Shiva
-
శివతత్త్వాన్ని పొందాలంటే...!
మన హృదయంలో ఉండేది శ్రీ మహాదేవుని ప్రతిబింబం. ఇది శ్రీ శివుని నివాసం. ఇది అన్నింటినీ మించినది. మన మనస్సుకు, ఆలోచనలకు అన్నింటికీ అతీతమైనది. ఈ శివ తత్త్వాన్ని పొందాలంటే, ముందుగా మనం శ్రద్ధ వహించి మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో మన లోపలికి మనం చూసుకోవాలి. మన హృదయం లోపల, మనం చాలా మురికిని పెంచుకుంటాము. ఉదాహరణకు, మనం ఎవరినైనా చూసి అసూయపడతాం. ఎవరో మనకు చెడు చేసినట్టు అసూయ పడుతుంటాము. వారు మనకు నిజంగా హాని చేసినా కూడా, ఇబ్బంది కలిగించినా కూడా వారి పట్ల అసూయపడి ప్రయోజనం లేదు. మన హృదయం శుభ్రంగా ఉంటే, మన హృదయమనే అద్దంలో గల సర్వ శక్తిమంతుడైన భగవంతుని ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. కానీ మనం మన లోపల అసూయను కలిగి ఉంటే, అప్పుడు ఆ అద్దం శుభ్రంగా ఉండదు. అందులో భగవంతుని ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండటం, ఎవరి పట్లనైనా హృదయంలో కోపం లేదా చెడు భావాలను కలిగి ఉండటం చాలా తప్పు. దాని వలన శ్రీ శివతత్త్వాన్ని కలిగి ఉండలేము. అందుకే మనం అందరినీ ప్రేమించడం, క్షమించడం చాలా ముఖ్యం. మనం రోజూ శివునికి పూజలు, అభిషేకాదులు చేస్తూ మన లోపల గల అరిషడ్వర్గాలను విడిచి పెట్టలేకపోతే శ్రీ శివతత్త్వాన్ని పొందలేం. శ్రీ శివతత్త్వాన్ని పొందాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. ఎటువంటి అలజడులు లేని స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలో ఉన్న సూర్యుని చక్కగా ప్రతిబింబించ గలుగుతుంది. అదే విధంగా మన హృదయం కూడా ఎటువంటి ఆలోచనలు లేని నిర్విచార స్థితిలో, ఇతరుల పట్ల ఏ విధమైన ద్వేషం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించ గలుగుతాము. అనగా శ్రీ శివ తత్త్వాన్ని పొందగలుగుతాం.శ్రీ శివుని సచ్చిదానంద స్వరూపుడు అని వర్ణిస్తారు. అనగా సత్ + చిత్ + ఆనంద స్వరూపుడు. సత్యము, చిత్తము మరియు ఆనందమును స్వరూపముగా కలిగిన వాడు శ్రీ శివుడు. ఏ విషయం గురించైనా సత్యము ఏమిటి అనేది మనకు సహస్రారములో ఉండే శ్రీ సదాశివుని పాదాల వద్దనే తెలుస్తుంది. మన చిత్తం ఆత్మ ప్రకాశంతో నిండినప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిరంతరం నిర్మలమైన ఆనందంతో ఉండే వ్యక్తే భగవంతుని పరిపూర్ణంగా ప్రతిబింబించ గలుగుతాడు. ఈ సచ్చిదానంద స్వరూపమయిన శ్రీ శివ తత్త్వాన్ని పొందగలిగిన వారి జన్మ ధన్యం.మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు మన హృదయంలో ఉండే శ్రీ శివుని ప్రకాశానికి అడ్డు పొరలుగా ఏర్పడతాయి. మనం సహజ యోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఈ ఆత్మ ఉనికిని మన చేతి వేళ్ళపై అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. అప్పుడు ఆత్మ పరిశీలన ద్వారా ఈ అరిషడ్వర్గాలను క్రమంగా తొలగించుకొన్నప్పుడు, పరిపూర్ణంగా ఆత్మ స్వరూపులమయ్యి భగవంతుని ప్రతిబింబాన్ని స్పష్టంగా మన హృదయంలో ప్రతిబింబించ గలుగుతాం. అటువంటి వ్యక్తులలో దైవికమైన సుగుణాలన్నీ స్పష్టంగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు నిత్య నిరామయమైన శ్రీ శివ తత్త్వాన్ని పొంది, సదా శివసాన్నిధ్యంలో ఉంటారు.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
తండ్రీకొడుకులను కబళించిన లారీ
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరాం ప్రేమ్దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి) -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణం.. కొడుకు జననం
రాజోళి: విధి ఆ కుటుంబంతో వింత నాటకమాడింది. భర్త చనిపో యాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకు ను చూసి సంబరపడాలో తెలియని దయనీయస్థితి ఏర్పడింది ఆ తల్లి కి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బల పాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్ అదుపు తప్పి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందగా, తర్వాత గంట సమయంలోనే పురిటి నొప్పు లతో శివ భార్య అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ.. మరోవైపు కొడుకు రూపంలో మళ్లీ జన్మించాడనే నమ్మకంతో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పుట్టిన బిడ్డను చూసుకునే భాగ్యం తండ్రికి లేదని, బిడ్డకు తండ్రిని చూపించే అదృష్టం తల్లికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ట్యాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్కు వివాహిత
శంషాబాద్: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది. ఆన్లైన్ పేమెంట్తో.. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్కు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్ మార్నింగ్ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్ 16న హైదరాబాద్ నుంచి లండన్ రప్పించుకున్నాడు. ఏం జరిగింది..? లండన్ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకుంది. తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిoది. చివరకు కాల్ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్పల్లి పోలీసులు ఆమె ఫోన్ను ట్రాక్ చేయగా చివరకు ఫోన్ లొకేషన్ రాజేంద్రనగర్లో చూపింది.శంషాబాద్ టు గోవా.. పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్ లోకేషన్ షేర్ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు బస్సు టికెట్ను వాట్సాప్ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు తరలించారు. తనకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్ బ్లాక్మెయిల్ చేయడంతోనే తాను హైదరాబాద్కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు. మరోవైపు తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు. -
ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.నాగార్జున తన ట్వీట్లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.నాగార్జున పోస్ట్కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024 -
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్పేట్ ఈశ్వర్గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్గా నిలిచింది. రామ్గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?
అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్ను కోరాడు. అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
లోక్సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్గాంధీ
సాక్షి,ఢిల్లీ:లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది. సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు. సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్...స్పీకర్ అభ్యంతరం..అయితే రాహుల్ సభలో మాట్లాడుతూ రాహుల్గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. రాహుల్గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..నా ఇల్లు, పదవి లాగేసుకున్నారువిపక్ష నేతలను, ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారుఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నాపరమతాత్మ మోదీతో నేరుగా మాట్లాడతారుఅదికారం కంటే నిజం గొప్పదిప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నాశివుడి ఎడమ చేతి వెనక త్రిశులం ఉంటుందిత్రిశూలం హింసకు చిహ్నం కాదుఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేదికొందరికి ఆ చిహ్నం అంటే భయంసభలో గురునానక్ ఫోటోను సైతం ప్రదర్శించిన రాహుల్హిందూ సమాజం అంటే ఒక్క మోదీ కాదుహిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వారే కాదుసభలో ఉన్నావారు, బయటవారు కూడా హిందువులేరాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా మైక్ మళ్లీ కట్ చేశారు.. రాహుల్లోక్సభలో తన మైక్ను మళ్లీ కట్ చేశారని రాహుల్గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. రాహుల్ వర్సెస్ స్పీకర్లోక్సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్ స్పష్టం చేశారు. -
ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’ (ఏ లవ్స్టోరీ ఇన్ రివర్స్). తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో రామ్ యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు స్నేహితుల మధ్య అవగాహన నేపథ్యంలో సాగే కథే ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్. -
అహం దెబ్బతిని..
శంషాబాద్: జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండమోనీ శివ (28) మియాపూర్లో చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామాని కి చెందిన శేషగిరి శివ (28) నగరంలోని గాయత్రీనగర్లో ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి జలకం రవికి వీరితో స్నేహం ఉంది. ముగ్గురూ బీజేవైఎంలో చురుగ్గా పనిచేశారు. శివ, శేషగిరి శివకు కొంతకాలం క్రితం రవితో మన స్పర్థలు రాగా, వారు కాంగ్రెస్లో చేరారు. దీంతో రవికి వీరికి దూరం పెరిగింది. దీనికితోడు ఈ నెల 4న కడ్తాల్లోని బట్టర్ఫ్లై వెంచర్లో రవి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ 300 ఫొటోలు గోవిందాయిపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. దీనికి ఇద్దరు శివలు అభ్యంతరం చెబుతూ ఫొటోలు డిలేట్ చేసి, రవిని వాట్సాప్ గ్రూప్లో నుంచి తొలగించారు. దీంతో తనను అవమానించి, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని అంతం చేయాలని రవి నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, జీలుకుంట్ల విజయ్, తిరు పతి జగదీశ్గౌడ్, నిట్ల ప్రవీణ్, వల్లేపు దాసు శేఖర్తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. వారిద్దరు ఈ నెల 5న ఓ వైన్స్ దుకాణంలో మద్యం తాగుతున్నారని తెలుసుకున్న రవి.. తన ఇన్నోవాలో ఆరుగురు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. బలవంతంగా వారిని కారులో ఎక్కించుకొని బట్టర్ఫ్లై వెంచర్లో తాను అద్దెకుంటున్న గది వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఆ తర్వాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మీర్పేట్ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024 -
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జన్మించాడు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్లు రెంట్కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
‘కంగువ’ నాకెంతో స్పెషల్ : హీరో సూర్య
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు . ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
-
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున 52 ఎకరాల భూములు
సాక్షి, యాదాద్రి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం. రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. 22 మంది ఆధార్కార్డులు శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ.. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
జన్మదినం రోజే యువకుడి విషాదం..
మహబూబాబాద్ / వరంగల్: జన్మదినం రోజునే ఓ యువకుడు అనంతలోకాలకు చేరాడు. తన బర్త్డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కమలాపూర్ మండలం కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన నకీర్త శివ (20) కమలాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం శివ ఇంట్లో మల్లన్న పట్నాలు వేశారు. అదేరోజు శివ పుట్టిన రోజు కూడా కావడంతో స్నేహితులు సాయంత్రం ఫోన్ చేసి పిలిచారు. దీంతో స్నేహితుల వద్దకు వెళ్లి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి అదేరోజు రాత్రి ద్విచక్రవాహనంపై వంగపల్లిలోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో కమలాపూర్లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నడికూడ నుంచి కొత్తకొండకు వెళ్తున్న ట్రాక్టర్.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా అతడితో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కమలాపూర్కు చెందిన మరో యువకుడు అరుణ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇవి చదవండి: ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు! -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం!
సాక్షి, మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు బలవంతంగా మాత్రలు మింగించి కడతేర్చాడో భర్త. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శివకావ్య (26) బీటెక్ చదువుతున్న సమయంలో స్థానిక బీసీకాలనీకి చెందిన వడ్ల భరత్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు అన్విధ్ ఉన్నాడు. కట్నం కోసం శివకావ్యను వేధించడంతో రెండు పర్యాయాలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది, అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శివకావ్య గర్భం దాల్చింది. డబ్బులు ఇచ్చేంత వరకు పిల్లలను కనేదిలేదని చెబుతూ 45 రోజుల కిందట భార్యతో బలవంతంగా మాత్రలను మింగించాడు. అవి వికటించడంతో శివకావ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. పలు ప్రవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆరెకటిక కిషన్జీ ఫిర్యాదు మేరకు వడ్ల భరత్, వేణుగోపాలాచారి, శారద ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం! -
రెగ్యులర్ కథలు చేయను : శివ కంఠమనేని
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘మధురపూడి గ్రామం అనే నేను’. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ– ‘‘ఒంగోలు బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ డ్రామా ఈ చిత్రం. మొరటుగా ఉండే సూరి పాత్రలో కనిపిస్తాను. తన మిత్రుడు బాబ్జీ ఎమ్మెల్యే కావడం కోసం సూరి ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతని ప్రేమకథ ఏ విధంగా ప్రభావితమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కమర్షియల్ పంథాలోనే ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు.. మనసులకు సంబంధించినదనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. నేను రెగ్యులర్ కథలు చేయను. నేను చేసిన ‘అక్కడొకడుంటాడు’లో నా పోస్టర్స్ చూసి ‘మధురపూడి..’ సినిమా కథకు నన్ను ఎంపిక చేసుకున్నారు మల్లికార్జున్గారు. దాదాపు 150కిపైగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రాలు ‘మణిశంకర్, రాఘవరెడ్డి’ త్వరలో రిలీజ్ కానున్నాయి. మంచు లక్ష్మిగారి ‘ఆదిపర్వం’ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
ఆ పాయింట్తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్గార్లు డైరెక్టర్స్కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి
అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. భర్తపై తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్లో రాన్జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు..
భద్రాద్రి: స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకున్న కొద్దిసేపటికే అందులోని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తోటి స్నేహితుల్లో విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాల్వంచ నవభారత్కు చెందిన ఏనిగ ఉపేందర్రెడ్డి కుమారుడు మధూకర్రెడ్డి (20), వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (20)లు ఆదివారం సాయంత్రం బైక్పై నవభారత్ వైపు వెళ్తూ ఎన్ఎండీసీ కర్మాగారం సమీపంలో డివైడర్కు ఢీకొట్టారు. దీంతో ఇద్దరు ఎగిరి ముందుకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్, పట్టణ ఎస్ఐ బి.రాములు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సంబురాలు.. అంతలోనే విషాదం.. ఆదివారం సెలవు కావడంతో పాటు స్నేహితుల దినోత్సవం కాగా నవభారత్లో ఉంటున్న మధూకర్రెడ్డి మోటార్ సైకిల్పై పాల్వంచకు వచ్చాడు. కొద్దిసేపు స్నేహితులంతా కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు మద్యం కూడా సేవించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మధూకర్రెడ్డి.. శివను మోటార్ సైకిల్పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో డివైడర్కు ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. మధూకర్రెడ్డి మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. శివ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.రాము తెలిపారు. -
‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్ నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన దర్శకత్వం : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా- శివ కోన విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే.. రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా శివ సెట్స్లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
నైనా గంగోలి కి రిటర్న్ ఏం ఇచ్చారు ?
-
ఆసక్తి పెంచుతున్న శివ కోన కొత్త సినిమా పోస్టర్
శివా కోన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ పోస్టర్ని మాత్రం వదిలారు. ఆ పోస్టర్లోక్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరికి ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది. కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది. -
ముగ్గురి ఆశలు ఖుషి పైనే..
-
ఉలవచారు బిర్యానీ చాలా ఇష్టం
‘‘ముప్పైఏళ్లుగా తెలుగువారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ గార్లు, ఎన్టీఆర్, రామ్చరణ్.. ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు.. చాలా మోటివేట్ చేస్తారు’’ అని కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శివ’. శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత డిసెంబరు 23న రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి నేడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ చెప్పిన విశేషాలు. ► రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నేను నటించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ (2016) చిత్రం తెలుగులో విడుదలైంది. ఆ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించడం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ‘శివ వేద’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం వెరీ హ్యాపీ. ► ‘వేద’ కన్నడలో విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి ఆదరణ వస్తోంది. ‘శివ వేద’లో వినోదం, భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది ఈ చిత్రంలో ఉంటుంది. ‘వేద’ అనేది క్యారెక్టర్ పేరు. లవ్, లైఫ్, హ్యాపీనెస్, ట్రస్ట్.. ఇవన్నీ వేద లైఫ్లో ఉంటాయి. ► ‘శివ వేద’ని కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, పబ్లిసిటీకి సమయం లేకపోవ డంతో ఇక్కడ విడుదల చేయలేదు. కన్నడ, తమిళ్లో రిలీజ్ చేయగా మంచి హిట్టయ్యింది. తమిళంలోనూ బాగా ఆదరిస్తున్నారు. హర్షకి నాపై ఉన్న నమ్మకం వల్లే మా కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశాం. ► తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు మాట్లాడగలను. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరే ఉండలేరు.. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కాబట్టి కొత్తవారిని ప్రోత్సహించాలి. ► భక్తి నేపథ్యంలో ఓ మూవీ చేయాలని ఉంది. పునీత్ రాజ్కుమార్ బయోపిక్ తీసే ఆలోచన లేదు. ప్రస్తుతం రజనీ సార్తో ‘జైలర్’, ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్ విన్నాను. -
‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : డై హార్డ్ ఫ్యాన్ నటీనటులు :ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది దర్శకత్వం: అభిరామ్ సంగీతం : మధు పొన్నాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి సినిమాటోగ్రఫీ:జగదీష్ బొమ్మిశెట్టి ఎడిటర్: తిరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్ విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ప్రియాంక శర్మ, శివ ఆలపాటి జంటగా నటించిన చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కితర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, ట్రైలర్కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 2)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? శివ(శివ ఆలపాటి) అనే యువకుడికి హీరోయిన్ ప్రియాంక (ప్రియాంక శర్మ) అంటే ఎనలేని అభిమానం. ఒక్కసారైనా తనను ప్రత్యేక్షంగా కలవాలనుకుంటాడు. ఆమె ఏ ఫంక్షన్కి వెళ్లినా తను అక్కడికి వెళ్లేవాడు. ఇక తన అభిమాన హీరోయిన్ ప్రియాంక బర్త్డేని ఎంతో గ్రాండ్గా చేద్దామని ప్లాన్ వేస్తాడు శివ. అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి ఆమె పర్సనల్ మొబైల్ నుంచి శివకు మెసేజ్ వస్తుంది. శివ ఆ షాక్లో ఉండగానే.. ప్రియాంక నేరుగా అతని ఇంటికి వస్తుంది. ఆ రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక.. తన అభిమాని ఇంటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన సంఘటన నుంచి శివ ఎలా బయట పడ్డాడు? హత్య కేసులో ఇరుక్కున్న శివ, అతని మామయ్య శంకర్ని బయటకు తీసుకురావడానికి లాయర్ కృష్ణకాంత్(రాజీవ్ కనకాల) ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ హత్య కేసుకు లాయర్ కృష్ణకాంత్కు ఏదైనా సంబధం ఉందా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా లో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరొయిన్ ని కలవాలనుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అభిరామ్. సాధారణ కథే అయినా.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అయిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్లో ల్యాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. ఈ సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతంది. కథని మరింత పకడ్బందీగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరోయిన్ ప్రియాంకగా ప్రియాంక శర్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. డై హార్డ్ ఫ్యాన్గా శివగా శివ ఆలపాటి ఆకట్టుకున్నాడు. షకలక శంకర్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాబోయే రాజకీయ నాయకుడు బేబమ్మ పాత్రలో శంకర్ ఒదిగిపోయాడు. లాయర్ కృష్ణకాంత్గా రాజీవ్ కనకాల మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఆదిత్య పాత్రలో నోయల్ చాలా చక్కగా నటించారు. కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే..ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. మధు పొన్నాస్ కంపోజ్ చేసిన పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ తిరు పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
సాయి కుమార్ ‘వన్ బై టు’ రిలీజ్ డేట్ ఫిక్స్
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వన్ బై టు’.ఆనంద్, శ్రీ పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించారు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ మరియు వీ ఐ పీ క్రియేషన్స్ బ్యానర్ ల పై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి సాంగ్స్ సంగీతం సమకూర్చగా సందీప్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. శంకర్ కేసరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కపిల్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, శంకర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. -
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రాముఖ్యత ఇదే..
శివుడు భోళాశంకరుడిగా, భక్త వశంకరుడిగానూ ప్రసిద్ధుడు. భస్మాసురుడికి సైతం వరాలిచ్చేంత భోళాతనం శివుడికే చెల్లింది. కఠిన నియమాలను పాటించనక్కర్లేదు. నిండుమనసుతో పూజిస్తే చాలు, భక్తులను ఇట్టే అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే. కన్నప్పను కటాక్షించిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్తసులభుడు. శివుడు సనాతనుడు. వేదాలు శివుడిని రుద్రుడిగా ప్రస్తుతించాయి. నిజానికి వేదకాలానికి ముందే శివారాధన వ్యాప్తిలో ఉండేదనేందుకు ఆరాధారాలు ఉన్నాయి. పురాణేతిహాసాల్లో శివుని మహిమను వెల్లడించే గాథలు విరివిగా కనిపిస్తాయి. శివుని గాథలన్నింటినీ క్రోడీకరించిన శివపురాణం శైవులకు ఆరాధ్యగ్రంథం. మాఘ బహుళ చతుర్దశి రోజున క్షీరసాగరమథనంలో పుట్టిన గరళాన్ని తన కంఠంలో బంధించి శివుడు లోకాలను రక్షించాడు. అందుకే ఈ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ మహాశివరాత్రి శైవులకు అత్యంత పవిత్ర పర్వదినం. భారతదేశం నలుచెరగలా పురాతన శైవక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. వీటికి తోడు దేశంలో దాదాపు ప్రతిగ్రామంలోనూ శివాలయాలు కనిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ శైవక్షేత్రాలే కాకుండా, ఊరూరా వెలసిన శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. నమక చమక స్తోత్రపారాయణాలతో హోరెత్తుతాయి. మహాశివరాత్రి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసం, జాగరణ చేస్తూ రోజంతా శివనామ స్మరణలో గడుపుతారు. యథాశక్తి ఆలయాల్లో అభిషేక, అర్చనాది సేవలు జరిపిస్తారు. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్ ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం, త్య్రంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఇది జ్యోతిర్లింగ స్తోత్రం. ఇందులో ప్రస్తావించిన క్షేత్రాలు: సోమనాథ క్షేత్రం సౌరాష్ట్ర– అంటే గుజరాత్లోని గిర్సోమనాథ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మల్లికార్జున క్షేత్రం ఉంది. ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారు. మహాకాళేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. మధ్యప్రదేశ్లోనే నర్మదాతీరంలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ ఒకే శివలింగం రెండు భాగాలుగా ఉండి, ఓంకారేశ్వర, అమలేశ్వర అనే రెండు పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటుంది. బిహార్లోని దేవగఢ్ జిల్లాలో బైద్యనాథ క్షేత్రం ఉంది. క్షీరసాగర మథనం తర్వాత ధన్వంతరి అమృతాన్ని ఇక్కడి శివలింగంలోనే భద్రపరచాడని ప్రతీతి. మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమశంకర క్షేత్రం ఉంది. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు ఇక్కడ విశ్రమించాడని పురాణాల కథనం. తమిళనాడులోని సాగరతీరాన రామేశ్వర క్షేత్రం ఉంది. రావణసంహారం తర్వాత శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణం చెబుతోంది. మహారాష్ట్రలోని దారుకావనంలో నాగేశ్వర క్షేత్రం ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన విశ్వేశ్వర క్షేత్రం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగం చిన్నగుంటలా ఉంటుంది. అందులో మూడుబొటన వేళ్లలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా మూడు చిన్న లింగాలు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లో మందాకినీ నది సమీపంలో హిమాలయాల్లో కేదారేశ్వర క్షేత్రం ఉంది. మంచుకారణంగా ఏడాదికి ఆరునెలలు మాత్రమే ఇందులో భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహల సమీపంలో ఘృష్ణేశ్వర క్షేత్రం ఉంది. చదవండి: అతడూ ఆమె: ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’! -
బిగ్బాస్ ఓటీటీ: ఈ సెలెబ్రిటీలు ఫిక్స్.. లిస్ట్ ఇదే!
తెలుగు బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సీజన్.. సీజన్కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బిగ్బాస్ ఐదో సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. గత మూడు సీజన్స్కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్.. ఓటీటీ బిగ్బాస్కి కూడా హోస్టింగ్ చేయనున్నాడు. మరో రెండు నెలల్లో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్బాస్ ఎలా ఉంటుంది? ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్లో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, వర్షిణి, రాజు, వైష్ణవి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ బిగ్బాస్ షో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. బిగ్బాస్ ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ సంస్థ అయిన ‘ఓక్ ఎంటర్టైన్మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
తీరని విషాదం: గేటు పడింది..గుండె ఆగింది
మదనాపురం: రైల్వేగేటు పడడంతో సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటకు చెందిన దండు శివ(45)కు గురువారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి అంబులెన్స్లో తరలిస్తుండగా.. మదనాపురం వనపర్తి రైల్వేగేట్ స్టేజీ వద్ద గేటు పడింది. పావుగంటపాటు అంబులెన్స్ ఆగిపోయింది. తోటి ప్రయాణికులు గేటు తీయాలని పట్టుబట్టడంతో గేట్మేన్ ఉన్నతాధికారులతో మాట్లాడి గే టు తెరిచి పంపించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సకాలంలో వైద్యం అందక శివ చనిపోయాడు. అతనికి భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!) -
రజనీకాంత్ ‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ని అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో ఇది కచ్చితంగా రికార్డులు తిరగ రాస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ నవంబర్ 4న థియేటర్స్లో విడుదల కానుంది. చదవండి: అక్టోబర్ 4న ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట Arangam Mulukka therikka therikka!#AnnaattheTeaser is releasing on October 14 @ 6 PM @rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @prakashraaj @IamJagguBhai @khushsundar #Meena @sooriofficial @actorsathish @AntonyLRuben @dhilipaction @vetrivisuals pic.twitter.com/SRvplKautv — Sun Pictures (@sunpictures) October 11, 2021 -
ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తానంటున్న సాయి కుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’.శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చెర్రీ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాయికుమార్ని చాలా పవర్ఫుల్గా చూపించారు. అమ్మాయిలపై యాసిడ్ దాడులు, పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్ గా ఉంది. ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. మహిళల రక్షణ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ ‘వన్బై టు’అని టీజర్ తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
తనికెళ్ళ భరణి.. వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!
వెబ్డెస్క్: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది. తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి. బాధలో నా భావనలను చెదరగొట్టాను. వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి. భావనలు వెళ్లిపోయాయి నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి! గురువు రాళ్లపల్లి లేకుంటేనా.. డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి. అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్ ఆర్ట్స్లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! శివుడంటే ప్రాణం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! నైజాం అభిమానం యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు. గతి మార్చింది ‘శివ’నేనా? దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్గా, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ విలన్గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది. -
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
-
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
టిక్టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టిక్టాక్ వీడియోల పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్లో భార్గవ్పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్ శివ సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం భార్గవ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా 2 లక్షలు ఇస్తాం..కేసు వాపసు తీసుకోండి అని భార్గవ్ పోలీసులను ప్రాధేయపడినట్లు శివ తన స్టోరీలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భార్గవ్ ఫోన్, ల్యాప్టాప్ను పోలీసులు సీజ్ చేశారని వివరించాడు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ వార్త నిజమేనా? లేక యాంకర్ శివ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడా అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. దీంతో ఇది వ్యూస్ కోసం చేయడం లేదని, ఈ వార్తను బయటకు రానివ్వకుండా ఎక్కడ ఆపేస్తారో అని తాను పోస్ట్ చేస్తున్నట్లు యాంకర్ శివ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది ప్రాంక్ కాదని, నిజమైన వార్తేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్ శివ చేసిన వరుస పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : పోలీస్స్టేషన్లో షణ్ముఖ్ రచ్చరచ్చ హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? -
గ్యాంగ్ నేపథ్యంలో..
శివ, మణికాంత్, మయూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దాస్ గ్యాంగ్’. చిరంజీవి రాళ్ళబండి దర్శకత్వంలో మమతా రాళ్లబండి నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గ్యాంగ్ నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి.. వాటికి పూర్తి భిన్నంగా మా చిత్రం ఉంటుంది. శివ, మణికాంత్ల పాత్రలు హైలెట్గా నిలుస్తాయి. హిందీలో గుర్తింపు తెచ్చుకున్న మయూరి మా సినిమాతో తెలుగులో పరిచయం అవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: గౌస్ బాషా. -
నా పేరు జగదీష్..కానీ అందరూ
అతని పేరు జగదీష్, కానీ అందరూ ‘టక్ జగదీష్’ అని పిలుస్తారు. మరి ఆ పేరు వెనక స్టోరీ ఏంటి? అంటే జగదీషే చెప్పాలి. ‘నిన్ను కోరి’ సినిమా తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని మరో సినిమా కోసం కలిశారు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ను మంగళవారం ప్రకటించారు. హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ‘‘నా తొలి హీరోతో మళ్లీ కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శివ నిర్వాణ. నానీతో తెరకెక్కించిన ‘నిన్ను కోరి’ దర్శకుడిగా శివ నిర్వాణకు తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
సంగీతంలో సస్పెన్స్
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాహుల్, పరిటాల. -
బర్త్డేకి ఫిక్స్
సినిమా పూర్తి చేయడం, హిమాలయాలకు వెళ్లి, కొన్ని రోజులు ఉండి రావడం రజనీకాంత్ అలవాటు. మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పి, హిమాలయాలు వెళ్లారాయన. అక్కడ్నుంచి రాగానే తన 168 సినిమాపై దృష్టి పెడతారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12)న ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. మామూలుగా ఒక సినిమాకి సంబంధించిన నటీనటులందరినీ అధికారికంగా ప్రకటించేవరకూ కీలక తారాగణం అయిన హీరోయిన్, విలన్ పాత్రధారుల గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. అలా ఈ చిత్రంలో రజనీ సరసన జ్యోతిక కథానాయికగా నటించనున్నారనే వార్త ప్రస్తుతం షికారు చేస్తోంది. రజనీ సరసన జ్యోతిక ఇప్పటివరకూ నటించలేదు. అయితే రజనీ కీలక పాత్రలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమాలో ప్రభు భార్యగా జ్యోతిక నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. రజనీ 168లో సూపర్ స్టార్ సరసన నటించబోయే హీరోయిన్ జ్యోతికా? కాదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
రజనీ @ 168
రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా చిత్రీకరణ ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది. మరి.. రజనీకాంత్ తర్వాతి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఏ దర్శకుడిని వరిస్తుందనే ప్రశ్నకు శుక్రవారం సమాధానం దొరికింది. తమిళంలో అజిత్తో వరుసగా ‘వీరమ్’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన శివ ఆ చాన్స్ను దక్కించుకున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ‘‘యందిరిన్ (తెలుగులో ‘రోబో’), ‘పేట’ చిత్రాల తర్వాత మరోసారి రజనీకాంత్గారి సినిమాను నిర్మించనుండటం సంతోషంగా ఉంది’’ అని సన్ పిక్చర్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 168వ చిత్రం. మాస్ ఎంటర్టైనింగ్ కథను రెడీ చేశారట శివ. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో వచ్చిన ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలు శివ దర్శకత్వంలోనే తెరకెక్కాయన్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
సస్పెన్స్ థ్రిల్లర్
శివ కంఠమనేని హీరోగా నటించనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఇందులో నందితా శ్వేతా కథానాయికగా నటిస్తున్నారు. రాశీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించనున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర రావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మిస్తున్నారు. శివ, నందితా శ్వేత, రాశీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వాసవి గ్రూప్ విజయ్కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటుడు, నిర్మాత అశోక్కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్. రెండు షెడ్యూల్స్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నాలుగు పాటలను రికార్డ్ కూడా చేశాం’’ అన్నారు. ‘‘చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నాను’’ అన్నారు రాశి. ‘‘ఈ సినిమాలో రాశికి అమ్మగా, నందితా శ్వేతకు అమ్మమ్మలా నటిస్తున్నాను’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఇందులో నా పేరు లక్కీ. టెర్రర్ గాళ్గా కనిపిస్తాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఓ మంచి పాయింట్తో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు సంజీవ్. ‘‘అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చేసేలా సినిమా తీస్తున్నాం’’ అన్నారు ఆర్. వెంకటేశ్వరరావు. ‘‘కథ నచ్చి నిర్మించాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాంబాబు. సంగీత దర్శకుడు సుధాకర్ మరియో, మాటల రచయిత అంజన్ మాట్లాడారు. -
‘ప్రాణ’హితుడు
ఎంతో మందిని రక్షించిన శివ పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మురుగు నీటిలోని శవాలను వెలికి తీయడంతో పాటు ఎంతోమందిని కాపాడినందుకు మహేందర్రెడ్డి నగర పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో శివను అవార్డుతో సత్కరించారు. రాంగోపాల్పేట్: అప్పుడు సమయం సాయంత్రం 3 గంటలు.. ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలు ఎప్పటిలాగే ఉన్నాయి. కొంత మంది ఫుట్పాత్పై నడుస్తూ హుస్సేన్ సాగర్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉన్నట్లుండి ఓ 45 ఏళ్ల వ్యక్తి సాగర్ నీళ్లలోకి దూకేశాడు. వెంటనే వాహనదారులు, పాదాచారులు అందరు గుమికూడారు.. అయ్యో ఎవరో దూకేశారు అంటున్నారే తప్ప రక్షించేందుకు ఎవరూ సాహసించడం లేదు. కొద్ది దూరంలో ఉన్న ఓ వ్యక్తి అది గమనించి నీళ్లలోకి నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాడిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కడుపులోని నీళ్లు కక్కించి శ్వాస అందించి ప్రాణాలు కాపాడాడు. మిట్ట మధ్యాహ్నం ఓ మహిళ ట్యాంక్బండ్పై ఏడ్చుకుంటూ రోడ్డు దాటి వచ్చి హుస్సేన్ సాగర్లోకి దూకేసింది. అప్పటికే ఆమె పరిస్థితిని గుర్తించి అనుసరిస్తున్న వ్యర్తి వెంటనే సాగర్లోకి దూకి మునిగిపోతున్న ఆమెను బయటకు తీశాడు. ఆమె ప్రాణాలతో భయట పడ్డది కానీ ఆ వ్యక్తి కుడి చేయి భుజం వద్ద ఓ ఇనుప చువ్వ గుచ్చుకుని తీవ్ర గాయమైంది. అయినా అతడిలో ఓ ప్రాణం కాపాడన్న ఆనందం ఉంది తప్ప గాయాన్ని మాత్రం పట్టిచుకోలేదు. ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు ఏవేవో సమస్యలతో బాధలతో హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు తీసుకోవాలని దూకేసిన 107 మందిని అతను రక్షించాడు. అందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టిన అతడి పేరు ‘శివ’. ట్యాంక్బండ్నే అడ్డాగా మార్చుకుని అక్కడే కుటుంబంతో కలిసి ఉంటూ ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఒకవైపు ప్రాణాలు కాపాడుతూ సాగర్లో పడిచనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడమే ఒక దైవ కార్యంగా చేపట్టాడా సాహసి. రైలు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారి మృతదేహాలు తరలింపుతో మొదలైన అతడి ప్రస్థానం హుస్సేన్ సాగర్లో మృతదేహల వెలికితీతతో పాటు ఎంతో మంది పునర్జన్మ నిచ్చిన వ్యక్తిగా నిలుస్తున్నాడు. సోదరుడి లాంటి వ్యక్తి మరణంతో.. శివ జీవితం మొత్తం ఫుట్పాత్ మీదే సాగింది.. సాగుతుంది కూడా. శివకు ఐదేళ్ల వయసులో ఫుట్పాత్పై తిరుగుతుండగా ఎవరో చాదర్ఘట్లోని సిధూర్ హాస్టల్లో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి ఖైరతాబాద్లోని మరో హాస్టల్కు మకాం మారింది. లోయర్ ట్యాంక్బండ్లో నివసించే మల్లేశ్వరమ్మ అనే మహిళ శివను చేరదీసింది. అమె కొడుకు మహేందర్, శివ అన్నదమ్ముల్లా ఉండేవారు. శివ చిన్న వయసులోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు సాయంగా వెళ్లేవాడు. తర్వాత హుస్సేన్ సాగర్లో మృతదేహాలను వెలికి తీసేవాడు. మహేందర్ మృతితో మార్పు తనకు అన్నలాంటి మహేందర్ 2013లో హస్మత్పేట్ చెరువులో మునిగి చనిపోయాడు. దాంతో తల్లిలా పెంచిన మల్లేశ్వరమ్మ బాధ చూడలేకపోయాడు శివ. అప్పటి నుంచి నీటిలో మునిపోతున్న వారిని రక్షించాలన్న సంకల్పంతో హుస్సేన్ సాగర్ పరిసరాలనే తన నివాసంగా మార్పుచుకున్నాడు. సాగర్ నీటిలో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు. దాంతో మిత్రుడు పవన్తో కలిసి వైజాగ్ సముద్ర జలాల్లో ఈత సాధన చేసి గజ ఈతగాళ్లుగా మారారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ ఇదే హుస్సేన్ సాగర్లో ప్రమాదవశాత్తు మరణించాడు. ఉపాధి చూపించిన సాగర్ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న శివకు హుస్సేన్ సాగరే ఉపాధి చూపించింది. గణపతి నిమజ్జనాల సందర్భంగా సాగర్లో దొరికే ఇనుప చువ్వలు వెలికితీసి వాటిని విక్రయించి ఉపాధి పొందుతుంటాడు. ఇక చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తే పోలీసులు కొంత డబ్బు ఇస్తుంటారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శివ. ఇటీవల సినిమా షూటింగ్లకు నటులకు బౌన్సర్గా వెళుతూ ఇంకొంత సంపాదించుకుంటున్నానని చెబుతున్నాడు. తన ఏడుగురు సంతానంతో కలిసి ట్యాంక్బండ్పై ఫుట్పాత్, పాడుబడిన లేపాక్షి భవనం వద్ద నివాసం ఏర్పరచుకున్నాడు. శివ కుటుంబానికి లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి ఆసరాగా నిలిచారు. ఆమె మేలు ఎప్పటికీ మరచిపోలేనంటున్నాడు శివ. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్కుమార్తో ధనలక్ష్మి మాట్లాడి శివ ముగ్గురు కుమారులను రెసిడెన్సియల్ పాఠశాలలో చేర్పించారు. -
పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్..
