Shiva
-
తండ్రీకొడుకులను కబళించిన లారీ
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరాం ప్రేమ్దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి) -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణం.. కొడుకు జననం
రాజోళి: విధి ఆ కుటుంబంతో వింత నాటకమాడింది. భర్త చనిపో యాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకు ను చూసి సంబరపడాలో తెలియని దయనీయస్థితి ఏర్పడింది ఆ తల్లి కి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బల పాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్ అదుపు తప్పి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందగా, తర్వాత గంట సమయంలోనే పురిటి నొప్పు లతో శివ భార్య అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ.. మరోవైపు కొడుకు రూపంలో మళ్లీ జన్మించాడనే నమ్మకంతో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పుట్టిన బిడ్డను చూసుకునే భాగ్యం తండ్రికి లేదని, బిడ్డకు తండ్రిని చూపించే అదృష్టం తల్లికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ట్యాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్కు వివాహిత
శంషాబాద్: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది. ఆన్లైన్ పేమెంట్తో.. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్కు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్ మార్నింగ్ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్ 16న హైదరాబాద్ నుంచి లండన్ రప్పించుకున్నాడు. ఏం జరిగింది..? లండన్ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకుంది. తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిoది. చివరకు కాల్ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్పల్లి పోలీసులు ఆమె ఫోన్ను ట్రాక్ చేయగా చివరకు ఫోన్ లొకేషన్ రాజేంద్రనగర్లో చూపింది.శంషాబాద్ టు గోవా.. పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్ లోకేషన్ షేర్ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు బస్సు టికెట్ను వాట్సాప్ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు తరలించారు. తనకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్ బ్లాక్మెయిల్ చేయడంతోనే తాను హైదరాబాద్కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు. మరోవైపు తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు. -
ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.నాగార్జున తన ట్వీట్లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.నాగార్జున పోస్ట్కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024 -
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్పేట్ ఈశ్వర్గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్గా నిలిచింది. రామ్గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?
అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్ను కోరాడు. అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
లోక్సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్గాంధీ
సాక్షి,ఢిల్లీ:లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది. సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు. సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్...స్పీకర్ అభ్యంతరం..అయితే రాహుల్ సభలో మాట్లాడుతూ రాహుల్గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. రాహుల్గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..నా ఇల్లు, పదవి లాగేసుకున్నారువిపక్ష నేతలను, ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారుఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నాపరమతాత్మ మోదీతో నేరుగా మాట్లాడతారుఅదికారం కంటే నిజం గొప్పదిప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నాశివుడి ఎడమ చేతి వెనక త్రిశులం ఉంటుందిత్రిశూలం హింసకు చిహ్నం కాదుఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేదికొందరికి ఆ చిహ్నం అంటే భయంసభలో గురునానక్ ఫోటోను సైతం ప్రదర్శించిన రాహుల్హిందూ సమాజం అంటే ఒక్క మోదీ కాదుహిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వారే కాదుసభలో ఉన్నావారు, బయటవారు కూడా హిందువులేరాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా మైక్ మళ్లీ కట్ చేశారు.. రాహుల్లోక్సభలో తన మైక్ను మళ్లీ కట్ చేశారని రాహుల్గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. రాహుల్ వర్సెస్ స్పీకర్లోక్సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్ స్పష్టం చేశారు. -
ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’ (ఏ లవ్స్టోరీ ఇన్ రివర్స్). తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో రామ్ యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు స్నేహితుల మధ్య అవగాహన నేపథ్యంలో సాగే కథే ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్. -
అహం దెబ్బతిని..
శంషాబాద్: జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండమోనీ శివ (28) మియాపూర్లో చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామాని కి చెందిన శేషగిరి శివ (28) నగరంలోని గాయత్రీనగర్లో ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి జలకం రవికి వీరితో స్నేహం ఉంది. ముగ్గురూ బీజేవైఎంలో చురుగ్గా పనిచేశారు. శివ, శేషగిరి శివకు కొంతకాలం క్రితం రవితో మన స్పర్థలు రాగా, వారు కాంగ్రెస్లో చేరారు. దీంతో రవికి వీరికి దూరం పెరిగింది. దీనికితోడు ఈ నెల 4న కడ్తాల్లోని బట్టర్ఫ్లై వెంచర్లో రవి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ 300 ఫొటోలు గోవిందాయిపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. దీనికి ఇద్దరు శివలు అభ్యంతరం చెబుతూ ఫొటోలు డిలేట్ చేసి, రవిని వాట్సాప్ గ్రూప్లో నుంచి తొలగించారు. దీంతో తనను అవమానించి, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని అంతం చేయాలని రవి నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, జీలుకుంట్ల విజయ్, తిరు పతి జగదీశ్గౌడ్, నిట్ల ప్రవీణ్, వల్లేపు దాసు శేఖర్తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. వారిద్దరు ఈ నెల 5న ఓ వైన్స్ దుకాణంలో మద్యం తాగుతున్నారని తెలుసుకున్న రవి.. తన ఇన్నోవాలో ఆరుగురు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. బలవంతంగా వారిని కారులో ఎక్కించుకొని బట్టర్ఫ్లై వెంచర్లో తాను అద్దెకుంటున్న గది వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఆ తర్వాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మీర్పేట్ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024 -
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జన్మించాడు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్లు రెంట్కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
‘కంగువ’ నాకెంతో స్పెషల్ : హీరో సూర్య
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు . ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
-
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున 52 ఎకరాల భూములు
సాక్షి, యాదాద్రి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం. రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. 22 మంది ఆధార్కార్డులు శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ.. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
జన్మదినం రోజే యువకుడి విషాదం..
మహబూబాబాద్ / వరంగల్: జన్మదినం రోజునే ఓ యువకుడు అనంతలోకాలకు చేరాడు. తన బర్త్డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కమలాపూర్ మండలం కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన నకీర్త శివ (20) కమలాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం శివ ఇంట్లో మల్లన్న పట్నాలు వేశారు. అదేరోజు శివ పుట్టిన రోజు కూడా కావడంతో స్నేహితులు సాయంత్రం ఫోన్ చేసి పిలిచారు. దీంతో స్నేహితుల వద్దకు వెళ్లి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి అదేరోజు రాత్రి ద్విచక్రవాహనంపై వంగపల్లిలోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో కమలాపూర్లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నడికూడ నుంచి కొత్తకొండకు వెళ్తున్న ట్రాక్టర్.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా అతడితో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కమలాపూర్కు చెందిన మరో యువకుడు అరుణ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇవి చదవండి: ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు! -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం!
సాక్షి, మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు బలవంతంగా మాత్రలు మింగించి కడతేర్చాడో భర్త. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శివకావ్య (26) బీటెక్ చదువుతున్న సమయంలో స్థానిక బీసీకాలనీకి చెందిన వడ్ల భరత్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు అన్విధ్ ఉన్నాడు. కట్నం కోసం శివకావ్యను వేధించడంతో రెండు పర్యాయాలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది, అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శివకావ్య గర్భం దాల్చింది. డబ్బులు ఇచ్చేంత వరకు పిల్లలను కనేదిలేదని చెబుతూ 45 రోజుల కిందట భార్యతో బలవంతంగా మాత్రలను మింగించాడు. అవి వికటించడంతో శివకావ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. పలు ప్రవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆరెకటిక కిషన్జీ ఫిర్యాదు మేరకు వడ్ల భరత్, వేణుగోపాలాచారి, శారద ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం! -
రెగ్యులర్ కథలు చేయను : శివ కంఠమనేని
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘మధురపూడి గ్రామం అనే నేను’. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ– ‘‘ఒంగోలు బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ డ్రామా ఈ చిత్రం. మొరటుగా ఉండే సూరి పాత్రలో కనిపిస్తాను. తన మిత్రుడు బాబ్జీ ఎమ్మెల్యే కావడం కోసం సూరి ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతని ప్రేమకథ ఏ విధంగా ప్రభావితమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కమర్షియల్ పంథాలోనే ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు.. మనసులకు సంబంధించినదనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. నేను రెగ్యులర్ కథలు చేయను. నేను చేసిన ‘అక్కడొకడుంటాడు’లో నా పోస్టర్స్ చూసి ‘మధురపూడి..’ సినిమా కథకు నన్ను ఎంపిక చేసుకున్నారు మల్లికార్జున్గారు. దాదాపు 150కిపైగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రాలు ‘మణిశంకర్, రాఘవరెడ్డి’ త్వరలో రిలీజ్ కానున్నాయి. మంచు లక్ష్మిగారి ‘ఆదిపర్వం’ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
ఆ పాయింట్తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్గార్లు డైరెక్టర్స్కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి
అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. భర్తపై తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్లో రాన్జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు..
భద్రాద్రి: స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకున్న కొద్దిసేపటికే అందులోని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తోటి స్నేహితుల్లో విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాల్వంచ నవభారత్కు చెందిన ఏనిగ ఉపేందర్రెడ్డి కుమారుడు మధూకర్రెడ్డి (20), వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (20)లు ఆదివారం సాయంత్రం బైక్పై నవభారత్ వైపు వెళ్తూ ఎన్ఎండీసీ కర్మాగారం సమీపంలో డివైడర్కు ఢీకొట్టారు. దీంతో ఇద్దరు ఎగిరి ముందుకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్, పట్టణ ఎస్ఐ బి.రాములు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సంబురాలు.. అంతలోనే విషాదం.. ఆదివారం సెలవు కావడంతో పాటు స్నేహితుల దినోత్సవం కాగా నవభారత్లో ఉంటున్న మధూకర్రెడ్డి మోటార్ సైకిల్పై పాల్వంచకు వచ్చాడు. కొద్దిసేపు స్నేహితులంతా కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు మద్యం కూడా సేవించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మధూకర్రెడ్డి.. శివను మోటార్ సైకిల్పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో డివైడర్కు ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. మధూకర్రెడ్డి మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. శివ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.రాము తెలిపారు. -
‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్ నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన దర్శకత్వం : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా- శివ కోన విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే.. రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా శివ సెట్స్లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
నైనా గంగోలి కి రిటర్న్ ఏం ఇచ్చారు ?
