే.. నగరంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ అధికారులు చే సిన ప్రకటనలు కాగితాలకే పరిమితయ్యాయి. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 65 శాతం పుస్తకాలు మాత్రమే పాఠశాలలకు చేరాయి. మిగిలిన 35 శాతం పుస్తకాలు స్కూళ్లకు ఎప్పుడొస్తాయో అంతుబట్టని దుస్థితి నెలకొంది. పుస్తకాలు ఇవ్వకుంటే విద్యార్థులు బడి రాకుండా పోయేందుకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. యూనిఫారాలు లే వ్ ! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు సుస్పష్టంగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన యూనిఫారాల గురించి అటు ఆర్వీఎంలోనూ.. ఇటు విద్యాశాఖలో ఆ హడావిడేమీ కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లాలో 1.07లక్షలమందికి 2.14లక్షల జతలు సిద్ధం కావాల్సి ఉండగా..నేటివరకు ఒక్క జత కూడా రెడీ కాలేదని తెలిసింది. కనీసం కాంట్రాక్టర్ నుంచి బట్ట(క్లాత్)కూడా అందలేదు. కమీషన్లకు కక్కుర్తిపడిన ప్రభుత్వ పెద్దలు.. అధ్వాన్నపు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడమే ఈ జాప్యానికి కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జోరు