శివ సినిమా... అప్పట్లో రికార్డులను బద్దలుకొట్టింది. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఇపుడో వార్త బయటకొచ్చింది. శివ హిందీ వెర్షన్లో మాస్ సినిమాల దర్శకుడు పూరీ జగన్నాథ్ నటించారంట. అవునా.. ఎక్కడా కన్పించలేదే అనుకోకండి...! కేవలం బోటనీ పాఠముంది... పాటలో మాత్రమే పూరీ కన్పిస్తారు. ఈ విషయాన్ని వీడియోతో సహా ట్విటర్లో పంచుకున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పటి జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమా దర్శకుడు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పూరీ స్పందిస్తూ.. అవును, అందులో డ్యాన్స్ చేస్తోంది నేనేనంటూ రీ ట్వీట్ చేశారు. వర్మ పంచుకున్న ఈ వీడియోలో నీలి రంగు షర్ట్లో ఉన్న పూరీ జగన్నాథ్ మిగతావారితోపాటు పాటలో స్టెప్పులేస్తూ కనిపిస్తారు. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ నిదర్శనమంటూ రాంగోపాల్ వర్మ అభినందించారు. The junior artiste in blue shirt is today’s super director Puri Jagan ..Hey @purijagan WHAT A JOURNEY🙏🙏🙏💐💐💐 pic.twitter.com/irRXxfhK3v — Ram Gopal Varma (@RGVzoomin) 24 June 2019 -
ఆకాశవాణి
శివ, ఉమయ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. ‘జబర్దస్త్’ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సైన్స్ స్టూడియోస్పై మర్రిమేకల మల్లికార్జున్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సతీష్ ఈ చిత్రకథను నాకు ముందే చెప్పాడు. మంచి పాయింట్తో తీస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మల్లికార్జున్గారు నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రమిది. ఆయనకు మంచి పేరు, డబ్బు తెచ్చి పెట్టే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సతీష్గారు సినిమాని చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను నిర్మించడంలో నా బాధ్యతను చక్కగా నిర్వర్తించాను’’ అన్నారు మర్రిమేకల మల్లికార్జున్. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. మల్లికార్జున్గారి సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాగలిగేవాళ్లం కాదు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సతీష్ బత్తుల. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, కెమెరా: ఆరీఫ్. -
‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్ లోగో లాంచ్
సయిన్స్ స్టూడియోస్ బ్యానర్పై శివ, రక్ష, ఉమయ్ చంద్, అక్షితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రాజ్ కందుకూరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది’ అన్నారు. హీరో శివ మాట్లాడుతూ.. ‘సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు’ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సినిమా సతీష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అన్నారు. నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా రాజ్ కందుకూరి లా నిర్మాతగా నిలబడదాం అనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథతో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని కోరారు. -
విశ్వాసం చూపిస్తారు
సంక్రాంతికి తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించిన చిత్రం ‘విశ్వాసం’. దర్శకుడు శివ, అజిత్ కాంబినేషన్లో రూపొందిన నాలుగో చిత్రమిది. ఇంతకుముందు ‘వీరం, వేదాళం, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. సత్యజోతి ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ‘విశ్వాసం’లో నయనతార హీరోయిన్, జగపతిబాబు విలన్గా నటించారు. ఈ సూపర్హిట్ తమిళ చిత్రాన్ని అదే టైటిల్తో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాత ఆర్. నాగేశ్వరరావు. మార్చి 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘తమిళంలో అజిత్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డా మాకు ఇచ్చిన సత్యజోతి సంస్థకు ధన్యవాదాలు. శివ–అజిత్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సూపర్ హిట్ సినిమా ఇది. తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమెరా: వెట్రి. -
ఏసీబీ దాడులు.. కేజీ బంగారం సీజ్!
-
కొత్త కాంబినేషన్
యువ దర్శకులతో ఈ మధ్య ఎక్కువగా పని చేస్తున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ చేయనున్నారు. ఈ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం’ సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయ్యారట చైతు. ఈ ప్రాజెక్ట్ను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు నిర్మించనున్నారని సమాచారం. నాగచైతన్య కోసం ఓ కొత్త పాయింట్ రెడీ చేశారట మేర్లపాక గాంధీ. యూవీ క్రియేషన్ బ్యానర్ యూత్ఫుల్ సబ్జెక్ట్స్ను ఎంపిక చేసుకోవడంతో పాటు భారీ ప్రొడక్షన్ వేల్యూస్తో సినిమాలు రూపొందిస్తారన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఈ నెల మూడో వారం నుంచి ‘వెంకీ మామ’లో జాయిన్ అవుతారు నాగచైతన్య. మేర్లపాక గాంధీ సినిమాను కూడా ‘వెంకీ మామ’తో సమాంతరంగా చేస్తారో లేదో వేచి చూడాలి. -
యువతితో నటుడు పరార్
తమిళనాడు, పెరంబూరు: సినీ నటుడు శివ పక్కింటి యువతితో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. వివరాలు.. పయపుళై అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు శివ. తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన ఇతను స్థానిక రామావరంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. శివకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పక్కింటి యువతితో పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. భార్యకు విడాకులిచ్చినట్లు అబద్దం చెప్పి ఆ యువతితో ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు వారించినా వినిపించుకోలేదు. అంతే కాదు నటుడు శివతో కలిసి పరారైంది. పోలీస్స్టేషన్లో చేరిన జంట.. దీనిపై యువతి తల్లిదండ్రులు రాయలనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ గౌతమన్ దర్యాప్తు చేపట్టారు. కాగా వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో పారిపోయిన జంట శుక్రవారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. విచారణలో శివ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసింది. అంతే కాదు శివ ఆ యువతితో కలిసి కన్యాకుమారి, మదురై తిరిగొచ్చినట్లు తెలిసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి ఈ యువతిని పెళ్లి చేసుకుంటానని పోలీసులకు చెప్పాడు. ఆ యువతిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. -
హరుడికే అమ్మ అయిన అమ్మవ్వ
పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది. అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి. – డి.వి.ఆర్. -
అక్షరాలా ఐదోసారి
ఆ రోజుల్లో హీరో, దర్శకుడు పది సినిమాల వరకూ కలసి చేసేవారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు తగ్గింది. హీరో–డైరెక్టర్ రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ అన్నట్లు ఉంది. కానీ తమిళ హీరో అజిత్, దర్శకుడు శివ అందుకు భిన్నంగా ఉన్నారు. వీళ్ల కాంబినేషన్లో ఆల్రెడీ ‘వీరమ్, వేదాళమ్, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐదోసారి కూడా వీళ్ల కాంబినేషన్ రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఈ సినిమా కూడా ‘వి’ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ‘వి’తో టైటిల్ పెడతారో లేదో వేచి చూడాలి. -
ఆవేశం కాదు.. ఆలోచన ముఖ్యం
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైడి రమేష్ మాట్లాడుతూ– ‘‘యువజన నాయకుడైన హీరో తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రకథాంశం. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. మా సినిమా ద్వారా రమణ సాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మెసేజ్ ఉన్న చిత్రం ‘రూల్’. సినిమా చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. తెలంగాణ ఎన్నికల సమయంలో మా చిత్రం విడుదల కావటం సంతోషంగా ఉంది’’ అన్నారు పైడి సూర్యనారాయణ. ‘‘కెమెరామెన్గా ఉన్న నన్ను ఈ సినిమాతో హీరోని చేశారు డైరెక్టర్’’ అని శివ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలా, సహ నిర్మాత: పాంగ కోదండరావు. -
ఉపవాస భుక్తి
ఆదిశేషుడిని విష్ణువు తల్పంగా చేసుకున్నాడు.శివుడు ఆభరణంగా మలుచుకున్నాడు.నాగభక్తి తెలుగువారి అనాది ఆచారం.నాగుల చవితికి ఉపవాసం మన ఆరాధన విధానం.ఉపవాసం అనంతరం తేలిగ్గా సింపుల్గా ఆహారం తీసుకుంటే భక్తి భుక్తి సమతులం అవుతాయి. పర్వదినం ఫలవంతం అవుతుంది. చిమ్మిలి కావలసినవి: వేయించిన నువ్వులు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; వేయించిన ఓట్స్ – అర కప్పు; వేయించిన బాదం పప్పులు – 10; వేయించిన జీడి పప్పులు – 10; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙నువ్వులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో నువ్వుల పొడి, బాదంపప్పుల మిశ్రమం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి వేసి బాగా కలిపి ఉండలు చేయాలి. సాబుదానా ఇడ్లీ కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్ సోడా – చిటికెడు ; జీడి పప్పులు – 20; నూనె – ఇడ్లీ రేకులకు పూయడానికి తగినంత తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో సగ్గు బియ్యం, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి ∙రెండు కప్పుల పెరుగు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, సుమారు 8 గంటలసేపు పక్కన ఉంచాక, గరిటెతో బాగా కలపాలి. (సగ్గుబియ్యం మెత్తగా అయ్యేలా మెదపకూడదు). అవసరాన్ని బట్టి నీరు జతచేసుకోవాలి ∙ఉప్పు జత చేయాలి ∙ఇడ్లీలు వేసే ముందు పిండిలో కొద్దిగా తినే సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దికొద్దిగా నూనె పూయాలి ∙ ఒక్కో గుంటలోనూ జీడిపప్పు ఉంచి, ఆ పైన గరిటెడు ఇడ్లీ పిండి వేయాలి ∙ అన్నీ వేసిన తరవాత ఇడ్లీ రేకులను కుకర్లో ఉంచి స్టౌ మీద పది నిమిషాలు ఉంచి దింపేయాలి (విజిల్ పెట్టకూడదు). చలిమిడి కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; పాలు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లన్నీ ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ∙బియ్యంలోని తడి ఆరిపోగానే, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టాలి. (జల్లెడ పట్టి మెత్తటి పిండితో మాత్రమే చలిమిడి చేయాలి) ∙ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపితే చలిమిడి సిద్ధమైనట్లే. ముర్మురా చాట్ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – పావు కప్పు; వేయించిన సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; మరమరాలు – 3 కప్పులు; పంచదార పొడి ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడయ్యాక çనూనె వేసి బాగా కాగాక, పల్లీలు వేసి సన్న మంట మీద క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి ∙పుట్నాల పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ∙మరమరాలు జత చేసి జాగ్రత్తగా పెద్ద గరిటెతో రెండు మూడు నిమిషాలు కలిపి దింపేయాలి ∙పంచదార పొడి, ఉప్పు జత చేసి కలిపి, ప్లేట్లలో వేసి వేడివేడిగా అందించాలి. కొసాంబరి సలాడ్ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు (నీళ్లలో రెండు గంటలపాటు నానబెట్టాలి); పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: ∙పెసర పప్పులోని నీళ్లు ఒంపేసి, నీళ్లు పూర్తిగా పోయేవరకు వడకట్టాలి ∙ పెద్ద పాత్రలో పెసర పప్పు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, సగం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙ ఇంగువ, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పెసర పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙చివరగా ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. అటుకుల పులావ్ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత కాయగూరలు... క్యారట్ తురుము – పావు కప్పు; బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బీన్స్ – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); క్యాబేజీ తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; క్యాలీఫ్లవర్ తరుగు – ఒక టేబుల్ స్పూను వేయించడానికి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2 తయారీ: ∙అటుకులను ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చిమిర్చి జత చేసి మరోమారు కలపాలి ∙తరిగి ఉంచుకున్న కూరగాయల తురుము, ముక్కలు వేసి మెత్తబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙అటుకులు, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. సాబుదానా ఉప్మా కావలసినవి: సగ్గు బియ్యం – 2 కప్పులు; పల్లీలు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (మధ్యకు నిలువుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె / నెయ్యి – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను బాగా వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు సుమారు మూడు నిమిషాల పాటు వేయించుతుండాలి ∙సగ్గుబియ్యంలో నీళ్లు పూర్తిగా ఒంపేయాలి ∙పల్లీలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి ∙వేగుతున్న పోపులో సగ్గు బియ్యం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి బాగా కలిపి, కొద్ది సేపు ఉంచి దింపేయాలి. -
డూప్ హీరోల సందడి
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ డూప్లు భాస్కర్, శివ, చందు హీరోలుగా హాబీబ్ తెరకెక్కించిన చిత్రం ‘కథానాయకులు’. సి.రామాంజనేయులు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. హబీబ్ మాట్లాడుతూ – ‘‘ఒక మల్టీస్టారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ వినోదంగా సెకండాఫ్ థ్రిల్కు గురి చేసే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది. పెద్ద హీరోల ఫ్యాన్స్ ఎక్కడా నొచ్చుకోకుండా చేశాం’’ అన్నారు నిర్మాత రామాంజనేయులు. ఈ చిత్రానికి కెమెరా: జో అండ్ శివ. -
ఆలోచన ముఖ్యం
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 9న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేశారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్, నిర్మాత అశ్వినీదత్ టీజర్, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసారు. సినిమా విజయం సాధించాలని వీరందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైడి రమేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో ఒక యువజన నాయకుడు. తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంతో రమణ సాయి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మంచి సందేశం ఉన్న చిత్రం ఇది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు పైడి సూర్యనారాయణ . ఈ చిత్రానికి కెమెరా: బాల, సహ నిర్మాత: పాంగ కోదండరావు. -
అతడు గోదారి ఎదురీదాడు
రేయ్... ఆగండి.... ఎంత దూరమని పరుగులెడతారు. చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకు రావాల్సిందే కదా. వయసు తాపాలు వద్దు, ప్రేమ పాశాలు వద్దు. మోహాలు...ప్రేమలు ...వద్దు. జీవించడం ప్రధానం. వేట కొడవళ్ళు కక్కుళ్ళు పెట్టి నునుపుదేరి ఉన్నాయి. గండ్ర గొడ్డళ్ళు కొలిమిలో కాగి కాగి పదునుతేరి ఉన్నాయి. దానికి తోడు అడ్డంగా నరికేసే ఆత్మాభిమానాలున్నాయి. కుల జాడ్యాలున్నాయి. కాస్త నిగ్రహం పాటించండి, లోకం మారే దాకా, జనం జట్టు కట్టే దాకా. అయినా...ఆగరా...మీ మాట మీదేనా...ఎవరి మాటా వినరా....అయితే ...అయితే.... మీ ఇష్టం...మీ ప్రారబ్ధం. గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పడవ అటూ ఇటూ ఊగుతోంది. ఎదురీదుతున్నట్లుగా సాగుతోంది. కాసేపు ఎండా మరికాసేపు వాన. వాతావరణం గమ్మత్తుగా ఉంది. ఇది విహారం కాదు. వేట ముఖ్యం. బతుకు తెరువు ముఖ్యం. బండి లాగించడం ముఖ్యం. ముగ్గురున్నారు పడవలో. రామచంద్రం, సత్య, శివుడు.దూసుకెళ్తున్న పడవ నీటిని అడ్డంగా కోస్తూంది. నీటి ముక్కలు తెల్లటి నురగలుగా తెగి పడుతున్నాయి. చితికి పరిగెలు ఎగిరెగిరి పడుతున్నట్టుగా ఉంది. దూది పింజెలు చెల్లాచెదురుగా ఎగురుతున్నట్టుగా ఉంది. శివుడు తదేకంగా చూస్తున్నాడు. అమ్మా నాన్నలతో యుద్ధం చేసి వచ్చాడు వేటకు. పెద్ద పేచీ పెట్టి పంతం నెగ్గించుకుని వచ్చాడు. సరదా తీరింది. కళ్ళు సలుపుతున్నాయి. కాళ్ళు నెప్పెడుతున్నాయి. ఉన్నట్టుండి ఆకాశంలో గురక పెడుతున్న చప్పుడు. అల్లంత దూరాన విమానం. తడిగా ఉన్న లాగు ఒంటి మీద ఉండగానే పిండుకున్నాడు. చూపు మాత్రం ఆకాశం పైనే. సరిగ్గా నెత్తి మీదకు రాగానే అడిగాడు.‘‘అందులో నిజంగా మనుషులుంటారా? భయం ఉండదా? నేనెప్పుడైనా అలాంటి పడవలో ఎక్కి కూర్చుంటానా? ’’ ‘‘అది పడవ కాదురా ..ఇమానం...ఇమానం. ఒరేయ్... నాయనా... లాగు విప్పేసి పిండుకోరా... గోదారి మధ్యలో ఉన్నాం. నీకేటి సిగ్గు? ఇందాకటి పాడు వాన... సడీ సప్పుడు లేకుండా వచ్చి కుమ్మరించేసింది... ముందా బట్టలిప్పుకో... ప్రతి దానికీ తయారవుతావు. సెప్పింది ఇనవు కదా ’’ అని విసుగ్గా అంది సత్య.‘‘విమానమని నాకు తెల్దేంటీ? ఊరికే పడవన్నాను’’ చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు శివుడు. దూరంగా చిన్న చుక్కలా కనిపిస్తోంది విమానం. బొటనవేలు, చూపుడువేలు గుండ్రంగా చుట్టి అందులోంచి విమానం చుక్కను చూస్తున్నాడు శివుడు. చిన్నగా ఉంది. అమ్మ చేత ఇక బతిమాలించుకోలేదు. గబగబా బట్టలు విడిచి దిశమొలతో నిలబడ్డాడు. ఈసారి ఆకాశంలో బారులు కట్టిన పక్షులు. వాటికేసి చూస్తూ అలాగే నిలబడ్డాడు. ‘‘ఈవేళ్టికి చాల్లే సంబడం. బేగి తెవిలితే మంచిది. ఈయేళ అచ్చి రాలేదు. సేపలు గీపలు లేవు గానీ కాళ్ళు తీట పుడుతున్నాయి. పొద్దెక్కింది. ఇక వెనక్కి తిప్పు....’’ మొగుడుతో అంది సత్య. గొంతులో నిరాశ. చెంబు లోంచి మంచినీళ్ళు గొంతు లోకి వొంపుకుంది. ‘‘వండుకున్నమ్మ తినక మానదు. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు. ఇంటికి పోక ఇక్కడే నీటిలో గుండ్రంగా తిరుగుతూ ఏటెల్ల కాలం ఉండిపోతామా, ఏటి? వొక అంచు వలేసి చూద్దారి...కంగారు పడితే ఎలా? కాసింత నిదానం ఉండాలి’’ అన్నాడు రామచంద్రం చుట్టూ గోదారిని నిశితంగా చూస్తూ. శివుడు ఒబ్బిడిగా వల పట్టుకుని అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో వాడికి ఇప్పటికిప్పుడే ఇంటికి వెళదామని లేదు. మళ్ళీ ఎప్పటికో గానీ తీసుకెళ్ళరు. ‘‘మనోడు గట్టోడే. ఏదైనా అంటే చాలు చిటికెలో తయారయిపోతాడు. అయినా గానీ సేప పిల్లకి ఈత నేర్పాలా?’’‘‘అసుమంటి కబుర్లు చెప్పమాకు. నా కొడుకు ఈ పని సస్తే చేయడు. సక్కగా సదువుకుని కలకటేరు అవుతాడు...ఏరా అబ్బిగా....’’ అంది మురిపెంగా సత్య కొడుకు కేసి చూస్తూ. తలూపాడు శివుడు. ఎండలో మెరుస్తూ రోడ్డు మీద గాంధీ వేషం వేసుకున్న కుర్రాడిలా ఉన్నాడు శివుడు. ‘‘రోజులీయాల్లా ఉండవులే... మనోడికి సదువొచ్చి మీద పడాలే గానీ నేనేమైనా కాదంటానా?’’ వలలో ఏదో పడినట్లుగా బరువుగా తోచి ‘‘ఇలా రాయే....’’ అంటూ అరిచాడు రామచంద్రం. పడింది పండుగొప్ప. అనుకోని అదృష్టం. ‘‘బాబిగాడొచ్చిన యేలా విసేసం’’ శివుడు ఆసక్తిగా చూస్తున్నాడు. సత్య ఆశగా చూస్తోంది. రామచంద్రం తృప్తిగా చూస్తున్నాడు. గోదారి పాయ.దక్షిణం నుండి ఉత్తరం వైపుకు పారే కోరింగ నది. ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ విశాల ఆవరణంలోంచి సన్నని ఇరుకు సందులోకి వచ్చి గడిబిడిగా... పరుగులు తీస్తోంది. దాని వేగం భయం కలిగించేలాఉంది. కట్టలు తెంచుకుని ప్రవహిస్తే ఇంక ఏమైనా ఉందా? నదీ పాయ దిగువన మంచి పారు మీద వరిచేలున్నాయి. పొట్ట మీద ఉండి ఆకుపచ్చని తివాసీ పరిచినట్లుండే పొలాలు ఏమౌతాయో? ముంపుకు గురయితే నీరు దిగే అవకాశం లేని పంట పొలాల గతి ఊహించడం కష్టం. నీటిని కట్టడి చేయడానికి పెద్ద పెద్ద తలుపులు బిగించి టైడల్ లాక్ ఏర్పాటు చేశారు. ఏ కారణం చేతనైనా అవి కొట్టుకుని పోతే తప్ప ప్రస్తుతం ఇబ్బంది లేదు. దానికి సమీపంలో మర్రిచెట్టు. దాని చుట్టూరా సిమెంటు చప్టా కట్టారు. ఊళ్ళో జనం ఊసులాడుకోడానికి అనువైన అడ్డా అది. సాయంత్రం సమయంలో అంతా చేరతారు భైరవస్వామి కబుర్లూ, కతలూ వినడానికి. అర్ధరాత్రి దాక ఒకటే కబుర్లు. ఊళ్ళో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. భైరవస్వామి వయసు ఎనభై ఏళ్ళు. ఎర్రగా ఉంటాడు. తెల్లటి జుట్టు. పొట్టిగా ఉంటాడు. గట్టివాడే. హుషారుగా మాట్లాడతాడు. మాటల పోగు. మనిషిలో దిగులుండదు. సమస్యలున్నట్టు అనిపించదు. ఒకవేళ ఉన్నా తెలియనీయడు. లౌక్యం తెలిసినవాడు. చెట్టు మొదలు గోనెసంచి పరుచుకుని కూర్చుంటాడు భైరవస్వామి. పొగాకు కాడ చీల్చి చుట్టలు చుట్టుకుంటాడు.నోరు ఊరుకోదు. అనుభవం రంగరించి లోకం తీరు గురించి మనుషుల మనస్తత్వాల గురించి చెబుతాడు. మంచీ చెడూ మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడానికి ప్రయత్నించడు. కానీ కోపం వస్తే పట్టుకోలేం.వీరావేశంతో ఊగిపోతాడు. ఊళ్ళో వాళ్ళు భైరవస్వామిని గౌరవిస్తారు. శ్రద్ధగా వింటారు. దినపత్రికల్లో వచ్చే వార్తలు చదివి దేశంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా చెబుతాడు. టీవీ కథనాల గురించీ ముచ్చటిస్తాడు. జీవితమంతా నాగరిక ప్రపంచంలో మసిలి వచ్చినవాడు. స్పష్టంగా మంచి భాష మాట్లాడతాడు. రచ్చబండకు దగ్గర్లోనే మహాప్రస్థానం పేరున శ్మశానం ఉంది. శవ దహనం సమయంలో అయితే భైరవస్వామి వేదాంత తత్వాలు పాడతాడు. జీవన సత్యాలు పలుకుతాడు. చావు పుట్టుకల మర్మం విప్పుతాడు. సాయం సంధ్య. చల్లగా గాలి వీస్తోంది. ఆవేళ భైరవస్వామి కాస్త నలతగా ఉన్నాడు. వచ్చీపోయే నాల్ని చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో శివుడు ఆ దారిన వస్తున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. భైరవస్వామికి శివుడంటే చాలా ఇష్టం. అతడ్ని చూడగానే ఎక్కడలేని ఓపిక వచ్చేసింది. భైరవస్వామితాతకు తల వంచి నమస్కారాలు చెప్పి పాదాలు ముట్టుకున్నాడు శివుడు. ‘‘చాలా సంతోషం నాయనా... మీ నాన్న రామచంద్రం సంబరపడుతూ చెప్పాడు. వాడు ఎంతో ఇదిగా పొంగిపోతున్నాడు. బిడ్డల ఎదుగుదల తండ్రికి ఆనందమే కదా. వాడొక్కడితో సరిపోయిందా? మన పేటోళ్ళంతా గొప్పలు చెప్పుకుంటూ గెంతులేస్తున్నారు. ఇప్పుడేం చేస్తావు, బాబూ...’’ భైరవస్వామి కళ్ళలో వెలుగులు నింపుకుని అడిగాడు. ‘‘కోచింగు తీసుకుంటున్నాను, తాతా... ఐ.ఎ.ఎస్ రాస్తాను. మళ్ళీ ఊరికి రావడం ఇప్పట్లో కుదరదని అమ్మా నాన్నలను చూడ్డానికి వస్తున్నాను ’’ అన్నాడు వినయంగా శివుడు.భైరవస్వామి ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాడు. తల గోక్కున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.భుజం మీద చేయి వేసి గుచ్చినట్టు గట్టిగా నొక్కి వదిలాడు. లోపలికి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. తాత ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని అర్థమైంది శివుడికి. ఆయన చెప్పబోయే దానికోసం ఎదురుచూస్తున్నాడు.‘‘మన జాతిలో నీ అంత తెలివైనవాడు మరొకడు లేడురా... పదోతరగతి మొదలు అన్నింటా మొదటోడిగా చదువుతున్నావు. నీవు అనుకున్నది కచ్చితంగా సాధించి తీరతావు. అందులో ఈసమెత్తు అనుమానం లేదు. కానీ... ఒరేయ్.... మీ నాన్న కష్టం చూడాలి. చేపల వేట గిట్టుబాటు కావడం లేదని నీకోసం రాత్రింబవళ్లు ఇసుక తవ్వుకి కూడా పోతున్నాడు. నిన్ను ప్రయోజకుడ్ని చేయాలనేది వాడి తాపత్రయం. మీ అమ్మా అంతే. వాళ్ళ కష్టం ఊరికే పోదు. ఇపుడు నీకో పాలి ఓ మాట చెప్పాలి... వింటావా? ’’ భైరవస్వామి అడిగాడు సూటిగా శివుడి కేసి చూస్తూ. ‘‘అలాగే చెప్పండి. పెద్దలు అంతా మంచికే చెబుతారు. చెప్పండి, తాతా? ’’ నవ్వుతూ అన్నాడు శివుడు. ‘‘నన్ను అర్థం చేసుకోగలవు. ఆ జ్ఞానం నీకుందని నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. ఒరేయ్... శివుడూ... నీకెలాగూ మంచి ఉద్యోగమే తప్పక వస్తుంది. అది దేవుడు ఎప్పుడో రాసేశాడు. దానికి తిరుగులేదు. నువ్వు ఈ మట్టిలో పుట్టిన మాణిక్యానివి. అసలు సంగతేమిటంటే నీవు కులం లోని పిల్లనే పెళ్ళాడాలి. నిన్ను ఏ అగ్రకులం పిల్లో వల పన్ని ఎగరేసుకుపోకూడదు. నీ జీవిత వైభోగమంతా కులం పిల్లే పొందాలి. ఎవడైనా ఎదిగాక పుట్టినచోటునీ జాతినీ మరచిపోకూడదు రా..’’ అన్నాడు. అంత దాక ఆవహించిన నీరసం భైరవస్వామిలో ఇప్పుడు మచ్చుకి కూడా లేదు. ‘‘మీ మాటలు గుర్తుంచుకుంటాను, తాతా ... అయినా ఇంకా ఏమైంది... మొదటి మెట్టు మీదే ఉన్నాను’’ అంటూ లేచాడు శివుడు వెళ్లడానికి సిద్ధపడుతూ. ‘‘ఒక్క క్షణం ఆగు... కొన్ని వార్తలు వింటుంటే నా ఒళ్ళు కుతకుతలాడిపోతోంది. ఇంతకష్టపడి తీర్చిదిద్దుకున్న ఫలం ఇంకొకళ్ళు దోచుకుపోతుంటే నాలాంటి వాడు ఉసూరుమంటాడు. వెన్ను లోంచి బాధ తన్నుకొస్తాది ’’అంతలోనే భైరవస్వామి స్వరం మారింది. గొంతులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ‘‘అలాంటిది మన ఊళ్ళో జరిగితే ఊరుకునేది లేదు. కుల పంచాయితీ పెట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇదిగో అబ్బాయ్... ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు... నా మాటను వేళాకోళంగా తీసుకోవద్దు’’అన్నాడు. భైరవస్వామి అంతే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట్లాడే ధోరణి మారిపోతుంది. ‘‘అలాగే తాతా...’’ వినమ్రంగా అని శివుడు ఊరివైపుకు అడుగులేశాడు. పదడుగులేసి వెనక్కి తిరిగి చూశాడు.అక్కడున్న నలుగురూ చప్పట్లు కొడుతున్నారు. భైరవస్వామి తృప్తిగా తల ఎగరేసి నవ్వుతున్నాడు. నాలుగేళ్ళ కాలం గిర్రున తిరిగిపోయింది. జాతీయ స్థాయిలో శివుడికి ఐదో ర్యాంకు వచ్చింది.దినపత్రికల మొదటి పేజీల్లో ఫొటోతో సహా ప్రముఖంగా ప్రచురించారు. ఊరూ వాడా సంబరాల్లో మునిగిపోయింది. ఊరు కాంతి దిశదశలా వెలుగులు జిమ్ముతోంది. కొడుకు ఫొటో ఉన్న పేపరు చంకలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి చూపిస్తున్నాడు రామచంద్రం. విషయం తెలిసింది మొదలు మొగుడూ పెళ్ళాలు ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగానే ఉన్నారు. విలేకర్లు మూకుమ్మడిగా ఊళ్ళోకి వచ్చి ఏవేవే ప్రశ్నలు వేస్తున్నారు. ఉన్నంతలో మంచి బట్టలేసుకుని సమాధానాలు ఇస్తున్నారు. చిన్నప్పట్నుంచీ శివుడికి చదువంటే ఉండే శ్రద్ధ గురించి చెబుతున్నారు వాళ్ళదైన భాషలో. ఊళ్ళో మనిషి కలెక్టరు కావడం అంటే మాటలా? శిక్షణాకాలం పూర్తయ్యింది. మరో ఏడాదిన్నర ఇట్టే గడిచింది. ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన తర్పీదూ పూర్తయ్యింది. శివుడి ఆలోచనలు గోదారి తరంగాల్లా ఒకచోట నిలబడటం లేదు. మాట్లాడేవాడెవరో తెలీదు. మాట్లాడుతున్నాడు.అంతలోనే పాట పాడుతున్నాడు. పాట సారాంశం ఏదో సందేశం ఇస్తున్నట్లుగానే ఉంది. మంద్రస్థాయిలో వినబడుతోంది. భాష మటుక్కి ఖచ్చితంగా తెలుగే. కాదు. మరేదో. అయినా భావం మాత్రం తెలిసిపోతోంది. ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నాడు. దుస్తులు చిత్రంగా ఉన్నాయి. చిరిగిన బట్టల మీద మాసిన కోటు వేసుకున్నాడు. అయిదు అడుగులు కంటే పొడుగుండడు. దవడలు వేలాడుతున్నాయి. గెడ్డం పెరిగి ఉంది. జుట్టు తైలసంస్కారం లేక అట్ట కట్టింది. కళ్ళజోడు ఉంది. వాటికి అద్దాలు లేవు. తనని చూసి దగ్గరకు వస్తున్నాడు. అయినా ఆనవాలు తెలియడం లేదు. చల్లని చూపు మెత్తగా తగిలింది. అది కొండంత అభిమానాన్ని చూపుతున్నది. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాడు. సూటిగా కళ్ళలోకి చూస్తున్నాడు. ఉహూ(... గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. అనునయంగా ఏదో చెబుతున్నాడు. ఒక్క ముక్క అర్థం కావడంలేదు. ముక్కు మీద వేలేసుకుని మంత్రాలు చదివినట్లుగా రాగం తీస్తున్నాడు. భుజం మీద చేయి వేశాడు. స్పర్శ గిలిగింతలు పెట్టింది. భుజం గట్టిగా గుచ్చినట్టు నొక్కి వదిలాడు. ఆత్మీయ స్పర్శ.అంతే... తెలిసిపోయింది. జీర గొంతు. వణుకుతున్న స్వరం లోంచి మాటలు జారుతున్నాయి. మరచిపోయిందేదో గుర్తు చేస్తున్న అలికిడి. జ్ఞాపకాల తేనెతుట్ట రేగింది. ఇక సమస్తం అర్థమైపోయింది.సరిగ్గా అప్పుడే కుక్కలు గందరగోళంగా మొరుగుతున్నాయి, కాలభైరవుని మేల్కొలుపులా. వెంటనే మెలకువ వచ్చేసింది. తక్షణం చేయాల్సిన పని గుర్తుకొచ్చింది. దిగ్గున లేచాడు. మర్నాడు శ్రీలతను కలిశాడు. శ్రీలత తనతోబాటు శిక్షణ పొందింది. ‘‘సమస్యొకటి మీద పడింది. పరిష్కారం నాకు తెలుసు. నా చేతిలోనే ఉంది. మనకేమీ ఇబ్బంది లేదు. అంతా సజావుగా జరుగుతుంది.అందులో సందేహం లేదు. అయినానీకు చెప్పాలి. చెప్పకుండా ఉండలేను’’ అని మొత్తం చెప్పేశాడు. శ్రీలత తేలిగ్గా తీసుకుంది. కంగారుపడలేదు. గుండెలు బాదుకోలేదు. గగ్గోలు పెట్టలేదు. ఇంత అన్యాయం చేస్తావా అని నిలదీయలేదు. ప్రసన్నంగా నవ్వింది. చదువు నేర్పిన సంస్కారం. లోకం తీరు బాగా ఎరిగిన మేధ. ఉదాత్త ఆలోచనల పోగు. ‘‘తప్పుగా ప్రవర్తించకు. నీవు కులం వాళ్ళ మాట విను.పెద్దలు చెప్పినట్టు మసులుకో. పర్వాలేదు. సర్దుకోగలను. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. నీవు చెప్పడం మంచిదే. ఈ రోజు నుండి మనం మంచి స్నేహితులం’’ అంది శ్రీలత ఏవిధమైన ఉద్వేగం కనిపించనీయకుండా. కళ్ళు తడిగా ఉన్నాయి. ముఖం నవ్వుతూనే ఉంది. జీవితం సవాలు విసిరినపుడు నిబ్బరంగా ఎదుర్కోవాలి. నచ్చచెప్పాల్సిన వాళ్ళకు నచ్చచెప్పాడు. బతిమాలాల్సిన వాళ్ళను బతిమాలాడు. నదిని దాటి గమ్యం చేరాలంటే కొన్నిసార్లు ఎదురీదాలి. ఎన్నో ‘నేను’ల సమూహం సంఘం. ఒక్క ‘నేను’ విడివడి ఎదురీదాలి. శివుడు వాలులో కొట్టుకు పోలేదు. ఎదురీదాడు. ఆఖరుగా ఎదిరించాల్సిన వాళ్ళను ఎదిరించాడు. గోదారి ఎప్పటిలాగే పాటు పోటులతో సందడిగా ఉంది. దాట్ల దేవదానంరాజు -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను చాలా ఇష్టపడుతోంది. తను నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు సార్. బట్ వాళ్ల డాడీ మాత్రం మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – శివ నువ్వు టోటల్ సిన్సియర్..! అమ్మాయి ఫుల్గా కమిటెడ్..!! డాడ్ కంప్లీట్గా కంపు చెయ్యడానికి రెడీ..!!‘సార్ ఆన్సర్ ఇవ్వమంటే క్వశ్చన్ చెబుతున్నారేంటి సార్????’వాళ్ల డాడ్ అంటే అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా...‘అబ్బాయికి కూడా... ఏంటి సార్???’లవ్..!!‘ఏంటి సార్..!? అమ్మాయి వాళ్ల డాడీని అబ్బాయి లవ్ చేస్తున్నాడా? వాట్ ఆర్ యు టాకింగ్ సార్?????!?’చేసుకోకపోతే అమ్మాయి బాధపడుతుందనీ.. చేసుకుంటే డాడీ బాధపడతారనీ.. ఇద్దరినీ లవ్ చేస్తున్నాడు నీలూ!!‘అయితే ఇప్పుడు శివ ఏం చెయ్యాలి సార్????’చక్కగా అమ్మాయి ఇంటికి వెళ్లి ‘డాడీ గారండీ.. మీ అమ్మాయిని నేను లవ్వాడుతున్నానండీ’ అని చెప్పి ధైర్యంగా అమ్మాయి హ్యాండ్ అడగొచ్చు. ఆ డాడీ ఎక్కడ ఫీల్ అయిపోతాడోనని మనకు ఉత్తరం రాస్తే ఎలా????‘డాడీ ఒకటి పీకితే అప్పుడు ఎకో సౌండ్లో శివ..శివ..శివ... అని వినపడుతుందేమో సార్??’ప్రేమించడానికే కాదు గుండె ఉండాల్సింది, ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా గుండె కావాలి...!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
దెయ్యం కథ చెబితే!
