తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 7.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు డీఎస్పీ జే.వి.రాముడు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ముబారక్అలి అలియాస్ శివ అనే అంతర్రాష్ట్ర దొంగ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో ఇతన్ని అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులను ఆయన అభినందించారు.