-
ఆసక్తి పెంచుతున్న శివ కోన కొత్త సినిమా పోస్టర్
శివా కోన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ పోస్టర్ని మాత్రం వదిలారు. ఆ పోస్టర్లోక్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరికి ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది. కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది. -
ముగ్గురి ఆశలు ఖుషి పైనే..
-
ఉలవచారు బిర్యానీ చాలా ఇష్టం
‘‘ముప్పైఏళ్లుగా తెలుగువారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ గార్లు, ఎన్టీఆర్, రామ్చరణ్.. ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు.. చాలా మోటివేట్ చేస్తారు’’ అని కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శివ’. శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత డిసెంబరు 23న రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి నేడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ చెప్పిన విశేషాలు. ► రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నేను నటించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ (2016) చిత్రం తెలుగులో విడుదలైంది. ఆ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించడం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ‘శివ వేద’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం వెరీ హ్యాపీ. ► ‘వేద’ కన్నడలో విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి ఆదరణ వస్తోంది. ‘శివ వేద’లో వినోదం, భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది ఈ చిత్రంలో ఉంటుంది. ‘వేద’ అనేది క్యారెక్టర్ పేరు. లవ్, లైఫ్, హ్యాపీనెస్, ట్రస్ట్.. ఇవన్నీ వేద లైఫ్లో ఉంటాయి. ► ‘శివ వేద’ని కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, పబ్లిసిటీకి సమయం లేకపోవ డంతో ఇక్కడ విడుదల చేయలేదు. కన్నడ, తమిళ్లో రిలీజ్ చేయగా మంచి హిట్టయ్యింది. తమిళంలోనూ బాగా ఆదరిస్తున్నారు. హర్షకి నాపై ఉన్న నమ్మకం వల్లే మా కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశాం. ► తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు మాట్లాడగలను. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరే ఉండలేరు.. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కాబట్టి కొత్తవారిని ప్రోత్సహించాలి. ► భక్తి నేపథ్యంలో ఓ మూవీ చేయాలని ఉంది. పునీత్ రాజ్కుమార్ బయోపిక్ తీసే ఆలోచన లేదు. ప్రస్తుతం రజనీ సార్తో ‘జైలర్’, ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్ విన్నాను. -
‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : డై హార్డ్ ఫ్యాన్ నటీనటులు :ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది దర్శకత్వం: అభిరామ్ సంగీతం : మధు పొన్నాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి సినిమాటోగ్రఫీ:జగదీష్ బొమ్మిశెట్టి ఎడిటర్: తిరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్ విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ప్రియాంక శర్మ, శివ ఆలపాటి జంటగా నటించిన చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కితర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, ట్రైలర్కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 2)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? శివ(శివ ఆలపాటి) అనే యువకుడికి హీరోయిన్ ప్రియాంక (ప్రియాంక శర్మ) అంటే ఎనలేని అభిమానం. ఒక్కసారైనా తనను ప్రత్యేక్షంగా కలవాలనుకుంటాడు. ఆమె ఏ ఫంక్షన్కి వెళ్లినా తను అక్కడికి వెళ్లేవాడు. ఇక తన అభిమాన హీరోయిన్ ప్రియాంక బర్త్డేని ఎంతో గ్రాండ్గా చేద్దామని ప్లాన్ వేస్తాడు శివ. అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి ఆమె పర్సనల్ మొబైల్ నుంచి శివకు మెసేజ్ వస్తుంది. శివ ఆ షాక్లో ఉండగానే.. ప్రియాంక నేరుగా అతని ఇంటికి వస్తుంది. ఆ రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక.. తన అభిమాని ఇంటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన సంఘటన నుంచి శివ ఎలా బయట పడ్డాడు? హత్య కేసులో ఇరుక్కున్న శివ, అతని మామయ్య శంకర్ని బయటకు తీసుకురావడానికి లాయర్ కృష్ణకాంత్(రాజీవ్ కనకాల) ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ హత్య కేసుకు లాయర్ కృష్ణకాంత్కు ఏదైనా సంబధం ఉందా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా లో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరొయిన్ ని కలవాలనుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అభిరామ్. సాధారణ కథే అయినా.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అయిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్లో ల్యాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. ఈ సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతంది. కథని మరింత పకడ్బందీగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరోయిన్ ప్రియాంకగా ప్రియాంక శర్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. డై హార్డ్ ఫ్యాన్గా శివగా శివ ఆలపాటి ఆకట్టుకున్నాడు. షకలక శంకర్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాబోయే రాజకీయ నాయకుడు బేబమ్మ పాత్రలో శంకర్ ఒదిగిపోయాడు. లాయర్ కృష్ణకాంత్గా రాజీవ్ కనకాల మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఆదిత్య పాత్రలో నోయల్ చాలా చక్కగా నటించారు. కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే..ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. మధు పొన్నాస్ కంపోజ్ చేసిన పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ తిరు పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
సాయి కుమార్ ‘వన్ బై టు’ రిలీజ్ డేట్ ఫిక్స్
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వన్ బై టు’.ఆనంద్, శ్రీ పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించారు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ మరియు వీ ఐ పీ క్రియేషన్స్ బ్యానర్ ల పై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి సాంగ్స్ సంగీతం సమకూర్చగా సందీప్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. శంకర్ కేసరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కపిల్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, శంకర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. -
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రాముఖ్యత ఇదే..
శివుడు భోళాశంకరుడిగా, భక్త వశంకరుడిగానూ ప్రసిద్ధుడు. భస్మాసురుడికి సైతం వరాలిచ్చేంత భోళాతనం శివుడికే చెల్లింది. కఠిన నియమాలను పాటించనక్కర్లేదు. నిండుమనసుతో పూజిస్తే చాలు, భక్తులను ఇట్టే అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే. కన్నప్పను కటాక్షించిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్తసులభుడు. శివుడు సనాతనుడు. వేదాలు శివుడిని రుద్రుడిగా ప్రస్తుతించాయి. నిజానికి వేదకాలానికి ముందే శివారాధన వ్యాప్తిలో ఉండేదనేందుకు ఆరాధారాలు ఉన్నాయి. పురాణేతిహాసాల్లో శివుని మహిమను వెల్లడించే గాథలు విరివిగా కనిపిస్తాయి. శివుని గాథలన్నింటినీ క్రోడీకరించిన శివపురాణం శైవులకు ఆరాధ్యగ్రంథం. మాఘ బహుళ చతుర్దశి రోజున క్షీరసాగరమథనంలో పుట్టిన గరళాన్ని తన కంఠంలో బంధించి శివుడు లోకాలను రక్షించాడు. అందుకే ఈ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ మహాశివరాత్రి శైవులకు అత్యంత పవిత్ర పర్వదినం. భారతదేశం నలుచెరగలా పురాతన శైవక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. వీటికి తోడు దేశంలో దాదాపు ప్రతిగ్రామంలోనూ శివాలయాలు కనిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ శైవక్షేత్రాలే కాకుండా, ఊరూరా వెలసిన శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. నమక చమక స్తోత్రపారాయణాలతో హోరెత్తుతాయి. మహాశివరాత్రి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసం, జాగరణ చేస్తూ రోజంతా శివనామ స్మరణలో గడుపుతారు. యథాశక్తి ఆలయాల్లో అభిషేక, అర్చనాది సేవలు జరిపిస్తారు. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్ ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం, త్య్రంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఇది జ్యోతిర్లింగ స్తోత్రం. ఇందులో ప్రస్తావించిన క్షేత్రాలు: సోమనాథ క్షేత్రం సౌరాష్ట్ర– అంటే గుజరాత్లోని గిర్సోమనాథ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మల్లికార్జున క్షేత్రం ఉంది. ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారు. మహాకాళేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. మధ్యప్రదేశ్లోనే నర్మదాతీరంలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ ఒకే శివలింగం రెండు భాగాలుగా ఉండి, ఓంకారేశ్వర, అమలేశ్వర అనే రెండు పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటుంది. బిహార్లోని దేవగఢ్ జిల్లాలో బైద్యనాథ క్షేత్రం ఉంది. క్షీరసాగర మథనం తర్వాత ధన్వంతరి అమృతాన్ని ఇక్కడి శివలింగంలోనే భద్రపరచాడని ప్రతీతి. మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమశంకర క్షేత్రం ఉంది. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు ఇక్కడ విశ్రమించాడని పురాణాల కథనం. తమిళనాడులోని సాగరతీరాన రామేశ్వర క్షేత్రం ఉంది. రావణసంహారం తర్వాత శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణం చెబుతోంది. మహారాష్ట్రలోని దారుకావనంలో నాగేశ్వర క్షేత్రం ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన విశ్వేశ్వర క్షేత్రం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగం చిన్నగుంటలా ఉంటుంది. అందులో మూడుబొటన వేళ్లలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా మూడు చిన్న లింగాలు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లో మందాకినీ నది సమీపంలో హిమాలయాల్లో కేదారేశ్వర క్షేత్రం ఉంది. మంచుకారణంగా ఏడాదికి ఆరునెలలు మాత్రమే ఇందులో భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహల సమీపంలో ఘృష్ణేశ్వర క్షేత్రం ఉంది. చదవండి: అతడూ ఆమె: ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’! -
బిగ్బాస్ ఓటీటీ: ఈ సెలెబ్రిటీలు ఫిక్స్.. లిస్ట్ ఇదే!