శివ, సుప్రియ, ఆరోహి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దెయ్యం చెప్పిన కథ’. ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో పెనాక దయాకర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ను దర్శకుడు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. దెయ్యం కథ చెప్పడం అనేది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం తీసుకొచ్చే సక్సెస్తో ప్రదీప్, దయాకర్ రెడ్డి మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు. దయాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి హారర్ మూవీ. వెరైటీ డైలాగులు, పంచ్లతో పాటు కామెడీ ఉంటుంది. ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘కోడి రామకృష్ణగారు మా సినిమా పోస్టర్ను ఆవిష్కరించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రదీప్. ఈ చిత్రానికి సంగీతం: నవీన్, కెమెరా అండ్ ఎడిటింగ్: క్షేత్ర క్రియేటివ్ ఆర్ట్స్. -
ఆయన నా బ్రాండ్ హీరో.. వర్మ
సాక్షి, హైదరాబాద్: సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘తన ట్వీటర్ అకౌంట్లో అక్కినేని నాగార్జున ఫొటోలు రెండు పోస్టు చేశాడు. ఈ రోజునే (ఫిబ్రవరి 16న) నా మొదటి సినిమా శివ తొలి రోజు చిత్రీకరణ చేశాం. ఈ సందర్భంగా నా బ్రాండ్ హీరో నాగార్జున ఫొటోలు ఇదిగో. 25 సంవత్సరాల అన్వేషణ తర్వాత నాకు ఓ కొత్త యాక్టర్ దొరికాడు. అతనేవరో కాదు.. అక్కినేని నాగార్జునే. ఇంతకముందు చూడని రియలిస్టిక్ యాక్షన్ హీరోను నాగార్జునలో చూస్తారు’ అని వర్మ ట్వీట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా వర్మ కంపెనీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఓ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. -
డిష్యూం.. డిష్యూం
ఇన్వెస్టిగేషన్లో ప్రొగెస్ వచ్చింది. క్లూ దొరికింది. అందుకే ముంబై వెళ్లి విలన్స్ను రఫ్పాడిస్తున్నారు హీరో నాగార్జున. మామూలుగా కాదు.. గన్తో చేజ్ చేస్తూ, పంచ్ మీద పంచ్లిస్తూ కుమ్మేస్తున్నారు. అంటే.. ముంబైలో డిష్యూం..డిష్యూం అన్నమాట. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్గోపాల్ వర్మ స్వీయదర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శపథం: మై రివెంజ్ కంప్లీట్స్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఐజా షేక్ సారథ్యంలో నాగార్జున, అజయ్, షాయాజీ షిండే కాంబినేషన్లో ఫైట్ సీన్స్ను తెరకెక్కిస్తున్నాం. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ అనే ఎమ్యూజ్మెంట్ పార్క్లో చేజింగ్ సీన్స్ కూడా తీస్తున్నాం. మార్చి 10వరకు కొనసాగే ఈ షెడ్యూల్లో మరికొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ
-
కడపలో మరో స్వాతి కథ..
సాక్షి, కడప : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం మరవక ముందే కడపలోనూ అదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసించే శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో అరుణకు ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లైన తర్వాత కూడా అది కొనసాగుతుండటంతో వద్దంటూ పలుమార్లు శివ వారించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు అరుణ ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పడేశారు. శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయిసుభాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ -
సంఘమిత్రకు ముందు సందడి
కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్ సుందర్ .సి అండ్ టీమ్ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్ ఎవరో కాదు. రజనీకాంత్ హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250కోట్ల బడ్జెట్తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్ రోల్స్లో తేనాండాళ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్ను డిసెంబర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. -
అప్పుడు సైకిల్ చైన్... ఇప్పుడు లాఠీ!
యస్... సైకిల్ చైన్కి, లాఠీకి లింక్ కుదిరింది. ఎలాగంటే? రామ్గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద ట్రెండ్ సెట్టరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘శివ’లో స్టూడెంట్గా చేసిన నాగార్జున చేత సైకిల్ చైన్ లాగించారు వర్మ. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న సినిమాలో నాగార్జున చేత లాఠీ పట్టిస్తున్నారు వర్మ. వర్మ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమాలో లాఠీ పట్టి రఫ్పాడించే పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో నాగార్జున కనిపించబోతున్నారు. ‘‘వర్మ డైరెక్షన్లో తెరకెక్కబోయే స్టైలిష్ యాక్షన్ డ్రామాలో పోలీసాఫీసర్గా నటించబోతున్నా’’ అని నాగ్ పేర్కొన్నారు. అంతేకాదు... ‘‘1988లో ఆర్జీవీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు చాలామంది షాకయ్యారు. డిఫరెంట్గా ఆలోచించారు. ఇప్పుడీ 2017లో కూడా చాలామంది హ్యాపీగా ఫీలైతే... ఎక్కువమంది షాకయ్యారు. లెట్స్ రాక్ రామూ’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘నాగ్... నువ్వెప్పుడూ తక్కువగా మాట్లాడతావు. నేనే ఎక్కువగా మాట్లాడతా. ఇప్పుడు రోల్స్ మార్చుకుందాం. సినిమానే మాట్లాడుతుంది’’ అని నాగ్కి రిప్లై ఇచ్చారు వర్మ. ఈ నెల 20న ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రివెంజ్ కంప్లీట్! ‘‘నేను దర్శకుణ్ణి అవుతానంటే మా నాన్నగారు నమ్మలేదు. అందుకే, ‘శివ’ ముహూర్తపు సన్నివేశానికి నాన్నతో క్లాప్ కొట్టించి, రివెంజ్ తీర్చుకున్నా. మా అమ్మగారు నాకు ఏమీ రాదంటుంటారు. అందుకే నాగ్తో స్టార్ట్ చేయబోయే నా కొత్త సినిమాకి మా అమ్మగారితో క్లాప్ కొట్టించాలనుకుంటున్నాను. రివెంజ్ కంప్లీట్!’’ అని వర్మ పేర్కొన్నారు. -
ఆఫ్టర్ 28 ఇయర్స్.. సేమ్ ప్లేస్..
ఆల్మోస్ట్ 28 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజైంది. అంతే... బాక్సాఫీసు బద్దలైంది. ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఓ నయా ట్రెండ్ స్టార్టయ్యింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అనేలా సీన్ మారింది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘శివ’. నాగార్జున హీరోగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ను రిపీట్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ను ఈ నెల 20న స్టార్ట్ చేయనున్నారు. విశేషం ఏంటంటే..‘శివ’ సినిమా ఫస్ట్ షాట్ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ చిత్రం షూటింగ్ని కూడా స్టార్ట్ చేయనున్నారు. దీంతో సేమ్ ప్లేస్.. సేమ్ కాంబినేషన్.. సేమ్ హిట్ కన్ఫార్మ్ అంటున్నారు అక్కినేని అభిమానులు. పడిరి సుధీర్ చంద్ర సమర్పణలో రామ్గోపాల్వర్మ కంపెనీ బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలతో పాటు, ఇతర విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. -
మళ్లీ అదే టీంతో..
తమిళసినిమా: వివేగం చిత్ర టీమ్ రిపీట్ కానుందా? అంటే.. అవుననే అంటున్నా యి కోలీవుడ్ వర్గాలు. నటుడు అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్లో ఇప్పటికి వరుసగా వీరం, వేదాళం, వివేగం మూ డు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వీరం, వేదాళం చిత్రాలు కమర్శియల్గా మంచి విజయాన్ని సాధిం చాయి. ఇక వివేగం చిత్రం చిత్రీకరణ పరంగా హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉన్నా రెండు చిత్రాల స్థాయిలో విజయం సాధించలేదన్నది విమర్శకులు మాట. అయినా నటుడు అజిత్ మళ్లీ దర్శకుడు శివకు మరో అవకాశం ఇచ్చారన్నది తా జా సమాచారం. వివేగం చిత్రం ఆశిం చిన విజయాన్ని పొందకపోయినా బాధ వద్దని మరో చిత్రం చేద్దామని అజిత్ దర్శకుడు శివకు భరోసా ఇచ్చినట్లు టాక్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు శివ మంచి కథను రెడీ చేస్తున్నారట. ఈ కథ సింగిల్ లైన్ అజిత్కు నచ్చేయడంతో బెటర్మెంట్స్ చేయమని చెప్పారట. ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇంతకు ముందు అజిత్తో ఆరంభం, వేదాళం చిత్రాలను నిర్మించిన నిర్మాత ఏఎం.రత్నం కోడలు, నిర్మాత ఐశ్వర్య అజిత్ ఓకే అంటే ఆయనతో చిత్రం చేయడానికి రెడీ అని ఒక ఇంటర్వూ్యలో ప్రకటించారు. దీంతో వారి సంస్థకు అజిత్ చిత్రం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రాన్ని వివేగం చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందనే తాజా సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్. -
జస్ట్... ఫోర్ మంత్స్!
కుదిరితే నాలుగు రోజుల్లో కూడా దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినిమా తీయగలరు. ‘దొంగల ముఠా’ను ఐదు రోజుల్లో తీశారు కదా! కథను, అందులో కంటెంట్ను బట్టి షూటింగ్ డేస్ ప్లాన్ చేస్తారాయన. ఇప్పుడు నాగార్జున హీరోగా తీయబోయే సినిమా షూటింగును నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తానని వర్మ పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘శివ’తోనే వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత నాగార్జునతో ‘అంతం’, ‘గోవిందా గోవింద’ సినిమాలు తీశారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదిరింది. అయితే... ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు తక్కువని కొన్ని ఊహాగానాలు రావడంతో వర్మ స్పందించారు. ‘‘అక్కినేని నాగార్జున సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభించి, ఫిబ్రవరిలో ముగిస్తా. ఏప్రిల్లో సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టార్ట్ చేసి, సెప్టెంబర్కి రెడీ చేస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. -
92 మందిని కాపాడిన ఆపద్బాంధవుడు
-
కాకతీయ కళావైభవం
పుణ్య తీర్థం ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు, బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరోప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడు సైతం సరస్వతీదేవితో కలిసి హంసవాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ. కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మికశోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లలమర్రి’ దేవాలయాలు. కాకతీయుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా విలసిల్లింది పిల్లలమర్రి. కవులు, పామరులను మెప్పించిన పిల్లలమర్రి పినవీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ ఇది. ముక్కంటికి... మూడు ఆలయాలు... పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ గుడులు దాదాపు 150 సంవత్సరాలపాటు ౖÐð భవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గురయ్యాయి, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ.1208లో ఎరుకేశ్వర దేవస్థానం కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవానికి చాటిచెప్పేలా ఆలయం చాల ఎత్తుగా... గోపురం చాలా దూరం వరకు కనిపిస్తుంది. నల్లరాయితో చెక్కిన దీని ముఖమండప స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ఈ స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలోని స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు. క్రీ.శ.1202లో నిర్మించిన ఈ ఆలయంలో నల్లరాతిపై చెక్కిన శిల్పాలు, ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు, కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. నల్లరాయి శిల్పుల చేతిలో పడి మైనంవలె కరిగిపోయిందా అన్నంత అద్భుతంగా ఉంటుంది. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, క్షీరసాగర మధనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే ఒకే మండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జాతర వేడుకలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. చెన్నకేవ, బ్రహ్మాలయాలు పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే 13వ శతాబ్దంలో చెన్నకేశవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకరతోరణంలో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై, నిత్యపూజలందుకుంటున్నారు. క్రీ.శ.1260లో ధ్వంసమైన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో తిరిగి నిర్మించినట్లు చెబుతారు. నామేశ్వర ఆలయానికి ఎడమవైపున గల బ్రహ్మాలయంలో బ్రహ్మ సరస్వతీమాతతో çకలసి దర్శనమిస్తాడు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది. పిల్లల మర్రి ఎలా చేరుకోవాలంటే..? పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం సులువే. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు. - నాగరాజు కాకోళ్ల, సాక్షి, సూర్యాపేట -
వెండి రథంపై ఆది దంపతులు
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లు వెండి రథంపై కొలువుదీరి ఆలయప్రాంగణంలో ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సహస్రదీపాలంకరణ మంటపానికి చేర్చారు. అక్కడ విశేషపూజల అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య స్వామిఅమ్మవార్లకు సహస్రదీపార్చన నిర్వహించారు. అనంతరం వెండిరథంపై ఆవహింపజేసి ఉత్సవమూర్తులను ఆలయప్రదక్షిణ చేయించి గర్భాలయ దక్షిణ ద్వారం వద్దకు చేర్చారు. భక్తులు అశేషంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. -
పుష్పం.. పత్రం.. తోయం..
సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. అయితే లింగపురాణం ఆ స్వామికి ఇష్టమైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డసరం, అశోకపత్రాలు, తమాలం, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీటికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవచనం. -
ఫైనల్లో శివ, సుమీత్
వికాస్కు కాంస్యం ∙ ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ తాష్కెంట్: ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్లు ఫైనల్లోకి ప్రవేశించారు. 60 కేజీల విభాగంలో పోటీపడుతున్న శివ.. శుక్రవారం జరిగిన సెమీస్లో ఒలింపిక్ కాంస్యపతక విజేత, టాప్ సీడ్ దొర్యమ్బుగ్ ఒట్గొందలాయ్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో పోటీపడుతోన్న సుమీత్.. రెండోసీడ్ తాజిక్ జఖోన్ కుర్బొనోవ్ (తజకిస్తాన్)పై గెలుపొందాడు. ఫైనల్లో స్థానికప్లేయర్ ఎల్నూర్ అబ్దురైమోవ్తో శివ తలపడనున్నాడు. మరోవైపు 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న వికాస్ కృషన్ మ్యాచ్కు హాజరు కాకపోవడంతో అతని ప్రత్యర్థి నాలుగోసీడ్, లీ డొంగ్యూన్ (దక్షిణ కొరియా)ను విజేతగా ప్రకటించారు. -
క్వార్టర్స్లో శివ, సుమీత్
ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్లు శివ థాపా, సుమీత్ సంగ్వాన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్గా బరిలోకి దిగిన శివ..ఒముర్బెక్ మలబెకోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. క్వార్టర్స్లో చు ఎన్ లాయ్ (చైనీస్తైపీ)తో శివ తలపడనున్నాడు. మరోవైపు 91 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్లో సుమీత్.. ఎర్దెన్బెయర్ సందగ్సురేన్ (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్స్లో మూడోసీడ్ ఫెంగ్కాయ్ యు (చైనా)తో సుమీత్ తలపడనున్నాడు. మరోవైపు మనీశ్ పాన్వర్ (81 కేజీలు), కవీందర్ సింగ్ బిస్త్ (49 కేజీలు) కూడా క్వార్టర్స్కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్లో జీ ఆర్ గుణరత్నపై మనీశ్ గెలుపొందగా.. అల్దోమ్స్ సుగురో (ఇండోనేసియా)పై కవీందర్ విజయం సాధించాడు. క్వార్టర్స్లో జాసుర్బెక్ లాతిపోవ్ (ఉజ్బెకిస్తాన్)తో కవీందర్ తలపడుతాడు. వీరితోపాటు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధురి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఇప్పటికే క్వార్టర్స్కు చేరిన సంగతి తెలిసిందే. -
త్రయం తాండవం
నేను నా దైవం త్రికరణ శుద్ధితో... మనసు... మాట... తనువు నువ్వు... నేను... మనం గుడి... బడి... ఇల్లు నింగి... నేల... దిఙ్మండలంఫలం... పుష్పం... బిల్వం ఉగ్ర... జ్ఞాన... అంతర నేత్రం శ్రీ... కాళ... హస్తి గంగ... గళం... గరళం బ్రహ్మ... విష్ణు... పరమేశ్వర అంతా శివమయం ఇదే భరణి త్రీ ఇన్ వన్ తత్త్వం పురివిప్పి పరవశింప జేసే త్రయం తాండవం మీరు శివనామాలతోనే కనిపిస్తారు... శబ్బాష్ రా శంకరా అని శివతత్వం చెప్పారు... మీరు మహాభక్తులా! భక్తుడినే కానీ, మహా కాదు. మన జీవితంలో మట్టి ప్రాధాన్యత తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ పూజకు ఒప్పుకున్నాను. నాకు ఎప్పుడూ ఉపవాసం అలవాటు లేదు. పూజ మొదలుపెట్టేటప్పుడే ‘అయ్యా, భక్తి ఎంత అవసరమో, భుక్తి కూడా అంతే అవసరం. సమయాన్ని పొడిగించకూడద’ని చెప్పాను. బుద్ధుడు కూడా మధ్యేమార్గాన్ని సూచించాడు. శరీరాన్ని కాపాడుకుంటూ దైవప్రార్థన చేయమని. శరీర లక్షణం ఏంటంటే వేళకు పెట్టే తిండి మానేస్తే... ఇంక వీడు తిండి పెట్టడు అనుకున్నప్పుడు తనే కొంతవరకు తయారుచేసుకుంటుంది. అలా ఆకలి అనిపించలేదు. భక్తిలో ఉన్నవారు కుటుంబంతో డిటాచ్డ్గా ఉంటారంటారు. మరి భక్తి ఫ్యామిలీ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా! భక్తి అనేది ఒక వ్యవహారం. మన భారతీయ జీవనంలో మనమేంటో ముందే డిసైడైపోతుంది. మీ తాత శివుని ఆరాధించేవాడు అనుకోండి. అది మీ తండ్రి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ఆచారాలు సంప్రదాయాలు మనదగ్గర ముందే ఫిక్స్డ్. ఇంట్లో అందరూ భక్తులే ఉండాలనేం లేదు. మా పెద్దన్నయ్య శివారాధకుడు. రెండో అన్నయ్య ఫక్తు కమ్యూనిస్టు. నాలుగో అతను తటస్థం. మన ఇల్లే ఒక సమాజం. సమాజమే దేశం. దేవుడంటే ఒక నమ్మకం. ఒక విశ్వాసం. ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందాలే తప్ప మాటల్లో వ్యక్తం చేయలేం. అలాగని మూఢంగా నమ్మమని కాదు. నమ్మకానికి, మూఢ నమ్మకానికి తేడా ఉంది. భక్తకన్నప్పది మూఢభక్తి కాదు గాఢ భక్తి. ఏ స్థాయికెళ్లాడంటే దైవానికి కన్ను ఇచ్చేశాడు. మూఢనమ్మకమంటే... ఈ రాళ్లు పెట్టుకుంటే, ఫలానా రంగు చీర కట్టుకుంటే... మంచిది అంటే దానిని పాటిస్తుంటారు చూడండి అదన్నమాట. మనిషికి కర్తవ్యం అవసరం. అంతే కానీ, దేవుడే అంతా చూసుకుంటాడులే అనుకోవడం ఎంతవరకు సమంజసం? దేవుడు అనేవాడు నువ్వు పని మానుకొని నన్నే పూజిస్తూ కూర్చో అని చెప్పలేదు. ‘కర్మణ్యే వాధికారస్యే, మా ఫలేషు కదాచనా! అంటే, పని చేయ్! ఫలితం ఆశించకు’ అన్నాడు. సృష్టిలో ఏ జంతువు, ఏ పక్షీ పనిచేయదు. కానీ, బతకడం కోసం పనిచేసే ఏకైక జంతువు మనిషి మాత్రమే! అందుకే, మనిషికి దేవుడంటే నమ్మకం, భయం. దైవాన్ని నమ్మడం అంటే ధైర్యం కొరవడినట్టే అంటారు... నమ్మినవాడికి దేవుడే ధైర్యం. నమ్మనివాడికి వాడికి వాడే ధైర్యం. దేవుడు చేయాల్సిన పనులు కూడా వాడే చేసుకుంటాడు కాబట్టి వాడికి వాడే దేవుడు. నాస్తికుడు నా దృష్టిలో పరమోత్కృష్టుడు. అయితే, నువ్వేది నమ్మినా వంద శాతం నమ్ము. ఎంత భక్తుడైనా సరే... అతడిని దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించండి. ‘కలడు కలడనువాడు... కలడో లేడో... అంటాడు. అదే నాస్తికుడితో –‘ఏమయ్యా, దైవం నిజంగా లేడా!’ అంటే, సందేహంతో చూస్తాడు. ‘నేను నమ్మనండి. ఇంట్లో వాళ్లు ఏవో వ్రతాలు, నోములు చేసుకుంటారు’ అంటాడు. అంటే ఇంట్లోవారినే ప్రభావితం చేయనివాడు ఇక సమాజాన్ని ఏం చేస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవడం చేతకాక దేవుని ముందు నిలబడితే ఎలా? పిల్లలకు దీని గురించి ఏం చెబుతున్నాం? సంకటకాలే వేంకటరమణ అన్నది ఓ సామెత ఉంది. కష్టాలు వచ్చినప్పుడే దైవాన్ని తలుచుకుంటాం. మనమేది చేస్తే, పిల్లలు అది చేస్తారు. పిల్లలతో ‘దేవున్ని మనం ఏమీ కోరనక్కర్లేదు. మనకన్నీ ఇచ్చాడు. ఈ జన్మను ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలయ్యా! అని ఓ దణ్ణం పెట్టుకుంటే చాలు’అని చెబితే వాళ్లే అర్థం చేసుకుంటారు. అంతేకాదు, అసలు రహస్యం ఒకటుంది. నువ్వే శివుడివి అని చెప్పాలి. ‘నాలోన శివుడు గలడు .. నీలోన శివుడు గలడు..’ అంటే మన గురించి మనం తెలుసుకోవడమే దైవం.. విశ్వరూపం అంటే అర్థం ‘ఆ విశ్వం అంతా నీలో ఉంది. నీలో ఉన్నదంతా విశ్వంలో ఉంది’ ఇలాంటప్పుడు ఇంకేం కావాలి. దుఃఖం వద్దంటావా? దుఃఖం లేకపోతే మజా ఏముంటుంది? ఎండ లేకపోతే ఏసీ చల్లదనం ఎలా తెలుస్తుంది? పిల్లలను గుడికి తీసుకెళితే అక్కడి వారు రుచికరమైన ప్రసాదాన్నే ఇష్టపడతారు. అలాంటప్పుడు వాళ్లకేం చెప్పాలి? ఇప్పటికీ నేనూ ప్రసాదం కోసమే వెళతాను (నవ్వు). వాళ్లు అక్కడ నమక చమకాలు వినిపిస్తుంటారు. ఏం చెప్పినా అక్కడి చక్కెర పొంగలి, పులిహోర ఊరిస్తుంటుంది. ప్రసాదం అంటే ప్రజెంటేషన్. ఈ క్షణం ఎంత అద్భుతమైనది. దానిని అనుభూతించాలని చెబుతుంది ప్రసాదం. పిల్లలు మనమేది ఆచరిస్తున్నామో అది తెలుసుకుంటారే తప్ప మనం చెబితే కాదు. ముక్కోటి దేవతలు ఉండగా మీకు శివుడు మీదే అంత ప్రేమ ఎందుకు? శివుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు? నా చిన్నప్పుడు మా ఊళ్లో హరిదాసు ‘అజామీళుడు’ అని ఓ కథ చెప్పాడు. ‘నువ్వు ఇన్ని పాపాలు చేసినా ఒక్క బిల్వ దళం ఆయన నెత్తిమీద వేస్తే కైలాసమే’ అన్నాడు. చిన్నమనసులో అది నాటుకుపోయింది. అప్పుడు పాపాలు చేస్తున్నామని తెలియని దశ. ఇప్పుడు పాపాలు చేయకుండా ఉండలేని దశ (నవ్వుతూ... ఒక్క అబద్ధం చెప్పడం కూడా పాపమే కదా!) ఇక శివుడంటేనే ఎందుకంత ఇష్టం అంటే, మన దగ్గర కాకాహోటల్ అని ఉంటుంది. స్టార్ హోటల్ ఉంటుంది. కాకాహోటల్కి ఏ అర్థరాత్రి అయినా వెళ్లచ్చు. పిలిచి మరీ తిండి, బస ఇస్తాడు. స్టార్ హోటల్ అనుకోండి. ఐడి కార్డు లేకపోతే అవతలకు పో అంటాడు. అంత సింపుల్ శివయ్య. ‘చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్.. చిటికెడు బూడిద పూస్తే బస్.. ఉట్టి పుణ్యానికే మోక్షమిస్తవ్ గదా! శబ్బాష్రా శంకరా!’ అని శివతత్త్వాలు రాసే శక్తినిచ్చాడు. శివుడు రూపరహితుడు. ఈయన్ను ఎక్కడైనా పెట్టచ్చు. ఈయనది అటామిక్ ఎనర్జీతో ఉండే భోళాతనం. ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సింబాలిక్గా చెప్పాలంటే లింగం. మనవాళ్లు ఒక ఆర్డర్ ప్రకారం అనుకూలంగా ఆయన్ను మార్చుకున్నారు. పుట్టించేటప్పుడు వాడు బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు. లయం చేస్తే గెటప్ వేసుకొచ్చేది శివుడే. అంటే, త్రీ ఇన్ వన్ శివుడే! వంకాయతో కూర చేసుకోవచ్చు. వేపుడు చేసుకోవచ్చు, పచ్చడీ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చడి శివుడే! శివ తాండవం అంటే ఏంటి? ఆయన ఎందుకలా డ్యాన్స్ చేస్తాడు? నృత్యం ద్వారా ఏం సూచనలు ఇస్తున్నాడు? (నవ్వుతూ) సమాజంలో బతకడానికి కొన్ని నటనలు చేస్తాం, తప్పదు. అయితే, ఈ శివ తాండవం జ్ఞానానికి సంబంధించింది. ఏది చేసిన తీవ్రంగా చేయ్. మనిషిగా నీకున్న తెలివితేటలు నాలుగు ఉంటే నాలుగూ వాడు. ప్రేమ ఉంటే అంతే తీవ్రంగా వాడు. ఆర్తి ఉంటే అంతే తీవ్రంగా వాడు అని చెప్పడం ఆ ఉద్దేశ్యం. జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత పెంచుకో అని నృత్యంతో సూచిస్తున్నాడు. శివుడికి రుద్రాక్షలు అంటే ఎందుకంత ఇష్టం? అవి మనిషి ధరిస్తే వచ్చే లాభమేంటి? రుద్రాక్షల్లో పై భాగం గరుకుగా ఉంటుంది. ఇది జపం చేస్తున్నప్పుడు బొటనవేలికి ప్రెజర్ పెరిగి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయం చెబితే వింటారా! నాయనా, ఇవి రుద్రుడి అక్షుల నుంచి పడినవి రా! ఇది ధరిస్తే మంచిది. దీంతో జపం చేస్తే రుద్రుడు సాక్షాత్కరిస్తాడంటే ఒక ఆశ పుడుతుంది. భక్తి భావనలో మీ కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం... ఓ రోజు పూజ గదిలో ఉన్నాను. మా ఇంట్లో దేవుడి రూమ్, వంటరూమ్ పక్కపక్కనే ఉంటాయి. మా ఆవిడ గోంగూర పచ్చడి చేస్తోంది. నేను స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి తాలూకు ఘుమఘుమకు నోట్లో నీళ్లూరాయి. అఖిలాండకోటి భ్రమంఢానాయకుడిని ముందు కూర్చుంటే కళ్లమ్మంట నీళ్లు రావడం లేదు. గోంగూర రుచికి నోట్లో నీళ్లూరుతున్నాయి. ఇక నిన్నెలా వేడుకోను స్వామీ.. అనుకున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ క్షణంలో ఏ కోరికా లేని ఓ ఆనందాన్ని చవిచూశాను. ‘భూమిపై మూడు వంతులు నీళ్లు. మిగతాది కన్నీరు... ఆటగదరా శివా!’’ అంటూ శివ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే! దాదాపు 15 ఏళ్లుగా దేవుణ్ణి ఏమీ వేడుకోవడం లేదు. నాకో పెద్ద లోకాసమస్తసుఖినోభవంతుః అనుకుంటున్నాను. బార్డర్లో ఉన్న జవాన్కు కూడా ఒక్క బుల్లెట్ తగలకూడదు. ఇరాక్లో స్త్రీ కూడా కన్నీరు పెట్టకూడదు.. అని కోరుకుంటున్నాను. శివుడు బూడిద రాసుకొని ఉంటాడు, శ్మశానంలో తిరుగుతుంటాడు కదా! ఆయనకు అంత పవర్ ఎక్కణ్ణుంచి వచ్చింది? ఐశ్వర్యానికి అధిపతి శివుడే! శివాలయాల్లో ద్వారం పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. డబ్బులు కావాలంటే ఈ పెద్దసార్ పర్మిషన్నే అడగాలి. అక్కడ విభూదినే ఇస్తారు. విభూదే మన ఐశ్వర్యం. నాటి రాజుల వద్ద అనంతమైన ధనరాశులుండేవి. చివరకు ఏమయ్యింది. పోయేటప్పుడు... మట్టి. అంటే బూడిద. నీ శరీరం... ఐశ్వర్యం. చివరకు కాలి బూడిదైపోతుందని చెప్పడమే ఉద్దేశ్యం. స్థితికారకుడు కాబట్టి విష్ణువుకు నిలువు నామం. పోయేటప్పుడు పడుకోబెడ్తరు కాబట్టి ఈశ్వరుడికి అడ్డనామం. విశ్వమే ఆయనైనప్పుడు శక్తి కూడా ఆయనే కదా! ఏకంగా గంగనే నెత్తిన పెట్టుకున్నా, ఈ అభిషేకాల పిచ్చెందుకు? కాస్మిక్ ఎనర్జీ నిరంతరం వేడిని విడుదల చేస్తుంటుంది. శివలింగం నుంచి ఆ వేడి విడుదల అవుతుంది. మూడుసార్లు శివలింగం చుట్టు తిరిగితే మనకే ఒక శక్తి వస్తుంది. ఒక దివ్యానందంలో ఉంటాం. అంత దివ్యానందం పనికిరాదు అని కాసేపు ఆ ఆలయంలో కూర్చోమంటారు. అందుకే తడి బట్టలతో అభిషేకం చేస్తారు. కథా పరంగా చూస్తే నెత్తిన గంగ ఉన్నా దానిని జనుల కోసం వదిలాడు. అందుకే కృతజ్ఞతగా జలంతో అభిషేకిస్తారు. ప్రతి దైవకార్యంలోనూ పరోపకారమే కనిపిస్తుంది. నాలో సగం అంటూ శివయ్య ఇంతికి అంత విలువ ఎందుకు ఇచ్చాడు? దాన్నుంచి మనమేం నేర్చుకోవాలి? శివరూపం ఎత్తినప్పుడు సగభాగం ఇచ్చాడు. విష్ణుమూర్తి వేషం కట్టినప్పుడు కాళ్లొత్తమన్నడు. బ్రహ్మ రూపం ఎత్తినప్పుడు వీణవాయించమన్నడు. ఈయనేం సామాన్యుడు కాదు. (నవ్వులు) అయినా, చివరకు అన్ని రూపాల్లోనూ ఆ అయ్య అమ్మ ముందే మోకరిల్లాడు. నీకోసం ఏం కావాలో, ఏది అవసరమో అమ్మ ఇస్తుందని చాటాడు. దైవాన్ని పరిచయం చేసేది అమ్మే! అమ్మను కొలుచుకున్నవాడు ఈశ్వరుడిని ఆరాధించినట్టే! అన్ని అదుపాజ్ఞలో ఉంచుకునే దైవానికి అంత కోపమెందుకు? మన్మధుడిని మసి చేయడం ఎందుకు? మనలో ఉండే లక్షణాలకు తగ్గట్టే దేవుణ్ణి తయారుచేసుకున్నాం. జీవితంలో అన్ని రసాలు ఉండాలి. వాటిలో కోపం కూడా ఒకటి. మన్మధుడిని మసి చేశాడు కాబట్టి ఈ విషయంపై అంతా ఒకేలా ఆలోచిస్తారు. నీలో కామం పెరిగినప్పుడు అంతర్నేత్రంతో దానిని కట్టడి చేయి. అక్రమమైన కామం కలిగినప్పుడు దానిని దహించివేసే శక్తి నీలోనే ఉందని గ్రహించి దానిని అంతం చేయ్. అదే తెలుసుకో! అని ఈ కథ ద్వారా చెబుతారు. కడుపునిండా భోజనం తినమని ప్రకృతిలో ఇన్ని రుచులను ఇచ్చిన దేవుడు శివరాత్రినాడు ఉపవాసం ఉంటే సంతోషించడం ఏంటి? జాగరణ చేస్తే మురిసిపోయి వరాలివ్వడం ఏంటి? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. జాగారణ మనసును జాగృతం చేయడం. అంతే కానీ, ఈ రోజు పూర్తిగా తిండి మానేసి మరుసటి రోజు ఫుల్లుగా లాగించమని కాదు. నిద్రమానేసి సినిమాలు చూస్తూ జాగరణ చేయడం అని కాదు. నీలోని అంతర్జ్యోతిని బయటకు తేవాలి. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పారు. ఇది సైన్స్ పరంగానూ ధ్రువీకరించారు. ఇదే అంశంమీద మొన్నీమధ్యే ఒక విదేశీయుడుకి అవార్డు కూడా వచ్చింది. ఇది మనవాళ్లు ఎప్పుడో చెప్పారు? శరీరం పడిపోకుండా ఆహారాన్ని తీసుకుంటూనే దైవాన్ని తెలుసుకోవడం. అసలు పాపం చేయకుండా ఉండలేం కదా! భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అని మూడు దశలు ఉంటాయి. ముందు పూజ ఉంటుంది. దీంట్లో కొబ్బరి కాయలు కొడతాం. ఓ పది సార్లు తిరుపతికి వెళ్లొస్తాం. అభిషేకాలు చేసేస్తుంటాం. ఈ దశలో ప్రపంచానికి చెప్పుకోవడం కోసమే పూజ ఉంటుంది. నే చెప్పేదేంటంటే ఏదైతే క్రియ ఉందో అది వద్దు. పూజ స్థాయి నుంచి ధ్యానం స్థాయికి చేరుకోవాలి. ఈ రెండోదశలో భక్తి నిశ్చలంగా ఉంటుంది. ఆ తర్వాతి దశలో అది కూడా ఉండదు. రమణమహర్షి. అంటే యోగి స్థాయికి చేరుకుంటాం. నిరంతరం నీలో ఓంకారం పలుకుతుంటే ఇంక ఏం కావాలి? మీరు గుడికి వెళ్తుంటారా? గుళ్లను దర్శించే ది అప్పటి శిల్పుల కళను తెలుసుకోవడానికి. ఆ కట్టడాల అందం చూడటానికి. దైవారాధనకు నమకచమకాలు అక్కర్లేదు. అలాంటి వాటికే దేవుడు లొంగడు. శ్రీ కాళహస్తిలో పురుగేం నేర్చుకుంది? పామేం తెలుసుకుంది? ఏనుగేమి చేసింది? వాటిని అనుగ్రహించలేదా శివుడు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
మాయ నుంచి బయటపడాలి
సాక్షాత్తూ పరమశివుని అంశగా పేర్కొనదగిన శ్రీ శంకర భగవత్పాదుల వారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళలోని కాలడిలో ఆర్యాంబ – శివగురువు దంపతులకు వైశాఖ శుక్ల పంచమినాడు జన్మించారు. వారు జన్మించేనాటికి భారతదేశం సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా పతనావస్థలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు భగవంతుడొక్కడే అని ఘోషిస్తున్నా, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాదులాడుకుంటూ, పరమత ద్వేషులుగా మారి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి. దాన్ని సమర్థంగా నివారించి సనాతన ధర్మ ప్రబోధతో ప్రజలను ఏకీకృతం చేసిన వారు శ్రీ శంకర భగవత్పాదులు. పిన్న వయస్సులోనే వేదవేదాంగాలను ఆపోశన పట్టి మహా పండితులను, విద్వాంసులనూ తన వాక్పటిమతో, మేధాసంపత్తితో అబ్బురపరచేవారు. పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటి మీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. అందులో శ్రీ శృంగేరీ శారదా పీఠం ఒకటి. శారదాంబ ఆలయ ప్రాకారంపైన పీఠంపై ఆసీనులై ఉన్న శ్రీ శంకర భగవత్పాదుల వారి మూర్తి దర్శనమిస్తుంది. పక్కనే వారు మానవాళికి జ్ఞానబోధ చేసిన శంకర భాష్యం, తదితర మహాగ్రంథాలను కూడా దర్శించుకోవచ్చు. వందల ఏళ్ల క్రితమే వారు భాష్యత్రయాన్ని, అనేక ప్రకరణ గ్రంథాలను, శివానందలహరి, సౌందర్యలహరిని, మనీషా పంచకాన్ని, ఇవిగాక అనేక స్తోత్రరత్నాలను అందించారు. ఆయన అన్ని గ్రంథాలను రచించడానికి కారణం బ్రహ్మచే సృష్టించబడిన మనుషులలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారుంటారు. వారిలో కొందరు తపశ్శక్తిని నమ్మినవారు, మరికొందరు స్తోత్రాధ్యయనాదులయందు ఇచ్ఛగలవారు, వీరినందరినీ పరిపూర్ణ విజ్ఞానవంతులను చేయడమనే శంకరుల ఆశయం. ఆయన అందించిన శ్లోకాలనేకం నేటికీ పండిత, పామర జనాల నాలుకల మీద నర్తిస్తున్నాయి.శంకరులు బోధించిన సాధన చతుష్టయం ద్వారా విజ్ఞానధనులై సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముని కృపకు పాత్రులు కావడమే ఆయన జయంతినాడు మనం సమర్పించే నమోవాకాలు. –స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శారదాపీఠం, విశాఖపట్నం -
తండ్రి దక్షిణామూర్తి
జ్ఞానదాతా మహేశ్వరః – మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరమశివుడు. జ్ఞానమంటే – లౌకికమైన విషయాలైనా కావచ్చు, లౌకిక విద్యలైనా కావచ్చు లేదా లౌకిక విద్య వలన ఒక పరమ సత్యాన్నిదృష్టిలోకి తెచ్చుకునే ప్రజ్ఞ అయినా కావచ్చు లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని, ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగినవాడు పరమశివుడే. అందుకే ఆయన నటరాజస్వామిగా ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మాహేశ్వర సూక్తాలొచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాఙ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారం. అందుకే ఇప్పటికీ శ్రీశైలక్షేత్రం లోపలికి వెడుతుంటే పక్కనే వీణవాయిస్తూ కనబడతాడు. శారదాదేవి ఎలా వీణ పట్టుకుంటుందో దక్షిణామూర్తి కూడా అలా వీణ పట్టుకుని ఉంటాడు. సమస్త విద్యలకు అధిదేవత పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారదకూడా తెలుపు. ఇద్దరూ జ్ఞాన ప్రదాతలే. అటువంటి పరమశివుడు, ఇంత జ్ఞానం ఇవ్వగలిగినవాడు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్లు చేయగలిగినవాడు తండ్రి రూపంలో ఇక్కడ తిరుగుతుంటాడు. అందుకే తండ్రి కలిగిన పెన్నిధానమేల? అన్నారు. లోకంలో సహజంగా తనంత తానుగా గురువు ఎవరంటే తండ్రే. ఎందుచేత అంటే... ఉపదేశం ఎవరు చేస్తారో ఆయన గురువవుతాడు. దీక్ష ఇచ్చేవాడు తండ్రి. యజ్ఞోపవీతాన్ని ధరించే అధికారం ఉన్నవారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని పొందేటట్లుగా అనుగ్రహించగలిగినవాడు తండ్రి. మంత్రదీక్షను ఇచ్చిన వాడు కనుక గురుస్థానంలో నిలబడతాడు. ఉపనయనం అంటే ఉప అంటే సమీపం, నయనము అంటే చేర్చుట. గురువు దగ్గరికి చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా విద్యాభ్యాసానికి అర్హతను కలిగించాడు కాబట్టి తండ్రి గురువయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మహామంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాడిని తొడమీద కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’అని రాయిస్తాడు. అలా రాయించాడు కాబట్టి తండ్రి గురువు. ఈ గురు స్థానానికి తండ్రి సమర్థతతో సంబంధం ఉండదు. కారణం– ధర్మం అన్నమాట ఎవడు ఆశ్రయిస్తున్నాడో(ఇక్కడ కుమారుడు) వాడివైపునుంచి ఉంటుంది తప్ప అవతలివాడు (తండ్రి) ఎటువంటివాడన్న దానినిబట్టి ఉండదు. ఉదాహరణకు మా నాన్నగారికి నాకంటే మా తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం, ఎప్పుడూ వాడినే పొగుడుతూ, నేనెంత ధర్మమార్గంలో ఉన్నా నన్నే నిందిస్తున్నారనుకోండి. అటువంటప్పుడు మా నాన్నగారిపట్ల నేనెందుకు గౌరవం ప్రదర్శించాలన్న ప్రశ్న వస్తే.....?? అసలు ఆ ఆలోచనే తప్పు. ధర్మం నీవైపు నుంచే చూడాలి కాబట్టి నీ వైపునుంచి దోషం లేకుండా నీవు గౌరవించాలి. తండ్రి ప్రవర్తనను పరిశీలించి తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకులేదు. తండ్రి ప్రవర్తనను ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటివాడయినా సేవించడం ఒక్కటే నీ ధర్మం. తండ్రి తాగుబోతయితే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఆ పరిస్థితి నీకు రాకుండా చేయడానికి నీ తండ్రిని తాగుబోతును చేశాడేమో ఈశ్వరుడు? ‘నా తండ్రి పనికిమాలిన వాడు’ అన్నమాట నీ నోటివెంట ఎన్నటికీ రాకూడదు. తండ్రి తప్పును ఎత్తిచూపే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి వందనీయుడు. అంతే. ఇది అతిక్రమిస్తే నీది దోషభూయిష్టమయిన జీవితం అవుతుంది. పరబ్రహ్మను తిరస్కరించిన వాడివవుతావు. -
తండ్రికి నిరంతరం కొడుకు ధ్యాసే!
మహానుభావుడు, ధర్మవేత్త, గొప్ప ఆచార్యుడు, మహా పరాక్రమవంతుడయిన ద్రోణుడు–చేతిలో ఆయుధం ఉన్నంతసేపు యుద్ధరంగంలో ఆయనను ఆపగలిగిన వాడు లేడు. అంత విలువిద్యను పొందిన అర్జునుడే సాక్షాత్తూ ఎదురుగా నిలబడినా ఆపడం అసాధ్యం.అంతటి ద్రోణాచార్యుడు ఒక్కమాటకి పడిపోయాడు. కారణజన్ముడైన ధృష్టద్యుమ్యుడు యుద్ధరంగంలో ఎదురుగా కాచుకుని ఉన్నాడు, ఆయనని చంపడానికి. కుదరడం లేదు. కారణం–ద్రోణుడి చేతిలో ఆయుధం ఉంది. అది విడిచిపెడితే తప్ప చంపడం కుదరదు. అసలు ద్రోణాచార్యుల వారితో యుద్ధమంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి.. ఆహా...ఎంత వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు... ధర్మజుణ్ణి పట్టిస్తానని మాటిచ్చాడు దుర్యోధనుడికి. ద్రోణాచార్యులవారు విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరూ నిలబడలేక పోతున్నారు. ఇక ఇది సాగకూడదనుకున్న శ్రీకష్ణ భగవానుడు ధర్మం నిలబడాలి కనుక వ్యూహరచన చేసాడు. భీముడి చేత అశ్వత్థామ అనే ఏనుగుని పడగొట్టించేసాడు. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్నాడు. చచ్చిపోయింది అశ్వత్థామ అనే ఏనుగయితే, ఏనుగు చచ్చిపోయిందని చెప్పకుండా ’అశ్వత్థామ చనిపోయాడు’ అన్నాడు. ద్రోణుడి కుమారుడి పేరు కూడా అశ్వత్థామ. అంతే! ద్రోణాచార్యుల వారు ముందు నమ్మలేదు. నిరుత్తరుడై పోయాడు. అయినా ఆయుధం ఇంకా చేతిలోనే ఉంది. అది నిర్ధరణ చేసుకోవడానికి ధర్మరాజువంక తిరిగాడు. ’నిజమా !’ అని అడిగాడు శిష్యుణ్ణి. ఎంత సంఘర్షణో !!! ఎదురుగా ఉన్నవాడు గురువు. గురుపుత్రుడు గురువుతో సమానం. అబద్ధం చెప్పడానికి నోరురావడం లేదు. నిన్నెవరు అబద్ధం చెప్పమన్నారయ్యా, నిజమే చెప్పు’ అన్నాడు శ్రీకష్ణ పరమాత్మ. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అను. కుంజరః అన్నప్పుడు మేం భేరీలు మోగిస్తాం’ అన్నాడు. ఎంతయినా గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. పైగా గురువుగారి మరణానికి కారణమవుతోందది. అయినా ధర్మరాజు ’అశ్వత్థామ హతః..కుంజరః’ అన్నాడు. ’కుంజరః’ అన్నప్పుడు భేరీలు మోగించారు. ’ అశ్వత్థామ హతః’ అన్నంత వరకే వినబడింది, కుంజరః అన్నది వినపడలేదు – ద్రోణా చార్యుల వారికి. అంతే ఆయుధం వదిలి పెట్టేసాడు. ఆయన ఎంతటి యోగమూర్తో తెలుసా! ఆయన ఆచార్య అనిపించుకున్నాడంటే కేవలం విలువిద్య ఒక్కటే కాదు ఆయన విశిష్టత. ఆయన ధర్మం అటువంటిది. ధర్మానికి నిలబడ్డవాడే ఆచార్యుడు తప్ప ప్రతి వాళ్లూ పేరు ముందు అసంబద్ధంగా తగిలించుకున్నంత మాత్రాన ఆచార్యులు కాలేరు. ఆయన అనుష్ఠానం అటువంటిది. ఆయుధాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మూలాధార చక్రం దగ్గర్నుంచీ యోగవిద్యతో ప్రాణవాయువును పైకి లేపి బ్రహ్మరంధ్రంగుండా నిష్కమ్రింప చేసాడు. అప్పుడు ధృష్ట్టద్యుమ్నుడు దూకాడు. చచ్చిన ద్రోణుడిని చంపాడు. అర్జునుడు ఎంత బాధపడ్డాడో, ధర్మరాజు ఎంత ఏడ్చాడో ! అంతటి మహానుభావుడు, అంతటి పరాక్రమశీలి, అంతటి ఆచార్యుడు కేవలం కొడుకు పడిపోయాడన్న మాటకూడా వినలేకపోయాడు. ఆ ఒక్క చిన్న పలుకు చంపేసిందంతే. కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరమో, ఎంతటి వాడెంత నైరాశ్యానికి లోనయిపోతాడో, ఎంత బాధ పడిపోతాడో.. కొడుకు అంటే ప్రాణం వదిలి పెట్టేస్తాడు తండ్రి. సర్వకాలాల్లో కొడుకుకు రక్షణ కలిగించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో మరొక ఆలోచన లేకుండా ఉండేవాడు ఎవడో ఆయనే తండ్రి. కొడుకు సంతోషం తప్ప మరో ధ్యాస ఉండదు. అందుకే తండ్రి – బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలుగా ప్రత్యక్ష దైవంగా ఉంటాడు. -
కష్టానికి.. నువ్వంటే ఇష్టమేమో!
శివా.. అని పిలవగానే ప్రెజెంట్ సార్! అని పలికే ఈ కుర్రోడు.. వస్తున్నానయ్యా! అంటున్నాడు. పుస్తకాల బ్యాగును మోసే ఈ చిన్నోడి భుజాలు.. ఇప్పుడు కుటుంబ బాధ్యతను మోస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా సరదాగా సాగిన ఈ బాలుడి బాల్యం.. ఇప్పుడు భారమైన బతుకీడుస్తోంది. ఎందుకు...? కష్టానికి.. శివ అంటే ఇష్టమా!! ఇతని కన్నీటి గాథ వింటే మీరే అవునంటారు.. శివప్రసాద్.. అందరి పిల్లల్లాగే ఏడోతరగతి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ ఇప్పుడు పరీక్ష రాయడంలేదు. కనీసం బడికి కూడా వెళ్లడం లేదు. ఎందుకంటే పదిరోజుల కిందట శివ తండ్రి రామారావు చనిపోయాడు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వదిలిపెట్టి పెద్దన్నయ్య కూడా వెళ్లిపోయాడు. దీంతో తనకంటే పెద్దవాళ్లైన ఇద్దరు అక్కలు, అమ్మను పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు శివ భుజానికెత్తుకున్నాడు. అంతేకాదు... తండ్రి చేసిన అప్పులను కట్టే బాధ్యత కూడా ఈ చిన్ని భుజాలపైనే ఉంది. శివ తండ్రి రామారావు కౌలు రైతు. గుంటూరు జిల్లాలో ఎక్కువగా పండే మిర్చీ, పత్తిని పండించేందుకు నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. దాదాపు రూ.2 లక్షలు అప్పుచేసి పంటను సాగుచేశాడు. వరుసగా కరువు కాటేస్తుండడంతో అప్పుల భారం పెరిగిపోయింది ఈ ఏడాది కూడా అప్పు తీరే పరిస్థితి కనిపించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో శివకు తండ్రి మాత్రమేకాదు ఉన్న ఇల్లు, చదువు కూడా దూరమయ్యాయి. అప్పు కట్టేదాకా చదువు మానెయ్యమని అమ్మ చెప్పడంతో పుస్తకాలను పక్కకు పెట్టిన శివ.. ఊళ్లోనే ఓ ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్తున్నాడు. చదువుకోవాలని లేదా? పలకరిస్తే... చదువుమీద ఆశల్లేవని చెబుతున్నాడు. కుటుంబం గడవడమే కష్టంగా ఉందని, పైగా కట్టాల్సిన అప్పు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదని చెబుతున్నాడు. కనీసం ప్రభుత్వమైనా ఆదుకొని శివకు ఓ దారి చూపించాలని కోరుకుందాం. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
బ్రహ్మ చేసిన బొమ్మ
ధర్మసోపానం మూడు లోకాలుగా, మూడు కాలాలుగా, మూడు మూర్తులుగా కనబడేవాడు పరమశివుడు. ఆయన శివ స్వరూపుడు. శివ అంటే మంగళం, శోభనం, శుభం. అటువంటి మంగళములు చేసేవాడికి సదాశివ’ అనిపేరు. ‘అమంగళం’ చేయడం ఆయనకు తెలియదు. కారణం– ఆయన తండ్రి కనుక. ఆ పరమ శివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణువు ఈ ముగ్గురు మూర్తులు ఈ లోకంలో ఎవరిగా ఉన్నారు? కంటితో చూడడానికి వీలయిన రూపంలో ఎక్కడ తిరుగుతున్నారో ఎలా గుర్తుపట్టడం ? ’నమశ్శంకరాయచ, మయస్కరాయచ’ అంది వేదం. శంరాయచ అంటే తండ్రి. శం కరోతీతి శంకరః – ’శం’ అంటే సుఖం, తండ్రి ఈ లోకంలో చేసే అద్భుత కార్యం–తన కడుపున పుట్టిన బిడ్డ సుఖం కోసం అహరహం శ్రమించడం. తనకోసంగా తాను ఫలానా దానిని పొందాలన్న కోర్కె ఏదీ ఉండదు. అది తనబిడ్డ పొందితే చాలు. పరమానందాన్ని పొందుతాడు. ’కొడుకుకు లేకపోయినా ఫరవాలేదు, పాడయినా ఫరవాలేదు, నేను మాత్రం సుఖం అనుభవించాలి’ అన్న కోర్కె ఎందుకుండదంటే– పరమేశ్వరుని కారుణ్యమెటువంటిదో తండ్రి దయ అటువంటిది. ఈశ్వరుడు ఎందుకు దయతో ఉంటాడంటే దానికి కారణమేదీ ఉండదు. అందుకే నిర్హేతుక కృపాపాత్రులం–అంటూ ఉంటారు. ఏ కారణం లేకుండా ఆయన దయను వర్షిస్తుంటాడు. కన్నతండ్రికూడా అంతే. చతుర్ముఖ స్వరూపంలో ఉన్న పరమాత్మ మనకు భువనము, భోగము, తనువు, కరణము అనే నాలుగింటిని అనుగ్రహిస్తుంటాడు. అవి లేకపోతే మన కర్మలను పోగొట్టుకోవడం సాధ్యం కాదు. గత జన్మలో చేసుకున్న పాపాలు కానీ, పుణ్యాలు కానీ సుఖదుఃఖాల రూపంలో అనుభవించనంతకాలం, కర్మల శేషం పోనంత కాలం, మోక్షమన్న మాట ఉండదు. అందుకే చిత్తశుద్ధిని కోరుకుంటారు. చింతపండు, ఉప్పు, పసుపు పెట్టి పాత్రలు తోమితే పాత్ర తళతళా మెరుస్తుంది. ఆ మెరుపు కొత్తగా వచ్చింది కాదు, పాత్రకున్న మెరుపుకు అడ్డుపడిన చిలుము తొలగిపోవడంవల్ల పాత్ర యథాస్థితిలో భాసించింది. నేను ఆత్మకాదు, నేను శరీరం–అనే అవివేకం అనేది మనల్నిపట్టి ఉన్న చిలుము. అదిపోవాలంటే మనం ఈశ్వరార్పణం కావాలి. దానితో ప్రీతిపొందిన ఈశ్వరుడు చిత్తశుద్ధిని ప్రసాదిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లు భాసిస్తుంది. అలా చిత్తశుద్ధిపొందే అవకాశం ఒక్క మనుష్యజన్మకే ఉంది. ఈ మనుష్య జన్మలో భగవన్నామ స్మరణతో ఆ చిలుము తొలగిపోవడానికి ఉపకరించేది శరీరం. భగవన్నామం పలుకగలిగిన శరీరం, భక్తిని పొందడానికి, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం, గురు సేవ చేయడానికి అవకాశమిచ్చే శరీరం ఒక్క మనుష్య శరీరం మాత్రమే. అటువంటి ‘శరీరాన్ని ఇవ్వడానికి సాక్షాత్ బ్రహ్మరూపంలో తండ్రే దానికి తగిన వ్యూహాన్ని అందిస్తాడు. ఆ వ్యూహం ఆచరణలో తండ్రి హృదయం నుంచి చైతన్యంగా మారి, దాని ఫలితంగా తేజస్సు జారితే కుమారుడిగా జన్మిస్తాడు’ అని వేదవాక్కు. అందుకే ‘ఆత్మవైపుత్ర నామాసి’. హృదయంనుండి జారిన బిందువు కనుక కొడుకు తన రూపమై లోకంలో తన బొమ్మగా, తన ప్రతిబింబంగా తిరుగుతుంటాడు. అందుకే తండ్రికి అత్యంత సంతోషాన్ని కలుగచేసేది, ఎక్కడలేని తృప్తినిచ్చేది ఏది? అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకు శరీరాన్ని అలా కౌగిలించుకుంటే చాలు. తండ్రికి ఎంతో ఉపశాంతి కలుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భక్తవ శంకర..నమో నమో!