తెలుగు బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సీజన్.. సీజన్కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బిగ్బాస్ ఐదో సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. గత మూడు సీజన్స్కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్.. ఓటీటీ బిగ్బాస్కి కూడా హోస్టింగ్ చేయనున్నాడు. మరో రెండు నెలల్లో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్బాస్ ఎలా ఉంటుంది? ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్లో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, వర్షిణి, రాజు, వైష్ణవి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ బిగ్బాస్ షో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. బిగ్బాస్ ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ సంస్థ అయిన ‘ఓక్ ఎంటర్టైన్మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
తీరని విషాదం: గేటు పడింది..గుండె ఆగింది
మదనాపురం: రైల్వేగేటు పడడంతో సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటకు చెందిన దండు శివ(45)కు గురువారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి అంబులెన్స్లో తరలిస్తుండగా.. మదనాపురం వనపర్తి రైల్వేగేట్ స్టేజీ వద్ద గేటు పడింది. పావుగంటపాటు అంబులెన్స్ ఆగిపోయింది. తోటి ప్రయాణికులు గేటు తీయాలని పట్టుబట్టడంతో గేట్మేన్ ఉన్నతాధికారులతో మాట్లాడి గే టు తెరిచి పంపించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సకాలంలో వైద్యం అందక శివ చనిపోయాడు. అతనికి భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!) -
రజనీకాంత్ ‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ని అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో ఇది కచ్చితంగా రికార్డులు తిరగ రాస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ నవంబర్ 4న థియేటర్స్లో విడుదల కానుంది. చదవండి: అక్టోబర్ 4న ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట Arangam Mulukka therikka therikka!#AnnaattheTeaser is releasing on October 14 @ 6 PM @rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @prakashraaj @IamJagguBhai @khushsundar #Meena @sooriofficial @actorsathish @AntonyLRuben @dhilipaction @vetrivisuals pic.twitter.com/SRvplKautv — Sun Pictures (@sunpictures) October 11, 2021 -
ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తానంటున్న సాయి కుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’.శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చెర్రీ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాయికుమార్ని చాలా పవర్ఫుల్గా చూపించారు. అమ్మాయిలపై యాసిడ్ దాడులు, పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్ గా ఉంది. ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. మహిళల రక్షణ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ ‘వన్బై టు’అని టీజర్ తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
తనికెళ్ళ భరణి.. వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!
వెబ్డెస్క్: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది. తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి. బాధలో నా భావనలను చెదరగొట్టాను. వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి. భావనలు వెళ్లిపోయాయి నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి! గురువు రాళ్లపల్లి లేకుంటేనా.. డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి. అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్ ఆర్ట్స్లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! శివుడంటే ప్రాణం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! నైజాం అభిమానం యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు. గతి మార్చింది ‘శివ’నేనా? దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్గా, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ విలన్గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది. -
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
-
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
టిక్టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టిక్టాక్ వీడియోల పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్లో భార్గవ్పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్ శివ సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం భార్గవ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా 2 లక్షలు ఇస్తాం..కేసు వాపసు తీసుకోండి అని భార్గవ్ పోలీసులను ప్రాధేయపడినట్లు శివ తన స్టోరీలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భార్గవ్ ఫోన్, ల్యాప్టాప్ను పోలీసులు సీజ్ చేశారని వివరించాడు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ వార్త నిజమేనా? లేక యాంకర్ శివ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడా అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. దీంతో ఇది వ్యూస్ కోసం చేయడం లేదని, ఈ వార్తను బయటకు రానివ్వకుండా ఎక్కడ ఆపేస్తారో అని తాను పోస్ట్ చేస్తున్నట్లు యాంకర్ శివ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది ప్రాంక్ కాదని, నిజమైన వార్తేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్ శివ చేసిన వరుస పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : పోలీస్స్టేషన్లో షణ్ముఖ్ రచ్చరచ్చ హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? -
గ్యాంగ్ నేపథ్యంలో..
శివ, మణికాంత్, మయూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దాస్ గ్యాంగ్’. చిరంజీవి రాళ్ళబండి దర్శకత్వంలో మమతా రాళ్లబండి నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గ్యాంగ్ నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి.. వాటికి పూర్తి భిన్నంగా మా చిత్రం ఉంటుంది. శివ, మణికాంత్ల పాత్రలు హైలెట్గా నిలుస్తాయి. హిందీలో గుర్తింపు తెచ్చుకున్న మయూరి మా సినిమాతో తెలుగులో పరిచయం అవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: గౌస్ బాషా. -
నా పేరు జగదీష్..కానీ అందరూ
అతని పేరు జగదీష్, కానీ అందరూ ‘టక్ జగదీష్’ అని పిలుస్తారు. మరి ఆ పేరు వెనక స్టోరీ ఏంటి? అంటే జగదీషే చెప్పాలి. ‘నిన్ను కోరి’ సినిమా తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని మరో సినిమా కోసం కలిశారు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ను మంగళవారం ప్రకటించారు. హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ‘‘నా తొలి హీరోతో మళ్లీ కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శివ నిర్వాణ. నానీతో తెరకెక్కించిన ‘నిన్ను కోరి’ దర్శకుడిగా శివ నిర్వాణకు తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
సంగీతంలో సస్పెన్స్
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాహుల్, పరిటాల. -
బర్త్డేకి ఫిక్స్
సినిమా పూర్తి చేయడం, హిమాలయాలకు వెళ్లి, కొన్ని రోజులు ఉండి రావడం రజనీకాంత్ అలవాటు. మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పి, హిమాలయాలు వెళ్లారాయన. అక్కడ్నుంచి రాగానే తన 168 సినిమాపై దృష్టి పెడతారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12)న ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. మామూలుగా ఒక సినిమాకి సంబంధించిన నటీనటులందరినీ అధికారికంగా ప్రకటించేవరకూ కీలక తారాగణం అయిన హీరోయిన్, విలన్ పాత్రధారుల గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. అలా ఈ చిత్రంలో రజనీ సరసన జ్యోతిక కథానాయికగా నటించనున్నారనే వార్త ప్రస్తుతం షికారు చేస్తోంది. రజనీ సరసన జ్యోతిక ఇప్పటివరకూ నటించలేదు. అయితే రజనీ కీలక పాత్రలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమాలో ప్రభు భార్యగా జ్యోతిక నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. రజనీ 168లో సూపర్ స్టార్ సరసన నటించబోయే హీరోయిన్ జ్యోతికా? కాదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
రజనీ @ 168
రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా చిత్రీకరణ ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది. మరి.. రజనీకాంత్ తర్వాతి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఏ దర్శకుడిని వరిస్తుందనే ప్రశ్నకు శుక్రవారం సమాధానం దొరికింది. తమిళంలో అజిత్తో వరుసగా ‘వీరమ్’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన శివ ఆ చాన్స్ను దక్కించుకున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ‘‘యందిరిన్ (తెలుగులో ‘రోబో’), ‘పేట’ చిత్రాల తర్వాత మరోసారి రజనీకాంత్గారి సినిమాను నిర్మించనుండటం సంతోషంగా ఉంది’’ అని సన్ పిక్చర్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 168వ చిత్రం. మాస్ ఎంటర్టైనింగ్ కథను రెడీ చేశారట శివ. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో వచ్చిన ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలు శివ దర్శకత్వంలోనే తెరకెక్కాయన్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
సస్పెన్స్ థ్రిల్లర్
శివ కంఠమనేని హీరోగా నటించనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఇందులో నందితా శ్వేతా కథానాయికగా నటిస్తున్నారు. రాశీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించనున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర రావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మిస్తున్నారు. శివ, నందితా శ్వేత, రాశీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వాసవి గ్రూప్ విజయ్కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటుడు, నిర్మాత అశోక్కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్. రెండు షెడ్యూల్స్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నాలుగు పాటలను రికార్డ్ కూడా చేశాం’’ అన్నారు. ‘‘చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నాను’’ అన్నారు రాశి. ‘‘ఈ సినిమాలో రాశికి అమ్మగా, నందితా శ్వేతకు అమ్మమ్మలా నటిస్తున్నాను’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఇందులో నా పేరు లక్కీ. టెర్రర్ గాళ్గా కనిపిస్తాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఓ మంచి పాయింట్తో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు సంజీవ్. ‘‘అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చేసేలా సినిమా తీస్తున్నాం’’ అన్నారు ఆర్. వెంకటేశ్వరరావు. ‘‘కథ నచ్చి నిర్మించాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాంబాబు. సంగీత దర్శకుడు సుధాకర్ మరియో, మాటల రచయిత అంజన్ మాట్లాడారు. -
‘ప్రాణ’హితుడు
ఎంతో మందిని రక్షించిన శివ పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మురుగు నీటిలోని శవాలను వెలికి తీయడంతో పాటు ఎంతోమందిని కాపాడినందుకు మహేందర్రెడ్డి నగర పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో శివను అవార్డుతో సత్కరించారు. రాంగోపాల్పేట్: అప్పుడు సమయం సాయంత్రం 3 గంటలు.. ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలు ఎప్పటిలాగే ఉన్నాయి. కొంత మంది ఫుట్పాత్పై నడుస్తూ హుస్సేన్ సాగర్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉన్నట్లుండి ఓ 45 ఏళ్ల వ్యక్తి సాగర్ నీళ్లలోకి దూకేశాడు. వెంటనే వాహనదారులు, పాదాచారులు అందరు గుమికూడారు.. అయ్యో ఎవరో దూకేశారు అంటున్నారే తప్ప రక్షించేందుకు ఎవరూ సాహసించడం లేదు. కొద్ది దూరంలో ఉన్న ఓ వ్యక్తి అది గమనించి నీళ్లలోకి నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాడిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కడుపులోని నీళ్లు కక్కించి శ్వాస అందించి ప్రాణాలు కాపాడాడు. మిట్ట మధ్యాహ్నం ఓ మహిళ ట్యాంక్బండ్పై ఏడ్చుకుంటూ రోడ్డు దాటి వచ్చి హుస్సేన్ సాగర్లోకి దూకేసింది. అప్పటికే ఆమె పరిస్థితిని గుర్తించి అనుసరిస్తున్న వ్యర్తి వెంటనే సాగర్లోకి దూకి మునిగిపోతున్న ఆమెను బయటకు తీశాడు. ఆమె ప్రాణాలతో భయట పడ్డది కానీ ఆ వ్యక్తి కుడి చేయి భుజం వద్ద ఓ ఇనుప చువ్వ గుచ్చుకుని తీవ్ర గాయమైంది. అయినా అతడిలో ఓ ప్రాణం కాపాడన్న ఆనందం ఉంది తప్ప గాయాన్ని మాత్రం పట్టిచుకోలేదు. ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు ఏవేవో సమస్యలతో బాధలతో హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు తీసుకోవాలని దూకేసిన 107 మందిని అతను రక్షించాడు. అందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టిన అతడి పేరు ‘శివ’. ట్యాంక్బండ్నే అడ్డాగా మార్చుకుని అక్కడే కుటుంబంతో కలిసి ఉంటూ ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఒకవైపు ప్రాణాలు కాపాడుతూ సాగర్లో పడిచనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడమే ఒక దైవ కార్యంగా చేపట్టాడా సాహసి. రైలు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారి మృతదేహాలు తరలింపుతో మొదలైన అతడి ప్రస్థానం హుస్సేన్ సాగర్లో మృతదేహల వెలికితీతతో పాటు ఎంతో మంది పునర్జన్మ నిచ్చిన వ్యక్తిగా నిలుస్తున్నాడు. సోదరుడి లాంటి వ్యక్తి మరణంతో.. శివ జీవితం మొత్తం ఫుట్పాత్ మీదే సాగింది.. సాగుతుంది కూడా. శివకు ఐదేళ్ల వయసులో ఫుట్పాత్పై తిరుగుతుండగా ఎవరో చాదర్ఘట్లోని సిధూర్ హాస్టల్లో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి ఖైరతాబాద్లోని మరో హాస్టల్కు మకాం మారింది. లోయర్ ట్యాంక్బండ్లో నివసించే మల్లేశ్వరమ్మ అనే మహిళ శివను చేరదీసింది. అమె కొడుకు మహేందర్, శివ అన్నదమ్ముల్లా ఉండేవారు. శివ చిన్న వయసులోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు సాయంగా వెళ్లేవాడు. తర్వాత హుస్సేన్ సాగర్లో మృతదేహాలను వెలికి తీసేవాడు. మహేందర్ మృతితో మార్పు తనకు అన్నలాంటి మహేందర్ 2013లో హస్మత్పేట్ చెరువులో మునిగి చనిపోయాడు. దాంతో తల్లిలా పెంచిన మల్లేశ్వరమ్మ బాధ చూడలేకపోయాడు శివ. అప్పటి నుంచి నీటిలో మునిపోతున్న వారిని రక్షించాలన్న సంకల్పంతో హుస్సేన్ సాగర్ పరిసరాలనే తన నివాసంగా మార్పుచుకున్నాడు. సాగర్ నీటిలో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు. దాంతో మిత్రుడు పవన్తో కలిసి వైజాగ్ సముద్ర జలాల్లో ఈత సాధన చేసి గజ ఈతగాళ్లుగా మారారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ ఇదే హుస్సేన్ సాగర్లో ప్రమాదవశాత్తు మరణించాడు. ఉపాధి చూపించిన సాగర్ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న శివకు హుస్సేన్ సాగరే ఉపాధి చూపించింది. గణపతి నిమజ్జనాల సందర్భంగా సాగర్లో దొరికే ఇనుప చువ్వలు వెలికితీసి వాటిని విక్రయించి ఉపాధి పొందుతుంటాడు. ఇక చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తే పోలీసులు కొంత డబ్బు ఇస్తుంటారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శివ. ఇటీవల సినిమా షూటింగ్లకు నటులకు బౌన్సర్గా వెళుతూ ఇంకొంత సంపాదించుకుంటున్నానని చెబుతున్నాడు. తన ఏడుగురు సంతానంతో కలిసి ట్యాంక్బండ్పై ఫుట్పాత్, పాడుబడిన లేపాక్షి భవనం వద్ద నివాసం ఏర్పరచుకున్నాడు. శివ కుటుంబానికి లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి ఆసరాగా నిలిచారు. ఆమె మేలు ఎప్పటికీ మరచిపోలేనంటున్నాడు శివ. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్కుమార్తో ధనలక్ష్మి మాట్లాడి శివ ముగ్గురు కుమారులను రెసిడెన్సియల్ పాఠశాలలో చేర్పించారు. -
పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్..
శివ సినిమా... అప్పట్లో రికార్డులను బద్దలుకొట్టింది. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఇపుడో వార్త బయటకొచ్చింది. శివ హిందీ వెర్షన్లో మాస్ సినిమాల దర్శకుడు పూరీ జగన్నాథ్ నటించారంట. అవునా.. ఎక్కడా కన్పించలేదే అనుకోకండి...! కేవలం బోటనీ పాఠముంది... పాటలో మాత్రమే పూరీ కన్పిస్తారు. ఈ విషయాన్ని వీడియోతో సహా ట్విటర్లో పంచుకున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పటి జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమా దర్శకుడు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పూరీ స్పందిస్తూ.. అవును, అందులో డ్యాన్స్ చేస్తోంది నేనేనంటూ రీ ట్వీట్ చేశారు. వర్మ పంచుకున్న ఈ వీడియోలో నీలి రంగు షర్ట్లో ఉన్న పూరీ జగన్నాథ్ మిగతావారితోపాటు పాటలో స్టెప్పులేస్తూ కనిపిస్తారు. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ నిదర్శనమంటూ రాంగోపాల్ వర్మ అభినందించారు. The junior artiste in blue shirt is today’s super director Puri Jagan ..Hey @purijagan WHAT A JOURNEY🙏🙏🙏💐💐💐 pic.twitter.com/irRXxfhK3v — Ram Gopal Varma (@RGVzoomin) 24 June 2019 -
ఆకాశవాణి
శివ, ఉమయ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. ‘జబర్దస్త్’ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సైన్స్ స్టూడియోస్పై మర్రిమేకల మల్లికార్జున్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సతీష్ ఈ చిత్రకథను నాకు ముందే చెప్పాడు. మంచి పాయింట్తో తీస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మల్లికార్జున్గారు నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రమిది. ఆయనకు మంచి పేరు, డబ్బు తెచ్చి పెట్టే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సతీష్గారు సినిమాని చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను నిర్మించడంలో నా బాధ్యతను చక్కగా నిర్వర్తించాను’’ అన్నారు మర్రిమేకల మల్లికార్జున్. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. మల్లికార్జున్గారి సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాగలిగేవాళ్లం కాదు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సతీష్ బత్తుల. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, కెమెరా: ఆరీఫ్. -
‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్ లోగో లాంచ్
సయిన్స్ స్టూడియోస్ బ్యానర్పై శివ, రక్ష, ఉమయ్ చంద్, అక్షితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రాజ్ కందుకూరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది’ అన్నారు. హీరో శివ మాట్లాడుతూ.. ‘సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు’ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సినిమా సతీష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అన్నారు. నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా రాజ్ కందుకూరి లా నిర్మాతగా నిలబడదాం అనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథతో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని కోరారు. -
విశ్వాసం చూపిస్తారు
సంక్రాంతికి తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించిన చిత్రం ‘విశ్వాసం’. దర్శకుడు శివ, అజిత్ కాంబినేషన్లో రూపొందిన నాలుగో చిత్రమిది. ఇంతకుముందు ‘వీరం, వేదాళం, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. సత్యజోతి ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ‘విశ్వాసం’లో నయనతార హీరోయిన్, జగపతిబాబు విలన్గా నటించారు. ఈ సూపర్హిట్ తమిళ చిత్రాన్ని అదే టైటిల్తో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాత ఆర్. నాగేశ్వరరావు. మార్చి 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘తమిళంలో అజిత్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డా మాకు ఇచ్చిన సత్యజోతి సంస్థకు ధన్యవాదాలు. శివ–అజిత్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సూపర్ హిట్ సినిమా ఇది. తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమెరా: వెట్రి. -
ఏసీబీ దాడులు.. కేజీ బంగారం సీజ్!