- పుష్పపల్లకీలో విహరించిన మల్లన్న నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాజ్ఞరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ! తస్మైనకారాయ నమశ్శివాయా !! సర్పాలను హారములుగా ధరించినవాడు, మూడు నేత్రములు కలవాడు, విభూదిని శరీరం నందు పూసుకున్నవాడు, పరిశుద్దుడును, దిక్కులే వస్త్రములు కలవాడు, నకార రూపుడు అయిన శివునికి నమస్కారమని అర్థం. లయకారుకుడైన పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా శ్రీశైలంలో కొలువయ్యారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుని లింగోద్భవకాల దర్శనాన్ని చేసుకోవడానికి లక్షలాదిగా చేరుకుంటున్న భక్తజనంతో క్షేత్రం కిటకిటలాడుతోంది. మల్లన్న మహిమలను కథలు కథలుగా శివభక్తులు చెప్పుకుంటూ ఆధ్యాత్మికానందానికి లోనవుతున్నారు. ఆకుంఠిత దీక్షతో పాదయాత్రగా శ్రీశైలం చేరుకుని ముక్కంటి దర్శనం చేసుకుని శివధ్యానంలో నిమగ్నమవుతున్నారు. ఏకాగ్రతతో శివుని ధ్యానిస్తే దొరకని శుభఫలితం లేదు. అసలు శివం అంటేనే శుభమని, శుభాలను చేకూర్చేవాడు కనుకనే ఆయన శివుడు అంటారు. పుష్పపల్లకీలో మల్లన్న వైభవం.. అభిషేక ప్రియుడు అయిన శ్రీ మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి బుధవారం పుష్పపల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మల్లికార్జునస్వామికి పుష్పపల్లకీ మహోత్సవాన్ని నిర్వహించి పరిపూర్ణంగా స్వామివార్ల కైంకర్యాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ నారాయణభరత్గుప్త తెలిపారు. బుధవారం సాయంత్రం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించాక ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. పల్లకీ కోసం తెలుపు, పసుపు చామంతులు, ఎరుపు, పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా..తదితర 18రకాల పుష్పాలను ఉపయోగించారు. అలాగే 600 కేజీలకు పైగా పూలను, 6వేల విడిపుష్పాలు (కట్ప్లవర్స్) వినియోగించి అత్యంత సుందరంగా పుష్ప పల్లకీని తీర్చిదిద్దారు. ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, డీఎస్పీ రాజశేఖరరాజు, ఈఈ రామిరెడ్డి, సంబం«ధిత విభాగాధిపతులు పాల్గొన్నారు. -
ఇష్టదైవంపై గానామృతం
- శివ ప్రకాశం పేరుతో గానం - ఈ నెల 24న హైదరాబాద్లో విడుదల - సినీ నటుడు జయప్రకాశ్రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ఇష్టదైవమైన శివునిపై శివప్రకాశం పేరుతో పాటలు గానం చేసినట్లు సినీ నటుడు జయప్రకాశ్రెడ్డి తెలిపారు. దీంతో తన చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. తన గానామృత సీడీలను ఈ నెల 24న హైద్రాబాద్లోని ఫిలిమ్ చాంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం వ్యవసాయశాఖ కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి బంధువు, స్నేహితుడైన ఏడీఏ రమణారెడ్డి, ఇతర వ్యవసాయ సిబ్బందితో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు యాక్టింగ్, డైలాగ్స్ మాత్రమే చూశారని, ఇపుడు మొదటి సారిగా శివునిపై పాడిన భక్తి పాటలు వింటారని తెలిపారు. విద్యార్థి దశనుంచే పాటలు పాడటం హాబీగా ఉందని, అయితే శివునిపై భక్తి పాటలు పాడాలనే చిరకాల వాంచ ఇప్పటికి నెరవేరిందన్నారు. జొన్నవిత్తల రచించిన ఆరు పాటలను, వీణపాణి సంగీత దర్శకత్వంలో గానం చేసినట్లు తెలిపారు. లక్ష్మిదేవికి ఒక లెక్కుంది అనే మూవీలో ఒక పాట పాడినప్పటికి అది పాపులర్ కాలేదన్నారు. ఇప్పటి వరకు 300కు పైగా సినిమాల్లో నటించినట్లు తెలిపారు. నాటక రంగం కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పిన జయప్రకాశ్రెడ్డి ఇటీవల గుంటూరులో ప్రత్యేక నాటక సమాజాన్ని స్థాపించామని వివరించారు. కర్నూలు జిల్లా శిరువెల్ల మండలం వీరారెడ్డిపల్లికి చెందిన తాను గ్రామంలో కష్టాల్లో ఉన్న వారికి చేయూత ఇస్తుంటానని తెలిపారు. ఆయన వెంట సినీ, టీవీ ఆర్టిస్ట్ ఆశా కూడా ఉన్నారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ అశోక్కుమార్రెడ్డి, రిటైర్డ్ ఏఓ శివశంకర్ తదితరులతో ఆయన కలిశారు. -
ప్రవాహమే పరమశివుడు
పుణ్యతీర్థం :: సహస్రలింగ ఆలయం అంటే నాలుగు గోడలు గోపురం ధ్వజస్తంభం ఉండాలి. కాని నదే అక్కడ ఆలయంగా మారుతుంది. ప్రవాహమే గర్భగుడై తన ఒడిలో సహస్ర లింగాలను ప్రతిష్టించుకుంది. కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో దట్టమైన అడవుల మధ్య శల్మల నదిలో దర్శనమిచ్చే ‘సహస్రలింగ’ అనే ఈ శైవతీర్థం జీవితంలో ఒక్కసారైన దర్శించతగ్గది. శివుడు నిర్మలుడు, నిరాకారుడు, నిరాడంబరుడు,లింగాకారంలో దర్శనమిచ్చే ఆదిభిక్షువు.ఆయన ఏకాంత ప్రదేశాలలో సంచరించడానికి ఇష్టపడతాడు. ప్రకృతిలో నిమగ్నమై ఉంటాడు. అందుకే మనదేశంలోని చాలా శైవక్షేత్రాలు రణగొణధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. సహస్ర లింగాల కూడా అలాంటి క్షేత్రమే. ప్రకృతి ఛాయల వెనుక దాగినట్టున్న ఆ క్షేత్రం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాదు ఆత్మను తేజోమయం కూడా చేస్తుంది.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ‘ సిరిసి’ ముఖ్యమైన పట్టణం. దీనికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే సహస్రలింగ క్షేత్రం. దీనిని చేరుతుండగానే దివ్యానుభూతి కలిగి కైలాసానికి రాలేదు కదా అని అనుమానం కలుగుతుంది. పరమశివుడు ఇక్కడ గంగమ్మలో మునకలేస్తూ వేయి లింగాలుగా నందీశ్వరునితో పరివ్యాప్తం అయి ఉంటాడు. తలపైన ఉండవలసిన గంగమ్మ ప్రేమతో పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంలో తలస్నానం చేస్తున్న శివలింగాలను చూసి దివ్యానుభూతి పొందుతాం. శల్మల నదీ తీరం... పచ్చని అరణ్యాలలో ప్రవహిస్తున్న శల్మల నది సమీపిస్తుండగానే ప్రకృతి శివనామస్మరణ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. గలగలమనే ఆకుల శబ్దాలతో చెట్లు, జలజలమనే జల నినాదంతో నది ఓం నమశ్శివాయ అంటున్న భావన కలుగుతుంది. శల్మల నది పేరుకి తగ్గట్టుగానే అందమైన సంగీత నాదం చేస్తూ ప్రవహిస్తుంది. గంగవల్లి నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న ఈ నది పడమటి కనుమల నుంచి బయలుదేరుతుంది. మనసును హత్తుకునే సుందరమైన ఈ నదే సాక్షాత్తు దేవాలయంగా మారింది. సాధారణంగా ఎక్కడైనా ఏక లింగం చూస్తేనే పరవశించిపోతాం. అటువంటిది ఇక్కడ సహస్ర లింగాలను ఏకకాలంలో దర్శించడమంటే ఊరిపి పీల్చడం మర్చిపోతాం. శల్మల నదిలో వేయి శివలింగాలు, వేయి నందులు దర్శనమిస్తాయి. పేరుకి మాత్రమే వెయ్యి. వాస్తవానికి అవి లెక్కలేనన్ని. నది మట్టం కొద్దిగా తగ్గగానే అన్ని లింగాలు కనువిందు చేస్తాయి. ప్రతి శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. అయితే కొన్ని నందులు ప్రవాహానికి శిథిలమవడం కొట్టుకుపోవడం జరిగిందని పరిశోధకుల పరిశీలన. శివరాత్రికి భక్తుల సందడితో ఈ ప్రాంతం కోలాహలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న అడవులలో అమూల్యమైన వనమూలికలు ఉన్నాయని పరిశోధకులు ఇప్పటికే తేల్చడం వల్ల శల్మల నదిలో మునకలు వేయడం స్నానాలు చేయడం చాలా మంచిదని భక్తులు భావిస్తారు. అనేక రకాల వనపుష్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. బుల్బుల్ పిట్టల గానం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. సంతానం కోసం 1678 – 1718 ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడిగా సదాశివరాయలు అనే రాజు సిరిసి ప్రాంతాన్ని పాలించేవాడు. అతడికి ఎంతకూ సంతానం కలగలేదు. నాకు గనుక సంతానం కలిగితే సహస్రలింగాలను చెక్కిస్తాను అని అతడు శివుడికి మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు కుమార్తె పుట్టింది. మొక్కు చెల్లుబాటులో భాగంగా అతడు శల్మల నదీ ప్రవాహంలో లెక్కక మించి ఉన్న రాతి శిలలపై సహస్ర లింగాలను చెక్కించాడు. నదీ ప్రవాహం నిండుగా ఉన్నప్పుడు లోపల ఉండే ఈ లింగాలు ప్రవాహం పూర్తిగా తగ్గాక నక్షత్రాల వలే బయటపడి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఇతర ప్రదేశాలలోనూ... అయితే ఒకే ప్రాంతంలో వందలాది లింగాలు ప్రతిష్టించిన సందర్భాలు ఇతర చోట్ల ఉన్నా సహస్ర లింగ మాత్రం విభిన్నమైన క్షేత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది కాకుండా ఒరిస్సా పరశురామేశ్వర దేవాలయంలో, కర్ణాటకలోని హంపీలో ఇటువంటి శివలింగాలు దర్శనమిస్తాయి. పరశురామేశ్వర దేవాలయంలో పెద్ద శివలింగం మీద 1008 లింగాలు దర్శనమిస్తాయి. హంపీ నగరంలో, తుంగభద్ర నదీ తీరం వెంబడి శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. శివారాధకులు భక్తితో వీటిని చెక్కి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అజంతా గుహలలో బుద్ధుడి విగ్రహాలు అనేక రూపాలలో ఉన్నట్లుగానే, ఇక్కడ కూడా లింగాలు దర్శనమిస్తాయి. జపాన్లోని ‘హియాన్ జపాన్’ ప్రాంతంలో కొందరు శిల్పకారులు సంజుసాంజెన్ దో (క్యోటో) లో ఆయుధం ధరించిన కానన్ (జపాన్ దైవం) 1001 విగ్రహాలు చెక్కారు. ఈ దేవాలయాన్ని జపాన్ జాతీయ సంపదగా భావిస్తుంది. కాంబోడియాలో అంగార్వాట్ సమీపంలోని పచ్చని అడవుల గుండా ప్రవహిస్తున్న నదిలో కూడా ఇటువంటి శివలింగాలే కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని వేయిలింగాల నదిగా పిలుస్తారు. ఉత్సవాలలో... శివరాత్రి, నదీ ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతంలో నివిసించేవారు, నదీ తీరాన్ని పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించి, డప్పులు వాయిస్తూ నృత్యం చేస్తారు. శల్మల నది ఉత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. వారికి జీవనాన్ని ఇచ్చింది ఆ నదీమతల్లి అనే భావంతో వారు ఈ ఉత్సవాలు జరుపుతారు. ‘‘మా పరిసరాలను ఎవరైనా పాడు చేయాలనుకుంటే, మేం ఊరుకోం’’ అంటూ వారి భక్తిని చాటుకుంటున్నారు. ►ఈ నదిమీదుగా ఇటీవలే వేలాడే వంతెనను నిర్మించారు. రెండువైపుల గ్రామాలను ఈ వంతెన కలుపుతుంది. వంతెన మధ్యభాగంలోకి చేరుకోగానే, చుట్టుపక్కల అంతా ప్రకృతిమాతను చూస్తూ పరవశించిపోతాం. ఆ వంతెన మీదనుంచి సహస్ర లింగాలను వీక్షిస్తుంటే, పైనుంచి పక్షుల కిలకిలరవాలు, కింద నుంచి నదీమ తల్లి జలజల ధ్వానాలు మాత్రమే వినిపిస్తాయి. ►ఇటీవలి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో, నీటి మట్టం బాగా తగ్గి, మరిన్ని లింగాలు బయటకు వచ్చాయి. వీటిని లెక్కించడం సాధ్యం కాకపోవడంతో, ఈ ప్రాంతానికి సహస్రలింగాల అని పేరుపెట్టారు. ప్రతి లింగానికి ముందు నందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. ఇలా చేరుకోవాలి.... ►సిరిసి నుంచి ఎల్లాపూర్ వెళ్లే మార్గంలో అంటే సిరిసి నుంచి 17 కి.మీ.దూరంలో ఉంది సహస్రలింగాల క్షేత్రం. ౖ¿ñ రుంబే తరువాత హుల్గోల్ బస్ స్టాప్లో దిగాలి. అక్కడ నుంచి హుల్గోల్కి నడవాలి. మెయిన్రోడ్ నుంచి ఇది రెండు కి.మీ. దూరంలో ఉంది. ►ఉడిపి వరకు రైలులో ప్రయాణించి, అక్కడ నుంచి సొంత వాహనంలో కాని, బస్సులో కాని ప్రయాణించి ఈ ప్రాంతం చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 405 కి.మీ. ఆరున్నర గంటల ప్రయాణం. ఇది హుబ్లీ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ►ఇక్కడకు వచ్చే సందర్శకులు, తినడానికి కావలసిన ఆహారపదార్థాలు వారి వెంట తెచ్చుకోవడం మంచిది. ఇక్కడ ఆహారం లభించదు. అన్ని పదార్థాలు వెంట తెచ్చుకుని, భగవంతుని సన్నిధిలో ఒకరోజు ప్రశాంతంగా గడపవచ్చు. దయచేసి ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు, చెత్త పారవేయవద్దని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి పురాతనమైన ప్రదేశాన్ని ప్రభుత్వం వారసత్వ సంపదగా ప్రకటించాలని మేధావులు కోరుతున్నారు. -
శివదీక్ష ధారణ ప్రారంభం
- ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శివదీక్ష ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామిఅమ్మవార్ల ప్రధానార్చకులు శివదీక్ష« మాలధారణ చేయించారు. అర్చకులు మాట్లాడుతూ మన పురాణాలు, ఇతిహాసాలు శివదీక్షను ప్రస్తావించాయని తెలిపారు. జగజ్జనని శివదీక్షను ఆచరించినట్లుగా చెప్పబడుతోందన్నారు. పాండవ మధ్యముడైన అర్జునుడు కూడా శివదీక్షను ఆచరించాడని మహాభారతంలో చెప్పబడిందన్నారు. ఆంగ్లశకం 660లో బాదామి చాళుక్యుడైన మొదటి విక్రమాదిత్యుడు శివదీక్షను మండలదీక్షగా స్వీకరించినట్లు శాసనాలు చెబుతున్నాయని తెలిపారు. మరుగున పడిన ఈ శివదీక్షలను శ్రీశైల దేవస్థానం పునరుద్ధరించిందని ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి చెప్పారు. -
దీక్షను కొనసాగిస్తాం..
సంస్థలు పారిపోవాలి.. లేదంటే డ్రైవర్లకు న్యాయం జరగాలి ఓలా, ఉబెర్ దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగుతుంది తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగ దని, ఇందుకోసం అవసరమైతే తన ఇంట్లో నైనా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగి స్తామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉలుకుండకర్ శివ స్పష్టం చేశారు. బుధవారం ఇందిరా పార్కు వద్ద క్యాబ్ డ్రైవర్ల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో.. శివతో పాటు మరికొందరు గురువారం ఉదయం మణికొండలో తమ ఆమరణ దీక్షను కొనసా గించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన డ్రైవర్లు, ఓనర్లు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శివ మాట్లా డుతూ.. ఓలా, ఉబెర్ సంస్థలు తమ ఆర్థిక నిల్వలను పెంచుకునేందుకు.. వాటిలో పని చేస్తున్న డ్రైవర్లను నిలువునా ముంచుతున్నా యన్నారు. మొదట్లో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి డ్రైవర్లు, వాహనాలను చేర్చుకుని ఇప్పుడేమో వాటిని తగ్గించి మోసం చేస్తున్నా యని ఆరోపించారు. కొత్త వాహనాలను చేర్చుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నా యని, సంస్థలను నమ్ముకుని రంగంలోకి వచ్చిన వారిని మోసం చేస్తున్నాయన్నారు. వారు పెట్టే టార్గెట్లను అధిగమించేందుకు ఒక్కో డ్రైవర్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు. ఆ సంస్థలు డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం చేయాలని, లేదంటే ఇక్కడి నుంచి సంస్థలు పారిపోయే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి సంస్థలతో పాటు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లినా న్యాయం జరగకపోవటంతోనే రోడ్డు ఎక్కా ల్సి వచ్చిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగి వచ్చి సంస్థలతో పాటు తమను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య.. బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో గురువారం ఉదయం మణికొం డలోని ఓ వ్యక్తికి చెందిన స్థలంలో క్యాబ్ డ్రైవ ర్లు దీక్షను తిరిగి ప్రారంభించారు. రోడ్లపై ఇతర క్యాబ్లను ఆపుతుండటంతో ట్రాఫిక్ నిలిచిపోవటం, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అనుమతి లేకుండా దీక్షను చేపట్టినందుకు కేసులు నమోదు చేస్తామని స్థల యజమానిని హెచ్చరించారు. సమావే శం అంటే సరే అన్నానని, దీక్ష విషయం తన కు తెలియదని, స్థలాన్ని వెంటనే ఖాళీ చేయా లని యజమాని ఒత్తిడి చేయటంతో డ్రైవర్లు సాయంత్రం దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు. -
ప్రియుడి దాడిలో గాయపడిన ప్రియురాలు మృతి
గుత్తి : గుత్తిలో గత సోమవారం ప్రియుడు శివ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి (25) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం గుత్తికి తరలించారు. ఈ ఘటనలో ప్రియుడు శివను ఇదివరకే పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. -
అక్రమ నిర్మాణాలు కూల్చండి
- రసాభాసగా కౌన్సిల్ సమావేశం - మున్సిపల్ స్థలాల ఆక్రమణపై దుమారం - అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం - వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైకాట్ హిందూపురం అర్బన్ : మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారుల మ«ధ్య వాదనలు దుమారం రేపాయి. అధికారులను టార్గెట్ చేసి ఒత్తిడి చేస్తే సెలవులపై వెళ్లిపోతామని వాకౌట్ చేశారు. అధికారులు లేని కౌన్సిల్లో ప్రజాసమస్యల పరిష్కారమేదంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైకాట్తో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం దద్దరిల్లిపోయింది. కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఏడాది చివరిరోజు శనివారం చైర్పర్సన్ ఆర్.లక్ష్మి అధ్యక్షతన కమిషనర్ పి.విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నాగభూషణం, ఆసీఫ్వుల్లా మాట్లాడుతూ పట్టణంలో చెత్త గురించి ప్రస్తావించారు. పని చేయకుండానే జీతాలు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. కౌన్సిలర్ షాజియా మాట్లాడుతూ పరిగి రోడ్డులోని మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా ఎందుకు స్పందించలేదన్నారు. ఇంతలో టీడీపీ కౌన్సిలర్ రోషన్అలీ మాట్లాడుతూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎస్బీఐ వద్ద ఉన్న పే అండ్ యూజ్ లెట్రిన్లను మూడంతస్తులుగా నిర్మిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కమిషనర్ స్పందించి నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగాయి.. నోటీసులు కాకుండా నిర్మాణాలు కూల్చివేయాలని సూచించారు. అధికారులు, టీడీపీ కౌన్సిలర్ల వాగ్వాదం సిబ్బంది తక్కువగా ఉన్నా.. తీవ్ర ఒత్తిడితో పని చేస్తున్నా.. తమపై పెత్తనం చేస్తే సహించేది లేదని మెప్మా టీపీఓ విజయభాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే రీతిలో మెప్మా విభాగంలో అవినీతిమయమని ఎలా చెబుతావంటూ సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్పై కూడా వాదనకు దిగారు. అధికారులను టార్గెట్ చేస్తే సెలవులపై వెళ్లిపోతామంటూ వాకౌట్ చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బైకాట్ అవసరమైనప్పుడు అధికారులను మీరే వెనకేసుకొస్తారు. రెండేళ్లుగా ఆక్రమణలపై చర్యలు తీసుకోండంటూ నిలదీసినా ఉలుకూ పలుకూ లేదు. ఉన్నట్టుండి అధికారులను టార్గెట్ చేస్తూ 15 రోజుల్లో అన్నింటిపై చర్యలు తీసుకోవాలంటున్నారని వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీ‹ఫ్వుల్లా, రెహెమన్ విమర్శించారు. అధికారులు లేని సమావేశంలో ప్రజాసమస్యలను ఎవరితో చర్చించాలంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు బైకాట్ చేశారు. -
శివభక్తి గాన సుధ
శ్రీశైలం: నాగులకట్ట కళావేదికపై బుధవారం రాత్రి కళానీరాజనంలో భాగంగా మనో(నాగుర్బాబు) బృంద సభ్యులు శివభక్తి గాన సుధ కార్యక్రమాన్ని నిర్వహించారు. వక్రతుండ మహాకాయ, గణపతి స్తోత్రంతో ప్రారంభించి.. శివభక్తి గీతాలను ఆలాపించారు. ఈ సందర్భంగా ఈఓ నారాయణభరత్ గుప్త మాట్లాడుతూ.. సాంస్కృతిక వారోత్సవాల్లో భాగంగా దేవస్థానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తి గానసుధలో మనోతోపాటు పవన్ చరణ్, శ్రీనిధి, కె. లక్ష్మీ కీర్తనలు పాల్గొన్నారు. మనో ఆరెస్ట్రా బృందం వాయిద్య సహకారాన్ని అందించగా, హైదరాబాద్కు చెందిన నేతి శ్రీశైలం అండ్ సన్స్ శ్రీస్వామిఅమ్మవార్ల సేవగా వీరు స్పాన్సర్స్గా వ్యవహరించినట్లు తెలిపారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో జేఈఓ హరినాథ్రెడ్డి, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు కథక్ నృత్య ప్రదర్శన కళానీరాజనంలో భాగంగా గురువారం రచనా యాదవ్ గురుగాన్.. కథక్ నృత్యప్రదర్శన ఉంటుందని ఈఓ భరత్ గుప్త తెలిపారు. -
సకల చరాచర సృష్టికి మూలం శివుడే
శ్రీశైలం: సకల చరాచర సృష్టికి మూలం శివుడేనని ప్రముఖ ప్రవాచకులు పద్దిపర్తి పద్మాకర్ తెలిపారు. శనివారం మూడోరోజు జరిగిన దివ్యప్రవచనాల్లో ఆహింస పరమధర్మమని, ఎవరినీ హింసించరాదని తెలిపారు. శివలింగాన్ని పూజిస్తే హింసాపాపం తొలగుతుందని, ఆ పూజ కూడా పంచగవ్యాలతో అభిషేకించిన అనంతరం తడి విభూదిని లేపనం చేసి జలాభిషేకం, బిల్వపత్రాలతో అర్చిస్తే హింసాపాపం తొలగుతుందని తెలిపారు. శివలింగమహిమను విశేషించి వివరిస్తూ నందివర్ధన మహారాజు ఆచరించిన శివార్చనను, శివుడు చెన్నమ్మవ్వప్ప చేసిన సేవను స్వీకరించిన విధానం భక్తుడు శివుడికి చేసిన వాహనసేవ, అతిహృద్యంగా వివరించారు. ఆయోద్యనగర రాజైన మిత్రసహుడు కాశీనగరంలో అగస్తుడు ప్రతిష్టించిన శివలింగాన్ని విస్మరించడం వల్ల నమస్కరించకపోవడంతో కలిగిన దుర్గతిని, తదితర అంశాలను క్షుణ్ణంగా తెలిపారు. కార్యక్రమానికి ముందు ప్రఖ్యాత ప్రవాచకులు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి శివలింగ మహిమపై ప్రవచనాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో శివలింగమహిమలపై ప్రవచనాలను ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వినిపిస్తారని జేఈఓ హరినాథ్రెడ్డి మంగళవారం తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో 21 నుంచి 25 వరకు ప్రతిరోజు సాయంత్రం జరిగే ప్రవచనాలలో శివలింగ ఆవిర్భావం, శివలింగ మహిమ, శివలింగ ఆరాధనతో కలిగే లాభాలు, శివలింగార్చన విశేషాలపై ప్రవచనాలు వినిపిస్తారన్నారు. ధనుర్మాసం శివుడికి చాలా ప్రీతికరమని, ఈ మాసంలో శివసంబంధమైన వివేషాలను తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. -
30 మంది విద్యార్థినులపై రేప్
తమిళనాడులో ట్యూషన్ సెంటర్ నిర్వాహకుల కీచకం సాక్షి ప్రతినిధి, చెన్నై: ట్యూషన్ విద్యార్థినులకు మత్తుమందిచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న ముగ్గురు ట్యూషన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలక్కోడుకు చెందిన శివకుమార్ (25) తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలసి పాలక్కాడు, ధర్మపురిలో ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ సెంటర్లలో టెన్త్, ఇంటర్మీడియెట్కు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ట్యూషన్ కు వచ్చే అమ్మాయిలను స్పెషల్ క్లాసుల పేరుతో శివకుమార్ ఎక్కువసేపు ఉంచేవాడు. ఆ సమయంలో టీ/ శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించి తర్వాత వారితో తన కోరిక తీర్చుకునేవాడు. ఆ దారుణాలనూ వీడియో తీసేవాడు. స్నేహితులు ఈశ్వరన్, శివలు సైతం వీడియోలను బయటపెడతామని బెది రించి, విద్యార్థినులను లొంగదీసుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థినులు వీరి దురాగతాలకు బలయ్యారు. -
75 కోట్లతో... 12 దేశాల్లో...
కోలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ హీరో అజిత్. అభిమానులు తలా అని ప్రేమగా పిలుచుకునే అజిత్.. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా వరుసగా మాస్ మసాలా ఎంటర్టైనర్లతో అలరిస్తున్నాడు. అజిత్ తాజా చిత్రం వేదలం కూడా వంద కోట్ల కలెక్షన్లు సాధించి అజిత్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. వీరం, వేదలం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన అజిత్, శివల కాంబినేషన్లో ప్రస్తుతం మరో సినిమా రూపొందుతోంది. ఈ కాంబినేషన్పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజిత్ సీక్రెట్ ఏజెంట్గా నటిస్తున్న ఈ సినిమాను 12 దేశాల్లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే బల్గేరియాతో పాటు యూరప్ లోని మరికొన్ని దేశాల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలోనూ ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో మరికొన్ని దేశాల్లో షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టిజీ త్యాగరాజన్ నిర్మాత. అజిత్ సరసన కాజల్ అగర్వాల్తో పాటు అక్షర హాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. -
వింటే శివస్తోత్రం కంటే యాగంటి
మానవ జీవితానికి ఊతం కోసం భక్తి. ఉల్లాసం కోసం ప్రకృతి. ఈ రెంటి అనుసంధానంగా భారతదేశమంతటా ఆలయాలు ఏర్పడ్డాయి. ఉమతో కలిసి మహేశ్వరుడు కొలువైన యాగంటి తెలుగువారికి సొంతమైన ఆధ్యాత్మిక సంపద. ఎర్రమల సౌందర్యానికి ప్రతీక. రోజు రోజుకూ పెరిగే బసవయ్య ఇక్కడి విశిష్టత. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం- యాగంటి. తెలుగువారి శైవక్షేత్రాల్లో యాగంటి నాగరిక ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని అధిరోహించిన ఉమా మహేశ్వరులు వెలసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. అందుకే భృగు, అగస్త్య వంటి మహా రుషులు అక్కడ సంచరించారని అంటారు. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్తావన చేశారు. ఇక్కడి నంది విగ్రహం రోజురోజుకూ పెరిగి కలియుగాంతానికి రంకె వేస్తుందని కాలజ్ఞానం. అంటే కలియుగాంతంతో ముడిపడిన క్షేత్రం ఇది అని అర్థం చేసుకోవాలి. నేకంటి... యాగంటి యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. బ్రహ్మంగారి వల్ల విఖ్యాతమైన బనగానపల్లికి ఇది కేవలం 13 కిలోమీటర్ల దూరం. చుట్టూ అడవి... ఎర్రటి కొండలు... పచ్చటి పరిసరాలు... రణగొణులు లేని ఏకాంతం... స్వచ్ఛమెన కొండధార ఉన్న ఈ క్షేత్రం చూసినంతనే ఆహ్లాదం కలిగించే క్షేత్రం. దీని ఉనికి పురాణ కాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడని దాని ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘నేకంటి నేకంటి’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు. అగస్త్యుని ఆలయం యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథనం. ఆయన ఇక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించాడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీవిష్ణువు మూలవిరాట్టు చివరి నిమషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన ఈశ్వరుడు ఇది శైవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయంగా మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహాలయాల్లో ఒక దానిలో శ్రీ వేంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటన వేలు భగ్నం అయి ఉండటానికి భక్తులు దర్శించవచ్చు. హరిహరరాయల కాలం నాటి క్షేత్రం ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందనేది కచ్చితంగా తెలియకపోయినా హరిహరరాయలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది (ఇలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). అజ్ఞాత కొండ ధారతో నిండే ఈ కోనేరులో స్నానం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని ఒక నమ్మకం. మరో అజ్జాత కొండ ధారతో వచ్చే నీటిని ‘అగస్త్య పుష్కరిణి’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికి వాడతారు. శని దోషం లేదు... కాకి ప్రవేశం లేదు ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకనొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుంటే కాకాసుర డనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించినట్లు ప్రతీతి. ఆగ్రహించిన అగ స్త్య ముని ఈ క్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కాన రావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా క్షేత్రం శనిప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ఉమామహేశ్వరస్వామిని దర్శించి పూజించడం వల్ల తప్పక శనిదోషం తొలగిపోతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఉత్సవాలు- పూజలు: ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు, కార్తికమాస సందర్భంగా నెల రోజులు మాసోత్సవాలు, సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఇక్కడికి వచ్చిన భక్తులకు స్వామివారి అర్చన, అభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, ఆకుపూజలు, కల్యాణం, అన్నాభిషేకం, దంపతుల పూజలు, ఆకాశదీప పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఉమాశంకరదీక్షిత శర్మ తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులు పూజలను బట్టి ఆలయ అధికారులు నిర్ణయించిన టికెట్లను పొందాల్సి ఉంటుంది. - గుండం సర్వేశ్వరరెడ్డి సాక్షి, బనగానపల్లె, కర్నూలు జిల్లా. దర్శన వేళలు: ప్రతిరోజు ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. వసతి సౌకర్యాలు: ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర సేవాసదన్, బ్రహ్మణి రెసిడెన్సీ తదితర వసతి గృహాలు ఉన్నాయి. వారు గదుల సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. ఇంకా అన్నదాన సత్రాల్లో కూడా వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన, ఉమామహేశ్వర రెడ్ల, వేదగాయత్రి బ్రాహ్మణ, వాసవి ఆర్యవైశ్య సత్రాల ద్వారా నిత్యాన్నదాన భోజన సౌకర్యాలు ఉన్నాయి. రవాణా సౌకర్యం: యాగంటి క్షేత్రం బనగానపల్లె నుంచి 13 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఆర్టీసి బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి బనగానపల్లె-76 కి.మీలు, అనంతపురం నుంచి బనగానపల్లె - 120 కి.మీ. నంద్యాల నుంచి బనగానపల్లె - 45 కి.మీ, హైదరాబాద్ నుంచి బనగానపల్లె - 228 కి.మీ, శ్రీశైలం నుంచి బనగానపల్లె - 223 కి. మీ. మహానంది నుంచి బనగానపల్లె - 60 కి.మీ యాగంటి బసవయ్య యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్ఠించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. మూడు ముఖ్యమైన గుహలు ఈ క్షేత్రం చుట్టూ నిలువుగా చెక్కినట్టుగా కొండలు ఉంటాయి. వాటి లోపల గుహలు ఉంటాయి. ఆలయానికి కుడివైపున ఉన్న కొండలో మూడు ముఖ్యమైన గుహలు ఉన్నాయి. ఒక గుహను వేంకటేశ్వర గుహ అంటారు. ఇందులో వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాయి. బొటన వేలు భగ్నమైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. తిరుమల వేంక టేశ్వరుని విగ్రహంతో పోల్చితే ఈ విగ్రహం కొంచెం భిన్నంగా ఉంటుంది. మరో గుహను అగస్త్య గుహ అంటారు. ఇందులో పూజ లందుకుంటున్న శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠిం చాడని నమ్మకం. మూడో గుహను బ్రహ్మంగారి గుహ అంటారు. పశువుల కాపరిగా ఉండగా బ్రహ్మంగారు ఇక్కడికి పశువులతో వచ్చి ఈ గుహలోనే కాలజ్ఞానంలో కొంతభాగం రాశారని నమ్మకం. తన శిష్యురాలైన గరివిరెడ్డి అచ్చమ్మకు ఇక్కడే జ్ఞానో దయం చేశారట. ఇంకా భక్తులకు అందుబాటులో లేని గుహలలో మహాత్ములు నేటికీ ధ్యానం చేస్తుంటారంటారు. -
అనూప్, శివలకు ‘శాట్స్’ ఎండీ ప్రశంస
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుపొందిన స్కేటర్ అనూప్ కుమార్ యామ, లిఫ్టర్ శివ కుమార్లను ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్బాబు అభినందించారు. అర్జున అవార్డీ అనూప్ కుమార్ ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో సీనియర్ పురుషుల ఫిగర్ స్కేటింగ్, కంబైన్డ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలిచాడు. దీంతో పాటు ఇన్లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్, సోలో డాన్స ఈవెంట్లో చెరో రజతం నెగ్గాడు. వెరుుట్లిఫ్టర్ శివ కుమార్ అంతర్జాతీయ యూనివర్సిటీ పోటీల్లో 56 కేజీ కేటగిరీలో రజత పతకం గెలుపొందాడు. -
శ్రీగిరి..భక్తజన ఝరి!