-
కొత్త కాంబినేషన్
యువ దర్శకులతో ఈ మధ్య ఎక్కువగా పని చేస్తున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ చేయనున్నారు. ఈ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం’ సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయ్యారట చైతు. ఈ ప్రాజెక్ట్ను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు నిర్మించనున్నారని సమాచారం. నాగచైతన్య కోసం ఓ కొత్త పాయింట్ రెడీ చేశారట మేర్లపాక గాంధీ. యూవీ క్రియేషన్ బ్యానర్ యూత్ఫుల్ సబ్జెక్ట్స్ను ఎంపిక చేసుకోవడంతో పాటు భారీ ప్రొడక్షన్ వేల్యూస్తో సినిమాలు రూపొందిస్తారన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఈ నెల మూడో వారం నుంచి ‘వెంకీ మామ’లో జాయిన్ అవుతారు నాగచైతన్య. మేర్లపాక గాంధీ సినిమాను కూడా ‘వెంకీ మామ’తో సమాంతరంగా చేస్తారో లేదో వేచి చూడాలి. -
యువతితో నటుడు పరార్
తమిళనాడు, పెరంబూరు: సినీ నటుడు శివ పక్కింటి యువతితో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. వివరాలు.. పయపుళై అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు శివ. తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన ఇతను స్థానిక రామావరంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. శివకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పక్కింటి యువతితో పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. భార్యకు విడాకులిచ్చినట్లు అబద్దం చెప్పి ఆ యువతితో ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు వారించినా వినిపించుకోలేదు. అంతే కాదు నటుడు శివతో కలిసి పరారైంది. పోలీస్స్టేషన్లో చేరిన జంట.. దీనిపై యువతి తల్లిదండ్రులు రాయలనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ గౌతమన్ దర్యాప్తు చేపట్టారు. కాగా వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో పారిపోయిన జంట శుక్రవారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. విచారణలో శివ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసింది. అంతే కాదు శివ ఆ యువతితో కలిసి కన్యాకుమారి, మదురై తిరిగొచ్చినట్లు తెలిసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి ఈ యువతిని పెళ్లి చేసుకుంటానని పోలీసులకు చెప్పాడు. ఆ యువతిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. -
హరుడికే అమ్మ అయిన అమ్మవ్వ
పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది. అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి. – డి.వి.ఆర్. -
అక్షరాలా ఐదోసారి
ఆ రోజుల్లో హీరో, దర్శకుడు పది సినిమాల వరకూ కలసి చేసేవారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు తగ్గింది. హీరో–డైరెక్టర్ రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ అన్నట్లు ఉంది. కానీ తమిళ హీరో అజిత్, దర్శకుడు శివ అందుకు భిన్నంగా ఉన్నారు. వీళ్ల కాంబినేషన్లో ఆల్రెడీ ‘వీరమ్, వేదాళమ్, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐదోసారి కూడా వీళ్ల కాంబినేషన్ రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఈ సినిమా కూడా ‘వి’ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ‘వి’తో టైటిల్ పెడతారో లేదో వేచి చూడాలి. -
ఆవేశం కాదు.. ఆలోచన ముఖ్యం
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైడి రమేష్ మాట్లాడుతూ– ‘‘యువజన నాయకుడైన హీరో తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రకథాంశం. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. మా సినిమా ద్వారా రమణ సాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మెసేజ్ ఉన్న చిత్రం ‘రూల్’. సినిమా చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. తెలంగాణ ఎన్నికల సమయంలో మా చిత్రం విడుదల కావటం సంతోషంగా ఉంది’’ అన్నారు పైడి సూర్యనారాయణ. ‘‘కెమెరామెన్గా ఉన్న నన్ను ఈ సినిమాతో హీరోని చేశారు డైరెక్టర్’’ అని శివ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలా, సహ నిర్మాత: పాంగ కోదండరావు. -
ఉపవాస భుక్తి
ఆదిశేషుడిని విష్ణువు తల్పంగా చేసుకున్నాడు.శివుడు ఆభరణంగా మలుచుకున్నాడు.నాగభక్తి తెలుగువారి అనాది ఆచారం.నాగుల చవితికి ఉపవాసం మన ఆరాధన విధానం.ఉపవాసం అనంతరం తేలిగ్గా సింపుల్గా ఆహారం తీసుకుంటే భక్తి భుక్తి సమతులం అవుతాయి. పర్వదినం ఫలవంతం అవుతుంది. చిమ్మిలి కావలసినవి: వేయించిన నువ్వులు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; వేయించిన ఓట్స్ – అర కప్పు; వేయించిన బాదం పప్పులు – 10; వేయించిన జీడి పప్పులు – 10; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙నువ్వులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో నువ్వుల పొడి, బాదంపప్పుల మిశ్రమం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి వేసి బాగా కలిపి ఉండలు చేయాలి. సాబుదానా ఇడ్లీ కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్ సోడా – చిటికెడు ; జీడి పప్పులు – 20; నూనె – ఇడ్లీ రేకులకు పూయడానికి తగినంత తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో సగ్గు బియ్యం, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి ∙రెండు కప్పుల పెరుగు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, సుమారు 8 గంటలసేపు పక్కన ఉంచాక, గరిటెతో బాగా కలపాలి. (సగ్గుబియ్యం మెత్తగా అయ్యేలా మెదపకూడదు). అవసరాన్ని బట్టి నీరు జతచేసుకోవాలి ∙ఉప్పు జత చేయాలి ∙ఇడ్లీలు వేసే ముందు పిండిలో కొద్దిగా తినే సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దికొద్దిగా నూనె పూయాలి ∙ ఒక్కో గుంటలోనూ జీడిపప్పు ఉంచి, ఆ పైన గరిటెడు ఇడ్లీ పిండి వేయాలి ∙ అన్నీ వేసిన తరవాత ఇడ్లీ రేకులను కుకర్లో ఉంచి స్టౌ మీద పది నిమిషాలు ఉంచి దింపేయాలి (విజిల్ పెట్టకూడదు). చలిమిడి కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; పాలు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లన్నీ ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ∙బియ్యంలోని తడి ఆరిపోగానే, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టాలి. (జల్లెడ పట్టి మెత్తటి పిండితో మాత్రమే చలిమిడి చేయాలి) ∙ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపితే చలిమిడి సిద్ధమైనట్లే. ముర్మురా చాట్ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – పావు కప్పు; వేయించిన సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; మరమరాలు – 3 కప్పులు; పంచదార పొడి ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడయ్యాక çనూనె వేసి బాగా కాగాక, పల్లీలు వేసి సన్న మంట మీద క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి ∙పుట్నాల పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ∙మరమరాలు జత చేసి జాగ్రత్తగా పెద్ద గరిటెతో రెండు మూడు నిమిషాలు కలిపి దింపేయాలి ∙పంచదార పొడి, ఉప్పు జత చేసి కలిపి, ప్లేట్లలో వేసి వేడివేడిగా అందించాలి. కొసాంబరి సలాడ్ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు (నీళ్లలో రెండు గంటలపాటు నానబెట్టాలి); పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: ∙పెసర పప్పులోని నీళ్లు ఒంపేసి, నీళ్లు పూర్తిగా పోయేవరకు వడకట్టాలి ∙ పెద్ద పాత్రలో పెసర పప్పు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, సగం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙ ఇంగువ, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పెసర పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙చివరగా ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. అటుకుల పులావ్ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత కాయగూరలు... క్యారట్ తురుము – పావు కప్పు; బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బీన్స్ – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); క్యాబేజీ తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; క్యాలీఫ్లవర్ తరుగు – ఒక టేబుల్ స్పూను వేయించడానికి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2 తయారీ: ∙అటుకులను ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చిమిర్చి జత చేసి మరోమారు కలపాలి ∙తరిగి ఉంచుకున్న కూరగాయల తురుము, ముక్కలు వేసి మెత్తబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙అటుకులు, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. సాబుదానా ఉప్మా కావలసినవి: సగ్గు బియ్యం – 2 కప్పులు; పల్లీలు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (మధ్యకు నిలువుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె / నెయ్యి – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను బాగా వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు సుమారు మూడు నిమిషాల పాటు వేయించుతుండాలి ∙సగ్గుబియ్యంలో నీళ్లు పూర్తిగా ఒంపేయాలి ∙పల్లీలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి ∙వేగుతున్న పోపులో సగ్గు బియ్యం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి బాగా కలిపి, కొద్ది సేపు ఉంచి దింపేయాలి. -