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో శనివారం రాత్రి శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వద్ద వందలాది మంది భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద కళాకారులు ప్రదర్శించిన.. పార్వతీ కల్యాణం, భక్తకన్నప్ప తదితర నృత్యరూపకాలు అలరించాయి. -
చేనేతకు గోకూప్ చేయూత..!
ఆన్లైన్లో చేనేత ఉత్పత్తుల విక్రయం • 10 రాష్ట్రాల్లోని 275 సంఘాలతో ఒప్పందం • చీరలు, బ్యాగులు, నగల వంటి 20 వేలకుపైగా ఉత్పత్తులు • నెలకు 5 వేల ఆర్డర్లు; 30 శాతం విదేశాల నుంచే • 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ • గుజరాత్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరణ కూడా.. • ‘స్టార్టప్ డైరీ’తో గోకూప్ ఫౌండర్ అండ్ సీఈఓ శివ దేవిరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేనేత కార్మికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాల్లో చాటిచెప్పే చీరలను నేసేదీ వీళ్లే! మరి, నిజంగా దేశంలో నేత కార్మికులకు అంతటి గౌరవం దక్కుతోందా..? సమాధానం కష్టమే! గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం వారి కష్టానికి తగిన ప్రతిఫలమూ దక్కట్లేదు. ఒక్క చీరలే కాదు! నేత కార్మికులు తయారు చేసే ప్రతి ఉత్పత్తీ ప్రజాదరణ ఉన్నదే. కాకపోతే వారికి తెలియం దల్లా... ఆయా ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని!! ఇదిగో.. అలాంటి కష్టాలకు చెక్ చెబుతోంది ‘గోకూప్’! రూ.80 లక్షల పెట్టుబడితో 2011లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గోకూప్ సొల్యూషన్స అండ్ సర్వీసెస్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ శివ దేవిరెడ్డి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ‘‘గోకూప్ అంటే ‘గో’ అంటే విశ్వమంతా(గ్లోబల్); ‘కూప్’ అంటే నలుగురం కలిసి (కో-ఆపరేటివ్) అని అర్థం. మొత్తంగా కలిపితే.. విశ్వమంతా నలుగురం కలిసి ముందుకెళదామని దానర్థం. దేశంలోని అన్ని చేనేత సంఘాలు, కార్మికుల దగ్గరకు స్వయంగా గోకూప్ వెళుతుంది. వారి ఉత్పత్తులను ఆన్లైన్ వేదికగా విక్రరుుంచేందుకు వారితో ఒప్పందం చేసుకుంటుంది. తయారైన ఉత్పత్తులను ఫొటోలు తీసి.. ధరలను నిర్ణరుుంచి.. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే గోకూప్ ఉద్యోగి ఆయా ఉత్పత్తులుండే ప్రాంతానికి వెళ్లి ఉత్పత్తిని పరీక్షించి, ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాడు’’ అని. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. 10 రాష్ట్రాలు.. 275 సంఘాలు..: ప్రస్తుతం గోకూప్ 10 రాష్ట్రాల్లోని 275 చేనేత సంఘాలతో ఒప్పందం చేసుకుంది. ఆప్కో, బోయంక, కేహెచ్డీసీ, ఇంద్రయాని, పోచంపల్లి, కోయల్గూడెం, ఉత్కళ్ వంటి దేశంలోని ప్రముఖ సంఘాలన్నీ ఒప్పందాలు చేసుకున్నారుు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని సుమారు 60 వేల మంది చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. ఆయా ఉత్పత్తులను గోకూప్ వేదికగా ఆన్లైన్లో విక్రరుుంచడమే మా వ్యాపారం. ఒక్కో ఆర్డర్పై కొనుగోలుదారు నుంచే 5-10 శాతం కమిషన్ రూపంలో తీసుకుంటాం. 30 శాతం ఆర్డర్లు విదేశాల నుంచే.. మహిళలు, పురుషుల విభాగంలో అన్ని రకాల చేనేత దుస్తులు, బ్యాగులు, పర్సులు, నగలు, హోం ఫర్నిచర్, హస్త కళలు వంటి ఉత్పత్తులున్నారుు. సుమారు 20 వేలకు పైగా ఉత్పత్తులు నమోదయ్యారుు. ప్రస్తుతం నెలకు 4-5 వేల ఆర్డర్లొస్తున్నారుు. ఇందులో 30% ఆర్డర్లు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల నుంచి వస్తున్నవే. మా మొత్తం వ్యాపారంలో 60 శాతం వాటా చీరల విభాగానిదే. పోచంపల్లి, మంగళగిరి, సంబల్పురి, ఇక్కల్, తుస్సార్ వంటి అన్ని రకాల సంప్రదాయ చేనేత చీరలున్నారుు. ఉత్పత్తుల డెలివరీ కోసం ఇండియా పోస్ట్, ఫెడెక్స్, డీటీసీపీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మరో 3 రాష్ట్రాలకు విస్తరణ.. ప్రస్తుతం గోకూప్లో 50 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఏటా 100 శాతం వ్యాపారం వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఏంజిల్స్, సాహా ఫండ్స, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు గోకూప్లో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ చేయాలని నిర్ణరుుంచాం. వీసీ ఫండ్స కోసం చూస్తున్నాం. వీటి సహాయంతో గుజరాత్, చత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలని లక్ష్యించాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఖుషీఖుషీగా విమల్
యువ నటుడు విమల్ ఖుషీఖుషీగా ఉన్నారు. 2017 నూతనోత్సాహాన్నిచ్చే సంవత్సరంగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. పసంగ చిత్రం విజయంతో దూసుకొచ్చిన ఈ యువ నటుడు కలవాణి, వాగై చూడవా, కలగలప్పు, మాంజా చిత్రాల విజయాలతో తనకంటూ ఒక గుర్తింపును పొందారు.అరుుతే ఇటీవల కాస్త వెనుక బడ్డ విమల్ మళ్లీ ఎగిసిన అలలా వస్తున్నానంటున్నారు. ప్రస్తుతం భూపతి పాండియన్ దర్శకత్వంలో మన్నర్ వగేరా చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందని విమల్ తెలిపారు. తదుపరి దర్శకుడు సుశీంద్రన్ నిర్మాణ సంస్థలో ఆయన శిష్యుడు శివ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని డి.ఇమాన్, మాటలను దర్శకుడు పాండిరాజ్ వంటి ప్రముఖులు పని చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. అదే విధంగా రాజతందిరం చిత్రం ఫేమ్ అమిత్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు.అంతే కాకుండా మరో నలుగురు ప్రముఖుల చిత్రాల్లో నటించే విషయై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం మీద 2017 తనకు నూతనోత్సాహాన్నిచ్చే సంవత్సరంగా ఉంటుందనే ఆనందాన్ని నటుడు విమల్ వ్యక్తం చేశారు. -
పెళ్లికి ముందు రోజు వరుడి ఆత్మహత్య
బర్మాకాలనీలో ఘటన మల్కాపురం : పెళ్లింట విషాదం అలముకుంది. మంగళమేళాలు మోగాల్సిన ఇంట చావు డప్పు మోగింది. పచ్చని పెళ్లి పందిరిలో పెళ్లికొడుకులా కూర్చుంటాడనుకున్న కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. వివరాలిలా ఉన్నారుు. 48వ వార్డు బర్మాకాలనీలో గంధవరపు జెంబో, మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులలో చివరివాడైన శివ(25)కు విజయనగరం ప్రాంతానికి చెందిన ఓ యువతితో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా పెళ్లి రాట ముహూర్తం శుక్రవారం ఉదయం కావడంతో ఇంట్లో పడుకున్న శివను లేపేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో కిటీకిలోంచి చూడగ.. గదిలో సీలింగ్ ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరిపోసుకొని వేలాడుతూ శివ కనిపించాడు. భయందోళన చెందిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూస్తే అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసును సీఐ కేశవరావు ఆధ్వర్యంలో ఏఎస్ఐ బి.ప్రసాద్రావు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే మృతికి కారణం శివ వృత్తిరీత్యా పెరుుంటర్. ఇంటికి సమీపాన ఉంటున్న ఓ యువతితో పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని శివకు ఉండేదని, అరుుతే ధైర్యం చేసి పెద్దలకు చెప్పలేక తల్లడిల్లేవాడు. ఇంతలో పెద్దలు వేరే యువతితో పెళ్లి నిశ్చరుుంచడంతో మనస్థాపానికి గురై శివ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కన్నీటి వరద తెల్లవారితే పెళ్లిరాట. దీంతో ఆ పనుల్లో శివ కుటుంబ సభ్యులు బిజీబిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి సామగ్రి అంతా సమకూర్చారు. పెళ్లి కొడుకు వస్తే ఆ శుభకార్యం చేద్దామనుకున్నారు. ఇంతలో తట్టుకోలేని నిజం వారిని అతలాకుతలం చేసింది. ‘పెళ్లి ఇష్టం లేకపోతే ఇలా చేస్తావా’అంటూ శివ తల్లిదండ్రులు భోరున విలపించారు. -
రాత్రంతా కోర్టులోనే.. వ్యక్తి హల్చల్!
హైదరాబాద్: గగన్ విహార్ సీబీఐ కోర్టులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నిన్న(గురువారం) సాయంత్రం కోర్టులోకి ప్రవేశించిన వ్యక్తి.. రాత్రి మొత్తం కోర్టు భవనంలోనే ఉన్నాడు. సిబ్బంది గురువారం సరిగ్గా చెక్ చేయకుండా తాళాలు వేయడంతో.. జనగామకు చెందిన శివ అనే వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో.. రాత్రంతా కోర్టులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి కోర్టులో ఉన్న కొన్ని దస్తావేజులు చించివేశాడు. శుక్రవారం కోర్టుకు వచ్చిన సిబ్బంది తాళాలు తెరిచిచూడగా ఓ వ్యక్తిని వారు గుర్తించారు. ఆ వెంటనే సిబ్బంది అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. సీబీఐ కోర్టుకు చేరుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకున్నారు. అతను చింపివేసిన దస్తావేజుల గురించి మేజిస్ట్రేట్ ఆరా తీస్తున్నారు. -
బాల శివుడి అండ కోటప్పకొండ
ఆ క్షేత్రంలో శివుడు... బాలుడిగా అవతరించాడు. ఆ క్షేత్రంలో శివుడు... దక్షిణామూర్తిగా బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశాడు. ఆ క్షేత్రంలో శివుడు... విష్ణువు పాపాలను కడిగి వేశాడు. ఆ క్షేత్రంలో శివుడు... తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు. కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు... జీవితంలోని కష్టాలను దాటడానికీ... భక్తులు కోటప్పను తలుచుకుంటారు! ‘చేదుకో... మమ్మల్ని ఏలుకో’ అని శరణుజొచ్చే ప్రతి ఒక్కరినీ... చల్లగా చూసే శివుడు... ఎల్లరకూ అభయమిచ్చే దేవుడు ఈ కోటప్ప!! కార్తీక క్షేత్రాలు - 3 ‘చేదుకో కోటయ్య చేదుకో... చేదుకుని మమ్మల్ని ఆదుకో’ అంటూ పారవశ్యంతో త్రికూటేశ్వరుణ్ణి కీర్తిస్తూ భక్తకోటి కోటప్పకొండకు తరలివస్తారు. ఎటు నుండి చూసినా మూడు శిఖరాల (త్రికూటాలు)తో కనిపిస్తుంది కనుక ఈ క్షేత్రం త్రికూటాచలమైంది. ఇక్కడి శివుడు త్రికూటేశ్వరుడయ్యాడు. ఈ శిఖరాలను రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరంగా భావిస్తూ కోటి మంది దేవతలు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేయడం వల్ల కూడా ఈ క్షేత్రం కోటప్ప క్షేత్రంగా మారిందని భక్తులు నమ్మకం. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలోని కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు కాగా, ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. తిమ్మరసు దర్శించిన క్షేత్రం 11వ శతాబ్దం నుంచి ఉనికిలో ఉందని భావిస్తున్న త్రికూటేశ్వర క్షేత్రానికి ఎందరో రాజులు, జమీందారులు భూరి విరాళాలు సమర్పించారు. విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో మహామంత్రి తిమ్మరసు కొండవీటిని జయించిన అనంతరం ఈ స్వామిని దర్శించుకుని, కొండకావూరు గ్రామాన్ని ఆలయానికి విరాళంగా సమర్పించిన దానశాసనం ఇక్కడ ఉంది. నరసరావుపేట జమీందారు మల్రాజు ఆలయాన్ని పునరుద్ధరించడంతో పాటు కొండ మీదకు చేరుకునేందుకు సోపాన మార్గాన్ని నిర్మించాడు. పురాణ ప్రాశస్త్యం పురాణాల ప్రకారం లయకారుడైన శివుని భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించే యజ్ఞానికి హాజరై, అవమానాలకు గురై ఆత్మాహుతి చేసుకుని శరీరాన్ని విడిచిపెడుతుంది. దీనితో పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, సతీ వియోగంతో విరాగిగా మారి, తనను తాను బాలునిగా (బాలవటువు) కుదించుకుని దక్షిణామూర్తి (గురు రూపంలో)గా తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు శివుణ్ణి దర్శించి బ్రహ్మోపదేశం చేయమని కోరారు. త్రికూటాద్రికి వస్తే చేస్తానంటాడు శివుడు. అలా వారు త్రికూటాద్రికి రాగా శివుడు బ్రహ్మదిదేవతలకు బ్రహ్మోపదేశం చేసినట్టు ఐతిహ్యం. దక్ష యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించిన విష్ణువు తన పాపాలను పోగొట్టాలని శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు తన శూలంతో కొండపై పొడిచి, జలాన్ని పైకి తీసుకువచ్చాడు. ఆ జలంతో స్నానం చేసిన విష్ణువు తన పాపాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఇక్కడ వెలసిన శివుణ్ణి ‘పాప వినాశనేశ్వరుడు’ అని పిలుస్తారు. బ్రహ్మోపదేశం పొందిన దేవతలు వారి వారి లోకాలకు వెళ్ళిపోగా, పరమశివుడు మాత్రం బాలవటువుగా ఇక్కడే తపస్సులో నిమగ్నమయ్యాడు. ఇదంతా త్రికూటాలలో ఒకటైన రుద్ర శిఖరంపై జరిగిన కథ. ఈ శిఖరంపైనే పాత కోటప్ప ఆలయం ఉంది. యాదవ బాలిక కోసం దిగిన శివుడు... రుద్రశిఖరంపై బాల వటువుగా తపస్సులో ఉన్న శివుణ్ణి సమీపంలోని యల్లమంద గ్రామానికి చెందిన యాదవ బాలిక ఆనందవల్లి నిత్యం సేవించడం మొదలుపెట్టింది. రోజూ శివుడి కోసం పెరుగు, మజ్జిగ తీసుకొని కొండెక్కి వచ్చేది. శివుడు ఆమెను వదిలించుకోవాలని చూసినా, వీలు కాలేదు. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించదలిచి మాయగర్భం ఇచ్చాడు. నిండుచూలాలుగా ఉన్నప్పటికీ ఆనందవల్లి ప్రయాసతో కొండపైకి వచ్చి బాల వటువుకు సేవలు అందిస్తూనే ఉండేది. దాంతో ప్రసన్నుడైన పరమేశ్వరుడు నీకు ప్రతి రోజూ కొండపైకి వచ్చే శ్రమను కలుగనివ్వనంటూ తనే కిందకు దిగడానికని, వెనుతిరిగి చూడకుండా దారి చూపమని ఆజ్ఞాపించాడు. ఆనందపరవశురాలైన ఆనందవల్లి ముందు నడుస్తుండగా పరమే శ్వరుడు ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు. అయితే వెనక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఆనందవల్లి కంగారుగా వెను తిరిగి చూసింది. దీంతో పరమేశ్వరుడు ప్రస్తుతం పూజలందుకుం టున్న బ్రహ్మ శిఖరంపై లింగాకారం ధరించాడు. ఆనందవల్లి శివ సాయుజ్యం పొందింది. తన దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆనందవల్లిని దర్శించుకునేలా స్వామి అనుగ్రహించాడు. ఆ ప్రకారమే కోటప్పకొండకు వచ్చే భక్తులు మొదట ఆనందవల్లిని దర్శించుకొని, తర్వాత త్రికూటేశ్వరుణ్ణి కొలుస్తారు. ప్రభల సంబరం మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ప్రభల సంబరం అంబరాన్ని అంటుతుంది. కోటప్పకొండ ప్రభలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రభల సంబరాన్ని చూసేందుకు భక్తులు ఇక్కడకు తరలివస్తారు. చిన్నారులు నిర్మించే అడుగు ఎత్తు బాలప్రభలు మొదలుకొని 80 అడుగుల ఎత్తు వరకు ఉండే భారీ ప్రభలను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇక్కడకు తీసుకువస్తారు. గ్రామాలకు గ్రామాలే ఈ ప్రభలు వెంట తరలివస్తాయి. కాలక్రమంలో ఆయా ప్రభలకు విద్యుత్ అలంకరణలు మరింత శోభను తీసుకువచ్చాయి. ఘాట్ రోడ్డు నిర్మాణం... పెరిగిన భక్తజనం... కోటప్పకొండ పైభాగానికి చేరుకునేం దుకు నరసరావుపేట జమీందారు రాజా మల్రాజు 1761లో సోపాన (మెట్ల)మార్గాన్ని ఏర్పాటుచేశారు. దీంతో కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో భక్తులు విశేషంగా చేరుకోవడానికి వీలైంది. ఈ మెట్లు ఎక్కడంలో ప్రయాస పడకుండా ఉండేందుకు భక్తులు ‘చేదుకో కోటయ్య చేదుకో’ అని కోటప్పను తలవడం విశేషం. కొండపైకి 1999లో ఘాట్రోడ్డు నిర్మించాక భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. ఘాట్రోడ్డు నిర్మాణా నికి పూర్వం ఆలయ ఆదాయం ఏటా రూ.7 లక్షలు ఉండేది. నేడు దాదాపు రూ. 10 కోట్ల ఆదాయం లభిస్తోంది. నిత్యపూజలివే! శివుడు బాల వటువుగా ఇక్కడ వెలవడంతో స్వామి వారికి ఇక్కడ కల్యాణం ఉండదు. విశేష పూజలు, ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. కార్తికమాసంలో ప్రత్యేకంగా కార్తిక అభిషేక పథకాన్ని దేవస్థానం ప్రవేశపెట్టింది. మూల విరాట్టుతోపాటు అభిషేక మండపాలలో భక్తులతో స్వామి వారి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలాగే ఆరుద్రోత్సవ సమయంలో జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి స్వామి వారు ‘మేధా దక్షిణామూర్తి’ స్వరూపం కావడంతో అక్షరాభ్యాస కేంద్రంగా కూడా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. - పుట్లూరి శివకోటిరెడ్డి సాక్షి, నర్సరావుపేట రూరల్ ఇలా చేరుకోవచ్చు! కోటప్పకొండ క్షేత్రం గుంటూరు జిల్లా నరసరావుపేటకు కేవలం 11 కి.మీ దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా వచ్చే యాత్రికులు నరసరావుపేట చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకోవచ్చు. అలాగే జాతీయ ర హదారిపై ఉన్న చిలకలూరిపేట నుంచి ఇక్కడకు 17 కి.మీ దూరం ఉంటుంది. రాయలసీమ వైపు నుంచి వచ్చే భక్తులు వినుకొండ మీదుగా నేరుగా పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద నుంచి కొండకు చేరుకోవచ్చు. గుంటూరుకు 55 కి.మీ దూరంలో, నూతన రాజధాని అమరావతి నుంచి 70 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను కొండకు నడుపుతున్నారు. ఆకట్టుకుంటున్న పర్యాటక కేంద్రం... ఘూట్రోడ్డులో మధ్యలో భక్తులను సేదతీర్చేందుకు సకలవసతులతో అటవీశాఖ పర్యాటకకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో కిలకిలరావం పేరుతో పక్షులు, మయూరవనం, జింకల పార్కు, విదేశి కొంగల కేంద్రం, ట్రాయ్ ట్రయిన్, రంగురంగుల చేపల కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇక్కడే ఏర్పాటుచేసిన కాళింది మడుగులో బోటు షికారు యాత్రికులను ఆకట్టుకుంటున్నది. -
ఒక తల కాదా?
తల తాజా చిత్రంలో ఒకరు కాదు ఇద్దరుగా అజిత్ మరోసారి దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారనే టాక్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభిమానులు తల అని పిలుచుకునే అజిత్ తాజా చిత్ర షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 57వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రానికి ఇంకాపేరు నిర్ణయంచకపోయినా,ప్రస్తుతం ఏకే 57 అన్న పేరుతోనే పిలుచుకుంటున్నారు. ఇంతకు ముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం వంటి విజయవంతమై చిత్రాలను దర్శకత్వం వహించిన శివ ఆయనతో తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ఇది. సత్యజ్యోతి ఫిలింస్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో తల ఒకరు కాదు ఇద్దరుగా నటిస్తున్నారన్నది తాజా సమాచారం. అజిత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు దాదాపు మంచి విజయాన్ని సాధించాయన్నది గమనార్హం. వాలి,వరలారు, అసల్, అట్టహసం చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వరలారు చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయంతో అలరించారు. తాజా చిత్ర కథ గురించి కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇది తమిళనాడులో జరిగిన ఒక నేరం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం.అయితే ఈ నేరానికి మూలాలు యూరోపియన్ దేశంలో కలిగి ఉండడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి ఇంటర్పోల్ పోలీస్ అధికారిగా అజిత్ రంగంలోకి దిగుతారట. అయితే ఇందులో మరో అజిత్ పాత్ర మాత్రం చాలా సర్ప్రైజ్గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడించాల్సిఉంటుంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ను ఈ నెల 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలిసింది. -
రైల్లో నుంచి జారిపడి యువకుడి మృతి
పరుగులు తీస్తున్న రైలు బండిలో నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న దాడి శివ అనే యువకుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
- ప్రియురాలు మృతి - ప్రియుడే హతమార్చాడని ఆరోపణ చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని గంగనపల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేయగా ప్రియురాలు మృతి చెందింది. గంగనపల్లికి చెందిన శివ(21), ప్రీతి(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఈ రోజు ఉదయం శివ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రీతి ఉరివేసుకుని మృతిచెందగా.. ఆత్మహత్యాయత్నంలో ఉన్న శివ భయంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకున్నారు. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పేరుతో లోబరుచుకుని శివ తమ అమ్మాయిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ప్రీతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రాణించిన శివ
⇒ ఆల్ సెయింట్స్ గెలుపు ⇒ ఎ-డివిజన్ వన్డే లీగ్ హైదరాబాద్: శివ (131 బంతుల్లో 80; 3 ఫోర్లు) రాణించడంతో ఆల్సెయింట్స్ హైస్కూల్ 3 పరుగుల తేడాతో యంగ్ మాస్టర్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆల్సెయింట్స్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. సాత్విక్ రెడ్డి 33, సయ్యద్ ఇబ్రహీం 22 పరుగులు చేశారు. ప్రఫుల్ 3, రాహుల్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యంగ్ మాస్టర్స్ జట్టు 45.4 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఆలౌటైంది. సూరి (55) అర్ధసెంచరీ చేయగా, విష్ణువర్ధన్ 36, ప్రఫుల్ కుమార్ 36 పరుగులు చేశారు. ముస్తాక్ అహ్మద్, సాత్విక్, ముజ్తాబా తలా 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు అను సీసీ: 267 (జై మాన్సింగ్ 89, రోహిత్ భగత్ 45; పృథ్వి 3/52), భారతీయ సీసీ: 214 (చంద్రశేఖర్ 52, తుషార్ 31; రోహిత్ భగత్ 5/20). మహావీర్ సీసీ: 128 (బాలాజీ 51; వివేక్ 5/14, విష్ణు 5/18), ఆర్జేసీసీ:132/7 (వివేక్ 45 నాటౌట్). టీమ్ కున్: 180/7 (సహస్ర రెడ్డి 95; అభినవ్ 5/31), తారకరామ: 98 (అనిరుధ్ 5/29, ధీరజ్ 3/15). విజయ్ సీసీ: 215/9 (అర్జున్ కుమార్ 119, హర్ష్ 3/32, రుత్విక్ 3/55), సఫిల్గూడ: 66 (అర్జున్ 3/33, ఫరీద్ బాబా 5/30). హైదరాబాద్: 326/5 (సౌభిక్ 110 నాటౌట్, మానవ్ 48, పీయూశ్ 33), సత్యం కోల్టస్: 90 (రంగస్వామి 4/17). -
శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టింది..
కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ ఖమ్మం కల్చరల్ : శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టిందని ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్తేజ అన్నారు. నగరంలోని బడ్జెట్ హోటల్లో శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో సుద్దాల అశోక్తేజ రచించిన ‘శ్రమకావ్య’ గానం పాఠ్యపుస్తకం విలువ, దాని వెనుక ఉన్న భావాలను తెలియజెపాల్పనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్తేజ రచించిన ‘శ్రమకావ్య’ పుస్తకానికి సంబంధించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. శంకరుని రూపాన్ని నేను చూసినప్పుడు ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది.. ఆయన ఒంటిపై పులి చర్మం ఉంటుంది.. అంటే ఆయన చేతిలో ఉన్న ఢమరుకాన్ని, పులి చర్మాన్ని తయారు చేసే వ్యక్తి శ్రమకోర్చి వాటిని తయారు చేశాడు కాబట్టే శంకరుడు వాటిని ధరించగలిగాడు.. అందుకే నేను శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టిందని భావిస్తాను. అలాగే రామాయణం కన్నా ముందు శ్రమయాణం పుట్టిందని చెప్పొచ్చు. శ్రమకావ్యన్ని రచించడానికి నాకు మూడు నెలల సమయం పట్టింది. దానిని నేను అమెరికాలో రెండు పర్యాయాలు నా కుమారుడిని చూసేందుకు వెళ్లినప్పుడు ఎటువంటి అసౌకర్యానికి లోనుకాకుండా ప్రశాంత, తీరిక సమయాల్లో రాశాను. శ్రమలో నిమగ్నమైన శారీరక చలనం నుంచి నాట్యం పుట్టింది.. శ్రమతో మమేకమైన మనిషి అరుపులో నుంచి సంగీతం వచ్చింది. ఈ రెండు అంశాలను తీసుకుని శ్రమకావ్యాన్ని రచించాను. ఆదిమానవుడు నరుడిగా రూపాంతరం చెంది ప్రస్తుతం ఎటువంటి జీవన గమనాన్ని అనుసరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన శ్రమ ఎలా దోపిడీకి గురైంది.. శ్రమ గొప్పతనం ఏమిటనే అంశాలను వివరిస్తూ శ్రముడు(పురుష), శ్రమి(స్త్రీ) అనే రెండు పాత్రలను తీసుకుని రాయడం జరిగింది. సాహితీ వేత్త మువ్వా శ్రీనివాసరావు, సాహితీ సేవాసంస్థ అధ్యక్షుడు ఆనందాచారి, కవి సీతారామ్.. ‘శ్రమ’ గొప్పతనాన్ని వివరిస్తూ కావ్యాలను రాసిన ఏకైన వ్యక్తి సుద్దాల అశోక్తేజ అని కొనియాడారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్తేజను క్లబ్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రోటరీ దశాబ్ది ఉత్సవాల కన్వీనర్ కురవెళ్ల ప్రవీణ్కుమార్, క్లబ్ అధ్యక్షుడు వందనపు శ్రీనివాసరావు, కార్యదర్శి వజ్రపు రామ్మోహన్, కోశాధికారి బోజెడ్ల ప్రభాకర్రావు, సభ్యులు పాలవరపు శ్రీనివాస్, రవి, నాగేష్, దండ్యాల లక్ష్మణరావు పాల్గొన్నారు. -
శివ.. హుస్సేన్ సాగర్ హీరో!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికై వినబడే పేరు.. శివ! జీవితం మీద విరక్తితో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చే వారిని కాపాడటంతోపాటు.. రకరకాల కారణాలతో హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయినవారి మృతదేహాలను వెలికి తీయడం వరకు అన్ని పనులు చేస్తాడు శివ. అందుకే తోటి కార్మికులు అతణ్ని 'హుస్సేన్ సాగర్ కా హీరో' అని పిలుచుకుంటారు. కార్మికుడిగా శివ చేస్తోన్న పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మెచ్చుకున్నారు. శుక్రవారం తన చాంబర్ కు పిలిపించుకుని శివకు శాలువా కప్పి సన్మానించారు. ఎందరినో కాపాడి, ఎన్నో మృతదేహాలను వెలికితీస్తూ శివ చేస్తున్న పని సామాన్యమైనదేమీకాదని డిప్యూటీ మేయర్ ప్రశంసించారు. -
విజృంభించిన శివ: ఆజాద్ సీసీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వై. శివ (6/23) విజృంభించడంతో ఆజాద్ సీసీ 8 వికెట్ల తేడాతో సెయింట్ మేరీస్పై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ మేరీస్ 33.2 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. శివ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తర్వాత ఆజాద్ సీసీ 13.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 83 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. హుస్సేన్ 42, ఇస్మాయిల్ 33 పరుగులు చేశారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు: అభినవ్ కోల్ట్స్: 264 (సుందర్ 50, అజ్మత్ అలీ 72; తరుణ్ 6/33), లాల్బహదూర్ పీజీ: 124 (తరుణ్ 74; సాయిప్రసాద్ 4/46, అషీర్ 5/42). రెడ్హిల్స్: 249/8 (అద్నాన్ 88, జాఫర్ 43; గుల్షన్ 3/51, రాజశేఖర్ 3/51). తిరుమల సీసీ: 128/6 (రిత్విక్ 41). హెచ్సీఏ అకాడమీ: 318/9 (సాత్విక్ రెడ్డి 89, సత్య 55, శ్రీనివాస్ రావు 44), విజయ్ సీసీ: 159/9 (శృతీశ్ రెడ్డి 3/23). అమీర్పేట్ సీసీ: 236/8 (గుర్విందర్ సింగ్ 103, భార్గవ్ రెడ్డి 64; అవినాశ్ 5/35), స్టార్లెట్స్ సీసీ: 164 (సృజన్ 33; నైరుత్ రెడ్డి 3/36, సుశీల్ 3/29). ఆర్జేసీసీ: 128 (కరణ్ 4/22), ఎంపీ స్పోర్టింగ్: 130/6 (రాజశేఖర్ 30; శ్రీధర్ 3/24). టీమ్కున్: 185 (సహస్ర 61, విఘ్నేశ్వర్ 52; ఫజల్ 3/10), ఎల్ఎన్సీసీ: 186/8 (గంగాధర్ 66, ఓబుల్ రెడ్డి 36). యాదవ్ డెయిరీ: 163/9 (ప్రణవ్ 51 నాటౌట్; అఖిలేశ్ 4/37), తారకరామ: 169/5 (నవీన్ కుమార్ 63). మయూర్ సీసీ: 196/6 (విరించి యాదవ్ 85), ఎస్కే బ్లూస్: 143 (యాకుబ్ 53; గోవర్ధన్ 5/30). యంగ్మాస్టర్స్: 177/8 (విశాల్ 44), డెక్కన్ కోల్ట్స్: 134 (నరేంద్ర 39; రిచి 4/28, ప్రఫుల్ 3/21). -
తీర్థ గుండం.. పాప ప్రక్షాళనం
శ్రీశైలం: ఎక్కడైతే గంగ ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. గంగలేని చోట శివుడు ఉండడు.. శివుని లేనిచోట గంగకు తావుండదు. ఇది ప్రకతి ధర్మం.భక్తుల నమ్మకం కూడా...గంగా గౌరీ సమేతుడైన పరమశివుడు మల్లికార్జునుడిగా వెలసిన ప్రసిద్ధశైవక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రం. ఈ క్షేత్రంలో ఒక్కప్పుడు లెక్కలేనన్ని తీర్థ జలాలు, గుండాలతో అలారుతుండేది. అవన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. నేడు కొన్నిమాత్రమే మిగిలి ఉన్నాయి. ఈతీర్థ గుండాలలోని నీరు సేవించిన వారికి సర్వపాప ప్రక్షాళన జరుగడంతోపాటు ఆ తీర్థం అమత తుల్యమని వేదపండితులు చెబుతారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో మిగిలిన ఉన్న గుండాలలో మల్లికా, మనోహర , రుధిర, సరస్వతి , అమత , శంఖుతీర్థ ముఖ్యమైనవిగా మనం గమనించవచ్చు. మల్లన్న ఆలయప్రాంగణంలోని వీటి గురించిన వివరాలు.... మల్లికా గుండం ఇది మల్లికార్జునస్వామివారి గర్భాలయానికి ఉత్తర దిశగా ఉంది. ఈశ్వరునికి జఠాజూఠంలో ఉన్న ఉన్న మల్లెపూల మకరందం జారి ఈ గుండంలో పడినందున మల్లికా గుండంగా ప్రసిద్ధి చెందిందంటారు. స్వామివారి గర్భాలయ విమాన కలశము ఈ నీటి గుండములో ప్రతిబింబిస్తుంది. గమనించదగ్గ విషయమేమింటంటే ఈ గుండం పై భాగం రాతి మండపంతో కప్పబడి మూసుకునిపోయి ఉన్నా విమాన కలశం కనిపించడం. ఈ గుండంలోని నీరు చూసినంత మాత్రానే సర్వపాపాలు హరిస్తాయంటారు. ఈ నీటితో స్నానం చేస్తే సర్వయజ్ఞాల ఫలం లభిస్తుందని, సర్వక్షేత్రాలలో తపస్సు చేస్తే ఎంత ఫలిముంటుందో అంత ఫలితం సునాయనంగా వస్తుందంటారు. మనోహర గుండం శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయానికి దక్షిణ భాగంలో ఉంది. లోకంలో సర్వ మహాతీర్థముల నీరు ఈ గుండంలో కలుస్తాయంటారు. ఇది గంగా సమానమైన తీర్థం. అంతటి విశేషమున్న తీర్థం మరెక్కడా లేదంటారు. ఈ నీటితో స్నానం చేసి స్వామి, అమ్మవార్లను పూజిస్తే సమస్త కోరికలు సిద్ధిస్తాయని చెబుతారు. ఈ గుండం దగ్గర మరణించిన వారు గణేశ్వరునిగానో, శ్రీమహావిష్ణువుగానో, పరమేశ్వరునిగానో మారిపోతారని స్థలపురాణం చెబుతుంది. రుధిర గుండం ఇది అమ్మవారి ఆలయంలో ఉత్తర దిక్కుగా ఉంది. ఈ గుండంలోని నీరు అమ్మవారి అభిషేకానికి వినియోగిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు ప్రీతి అందుకనే రుధిర గుండంగా పిలుస్తారు. ఈ నీరు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కలియుగాంతంలో ఈ గుండంలో ముసలి పిల్లలను కంటుందని, అప్పుడే యుగం అంతమైపోతుందనే జనగాథ. ఘంటా గుండం దేవాలయ ప్రాకారానికి ఉత్తర వాయువ్యదిశలో ఉన్న ఘంటా సిద్దేశ్వర మఠం ఆవరణలో ఉంది. మూడు లోకాలలో ఉండే సర్వతీర్థాలు ఇందులో ఉన్నాయని తపస్సు చేసే మునీశ్వరులు, సాధకులు ఇక్కడ అదశ్యరూపాల్లో నివసిస్తుంటారని స్థలపురాణం చెబుతుంది. చంద్ర గుండం ఘంటా మఠానికి ఉత్తరాన చంద్రేశ్వరం ఉంది. ఇక్కడ చంద్రగుండం ఉంది. పరమేశ్వరునికి నిశ్చల మనస్సుతో కామక్రోధాలు విడిచి పంచాక్షరే మంత్రంగా జపించి చంద్రకిరణములు సోకినంతనే ఈ గుండము నందలి నీరు తాగితే జరామరణాలు లేని దైవత్వం సిద్ధిస్తుందని అంటారు. వరహ గుండం పూర్వ ఆలయప్రాంగణంలో ఉండేదని అంటారు. బిందు తీర్థానికి పక్కనే సారంగధర మఠానికి ఉత్తరాన వరాహ గుండం ఒకటుంది. ఇది రాతితో వరాహం ఆకారంలో ఉండడంతో దానికి ఆ పేరొచ్చింది. ఈ నీరు చాలా పవిత్రమైనదిగా చెబుతారు. బిందు తీర్థం సారంగ మథానికి ఉత్తరు వాయువ్య దిక్కు కొంత దూరంలో బండ మధ్యవనున్న చిన్న మార్గంలో నుంచి కొద్ది కొద్దిగా నీరు వస్తు చిన్న గుంటలో నిలుస్తుంది. ఈ నీరు ఎల్లప్పుడూ ఉంటుంది. దీనిని బిందు తీర్థమని అంటారు. దీనినే స్థానికులు ‘మల్లమ్మకన్నీరు’ అంటారు. మల్లమ్మ అనే శివభక్తురాలు ఈ ప్రాంతంలోనే తపస్సు చేసి శివునిలో ఐక్యమైందని చెబుతారు. దేవహ్రదం శ్రీశైలానికి వాయువ్యదిశలో ఈ తీర్థముందని, ఇందులో ముద్గవర్ణముగల శిలలు, స్పర్శవేదులు ఉన్నాయని స్థలాపురాణం చెబుతోంది. అమృతగుండం ఇది మల్లికార్జునస్వామి ఆలయానికి దక్షిణ ౖనైరుతిలో ఉంది. గతంలో దీనిపైన సిమెంట్ బండలు పరచి దానికి రంధ్రాలు వేసి ఉంచారు. అయితే రెండేళ్ల క్రితం అప్పటి ఈవో చంద్రశేఖర ఆజాద్ వాటిని తొలగించి ఐరన్మెష్ వేసి భక్తులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ గుండంలోని నీరు మల్లికార్జున లింగం కిందుగా ప్రవహించి మల్లికాగుండంలో కలుస్తుందంటారు. -
వృద్ధులకు ఆర్థికసాయం
హిందూపురం అర్బన్ : స్థానిక మేళాపురంలోని 34వ వార్డులో అనాథలుగా ఉన్న వృద్ధులకు ఇంటి మరమ్మతుల కోసం వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ శివ మంగళవారం ఆర్థిక సాయం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వృద్ధుల ఇంటి పైకప్పు దెబ్బతిని వర్షపు నీరు ఇంట్లోకి కారుతోంది. దీంతో మరమ్మతుల కోసం ఆర్థిక సాయంగా రూ.5 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మహబూబ్బాష తదితరులు పాల్గొన్నారు. -
కోటి లింగేశ్వరస్వామి
పుణ్యతీర్థం విజయవాడ ప్రకాశం బ్యారేజీపైన కృష్ణమ్మ గుండెల మీదుగా ప్రయాణించి, కొస వరకు నడిచి, ఆ చివర కుడివైపుగా సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించాలి. సన్నని బాట. బాటకు ఇరువైపులా అరటితోటలు గెలలతో మనతో పాటు కబుర్లు చెబుతూ ప్రయాణిస్తుంటాయి. కొద్దిగా ముందుకు వెళితే, పొట్టిగా ఉన్న మునగచెట్లు, నిండుగా మునగకాడలతో చేతులు కదుపుతుంటాయి. మరికాస్త ముందుకు వెళ్లేసరికి దొండపాదులు వాటి పిల్లల్ని కిందకు వేళ్లాడదీస్తూ కనిపిస్తాయి. ఎంతో అందమైన ప్రకృతిలో ప్రయాణపు అలుపు తెలియకుండా కోటిలింగేశ్వర శైవక్షేత్రానికి చేరుకుంటాం. శివుడిని ధ్యానిస్తూ, ఆలయంలోకి ప్రవేశించ గానే కైలాసన అడుగుపెట్టిన భావన ఒడలెల్లా కలుగకమానదు. పాదరస శివలింగం... ఆలయంలో ప్రధాన ద్వారం దాటగానే, ఒక పక్క పాదరసంతో రూపొందిన రసలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. పాదరసం విడిగా ఉంటే కరిగిపోతుంది కనుక, ఒక గదిలో ఉంచి, ఆయనకు చల్లని గాలులు వీచేలా ఏసి అమర్చారు. అద్దాల ద్వారం గుండా స్వామిని దర్శించుకోవచ్చు. 350 కిలోల పాదరసంతో రూపొందిన శివలింగదర్శనం దివ్యానుభూతిని కలుగచేస్తుంది. ప్రధాన ఆలయం ఆలయ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో అర్చనలు నిర్వర్తించుకోవడానికి అనువుగా ఒక పక్క శివపార్వతుల ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మరోపక్క... ఉత్సవాలకు సంబంధించిన రాధాకృష్ణులు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు, సీతా, లక్ష్మణ, హనుమత్సమేత రాములవారు దర్శనమిస్తారు. ఇక ప్రధాన ఆలయంలో శివుడు లింగాకృతిలో దర్శనమిస్తూ, ఆ లింగం మీద నలుదిక్కులా ఆకృతిలో కూడా భక్తులకు కనువిందు చేస్తాడు. ఆలయంలో స్వయంగా అందరూ అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ లింగానికి నాలుగు దిక్కుల నుంచి ప్రవేశం ఉంది. నాలుగు దిక్కులకూ నాలుగు నామకరణాలు చేశారు. ముఖద్వారంలో ఒక వైపు వినాయకుడు, మరొక వైపు కుమారస్వామి విగ్రహాలు గోమేధికంతో తయారయినవి ప్రత్యేకంగా పరవశింపచేస్తాయి. మూలవిరాట్టుకు కిందుగా! పాతాళంగా పిలచే గర్భాలయంలోనూ శివుడు కొలువుతీరి ఉన్నాడు. ఇక్కడ శివుడు కిరీట ధారణతో విలక్షణంగా దర్శనమిస్తాడు. ఇక్కడే భక్తులు ప్రతిష్టించిన కొన్నివందల స్ఫటిక లింగాలు, వాటితో పాటే చిన్నచిన్న రసలింగాలు కూడా సందర్శకుల గుండెల్లో గుడులు కట్టుకుంటాయి. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాంగణం పరిశీలిస్తే... ఒక పక్క నవగ్రహాలకు ఆలయాలు వలయాకారంలో నిర్మితమై ఉన్నాయి. నవగ్రహాలు వారి వారి కుటుంబాలతో సహా కొలువుదీరి కనువిందు చేస్తారు. మరో పక్కన నక్షత్ర వృక్షాలు కంటికి ఇంపుగా పచ్చని చిగుళ్లతో, ఆకులతో అలరిస్తాయి. వాటిపై నక్షత్రం పేరు, వృక్షం పేరు రాసి ఉంటాయి. మరోపక్క పన్నెండు రాశులకు సంబంధించిన గంటలతో నిండిన దేవాలయం దర్శనమిస్తుంది. ఆయా రాశుల ముందుకు వచ్చిగంట మోగిస్తారు. ఈ దేవాలయంలో ప్రత్యంగిరాదేవి కొలువుదీరి ఉంది. వివిధ లోహాలతో శివలింగాలు అక్కడకు నుంచి ఒకటవ అంతస్తులోకి వెళితే... ప్రధాన ఆలయంలో శివలింగంతోపాటు, కుడి పక్కన, ఎడమ పక్కన వివిధ రత్నాలతో రూపొందిన శివలింగాలు మనలను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయి. ముందుగా రెండున్నర లక్షల విలువ చేసే స్ఫటిక లింగం స్వాగతం పలుకుతుంది. ఆ పక్కన మరకతం, మాణిక్యం, గోమేధికం... వంటి వాటితో రూపొందిన శివలింగాలు కనిపిస్తాయి. శివునికి ఎదురుగా ఉన్న నంది కూడా మరకతంతో రూపొందినదే. ప్రపంచంలో ఉన్న అన్ని లోహాల శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. మహాలింగేశ్వరుడు, అయఃలింగేశ్వరుడు, తామ్ర లింగేశ్వరుడు, దారు లింగేశ్వరుడు, మరకత లింగేశ్వరుడు, త్రిపుర లింగేశ్వరుడు, ఆరకూట లింగేశ్వరుడు, కాంస్య లింగేశ్వరుడు, నాగ లింగేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు... మనలను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతారు. ద్వాదశజ్యోతిర్లింగాల ఆకృతులు, క్షేత్రనామాలతో మనలను మంత్రముగ్ధులను చేస్తాయి. లింగప్రతిష్ఠ కోటి లింగాల ప్రతిష్ఠాపన ధ్యేయంగా ఉన్న ఈ శివాలయంలో భక్తులు స్వయంగా లింగప్రతిష్ఠ చేయడం విశేషం. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠాపన జరుగుతుంది. భక్తులు వారి వారి శక్తిసామర్థ్యాలను బట్టి ఇక్కడ లింగప్రతిష్ఠ జరుపుతారు. తాళ్లాయపాలెం గ్రామం గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలంలో, మందడం పంచాయితీకి చెందిన తాళ్లాయపాలెం కొత్తరాజధాని తుళ్లూరుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో కొలువుతీరి ఉంది. ఇబ్రహీం పట్టణం, తాడేపల్లి, మంగళగిరి, విజయవాడలు నలుదిక్కులా ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉంది ఈ క్షేత్రం. - డా. పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ -
"నేను శివుడికి జన్మనిచ్చా.."
తన అందచందాలు గ్లామర్ తో యువతను వెర్రెత్తించిన మోడల్ సోఫియా హయత్ నటిగా కూడ ఎంతో పేరు సంపాదించుకుంది.. అంతేకాదు ఆమె.. తన మార్గాన్ని ఆథ్యాత్మికత వైపు మళ్ళించుకున్నట్లు, ఓ నన్ గా మారుతున్నట్లు ఇటీవల ఏకంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ వెల్లడించింది. అయితే అక్కడితో ఆగని ఆమె.. ఇప్పుడు ఏకంగా శివుడికే జన్మనిచ్చానంటోంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అభిమానులను తనవైపు తిప్పుకున్న నటి, మోడల్ సోఫియా హయత్... నన్ మారి, అందరికీ ఝలక్ ఇచ్చిన విషయం మరచిపోక ముందే.. మరో సంచలనం రేపింది. తాజాగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పి, క్రిస్టియన్ నన్ గా అవతారమెత్తిన విషయం ఇటీవల సంచలనం రేపింది. ఈ నెల మొదట్లో ఓ మీడియా సమావేశం పెట్టిమరీ ఆ విషయాన్ని ఆవిడగారు అందరి ముందుకూ తెచ్చింది. ఇకపై తాను సన్యాసినిగా జీవించనున్నట్లు తెలిపిన ఆమె... తన జీవితాన్ని దేవుడి దగ్గరే ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తానని, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటానని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది.. అక్కడే మరో ట్విస్ట్ ఇస్తూ ఇకపై తనను గయా మదర్ సోఫియా గా పిలవాలని విన్నవించింది. దీనికి తోడు జనానికి షాక్ ఇచ్చేలాంటి మరోవార్త వారి చెవిన పడేసింది. తాను ఇప్పటిదాకా అందంగా ఉండటంకోసం వక్షోజాలకు సిలికాన్ ఇంప్లాంట్ప్ పెట్టుకున్నాని, ఇప్పుడు సన్యాసినిగా మారుతుండటంతో వాటిని తీసివేస్తున్నానంటూ అందరికీ ప్రదర్శనకూడ ఇచ్చింది. అయితే ఇప్పటిదాకా చెప్పినదంతా సోఫియా హయత్ గతం... హాట్ మోడల్ నుంచి నన్ అవతారం నుంచి ఇప్పుడు ఏకంగా హిందూమతానికి చెందిన ఓ దేవుడికే జన్మనిచ్చానని చెప్తోంది. నన్ అవతారంలో కొన్నాళ్ళు కనిపించిన హయత్.. ఇటీవల కైలాష్ యాత్రకు వెళ్ళింది. యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో తాను శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మరో సంచలనానికి తెర తీసింది. శివలింగంనుంచీ ఓ భారీ అయస్కాంత శక్తి వచ్చి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తల పైకెత్తలేకపోయానని, ఇప్పుడు ఆ శక్తి ఏమిటో తనకు అర్థమైందని చెప్పిన ఆమె... చివరిగా తాను శివుడికి జన్మనిచ్చానంటోంది. -
గురువుతో కలిసే తొలి బురిడీ!
కేపీహెచ్బీలో తొలిసారి నకిలీ బాబా శివ మోసం ఇప్పటికి ఆరుసార్లు అరెస్టు, మూడింట్లో వాంటెడ్ నాలుగు ఠాణాల్లో పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు ఏడేళ్లలో రూ.4.25 కోట్లకు పైగా మోసాలు సిటీబ్యూరో: ‘లైఫ్స్టైల్’ మధుసూదన్రెడ్డిని ‘రెట్టింపు’, ‘రైస్పుల్లింగ్ కాయిన్’ పేర్లతో బురిడీ కొట్టించిన బుడ్డప్పగారి శివ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగర పోలీసులు ఇతడితో పాటు సహకరించిన దామోదర్, శ్రీనివాసరెడ్డిల్నీ శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ‘తొలి పూజ’ను తన గురువుతో కలిసే చేసినట్లు వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి రమణ విద్యుత్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందారు. 1996లో ఇంటర్నీడియట్ చదువును మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బెంగళూరు చేరాడు. ఉద్యోగం... ఏజెన్సీ... ‘ఆశ్రమావతారం’... బెంగళూరులో రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతడి ద్వారా శివ శాంతి సాగర్ హోటల్లో ఉద్యోగంలో చేరాడు. ఆపై అక్కడి తిప్పసముద్రం ప్రాంతంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా విద్యుత్, పారిశుద్ధ్య కార్మికుల్ని పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకూ ఈ పనీ మానేసిన శివ బెంగళూరులోని శివ సాయిబాబ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. అక్కడ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడులో ఉన్న మరో ఆశ్రమానికి వచ్చినా... మళ్లీ పాత ఆశ్రమానికే చేరాడు. కొన్నాళ్లు అక్కడ పని చేసిన తర్వాత తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి హ్యూమన్ బాడీ లాంగ్వేజ్, ఆయుర్వేద వైద్యం అంశాలు నేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఇతరులకు మత్తు ఇవ్వచ్చనే విషయం తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ శివ సాయిబాబ ఆశ్రమానికే చేరాడు. గురువుతో కలిసి కేపీహెచ్బీలో పంజా.... ఈ ఆశ్రమంలో శివకు అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే లక్ష్మీ పూజలతో నగదు రెట్టింపు, అష్టదిగ్భంధనమంటూ మోసం చేయడం ఎలానో నేర్చుకున్నాడు. ఆపై 2009లో ఈ గురువుతోనే కలిసి నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశారు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చమ్రాజ్నగర్లో రూ.10 లక్షలు పట్టుకుపోయాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ ఆపై తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. శివ తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, తంతు ముగిసే సమయానికి ఆ మొత్తం రెట్టింపు అవుతుం దని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచి న నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. ఆపై రెట్టింపు మొత్తాన్ని భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఆపై ఈ బురిడీ బాబా అసలు కథ ప్రారంభించి అందినకాడికి దండుకుంటాడు. రెండు నెలల నుంచీ ప్రిపరేషన్... ఏడాదిన్నరగా ‘లైఫ్స్టైల్’ మధుసూదన్రెడ్డితో పరిచయం కొనసాగిస్తున్న, గతంలోనే రూ.లక్ష ‘లాభం’ చేకూర్చిన శివ రెండు నెలల క్రితమే ‘ముగ్గులో దించేందుకు’ పథకం వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అన్నీ ‘కొత్తవి’ సిద్ధం చేసుకున్నాడు. రెండు నెలల క్రితమే బెంగళూరు శివార్లలోని సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లేఔట్లో కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ‘ఆపరేషన్ మధుసూదన్రెడ్డి’ తర్వాత ఇక్కడే తలదాచుకోవాలనే ఉద్దేశంతో ఈ చిరునామా తన స్నేహితులు, బంధువులు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. సిమ్కార్డులు, ఫోన్లు సైతం కొత్తగా ఖరీదు చేసి పక్కా పథకం ప్రకారం రంగంలోకి దిగాడు. బుధవారం మధుసూదన్రెడ్డి ఇంట్లో ‘పూజ’ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదునూ తీసుకుని దేవాలయాలకు తిప్పాడు. అప్పటికే ‘ఉమ్మెత్త మత్తు’లో ఉన్న మధుసూదన్రెడ్డి కుమారుడిని చేతులు కడుక్కోవాలంటూ బస చేసిన ఓరిస్ హోటల్లోని తన గదికి తీసుకువచ్చాడు. ‘ధ్యాన’మంటూ తాళాలు కాజేశాడు... ఆ సమయంలో డబ్బుతో కూడిన సంచి మధుసూదన్రెడ్డి కుమారుడి కారు డిక్కీలో, కారు తాళం ఆయన దగ్గరే ఉంది. ఇక్కడా బురిడీ స్వామి తెలివిగానే వ్యవహరించాడు. డబ్బు రెట్టింపు కావడానికి ధ్యానం చేయాల్సి ఉందంటూ మధుసూదన్రెడ్డి కుమారుడికి చెప్పాడు. గదిలో ధ్యానంలో కూర్చునే ముందు నీ దగ్గర ఎలాంటి లోహపు వస్తువులూ ఉండకూడదు అంటూ చెప్పి కారు తాళాలతో సహా అన్నీ పక్కన పెట్టిం చాడు. ఆపై చాకచక్యంగా కారు తాళాలు తీసుకుని పార్కింగ్లోకి వెళ్లిన శివ... నగదు సంచిని తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చేసి తాళాలు యథాస్థానంలో ఉంచేశాడు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్రెడ్డి కుమారుడు ఇంటికి చేరుకునే వరకు డిక్కీలోని నగదు పోయిన విషయం గుర్తించలేదు. ఏడేళ్లల్లో రూ.4.25 కోట్ల మోసాలు.... బురిడీ బాబా శివ 2009 నుంచి ఇప్పటి వరకు 10 ఉదంతాల్లో రూ.4.25 కోట్ల మేర స్వాహాలకు పాల్పడ్డాడు. మధుసూదన్రెడ్డి కేసుతో సహా రూ.2.05 కోట్లకు సంబంధించి బంజారాహిల్స్, కేపీహెచ్బీ, మైలార్దేవ్పల్లి చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టయ్యాడు. రైస్పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్గా ఉన్నాడు. ఈ ఘరానా నేరగాాడిపై రాజంపేట, నెల్లూరు, కుంబులుగుడ్డు, కేపీహెచ్పీ ఠాణాల్లో నాలుగు నాన్-బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్లో ఉన్నాయి. వెలుగులోకి రావాల్సిన మోసాలు మరిన్ని ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఈ అంశాలపై దృష్టి పెట్టనున్నారు. -
దొంగ బాబా శివ అరెస్ట్
హైదరాబాద్: బంజారాహిల్స్లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబానికి మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన దొంగబాబా శివను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను పట్టుకున్నారు. చోరీ అనంతరం పరారైన శివ బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, 'లైఫ్స్టైల్’ భవన యజమాని మధుసూదన్రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి, రూ.1.33 కోట్లతో దొంగ బాబా శివ పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇతడు గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహాలో కొంతమందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్ శివస్వామి, శివబాబా... నకిలీ బాబాగా అవతారమెత్తాడు. గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్చల్ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తర్వాత ఎలా బయటకు వచ్చాడో, ఇక్కడ ఎలా మోసానికి పాల్పడ్డాడో మాత్రం తెలియలేదు. -
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!
చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది. ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
అదృశ్యమైన చిన్నారులు క్షేమం
మీర్పేట పరిధిలోని జిల్లెలగూడ వెంకటగిరి కాలనీలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. కాలనీకి చెందిన శ్రీశైలం(10), రేణుక(8), శివ(7) అనే చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు మందలించడంతో భయపడి కనిపించకుండా పోయారు. రాత్రి అయినా కనపడకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా..దూల్పేట్ పరిధిలోని అల్మాస్గూడలో ఉంటున్న వారి పెద్దమ్మ దగ్గరకు వెళ్లినట్లుగా కనుగొన్నారు. వారిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. -
నందివనపర్తిలో 101 నంది విగ్రహాలు
గ్రామం… చుట్టూ ఎక్కడచూసినా అవే.. ఈ పల్లెలోఆలయాలూ ఎక్కువే.. ఆ ఊరు ఆలయాలకు నెలవుగా మారింది.. ఒకటికాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో అక్కడ గుళ్లు ఉన్నాయి. ఆదిదేవుడైన పరమశివుడు.. చదువులతల్లి సరస్వతీదేవి.. ఊరిని కాపాడే ముత్యాలమ్మ.. గ్రామాన్ని పరిరక్షించేలా ఊరిచుట్టూ నంది విగ్రహాలు.. ఇలా దేవుళ్లు కొలువుదీరిన ఆ పల్లె ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతోంది. అదే యాచారం మండలంలోని నందివనపర్తి. ఈ గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. 101 నంది విగ్రహాలు వెలిసినందునే ఈ ఊరికి నందివనపర్తి అని పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతారు. ఆలయాలకు నిలయమైన ఈ పల్లె కథనమే ఆదివారం ప్రత్యేకం.. - యాచారం నందివనపర్తి గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. గ్రామం చుట్టూ 101 నంది విగ్రహాలు వెలిసినందున నందివనపర్తిగా పేరు వచ్చిందంటారు. గ్రామంలో అక్కన్నమాదన్నల కాలంలో నిర్మించిన శివాలయం, చెన్నకేశవ ఆలయం, సోమనాథ క్షేత్రం, నందీశ్వరాలయం, రామలింగేశ్వరస్వామి ఆలయం, ముత్యాలమ్మ దేవాలయం ఉన్నాయి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలియడంతో శివాల యంలోని లింగం యేటా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోందని భక్తుల విశ్వాసం. గ్రామానికి ఉత్తరాన సోమనాథ దేవా లయం కొండల్లో ఉండడంతో అప్పట్లో పార్వతీపరమేశ్వరులు మారువేషంలో చుట్టుపక్కల గ్రామాల్లో సం చరించి వ్యవసాయ బావుల్లో జలకాలాడేవారని చెబుతారు. సరస్వతి అమ్మవారు చదువుల తల్లిగా, కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అభిషేకాలకు తరించి.. వర్షాలు కురిపించి.. శివాలయంలోని లింగానికి 101 బిందెలతో జలాభిషేకం చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. అప్పట్లో ఆర్యబట్ట అనే ఇంజినీర్ ఈ ప్రాంతం లో పర్యటిస్తూ గ్రా మం పడమర దిక్కు న నందిచెరువును, ఆ తర్వాత శివాల యాన్ని నిర్మించినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. అప్పట్లో మల యాళ స్వామి ప్రప్రథమంగా ఈ శివాలయంలో గీతాయజ్ఞం ప్రారంభించి స్వామివారి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించారని చెబుతారు. ప్రత్యేక ఆకర్షణగా ఏడడుగుల నంది విగ్రహం.. శివుడి మహిమలతో 150 ఏళ్ల క్రితమే గ్రామంలో 101 నంది విగ్రహాలు వెలిసాయని, శివాలయానికి తూర్పున గ్రామప్రధాన దారికి ముందు వెలిసిన నంది కుక్క నందిగా అవతరించి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతోందని గ్రామస్తుల నమ్మకం. మిగతా నందులు గ్రామం చుట్టూ వ్యవసాయ పొలాల్లో ఉండగా, మరికొన్ని ఔరంగాజేబు దండయాత్రల కాలంలో ధ్వంసమయ్యాయి. రైతులు పంటల సాగు, ధాన్యం ఇంటికి తెచ్చుకునే సమయాల్లో పొలాల్లో ఉన్న నందులకు పూజలు నిర్వహిస్తుంటారు. గ్రామానికి పడమర దిక్కున నందీశ్వరాలయంలో ఏడడుగుల నంది విగ్రహం గంభీరంగా దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశేష సంపదలున్న ఓంకారేశ్వరుడు.. గ్రామంలోని ఓంకారేశ్వరుడికి విశేష సంపదలున్నాయి. 1,400 ఎకరాలు ఓంకారేశ్వరుడికి సొంతం. వందేళ్ల క్రితం నల్లగొండ జిల్లా గుడిపల్లికి చెందిన లింగయ్య యోగానంద స్వామిగా మారి నగరంలోని ప్రస్తుత సెంట్రల్ లైబ్రరీ పక్కన శివాలయం నిర్మించారని, ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 19 ఆలయాలను నిర్మించారని, 21వ ఆలయంగా నందివనపర్తిలో ఓంకారేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన యోగానందుడు ఇక్కడే జీవసమాధి అయ్యాడట. 1900 సంవత్సరంలోనే అప్పట్లో ప్రముఖ శిల్పి కాశరామన్న పర్యవేక్షణలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఓంకారేశ్వరుడు, రామచంద్రస్వామి, దత్తాత్రేయుడు తదితర దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల్లో రూ. కోట్ల విలువ జేసే పంచలోహ విగ్రహాలు కొలువుదీరాయి. సరస్వతీ ఆలయంతో ఖ్యాతి.. గొప్ప చరిత్ర కలిగిన నందివనపర్తి పూర్వవైభవానికి గ్రామస్తులు సంకల్పించారు. పూర్వ విద్యార్థుల కృషితో హంపీ పీ ఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ పర్యవేక్షణలో జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్మాణం జరుగుతోంది. నిత్యం ఈ దేవాలయంలో చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ వెలిసిన అమ్మవారికి మొక్కితే నిరుద్యోగులకు కొలువులు ఖాయమన్న నమ్మకం ఏర్పడింది. ఏళ్ల క్రితం నిర్మించిన ఓంకారేశ్వరాలయం పునర్నిర్మాణం సాగుతోంది. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 7.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు డీఎస్పీ జే.వి.రాముడు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ముబారక్అలి అలియాస్ శివ అనే అంతర్రాష్ట్ర దొంగ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో ఇతన్ని అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులను ఆయన అభినందించారు. -
శివాలయం కట్టించిన అక్బర్..!
జైపూర్ః భరత భూమి సర్వ మానవ సమానత్వానికి పెట్టింది పేరు. హిందూ ముస్లిం భాయి భాయి అన్న నానుడి... ఈ పుణ్యభూమిలో అనుచరణలోనే ఉంది. తీవ్రమైన మతాచారాలు, కుల తత్వాలు ఆచరించే రోజుల్లోనే అక్బర్ చక్రవర్తి... మీరాబాయి భజనలు వినడానికి వెళ్లేవాడట. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్ని మతాలవారి ఆదరణను పొందారు. తమిళనాడు శ్రీరంగ దేవాలయం, భద్రాద్రి రాముని ఆలయాల్లో సన్నాయి వాయించేది ముస్లింలే. చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్నవాడినే దేముడు అంటాం. అదే జైపూర్ వాసికి అనుభవపూర్వకమైంది. చిన్ననాడు మసీదులో ప్రార్థనలతోపాటు.. సమీప దేవాలయంలోనూ పూజలు చేసిన అక్బర్ ఖాన్.. కష్టాలు తీరడంతో ఆ పరమేశ్వరుని భక్తుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఏకంగా దేవాలయ నిర్మాణానికి నడుం కట్టాడు. 'అల్లా కహో యా రామ్.. క్యా ఫరక్ పడ్తాహై' అంటూ అతడు మత సామరస్యాన్ని చాటి చెప్తున్నాడు. తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు జైపూర్ వాసి అక్బర్ ఖాన్. ఆ పరమ శివుడే తన రక్షకుడుగా భావిస్తున్నాడు. అందుకే జైపూర్ లో శివాలయం కట్టించేందుకు పూనుకున్నాడు. మసీదులో ప్రార్థనలతోపాటు చిన్నతనంలో తన స్నేహితులతో అనేక దేవాలయాలను దర్శించిన అక్బర్.. కష్టాల్లో అల్లాకు ప్రార్థనలతోపాటు పూజలు కూడ చేసేవాడు. అదే భక్తితో ప్రస్తుతం 39 ఏళ్ళ అక్బర్ ఖాన్ శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తాను నిర్మించిన ఆలయాన్ని ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేసే ముందు గణేశ హోమం, యజ్ఞ యాగాదులు నిర్వహించి, కైలాస యాత్ర, భజన కార్యక్రమాలు చేపట్టేందుకు రాజస్థాన్ లోని టాంక్ టౌన్ లో ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాలను కూడ అక్బర్ ఖాన్ ఏర్పాటు చేశాడు. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు కష్టం అనిపించినా శివుడ్ని తల్చుకుంటానని, వెంటనే కష్టాలు అదృశ్యమౌతాయని ఖాన్ చెప్తున్నాడు. పరమశివుడ్ని ప్రార్థించిన తర్వాతే తన జీవితంలో ఆనందం వెలుగు చూసిందని వెల్లడించాడు. ఓమ్ విహార్ కాలనీలోని వంద చదరపు మీటర్ల స్థలంలో భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం నిర్మించిన ఖాన్...ఆలయంలో పార్వతీ పరమేశ్వరులతోపాటు.. వినాయకుడు, కుమారస్వామి ప్రతిమలను కూడ స్థాపించాడు. నన్ను భక్తుడుగా మార్చుకొని, నా కష్టాలను తీర్చిన పరమేశ్వరుడికి.. చంద్రుడికో నూలు పోగులా ఆలయ నిర్మాణం చేపట్టి... నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఖాన్ చెప్తున్నాడు. ఎవరివద్దా ఎటువంటి విరాళాలు, ఆర్థిక సాయం సేకరించకుండానే గుడి నిర్మాణం చేపట్టానని, ఇప్పటి వరకూ ఓమ్ విహార్ కాలనీలో ఆలయం లేకపోవడంతో ఇక్కడ నిర్మించానని చెప్తున్నాడు. అయితే ఆలయ నిర్మాణ విషయంలో సమాజంనుంచీ, స్వంత కమ్యూనిటీ నుంచి కూడ ఎటువంటి అభ్యంతరాలు ఎదుర్కోలేదని అక్బర్ ఖాన్ చెప్తున్నాడు. అల్లా అని పిలిచినా, రామ్ అన్నా ఒక్కటేనని, ఏ మతస్థులైనా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అవసరమన్న స్పష్టమైన సందేశాన్ని ఆలయ నిర్మాణంతో ప్రజలకు ఇవ్వాలనుకున్నానని ఖాన్ తెలిపాడు. ఈ నూతన శివాలయం ఏప్రిల్ 30న ప్రారంభమై భక్తులకు అందుబాటులోకి వస్తుందని అక్బర్ వెల్లడించాడు. -
ప్రేమ పేరుతో యువతిని నమ్మించి..
నాగోలు: ప్రేమ పేరుతో యువతిని బుట్టలో వేసుకొని.. పెళ్లి నిశ్చితార్థం కూడా చేసుకొని, ఆ తర్వాత ముఖం చాటేశాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు లైంగిక దాడి, చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... సైదాబాద్ కాలనీకి చెందిన శివ ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాల లో బీడీఎస్ చదువుతున్నాడు. ఎల్బీనగర్కు చెందిన యువతి (28) వైద్యురాలు. వీరిద్దరికీ 2004లో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన అవసరాల నిమిత్తం యువతి నుంచి పలుమార్లు డబ్బు తీసుకున్నా డు. ఇరుకుటుంబాల వారు వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని 2016 ఫిబ్రవరి 14న నిశ్చితార్థం చేశారు. బంగారం, నగదును ఇరు కుటుంబాల వారు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈనెల 22న పెళ్లి జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. శివ తన చదువు కోసం యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.4.5 లక్షల నగదును తీసుకున్నాడు. తదనంతరం పెళ్లి చేసుకొమ్మని అడుగగా శివ తాను పెళ్లి చేసుకోనంటూ ముఖం చాటేశాడు. దీంతో యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా... శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివపై లైంగిక దాడి, నమ్మకద్రోహంతో పాటు పలు సెక్షన్ల కిం ద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి
పెళ్లయిన నెల రోజులకే నవ దంపతులకు నూరేళ్లు నిండిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పలకగనుల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పెద్దారవీడు మండలం స్థానికవరం గ్రామానికి చెందిన తోట శివ (25), తోట హేమలత (21) కొనకనమిట్లలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతున్నారు. మార్కాపురం పలకలగనుల వద్ద వీరి వాహనాన్ని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలతో శివ, హేమలత ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. వీరికి నెల క్రితమే వివాహం జరిగినట్టు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మార్కాపురం మండలం కొలభీమునిపాడులో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో మోటార్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై తోట శివ(22) అనే యువకుడు మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆత్మకూరులో ఇద్దరిని నరికిన సైకో
కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బావనంతాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సైకో వీరంగం సృష్టించాడు. శివ(35) అనే యువకుడు వేటకొడవలితో ఇద్దరు వ్యక్తులను నరికి చంపాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. గాయపడినవారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శివ అప్పులు విపరీతంగా చేశాడు. అవి తీర్చలేక సైకోగా మారాడు. కనిపించినవారిపై దాడిచేయడం ప్రారంభించాడు. బుధవారం మధ్యాహ్నం కర్నూలు నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి తమ అప్పు చెల్లించమని కోరడంతో రెచ్చిపోయిన శివ వేటకొడవలితో వారిపై దాడిచేశాసి పరారయ్యాడు. ఆత్మకూరు పోలీసులు కేసి నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. -
వేయి మునుల కుదురు యనమలకుదురు
సందర్శనీయం కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని యన మలకుదురు గ్రామంలో ‘మునిగిరి’ అనే పేరు గల కొండపై శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. శివుడు ఇక్కడ ‘రామలింగేశ్వరుడు’గా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివుడు స్వయం భువుగా వెలిశాడు. ఈ దేవాలయంలో శివుడిని వాయులింగంగా కొలుస్తారు. చరిత్ర ఒకప్పుడు యనమలకుదురు ప్రాంతం ఎంత ప్రశాంతంగా, తపస్సుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందువల్లనేమో... విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివుని కోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ వేయి మంది మునులు కొలువు తీరి, యజ్ఞం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. క్షత్రియ లక్షణాలున్న పరశురాముడు, వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించాడు. యజ్ఞ పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ఠ చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడి శివుడిని రామలింగేశ్వరుడుగా భక్తులు ప్రేమగా భక్తితో, పిలుచుకుంటారు.ఈ గిరి చుట్టూ వేయి మంది మునులు కూర్చుని శివుని గూర్చి తపస్సు చేశారు కనుక, ఈ ప్రాంతాన్ని ‘వేయి మునుల కుదురు’ అని పిలిచారు. వేయి మునుల కుదురు అంటే వెయ్యి మంది మునుల సమావేశం అని అర్థం. కాలక్రమేణా స్థానికుల భాషలో ఇది యనమలకుదురుగా మారిపోయింది. భూమి మీద 612 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మునిగిరి కొండ ముఖద్వారంలో ఎత్తయిన హనుమంతుడు స్వాగతం పలుకుతాడు. ఇక్కడ మహాశివరాత్రిని వైభవంగా నిర్వర్తిస్తారు. చేరుకోవడానికి మార్గాలు... బస్ మార్గం: ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడకు కేవలం 5 కి.మీ. దూరం. రైలు మార్గం: అతి సమీప ైరె ల్వే స్టేషను విజయవాడ. కేవలం 8 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుంచి దేవాలయం వరకు బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి. - డా. పురాణపండ వైజయంతి -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ఓ కు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన యాచారపు శివ దేవరకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి పొలానికి వెళ్లిన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం స్థానిక రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
యువకుని అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామ శివారులోని వరి పొలాల్లో సోమవారం ఉదయం యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన కిష్టయ్య, చెన్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ(22) ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవి అయి కనిపించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎస్పీ అశోక్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మైదుకూరు మండలం సోమయాజుల పల్లెకు చెందిన సీర్ల శివ(23) ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి
-
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి
నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోతో పాటు మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలు.. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని ధ్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా.. బండరాళ్లను తరలిస్తున్న లారీ ఈరోజు ఉదయం నెల్లూరు మండలం నవీపేట సమీపంలో పంక్చర్ అయింది. దీంతో లారీ డ్రైవర్ తిరుపతయ్య లారీని రోడ్డు పక్కకు తీసి టైరును మార్చేందుకు నలుగురు మెకానిక్ లను తీసుకు వచ్చాడు. పంక్చర్ వేసేందుకు ఇద్దరు మెకానిక్లు లారీ కిందికి వెళ్లగా.. మరో ఇద్దరు... పక్కనే నిల్చున్నారు. ఈ సమయంలో చెన్నై కి వెళుతున్న లారీ.. మెకానిక్ ల ఆటోతో పాటు.. లారీ ముందున్న బండరాళ్లను ఢీకొట్టింది. దీంతో లారీ కింద పని చేస్తున్న ఇద్దరు మెకానిక్లు శివ(19), షారుఖ్(18), లతోపాటు పక్కనే ఉన్న లారీ డ్రైవర్ తిరుపతయ్య(40), శషి(20) తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు లారీ కింద నలిగి పోయి మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మాతృభాషలో తొలి విజయం
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కోసం చాలా రోజులు పాటు వెయిట్ చేసిన అందాల భామ శృతిహాసన్. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ ఎక్కడా సక్సెస్ సాధించలేకపోయింది. చాలా కాలం తరువాత తెలుగులో తెరకెక్కిన 'గబ్బర్సింగ్' సినిమాతో తొలి హిట్ అందుకున్న శృతి ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో వరుస సూపర్హిట్స్తో దూసుకుపోతున్న శృతిహాసన్, బాలీవుడ్ లో కూడా అదే జోరు చూపిస్తోంది. అయితే తన మాతృభాష అయిన తమిళ నాట మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్ని భాషల్లో విజయాలు సాధించినా కోలీవుడ్లో సక్సెస్ కాలేకపోవటంతో శృతికి కష్టంగా అనిపించింది. అయితే ఈ బాధను 'వేదలం' సినిమాతో తీర్చేసుకుంది ఈ బ్యూటీ. అజిత్ హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదలం' సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ హిట్ జోరు చూపిస్తోంది. ఏ సెంటర్స్లో పెద్దగా వర్క్అవుట్ కాకపోయినా.. బి, సి సెంటర్స్లో అజిత్ జోరు కనిపిస్తోంది. ఈ సక్సెస్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది శృతిహాసన్. -
మరో హీరోకి లీకేజ్ ప్రాబ్లమ్
ప్రస్తుతం ఇండస్ట్రీని వేదిస్తున్న సమస్యల్లో పైరసీ అన్నింటికంటే పెద్దది. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ తరువాత ఇండస్ట్రీ వర్గాలను ఇబ్బంది పెడుతూ వస్తున్న ఈ పైరసీ భూతం మారుతున్న టెక్నాలజీ కారణంగా రిలీజ్కు ముందే చిత్ర యూనిట్కు షాక్ ఇస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చాలా చిత్రాలు విడుదలకు ముందే ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా అజిత్ హీరోగా తెరకెక్కిన 'వేదలం' సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది. గతంలో పవన్కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' రిలీజ్కు ముందే దాదాపు సగం సినిమా నెట్లో దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో నిర్మాతకు ఎలాంటి నష్టం రాలేదు. తరువాత 'బాహుబలి', 'పులి' లాంటి భారీ చిత్రాలకు కూడా ఇదే సమస్య ఎదురైంది. అయితే టెక్నాలజీ పరంగా గ్రాఫిక్స్, రీ రికార్డింగ్, డిఐ లాంటి సాంకేతికతల కోసం చాలా మంది చేతులు మారుతున్న సినిమాలు, ఎక్కడో ఒకచోట పైరసీ బారిన పడుతున్నాయి. అదే బాటలో అజిత్ హీరోగా నటిస్తున్న వేదలం సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు శుక్రవారం నెట్లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన చిత్ర నిర్మాత ఎఎం రత్నం సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఆ సీన్స్ను తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అజిత్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మానస సరోవరం..శివుడి నివాసం!
కైలాస పర్వతం.. సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకం. అందుకే జీవితంలో ఒకసారైనా కైలాస పర్వతాన్ని దగ్గర నుంచి వీక్షించి, మానస సరోవరంలో స్నానమాచరించాలని భక్తులు పరితపిస్తుంటారు. కానీ సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశాన్ని దర్శించడం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. ఈ రోజు ఆ ప్రత్యేక యాత్ర విశేషాల గురించి మనమూ తెలుసుకుందాం...! యాత్రలు.. చలికాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రికులకు ప్రతికూలంగా పరిణమిస్తుంది. కనుక యాత్రికులు సాధారణంగా ఎండాకాలం, రుతుపవనకాలాల్లో మానససరోవాన్ని దర్శిస్తారు. భారతదేశంలో ఉత్తర కాశీ, నేపాల్లోని కఠ్మాండు నుంచి ప్రతి ఏటా కైలాస యాత్రలు జరుగుతున్నాయి. ఎక్కడ ఉంది..? 'మానస సరోవరం' అనేది చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉన్న మంచినీటి సరస్సు. ఇది లాసా నగరానికి 940 కి.మీ దూరంలో భారత్, నేపాల్ దేశాలకు దగ్గరలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యు, మపం యు ట్సొ.. అనే పేర్లతో పిలుస్తారు. భౌగోళిక స్వరూపం.. మానస సరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పునీటి సరస్సు, ఉత్తరాన హిందువులు పరమశివుని నివాసస్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. 300 అడుగుల తోతు ఉన్న ఈ సరస్సు 320 చదరపు కిలోమీటర్ల ఉపరితలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. రుతుపవనాలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి -15 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. అతిశీతలమైన ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు, బండరాళ్లు, చిన్నపాటి గడ్డిమొక్కలు కనిపిస్తాయి. సాంస్కృతిక ప్రాధాన్యం.. సంస్కృతంలో మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు అని అర్థం. పూర్వకాలం భారతదేశం, టిబెట్, నేపాల సరిహద్దులతో సంబం దం లేకుండా కలిసి ఉండటం వల్ల ఇది హిందువులకు, బౌద్ధులకు, జైనులకు కూడా పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి ఆలోచనల నుంచి మానససరోవరం ఆవిర్భవించి భూమిపై పడింది. ఇందులో నీరు తాగితే మరణించాక నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకుంటారని, వంద జన్మల పాపాలు హిరిస్తాయని.. హిందువుల విశ్వాసం. జ్ఞానం, అందానికి ప్రతిరూపాలైన హంసలు మానస సరోవరంలో విహరించేవని నమ్ముతారు. చరిత్ర.. పురాణేతిహాసాల ప్రకారం కైలాసగిరి, హిమాలయాలు భరత ఖండానికి చెందినవి. ఏడో శతాబ్దంలో టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పటి నుంచి కైలాస్గిరి టిబెట్ దేశానికి చెందింది. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నాక భారతీయులకు కైలాస దర్శనం కష్టసాధ్యమయింది. 1959 నుంచి 1978 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు ఎవరినీ ఈ గిరిని దర్శించడానికి అనుమతినివ్వలేదు. ఆ తర్వాత 1980 నుంచి భారత ప్రభుత్వ అనుమతి ద్వారా వెళ్లేవారిని అనుమతిస్తున్నారు. యాత్ర జాగ్రత్తలు.. మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్ధం కావడానికి ముందు నుంచీ ఉదయం, సాయంత్రం నడక.. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, యోగా.. లాంటివి చేయడం మంచివి. మధుమేహం, స్పాండిలైటీస్, ఆస్తమా, సైనస్.. వంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ యాత్ర చేయలేరు. సముద్ర మట్టానికి సుమారు 5000 మీటర్ల ఎత్తుకు వెళ్లాక శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. దీన్ని నివారించడం కోసం రోజూ రాత్రి 'డైమాక్స్' అనే ట్యాబ్లెట్ వేసుకోవడ తప్పనిసరి. అక్కడి చలిని తట్టుకునే దస్తులు ధరించాలి. ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం.. కైలాస పర్వతాన్ని టిబెటన్ భాషలో ‘రిస్పోచి’ అని పిలుస్తారు. ఏటా వేల మంది హిందూ భక్తులు 52 కి.మీ వరకు మాత్రమే కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ పర్వతాన్ని పూర్తిగా అధిరోహించరు. పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించినా అనేక కారణాల వల్ల వారి ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ప్రాంతమంతా శక్తిమయం.. విజ్ఞానశాస్త్రం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం కూడా అలాంటి కోవకు చెందిన ప్రాంతాలే. మరిన్ని విశేషాలు.. బ్రహ్మపుత్ర, గంగ, సింధు, సట్టజ్.. నదులు మానస సరోవరం నుంచే పుట్టాయనే ఒక వాదన ప్రచారంలో ఉంది. అయితే దానికి కచ్చితమైన ఆధారాలు లేవు. సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులు బుద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. భారత ప్రభుత్వం ఏడాదికి సుమారు 750 మందిని మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. మానస సరోవరం ప్రాంతంలో తెల్లవారు జామున రెండు నుంచి నాలుగున్నర గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానమాచరించేందుకు సరోవరానికి వస్తారని భక్తుల నమ్మకం. -
ఆసియా బాక్సింగ్ క్వార్టర్స్ లోకి శివ, దేవేంద్రో
ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 56 కిలోల విభాగంలో శివ థాపా, 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. జోర్డాన్ కు చెందిన మహ్మద్ అల్వదీతో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శివ 3-0 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో దేవేంద్రో 3-0 తేడాతో చైనాకు చెందిన హీ- జున్ జున్ ను ఓడించాడు. కాగా..గత ఏడాది ఇదే టోర్నీలో రజత పతకం సాధించిన మన్దీప్ జంగ్రా ఈ సారి ప్రీ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 69 కిలోల విభాగంలో బరిలోకి దిగిన మన్దీప్ 1-2 స్కోర్ తో జపాన్ బాక్సర్ యసుహిరో సుజుకీ చేతిలో పరాజయం చెందాడు. సెప్టెంబర్ ఒకటిన జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దేవేంద్రో క్వాంగూ లాంగూతో, శివ కజకిస్తాన్ కు చెందిన ఒమర్ బెక్తో తలపడనున్నారు. -
రూ.5 ఇవ్వలేదని అదృశ్యం
పంజగుట్ట: తల్లిని ఐదు రూపాయలు అడిగితే ఇవ్వలేదని అలిగి ఓ యవకుడు కనిపించకుండా పోయాడు. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముషీరాబాద్ బంగ్లాదేశ్ బస్తీలో నివాసముండే శివ(10) స్థానిక ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. తల్లి సరస్వతితో కలిసి మంగళవారం సోమాజిగూడలోని బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం 10.30కి శివ తల్లిని రూ.5 అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 9490616610 నెంబర్లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. -
కొడుకుని అమ్మేసి కథ అల్లింది..
రూ. 30 వేలకు ముందే బేరం కుదుర్చుకున్న తల్లి బంధువుతో కలిసి పథకం 12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు మైలవరం : తాగుడుకు బానిసై నిత్యం అనుమానంతో వేధిస్తున్న భర్తను వదిలించుకుని వెళ్లిపోవడానికి అడ్డుగా ఉన్న కొడుకుని అమ్ముకుని, చివరకు పోలీసుల వలలో చిక్కుకున్న మహిళ ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిని బాణావతు సంధ్య అనుమానంతో వేధిస్తున్న భర్త శివను వదిలించుకోడానికి జి.కొండూరులో నివసిస్తున్న సమీప బంధువు బుజ్జి అనే మహిళతో కలిసి వారం కిందట పథకం వేసింది. ఆ మేరకు ముచ్చర్ల శ్రీను, సరిత దంపతులకు చిన్నారిని రూ. 30 వేలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకుంది. సదరు సొమ్మును బుజ్జి ముందే తీసుకుని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత పథకం ప్రకారం మంగళవారం మూడు నెలల తన కొడుకును మైలవరం ఆస్పత్రిలో చూపించడానికని చెప్పి సంధ్య తీసుకువచ్చింది. అప్పటికే బస్టాండ్ వద్దకు బుజ్జితో పాటు సరిత, ముచ్చర్ల శ్రీను దంపతులు, దేవి అనే మహిళ చేరుకున్నారు. వారికి బిడ్డను అప్పగించిన సంధ్య తాను టాయిలెట్కు వెళుతూ పిల్లవాడిని పట్టుకోమని తన కులం మహిళకు ఇస్తే పరారయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీగలాగితే డొంక కదిలింది... తీగలాగితే డొంక కదిలినట్లు తన బిడ్డను అపహరించితే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన మహిళ స్వగ్రామం రుద్రవరం వెళ్లి బంధువులతో తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై పోలీసులు మరి కొంచెం లోతుగా విచారించగా అసలు విషయం బయట పడింది. భర్తను వదిలించుకుని కొడుకుని అమ్ముకుని వస్తే సుఖపడవచ్చని జి,కొండూరులో ఉండే బంధువు బుజ్జి ఇచ్చిన సూచనను సంధ్య పాటించిందని తేలింది. విచారణలో వెల్లడైన ప్రకారం కొండపల్లిలోని సరిత,శ్రీనుల వద్ద బిడ్డను రికవరీ చేసుకున్నామని, నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. బిడ్డను విజయవాడలోని ఉమన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్కు అప్పగించామన్నారు. కేసును 12 గంటల్లోనే కేసు ఛేదించినట్లు డీఎస్పీ బుధవారం పోలీస్స్టేషన్లో విలేకరులకు తెలిపారు. -
శివ ఆ పేరు ఎందుకు పెట్టిందో వాళ్ల అమ్మ...
శివుడు విషం కంఠంలో దాచుకున్నట్టే ఇతను కష్టం గొంతు దాటనివ్వలేదు. రక్తం కక్కాడు కానీ నిజం బయట పడనివ్వలేదు. ప్రేమ ఇచ్చాడు కానీ బాధ పంచుకోలేదు. పేగుబంధానికి ప్రాణం పోశాడు కానీ, పేగు పంచుకున్న వారికి నష్టం రానివ్వలేదు. ఉరిపోసుకున్నాడు కానీ అడిగుంటే మా ఆయుష్షు పోసుకునేవాడు. పెద్ద జబ్బు వస్తే పేద కుటుంబాలు అల్లాడిపోతాయ్. శివ తన కుటుంబంపై ఆర్థిక భారం మోపకూడదని చివరిక్షణాలు అమ్మ వొడిలో, కుటుంబం సడిలో గడిపి సూసైడ్ చేసుకున్నాడు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, గొప్ప మనసు ఉన్నవారు ఎందరో శివను కాపాడుకునేవారేమో! అది తెలియక, చెప్పే వాళ్లు లేక శివలాంటి వాళ్లు ఎందరో ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ సంఘటన మనందరిని మేలుకునేలా చేస్తుందని మేం నమ్ముతున్నాం. అమ్మంటే ప్రాణం కర్నూలు జిల్లా ఆదోని. దిబ్బనకల్ గ్రామంలో రవి, జయంతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడి పేరు శివ. కిందటి నెల 16వ తారీఖుకి పద్దెనిమిది వెళ్లి పంతొమ్మిది వచ్చాయి. శివ తండ్రి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి మిషన్ కుట్టి, భర్త సంపాదనకు తన సంపాదన జోడించి పిల్లలను చదివిస్తోంది. ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు, పిల్లలు తప్ప. శివకుమార్ కర్నూల్ పాలిటెక్నికల్ కాలేజీలో కంప్యూటర్ కోర్సు పూర్తి చేశాడు. మిగతా పిల్లలిద్దరివీ ఇంకా స్కూల్ చదువులే. కోర్సు పూర్తవగానే శివకుమార్ ‘ఇన్నాళ్లూ అమ్మ, నువ్వు మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూనే ఉన్నారు. నేను పట్నం వెళ్లి బాగా సంపాదిస్తా. కుటుంబాన్ని పోషిస్తా, మీ కష్టాలన్నీ తీరుస్తా. అమ్మకు గుండాపరేషన్ చేయిస్తా’ అని పట్నం బస్సెక్కాడు. పట్నంలో ఓ ప్రయివేట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. నెలకు ఏడున్నర వేలు జీతం. అందులో నాలుగు వేలు ఇంటికే పంపించేవాడు. ‘ఇంకో ఆరునెలలు పోతే జీతం పెరుగుద్ది. ఇంకా డబ్బులు పంపిస్తా. నువ్వు మిషన్ కుట్టుడు మానేయ్’మని తల్లికి ఎప్పుడూ ఫోన్లో చెప్పేవాడు. బెంగపడ్డాడు... బోరుమన్నాడు చూస్తుండగానే పదినెలలు గడిచిపోయాయి. వారం రోజులుగా ఫోన్ చెయ్యని కొడుకు ఓ రోజు ఫోన్ చేసి ‘అమ్మా. ఇక్కడ కంపెనీలో పని లేదు. భోజనానికి కష్టమైపోతుంది. ఊరొచ్చేస్తానే’ అన్నాడు. ‘అయ్యో. ఎందుకురా అంత డీలా పడిపోతావ్. ఉన్న చోటనే ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం రా. మీ నాయిన కూడా అదే చెబుతున్నడు. ఇంకేమీ ఆలోచించక వెంటనే బస్సెక్కు’ అని చెప్పింది ఆ తల్లి. అనుకున్నట్టుగానే శివ ఊరు చేరుకున్నాడు. అమ్మను నాన్నను తమ్ముడిని చెల్లెలి చూడగానే ఒక్కసారిగా వాళ్లను వాటేసుకొని బోరుమన్నాడు. అందరూ కంగారుపడిపోయారు. ‘ఏమైందిరా..’ అంటే ‘ఇన్నాళ్లూ మీకు దూరంగా ఉన్నా కదా! అందుకే’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ. ఆకలేస్తుందని కావల్సివన్నీ చేయించుకున్నాడు అమ్మతో. ఆబగా తిన్నాడు. ‘పిల్లవాడికి ఇల్లు మనాది పట్టుకుంది. ఇంకెక్కడికీ వెళ్లకురా’ అన్నాడు తండ్రి.’ ‘సరే’ అన్నాడు శివ. జన్మజన్మలకు గుర్తుంటుంది అమ్మ అమ్మ ఏదైనా పని చేస్తుంటే ఆమెతో పాటే తిరిగేవాడు. సాయంకాలం తమ్ముడు, చెల్లెలితో షికార్లకని వెళ్లేవాడు. పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేవాడు. పుట్టిన రోజున హుషారు అంతా ఇంతా కాదు. పొద్దున్నే లేచి స్నానం చేసి, అమ్మ చేత పాయసం చేయించుకొని ‘నీ చేతి రుచి జన్మ జన్మలకూ గుర్తుంటుంది అమ్మ’ అన్నాడు. అమ్మానాయిన కాళ్లకు మొక్కాడు. ‘నూరేళ్లు చల్లగా బతకరా తండ్రీ’ అని దీవించారు తల్లీతండ్రీ. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ తల్లిదండ్రులని హత్తుకుపోయాడు. కొత్త బట్టలు కొనుక్కోమని తల్లి డబ్బులు ఇస్తే ‘వద్దులే అమ్మా! అనవసరపు ఖర్చు... నీ ప్రేమ చాలు’ అన్నాడు. చిన్నాయనలను కలిసొస్తానని చెప్పి అందరిళ్లకూ వెళ్లి చాక్లెట్లు పంచి వచ్చాడు. సినిమా చూసొద్దామని ఇంటిల్లిపాదినీ తీసుకెళ్లాడు. ఎప్పుడైనా పొరపాటున కొడుకును పనికోసం వెళ్లమని భార్య అంటుందేమో అని ‘ఎండలు తగ్గేదాక ఇంట్లనే ఉండనియ్యి. తర్వాత వాడే ఏదో పని చేసుకుంటాడులే’ అనేవాడు తండ్రి. వారి మీద ఎండ పడినా భరించలేరే... అలాంటిది మృత్యువే పడితే... ఐదు రోజుల క్రితం ఆ ఇంట్లో చీకటి ముసురుకుంది. రెండు నెలల పాటు తమను ఆనందపెడుతూ తను సంబరంగా ఉన్న కొడుకు ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించాడు. ఇంటిల్లిపాదీ హతాశులయ్యారు. తమ గారాల బిడ్డ తమనెందుకిలా అన్యాయం చేశాడో అంతుచిక్కక కాసేపు పిచ్చివాళ్లయ్యారు. విషయం తెలిసి తల్లిడిల్లిపోయారు. శివకుమార్ రాసిన చివరి ఉత్తరం వారి కంటపడింది. అందులో... అమ్మా, నాన్న! పట్నంలో ఉన్నప్పుడు ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్కు చూపించుకున్నాను... బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారు. రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని, అయినా బతకడం కష్టమని వైద్యులు చె ప్పారు. వైద్యం చేయించుకునేంత డబ్బు నా దగ్గర లేదు. ఈ విషయం మీకు తెలిస్తే ఏమైపోతారో అని భయం. పైగా నా వైద్యం కోసం మీరు ఎన్ని అప్పులు చేస్తారో.. తమ్ముడు, చెల్లెలి చదువులు ఆగిపోతాయేమో.. మన కుటుంబం రోడ్డున పడుతుందేమో... ఇది తలుచుకుంటే దుఃఖం ఆగడం లేదు. ఇన్నాళ్లూ కడుపునొప్పి, నోట్లో నుంచి రక్తం వస్తుంటే మందులు తింటూ కాలం గడిపాను. నాకు రోజులు దగ్గరపడ్డాయని అర్థమైంది. ఎప్పుడు చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో పట్నంలో ఉండలేక ఊరొచ్చాను. ఈ చివరి రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశ. కానీ, బాధ నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. భరించలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఎవ్వరూ నా కోసం బాధపడవద్దు. ఇంతటితో మీతో నా రుణం తీరింది. ఇట్లు.. మీ శివకుమార్ తల్లిదండ్రికి ఏమీ అర్థం కాలేదు. శివకుమార్ మరణించి ఐదు రోజులయ్యాయి. తమ కోసం బిడ్డ ఆలోచించిన తీరుకు కరిగి నీరవుతున్నారు ఆ తల్ల్లీ తండ్రీ. ముందే విషయం తెలిస్తే యములోరితో పోరాడైనా కొడుకును బతికించుకొనేవారం కదా! అని కుమలిపోతునే ఉన్నారు. ఇంకో శివ బూడిద కాకూడదు... ఎంతటి విషమ పరిస్థితి వచ్చినా పోరాడవచ్చు అనే ధైర్యం ప్రతి ఒక్కరికీ ఈ సమాజం నుంచి అందాలని హెచ్చరిస్తున్న సంఘటన ఇది. వ్యక్తికష్టం సమాజకష్టం అయినప్పుడే ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవు. - నిర్మలా రెడ్డి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి ఇన్పుట్స్: డి. చంద్రశేఖర్, ఆదోని రూరల్, సాక్షి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అంటే చాలా మంది వెనకడుగు వేస్తారు కానీ మా దగ్గర కార్పోరేట్ ఆసుపత్రులకు దీటైన చికిత్స ఉంది. అనుభవం ఉన్న వైద్యులతో, అత్యుత్తమ ఆధునిక పరికరాలతో అన్ని రకాల క్యాన్సర్లకు పూర్తి ఉచితంగా చికిత్స లభిస్తుంది. అంతేకాదు, జిల్లాల నుంచి చికిత్స నిమిత్తం వచ్చేవారికి ప్రయాణ ఛార్జీలు ఇచ్చే సౌలభ్యం కూడా ఉంది. - డా.రమేష్ మాటూరి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ కాన్సర్లలో వందల రకాలున్నాయి. వీటి బారిన పడి నయమైనవారి కథనాలతో పాటు, అవగాహన సదస్సులూ నిర్వహిస్తుంటాం. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)కు చికిత్స అందుబాటులో ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స లభిస్తుంది. అలాగే అపోలో హాస్పిటల్ నుంచి క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇస్తుంది. వచ్చే నెల (జూన్)1వ తారీఖున క్యాన్సర్ అవగాహన సదస్సు ఆసుపత్రిలో జరుపుతున్నాం. - డా. పి.విజయ్ ఆనంద్రెడ్డి, డెరైక్టర్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం ఉంది. క్యాన్సర్కు సరైన వైద్యం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రోగులకు హైదరాబాద్లోనూ వైద్యం లభిస్తుంది. ఎన్టీఆర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యసేవ కింద క్యాన్సర్ తీవ్రత లేదా జబ్బు రకాన్ని బట్టి రేటు నిర్ణయించి ఉంది. అంతకు మించి ఖర్చయినా తగిన కారణాలు చూపిస్తే అదనంగా డబ్బులు మంజూరు చేసే అవకాశం ఉంది. - డా.శాంతారావు, వైద్యవిద్యా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు వాస్తవ జీవితానికి దూరమైపోతున్నారు. ఏదైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియజెప్పడం కూడా అవసరం. సమస్య ఏదైనా వచ్చినప్పుడు పెద్దల సాయం తీసుకోమనాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో ఏదో రూపంలో మాటలు, ప్రవర్తన ద్వారా తెలియజేస్తుంటారు. వారి ప్రవర్తన సాధారణంగా కంటే పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తే వెంటనే మానసిక వైద్యుల సలహా తీసుకోవాలి. కొందరిలో అత్యంత సాధారణ ప్రవర్తనతో ఉంటారు. లేదంటే బాహ్యప్రపంచంతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతారు. ఇవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. - డా.గీతా చల్లా, సైకియాట్రిస్ట్