డూప్ హీరోల సందడి
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ డూప్లు భాస్కర్, శివ, చందు హీరోలుగా హాబీబ్ తెరకెక్కించిన చిత్రం ‘కథానాయకులు’. సి.రామాంజనేయులు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. హబీబ్ మాట్లాడుతూ – ‘‘ఒక మల్టీస్టారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ వినోదంగా సెకండాఫ్ థ్రిల్కు గురి చేసే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది. పెద్ద హీరోల ఫ్యాన్స్ ఎక్కడా నొచ్చుకోకుండా చేశాం’’ అన్నారు నిర్మాత రామాంజనేయులు. ఈ చిత్రానికి కెమెరా: జో అండ్ శివ. -
ఆలోచన ముఖ్యం
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 9న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేశారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్, నిర్మాత అశ్వినీదత్ టీజర్, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసారు. సినిమా విజయం సాధించాలని వీరందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైడి రమేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో ఒక యువజన నాయకుడు. తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంతో రమణ సాయి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మంచి సందేశం ఉన్న చిత్రం ఇది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు పైడి సూర్యనారాయణ . ఈ చిత్రానికి కెమెరా: బాల, సహ నిర్మాత: పాంగ కోదండరావు. -
అతడు గోదారి ఎదురీదాడు
రేయ్... ఆగండి.... ఎంత దూరమని పరుగులెడతారు. చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకు రావాల్సిందే కదా. వయసు తాపాలు వద్దు, ప్రేమ పాశాలు వద్దు. మోహాలు...ప్రేమలు ...వద్దు. జీవించడం ప్రధానం. వేట కొడవళ్ళు కక్కుళ్ళు పెట్టి నునుపుదేరి ఉన్నాయి. గండ్ర గొడ్డళ్ళు కొలిమిలో కాగి కాగి పదునుతేరి ఉన్నాయి. దానికి తోడు అడ్డంగా నరికేసే ఆత్మాభిమానాలున్నాయి. కుల జాడ్యాలున్నాయి. కాస్త నిగ్రహం పాటించండి, లోకం మారే దాకా, జనం జట్టు కట్టే దాకా. అయినా...ఆగరా...మీ మాట మీదేనా...ఎవరి మాటా వినరా....అయితే ...అయితే.... మీ ఇష్టం...మీ ప్రారబ్ధం. గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పడవ అటూ ఇటూ ఊగుతోంది. ఎదురీదుతున్నట్లుగా సాగుతోంది. కాసేపు ఎండా మరికాసేపు వాన. వాతావరణం గమ్మత్తుగా ఉంది. ఇది విహారం కాదు. వేట ముఖ్యం. బతుకు తెరువు ముఖ్యం. బండి లాగించడం ముఖ్యం. ముగ్గురున్నారు పడవలో. రామచంద్రం, సత్య, శివుడు.దూసుకెళ్తున్న పడవ నీటిని అడ్డంగా కోస్తూంది. నీటి ముక్కలు తెల్లటి నురగలుగా తెగి పడుతున్నాయి. చితికి పరిగెలు ఎగిరెగిరి పడుతున్నట్టుగా ఉంది. దూది పింజెలు చెల్లాచెదురుగా ఎగురుతున్నట్టుగా ఉంది. శివుడు తదేకంగా చూస్తున్నాడు. అమ్మా నాన్నలతో యుద్ధం చేసి వచ్చాడు వేటకు. పెద్ద పేచీ పెట్టి పంతం నెగ్గించుకుని వచ్చాడు. సరదా తీరింది. కళ్ళు సలుపుతున్నాయి. కాళ్ళు నెప్పెడుతున్నాయి. ఉన్నట్టుండి ఆకాశంలో గురక పెడుతున్న చప్పుడు. అల్లంత దూరాన విమానం. తడిగా ఉన్న లాగు ఒంటి మీద ఉండగానే పిండుకున్నాడు. చూపు మాత్రం ఆకాశం పైనే. సరిగ్గా నెత్తి మీదకు రాగానే అడిగాడు.‘‘అందులో నిజంగా మనుషులుంటారా? భయం ఉండదా? నేనెప్పుడైనా అలాంటి పడవలో ఎక్కి కూర్చుంటానా? ’’ ‘‘అది పడవ కాదురా ..ఇమానం...ఇమానం. ఒరేయ్... నాయనా... లాగు విప్పేసి పిండుకోరా... గోదారి మధ్యలో ఉన్నాం. నీకేటి సిగ్గు? ఇందాకటి పాడు వాన... సడీ సప్పుడు లేకుండా వచ్చి కుమ్మరించేసింది... ముందా బట్టలిప్పుకో... ప్రతి దానికీ తయారవుతావు. సెప్పింది ఇనవు కదా ’’ అని విసుగ్గా అంది సత్య.‘‘విమానమని నాకు తెల్దేంటీ? ఊరికే పడవన్నాను’’ చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు శివుడు. దూరంగా చిన్న చుక్కలా కనిపిస్తోంది విమానం. బొటనవేలు, చూపుడువేలు గుండ్రంగా చుట్టి అందులోంచి విమానం చుక్కను చూస్తున్నాడు శివుడు. చిన్నగా ఉంది. అమ్మ చేత ఇక బతిమాలించుకోలేదు. గబగబా బట్టలు విడిచి దిశమొలతో నిలబడ్డాడు. ఈసారి ఆకాశంలో బారులు కట్టిన పక్షులు. వాటికేసి చూస్తూ అలాగే నిలబడ్డాడు. ‘‘ఈవేళ్టికి చాల్లే సంబడం. బేగి తెవిలితే మంచిది. ఈయేళ అచ్చి రాలేదు. సేపలు గీపలు లేవు గానీ కాళ్ళు తీట పుడుతున్నాయి. పొద్దెక్కింది. ఇక వెనక్కి తిప్పు....’’ మొగుడుతో అంది సత్య. గొంతులో నిరాశ. చెంబు లోంచి మంచినీళ్ళు గొంతు లోకి వొంపుకుంది. ‘‘వండుకున్నమ్మ తినక మానదు. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు. ఇంటికి పోక ఇక్కడే నీటిలో గుండ్రంగా తిరుగుతూ ఏటెల్ల కాలం ఉండిపోతామా, ఏటి? వొక అంచు వలేసి చూద్దారి...కంగారు పడితే ఎలా? కాసింత నిదానం ఉండాలి’’ అన్నాడు రామచంద్రం చుట్టూ గోదారిని నిశితంగా చూస్తూ. శివుడు ఒబ్బిడిగా వల పట్టుకుని అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో వాడికి ఇప్పటికిప్పుడే ఇంటికి వెళదామని లేదు. మళ్ళీ ఎప్పటికో గానీ తీసుకెళ్ళరు. ‘‘మనోడు గట్టోడే. ఏదైనా అంటే చాలు చిటికెలో తయారయిపోతాడు. అయినా గానీ సేప పిల్లకి ఈత నేర్పాలా?’’‘‘అసుమంటి కబుర్లు చెప్పమాకు. నా కొడుకు ఈ పని సస్తే చేయడు. సక్కగా సదువుకుని కలకటేరు అవుతాడు...ఏరా అబ్బిగా....’’ అంది మురిపెంగా సత్య కొడుకు కేసి చూస్తూ. తలూపాడు శివుడు. ఎండలో మెరుస్తూ రోడ్డు మీద గాంధీ వేషం వేసుకున్న కుర్రాడిలా ఉన్నాడు శివుడు. ‘‘రోజులీయాల్లా ఉండవులే... మనోడికి సదువొచ్చి మీద పడాలే గానీ నేనేమైనా కాదంటానా?’’ వలలో ఏదో పడినట్లుగా బరువుగా తోచి ‘‘ఇలా రాయే....’’ అంటూ అరిచాడు రామచంద్రం. పడింది పండుగొప్ప. అనుకోని అదృష్టం. ‘‘బాబిగాడొచ్చిన యేలా విసేసం’’ శివుడు ఆసక్తిగా చూస్తున్నాడు. సత్య ఆశగా చూస్తోంది. రామచంద్రం తృప్తిగా చూస్తున్నాడు. గోదారి పాయ.దక్షిణం నుండి ఉత్తరం వైపుకు పారే కోరింగ నది. ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ విశాల ఆవరణంలోంచి సన్నని ఇరుకు సందులోకి వచ్చి గడిబిడిగా... పరుగులు తీస్తోంది. దాని వేగం భయం కలిగించేలాఉంది. కట్టలు తెంచుకుని ప్రవహిస్తే ఇంక ఏమైనా ఉందా? నదీ పాయ దిగువన మంచి పారు మీద వరిచేలున్నాయి. పొట్ట మీద ఉండి ఆకుపచ్చని తివాసీ పరిచినట్లుండే పొలాలు ఏమౌతాయో? ముంపుకు గురయితే నీరు దిగే అవకాశం లేని పంట పొలాల గతి ఊహించడం కష్టం. నీటిని కట్టడి చేయడానికి పెద్ద పెద్ద తలుపులు బిగించి టైడల్ లాక్ ఏర్పాటు చేశారు. ఏ కారణం చేతనైనా అవి కొట్టుకుని పోతే తప్ప ప్రస్తుతం ఇబ్బంది లేదు. దానికి సమీపంలో మర్రిచెట్టు. దాని చుట్టూరా సిమెంటు చప్టా కట్టారు. ఊళ్ళో జనం ఊసులాడుకోడానికి అనువైన అడ్డా అది. సాయంత్రం సమయంలో అంతా చేరతారు భైరవస్వామి కబుర్లూ, కతలూ వినడానికి. అర్ధరాత్రి దాక ఒకటే కబుర్లు. ఊళ్ళో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. భైరవస్వామి వయసు ఎనభై ఏళ్ళు. ఎర్రగా ఉంటాడు. తెల్లటి జుట్టు. పొట్టిగా ఉంటాడు. గట్టివాడే. హుషారుగా మాట్లాడతాడు. మాటల పోగు. మనిషిలో దిగులుండదు. సమస్యలున్నట్టు అనిపించదు. ఒకవేళ ఉన్నా తెలియనీయడు. లౌక్యం తెలిసినవాడు. చెట్టు మొదలు గోనెసంచి పరుచుకుని కూర్చుంటాడు భైరవస్వామి. పొగాకు కాడ చీల్చి చుట్టలు చుట్టుకుంటాడు.నోరు ఊరుకోదు. అనుభవం రంగరించి లోకం తీరు గురించి మనుషుల మనస్తత్వాల గురించి చెబుతాడు. మంచీ చెడూ మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడానికి ప్రయత్నించడు. కానీ కోపం వస్తే పట్టుకోలేం.వీరావేశంతో ఊగిపోతాడు. ఊళ్ళో వాళ్ళు భైరవస్వామిని గౌరవిస్తారు. శ్రద్ధగా వింటారు. దినపత్రికల్లో వచ్చే వార్తలు చదివి దేశంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా చెబుతాడు. టీవీ కథనాల గురించీ ముచ్చటిస్తాడు. జీవితమంతా నాగరిక ప్రపంచంలో మసిలి వచ్చినవాడు. స్పష్టంగా మంచి భాష మాట్లాడతాడు. రచ్చబండకు దగ్గర్లోనే మహాప్రస్థానం పేరున శ్మశానం ఉంది. శవ దహనం సమయంలో అయితే భైరవస్వామి వేదాంత తత్వాలు పాడతాడు. జీవన సత్యాలు పలుకుతాడు. చావు పుట్టుకల మర్మం విప్పుతాడు. సాయం సంధ్య. చల్లగా గాలి వీస్తోంది. ఆవేళ భైరవస్వామి కాస్త నలతగా ఉన్నాడు. వచ్చీపోయే నాల్ని చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో శివుడు ఆ దారిన వస్తున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. భైరవస్వామికి శివుడంటే చాలా ఇష్టం. అతడ్ని చూడగానే ఎక్కడలేని ఓపిక వచ్చేసింది. భైరవస్వామితాతకు తల వంచి నమస్కారాలు చెప్పి పాదాలు ముట్టుకున్నాడు శివుడు. ‘‘చాలా సంతోషం నాయనా... మీ నాన్న రామచంద్రం సంబరపడుతూ చెప్పాడు. వాడు ఎంతో ఇదిగా పొంగిపోతున్నాడు. బిడ్డల ఎదుగుదల తండ్రికి ఆనందమే కదా. వాడొక్కడితో సరిపోయిందా? మన పేటోళ్ళంతా గొప్పలు చెప్పుకుంటూ గెంతులేస్తున్నారు. ఇప్పుడేం చేస్తావు, బాబూ...’’ భైరవస్వామి కళ్ళలో వెలుగులు నింపుకుని అడిగాడు. ‘‘కోచింగు తీసుకుంటున్నాను, తాతా... ఐ.ఎ.ఎస్ రాస్తాను. మళ్ళీ ఊరికి రావడం ఇప్పట్లో కుదరదని అమ్మా నాన్నలను చూడ్డానికి వస్తున్నాను ’’ అన్నాడు వినయంగా శివుడు.భైరవస్వామి ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాడు. తల గోక్కున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.భుజం మీద చేయి వేసి గుచ్చినట్టు గట్టిగా నొక్కి వదిలాడు. లోపలికి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. తాత ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని అర్థమైంది శివుడికి. ఆయన చెప్పబోయే దానికోసం ఎదురుచూస్తున్నాడు.‘‘మన జాతిలో నీ అంత తెలివైనవాడు మరొకడు లేడురా... పదోతరగతి మొదలు అన్నింటా మొదటోడిగా చదువుతున్నావు. నీవు అనుకున్నది కచ్చితంగా సాధించి తీరతావు. అందులో ఈసమెత్తు అనుమానం లేదు. కానీ... ఒరేయ్.... మీ నాన్న కష్టం చూడాలి. చేపల వేట గిట్టుబాటు కావడం లేదని నీకోసం రాత్రింబవళ్లు ఇసుక తవ్వుకి కూడా పోతున్నాడు. నిన్ను ప్రయోజకుడ్ని చేయాలనేది వాడి తాపత్రయం. మీ అమ్మా అంతే. వాళ్ళ కష్టం ఊరికే పోదు. ఇపుడు నీకో పాలి ఓ మాట చెప్పాలి... వింటావా? ’’ భైరవస్వామి అడిగాడు సూటిగా శివుడి కేసి చూస్తూ. ‘‘అలాగే చెప్పండి. పెద్దలు అంతా మంచికే చెబుతారు. చెప్పండి, తాతా? ’’ నవ్వుతూ అన్నాడు శివుడు. ‘‘నన్ను అర్థం చేసుకోగలవు. ఆ జ్ఞానం నీకుందని నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. ఒరేయ్... శివుడూ... నీకెలాగూ మంచి ఉద్యోగమే తప్పక వస్తుంది. అది దేవుడు ఎప్పుడో రాసేశాడు. దానికి తిరుగులేదు. నువ్వు ఈ మట్టిలో పుట్టిన మాణిక్యానివి. అసలు సంగతేమిటంటే నీవు కులం లోని పిల్లనే పెళ్ళాడాలి. నిన్ను ఏ అగ్రకులం పిల్లో వల పన్ని ఎగరేసుకుపోకూడదు. నీ జీవిత వైభోగమంతా కులం పిల్లే పొందాలి. ఎవడైనా ఎదిగాక పుట్టినచోటునీ జాతినీ మరచిపోకూడదు రా..’’ అన్నాడు. అంత దాక ఆవహించిన నీరసం భైరవస్వామిలో ఇప్పుడు మచ్చుకి కూడా లేదు. ‘‘మీ మాటలు గుర్తుంచుకుంటాను, తాతా ... అయినా ఇంకా ఏమైంది... మొదటి మెట్టు మీదే ఉన్నాను’’ అంటూ లేచాడు శివుడు వెళ్లడానికి సిద్ధపడుతూ. ‘‘ఒక్క క్షణం ఆగు... కొన్ని వార్తలు వింటుంటే నా ఒళ్ళు కుతకుతలాడిపోతోంది. ఇంతకష్టపడి తీర్చిదిద్దుకున్న ఫలం ఇంకొకళ్ళు దోచుకుపోతుంటే నాలాంటి వాడు ఉసూరుమంటాడు. వెన్ను లోంచి బాధ తన్నుకొస్తాది ’’అంతలోనే భైరవస్వామి స్వరం మారింది. గొంతులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ‘‘అలాంటిది మన ఊళ్ళో జరిగితే ఊరుకునేది లేదు. కుల పంచాయితీ పెట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇదిగో అబ్బాయ్... ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు... నా మాటను వేళాకోళంగా తీసుకోవద్దు’’అన్నాడు. భైరవస్వామి అంతే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట్లాడే ధోరణి మారిపోతుంది. ‘‘అలాగే తాతా...’’ వినమ్రంగా అని శివుడు ఊరివైపుకు అడుగులేశాడు. పదడుగులేసి వెనక్కి తిరిగి చూశాడు.అక్కడున్న నలుగురూ చప్పట్లు కొడుతున్నారు. భైరవస్వామి తృప్తిగా తల ఎగరేసి నవ్వుతున్నాడు. నాలుగేళ్ళ కాలం గిర్రున తిరిగిపోయింది. జాతీయ స్థాయిలో శివుడికి ఐదో ర్యాంకు వచ్చింది.దినపత్రికల మొదటి పేజీల్లో ఫొటోతో సహా ప్రముఖంగా ప్రచురించారు. ఊరూ వాడా సంబరాల్లో మునిగిపోయింది. ఊరు కాంతి దిశదశలా వెలుగులు జిమ్ముతోంది. కొడుకు ఫొటో ఉన్న పేపరు చంకలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి చూపిస్తున్నాడు రామచంద్రం. విషయం తెలిసింది మొదలు మొగుడూ పెళ్ళాలు ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగానే ఉన్నారు. విలేకర్లు మూకుమ్మడిగా ఊళ్ళోకి వచ్చి ఏవేవే ప్రశ్నలు వేస్తున్నారు. ఉన్నంతలో మంచి బట్టలేసుకుని సమాధానాలు ఇస్తున్నారు. చిన్నప్పట్నుంచీ శివుడికి చదువంటే ఉండే శ్రద్ధ గురించి చెబుతున్నారు వాళ్ళదైన భాషలో. ఊళ్ళో మనిషి కలెక్టరు కావడం అంటే మాటలా? శిక్షణాకాలం పూర్తయ్యింది. మరో ఏడాదిన్నర ఇట్టే గడిచింది. ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన తర్పీదూ పూర్తయ్యింది. శివుడి ఆలోచనలు గోదారి తరంగాల్లా ఒకచోట నిలబడటం లేదు. మాట్లాడేవాడెవరో తెలీదు. మాట్లాడుతున్నాడు.అంతలోనే పాట పాడుతున్నాడు. పాట సారాంశం ఏదో సందేశం ఇస్తున్నట్లుగానే ఉంది. మంద్రస్థాయిలో వినబడుతోంది. భాష మటుక్కి ఖచ్చితంగా తెలుగే. కాదు. మరేదో. అయినా భావం మాత్రం తెలిసిపోతోంది. ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నాడు. దుస్తులు చిత్రంగా ఉన్నాయి. చిరిగిన బట్టల మీద మాసిన కోటు వేసుకున్నాడు. అయిదు అడుగులు కంటే పొడుగుండడు. దవడలు వేలాడుతున్నాయి. గెడ్డం పెరిగి ఉంది. జుట్టు తైలసంస్కారం లేక అట్ట కట్టింది. కళ్ళజోడు ఉంది. వాటికి అద్దాలు లేవు. తనని చూసి దగ్గరకు వస్తున్నాడు. అయినా ఆనవాలు తెలియడం లేదు. చల్లని చూపు మెత్తగా తగిలింది. అది కొండంత అభిమానాన్ని చూపుతున్నది. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాడు. సూటిగా కళ్ళలోకి చూస్తున్నాడు. ఉహూ(... గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. అనునయంగా ఏదో చెబుతున్నాడు. ఒక్క ముక్క అర్థం కావడంలేదు. ముక్కు మీద వేలేసుకుని మంత్రాలు చదివినట్లుగా రాగం తీస్తున్నాడు. భుజం మీద చేయి వేశాడు. స్పర్శ గిలిగింతలు పెట్టింది. భుజం గట్టిగా గుచ్చినట్టు నొక్కి వదిలాడు. ఆత్మీయ స్పర్శ.అంతే... తెలిసిపోయింది. జీర గొంతు. వణుకుతున్న స్వరం లోంచి మాటలు జారుతున్నాయి. మరచిపోయిందేదో గుర్తు చేస్తున్న అలికిడి. జ్ఞాపకాల తేనెతుట్ట రేగింది. ఇక సమస్తం అర్థమైపోయింది.సరిగ్గా అప్పుడే కుక్కలు గందరగోళంగా మొరుగుతున్నాయి, కాలభైరవుని మేల్కొలుపులా. వెంటనే మెలకువ వచ్చేసింది. తక్షణం చేయాల్సిన పని గుర్తుకొచ్చింది. దిగ్గున లేచాడు. మర్నాడు శ్రీలతను కలిశాడు. శ్రీలత తనతోబాటు శిక్షణ పొందింది. ‘‘సమస్యొకటి మీద పడింది. పరిష్కారం నాకు తెలుసు. నా చేతిలోనే ఉంది. మనకేమీ ఇబ్బంది లేదు. అంతా సజావుగా జరుగుతుంది.అందులో సందేహం లేదు. అయినానీకు చెప్పాలి. చెప్పకుండా ఉండలేను’’ అని మొత్తం చెప్పేశాడు. శ్రీలత తేలిగ్గా తీసుకుంది. కంగారుపడలేదు. గుండెలు బాదుకోలేదు. గగ్గోలు పెట్టలేదు. ఇంత అన్యాయం చేస్తావా అని నిలదీయలేదు. ప్రసన్నంగా నవ్వింది. చదువు నేర్పిన సంస్కారం. లోకం తీరు బాగా ఎరిగిన మేధ. ఉదాత్త ఆలోచనల పోగు. ‘‘తప్పుగా ప్రవర్తించకు. నీవు కులం వాళ్ళ మాట విను.పెద్దలు చెప్పినట్టు మసులుకో. పర్వాలేదు. సర్దుకోగలను. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. నీవు చెప్పడం మంచిదే. ఈ రోజు నుండి మనం మంచి స్నేహితులం’’ అంది శ్రీలత ఏవిధమైన ఉద్వేగం కనిపించనీయకుండా. కళ్ళు తడిగా ఉన్నాయి. ముఖం నవ్వుతూనే ఉంది. జీవితం సవాలు విసిరినపుడు నిబ్బరంగా ఎదుర్కోవాలి. నచ్చచెప్పాల్సిన వాళ్ళకు నచ్చచెప్పాడు. బతిమాలాల్సిన వాళ్ళను బతిమాలాడు. నదిని దాటి గమ్యం చేరాలంటే కొన్నిసార్లు ఎదురీదాలి. ఎన్నో ‘నేను’ల సమూహం సంఘం. ఒక్క ‘నేను’ విడివడి ఎదురీదాలి. శివుడు వాలులో కొట్టుకు పోలేదు. ఎదురీదాడు. ఆఖరుగా ఎదిరించాల్సిన వాళ్ళను ఎదిరించాడు. గోదారి ఎప్పటిలాగే పాటు పోటులతో సందడిగా ఉంది. దాట్ల దేవదానంరాజు -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను చాలా ఇష్టపడుతోంది. తను నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు సార్. బట్ వాళ్ల డాడీ మాత్రం మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – శివ నువ్వు టోటల్ సిన్సియర్..! అమ్మాయి ఫుల్గా కమిటెడ్..!! డాడ్ కంప్లీట్గా కంపు చెయ్యడానికి రెడీ..!!‘సార్ ఆన్సర్ ఇవ్వమంటే క్వశ్చన్ చెబుతున్నారేంటి సార్????’వాళ్ల డాడ్ అంటే అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా...‘అబ్బాయికి కూడా... ఏంటి సార్???’లవ్..!!‘ఏంటి సార్..!? అమ్మాయి వాళ్ల డాడీని అబ్బాయి లవ్ చేస్తున్నాడా? వాట్ ఆర్ యు టాకింగ్ సార్?????!?’చేసుకోకపోతే అమ్మాయి బాధపడుతుందనీ.. చేసుకుంటే డాడీ బాధపడతారనీ.. ఇద్దరినీ లవ్ చేస్తున్నాడు నీలూ!!‘అయితే ఇప్పుడు శివ ఏం చెయ్యాలి సార్????’చక్కగా అమ్మాయి ఇంటికి వెళ్లి ‘డాడీ గారండీ.. మీ అమ్మాయిని నేను లవ్వాడుతున్నానండీ’ అని చెప్పి ధైర్యంగా అమ్మాయి హ్యాండ్ అడగొచ్చు. ఆ డాడీ ఎక్కడ ఫీల్ అయిపోతాడోనని మనకు ఉత్తరం రాస్తే ఎలా????‘డాడీ ఒకటి పీకితే అప్పుడు ఎకో సౌండ్లో శివ..శివ..శివ... అని వినపడుతుందేమో సార్??’ప్రేమించడానికే కాదు గుండె ఉండాల్సింది, ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా గుండె కావాలి...!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
దెయ్యం కథ చెబితే!
శివ, సుప్రియ, ఆరోహి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దెయ్యం చెప్పిన కథ’. ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో పెనాక దయాకర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ను దర్శకుడు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. దెయ్యం కథ చెప్పడం అనేది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం తీసుకొచ్చే సక్సెస్తో ప్రదీప్, దయాకర్ రెడ్డి మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు. దయాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి హారర్ మూవీ. వెరైటీ డైలాగులు, పంచ్లతో పాటు కామెడీ ఉంటుంది. ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘కోడి రామకృష్ణగారు మా సినిమా పోస్టర్ను ఆవిష్కరించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రదీప్. ఈ చిత్రానికి సంగీతం: నవీన్, కెమెరా అండ్ ఎడిటింగ్: క్షేత్ర క్రియేటివ్ ఆర్ట్స్. -
ఆయన నా బ్రాండ్ హీరో.. వర్మ
సాక్షి, హైదరాబాద్: సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘తన ట్వీటర్ అకౌంట్లో అక్కినేని నాగార్జున ఫొటోలు రెండు పోస్టు చేశాడు. ఈ రోజునే (ఫిబ్రవరి 16న) నా మొదటి సినిమా శివ తొలి రోజు చిత్రీకరణ చేశాం. ఈ సందర్భంగా నా బ్రాండ్ హీరో నాగార్జున ఫొటోలు ఇదిగో. 25 సంవత్సరాల అన్వేషణ తర్వాత నాకు ఓ కొత్త యాక్టర్ దొరికాడు. అతనేవరో కాదు.. అక్కినేని నాగార్జునే. ఇంతకముందు చూడని రియలిస్టిక్ యాక్షన్ హీరోను నాగార్జునలో చూస్తారు’ అని వర్మ ట్వీట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా వర్మ కంపెనీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఓ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. -
డిష్యూం.. డిష్యూం
ఇన్వెస్టిగేషన్లో ప్రొగెస్ వచ్చింది. క్లూ దొరికింది. అందుకే ముంబై వెళ్లి విలన్స్ను రఫ్పాడిస్తున్నారు హీరో నాగార్జున. మామూలుగా కాదు.. గన్తో చేజ్ చేస్తూ, పంచ్ మీద పంచ్లిస్తూ కుమ్మేస్తున్నారు. అంటే.. ముంబైలో డిష్యూం..డిష్యూం అన్నమాట. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్గోపాల్ వర్మ స్వీయదర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శపథం: మై రివెంజ్ కంప్లీట్స్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఐజా షేక్ సారథ్యంలో నాగార్జున, అజయ్, షాయాజీ షిండే కాంబినేషన్లో ఫైట్ సీన్స్ను తెరకెక్కిస్తున్నాం. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ అనే ఎమ్యూజ్మెంట్ పార్క్లో చేజింగ్ సీన్స్ కూడా తీస్తున్నాం. మార్చి 10వరకు కొనసాగే ఈ షెడ్యూల్లో మరికొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ
-
కడపలో మరో స్వాతి కథ..
సాక్షి, కడప : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం మరవక ముందే కడపలోనూ అదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసించే శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో అరుణకు ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లైన తర్వాత కూడా అది కొనసాగుతుండటంతో వద్దంటూ పలుమార్లు శివ వారించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు అరుణ ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పడేశారు. శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయిసుభాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ -
సంఘమిత్రకు ముందు సందడి
కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్ సుందర్ .సి అండ్ టీమ్ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్ ఎవరో కాదు. రజనీకాంత్ హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250కోట్ల బడ్జెట్తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్ రోల్స్లో తేనాండాళ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్ను డిసెంబర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. -
అప్పుడు సైకిల్ చైన్... ఇప్పుడు లాఠీ!
యస్... సైకిల్ చైన్కి, లాఠీకి లింక్ కుదిరింది. ఎలాగంటే? రామ్గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద ట్రెండ్ సెట్టరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘శివ’లో స్టూడెంట్గా చేసిన నాగార్జున చేత సైకిల్ చైన్ లాగించారు వర్మ. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న సినిమాలో నాగార్జున చేత లాఠీ పట్టిస్తున్నారు వర్మ. వర్మ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమాలో లాఠీ పట్టి రఫ్పాడించే పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో నాగార్జున కనిపించబోతున్నారు. ‘‘వర్మ డైరెక్షన్లో తెరకెక్కబోయే స్టైలిష్ యాక్షన్ డ్రామాలో పోలీసాఫీసర్గా నటించబోతున్నా’’ అని నాగ్ పేర్కొన్నారు. అంతేకాదు... ‘‘1988లో ఆర్జీవీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు చాలామంది షాకయ్యారు. డిఫరెంట్గా ఆలోచించారు. ఇప్పుడీ 2017లో కూడా చాలామంది హ్యాపీగా ఫీలైతే... ఎక్కువమంది షాకయ్యారు. లెట్స్ రాక్ రామూ’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘నాగ్... నువ్వెప్పుడూ తక్కువగా మాట్లాడతావు. నేనే ఎక్కువగా మాట్లాడతా. ఇప్పుడు రోల్స్ మార్చుకుందాం. సినిమానే మాట్లాడుతుంది’’ అని నాగ్కి రిప్లై ఇచ్చారు వర్మ. ఈ నెల 20న ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రివెంజ్ కంప్లీట్! ‘‘నేను దర్శకుణ్ణి అవుతానంటే మా నాన్నగారు నమ్మలేదు. అందుకే, ‘శివ’ ముహూర్తపు సన్నివేశానికి నాన్నతో క్లాప్ కొట్టించి, రివెంజ్ తీర్చుకున్నా. మా అమ్మగారు నాకు ఏమీ రాదంటుంటారు. అందుకే నాగ్తో స్టార్ట్ చేయబోయే నా కొత్త సినిమాకి మా అమ్మగారితో క్లాప్ కొట్టించాలనుకుంటున్నాను. రివెంజ్ కంప్లీట్!’’ అని వర్మ పేర్కొన్నారు. -
ఆఫ్టర్ 28 ఇయర్స్.. సేమ్ ప్లేస్..
ఆల్మోస్ట్ 28 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజైంది. అంతే... బాక్సాఫీసు బద్దలైంది. ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఓ నయా ట్రెండ్ స్టార్టయ్యింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అనేలా సీన్ మారింది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘శివ’. నాగార్జున హీరోగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ను రిపీట్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ను ఈ నెల 20న స్టార్ట్ చేయనున్నారు. విశేషం ఏంటంటే..‘శివ’ సినిమా ఫస్ట్ షాట్ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ చిత్రం షూటింగ్ని కూడా స్టార్ట్ చేయనున్నారు. దీంతో సేమ్ ప్లేస్.. సేమ్ కాంబినేషన్.. సేమ్ హిట్ కన్ఫార్మ్ అంటున్నారు అక్కినేని అభిమానులు. పడిరి సుధీర్ చంద్ర సమర్పణలో రామ్గోపాల్వర్మ కంపెనీ బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలతో పాటు, ఇతర విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.